Monday, May 27, 2024

పంచముడైన ఛోఖా మేళా పాండురంగనికి అతి ప్రియమైనవాడు .

చోఖా మేళా .
సాయిబాబా చాందపాటిల్ పెళ్లి బృందంతో షిరిడీకి వచ్చినప్పుడు ఖండోబా మందిరమందిరములోకి అడుగుపెట్టబోతే ఆ మందిర పూజారి 
మహల్సాపతి అడ్డుకోబోయాడు .
అప్పుడు బాబా కోపం తెచ్చుకోకుండా 
"నీ అభిమతాన్ని అనుసరించి నేను 
దూరంనుండే దైవ దర్శనం చేసుకుంటాలే ! దానికి నీకు అభ్యంతరం లేదనుకుంటాను .మీ పురాణాలలో ఒక కధ ఉన్నది .
పంచముడైన ఛోఖా మేళా పాండురంగనికి అతి ప్రియమైనవాడు .
పాండురంగని వద్ద పూజ చేసే పురోహితులకంటే వందరెట్లు శ్రేష్ఠుడు .
శ్రీహరి ద్వారానికి చేరుటకు శ్రద్ధతో 
ప్రయత్నించేవారు తప్ప మిగిలినవారందరూ పంచములే !
ఎవరి ఆంతర్యం పరిశుద్ధంగా ఉంటుందో 
వారు సర్వత్రా పరిశుద్ధులే ! అని బాబా 
మహాల్సాపతితో అన్నారు .
మహారాష్ట్రలో ఛోఖా మేళా గురించి 
తెలియని వారుండరు .అతడు పాండురంగ భక్తుడు .ఆతనిని ఆలయ పూజారులు పండరీ ఆలయం లోపలికి 
రానివ్వలేదు .కానీ అంతటా పాండు రంగని చూసి మైమరచిపోయే భక్తుడు .

No comments:

Post a Comment

RECENT POST

మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు.

చాలా బాగుంది - పూర్తిగా చదవండి మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు.  ఆమె తన ఐహికమైన బరువుబా...

POPULAR POSTS