Friday, May 31, 2024

ఆంజనేయ సర్వస్వం

🌹           *ఆంజనేయ సర్వస్వం*   

       🌹

🚩 ఆంజనేయుడి తల్లి పేరు అంజనాదేవి

🚩 ఆంజనేయుడి తండ్రి పేరు కేసరి

🚩 ఆంజనేయుడి జన్మ తిథి వైశాఖ బహుళ దశమి

🚩 ఆంజనేయుడు ఈశ్వరాంశతో పుట్టాడు

🚩 ఆంజనేయుడు వాయుదేవుని వరం వలన పుట్టాడు

🚩 ఆంజనేయుడి జనన కారకులు శివ పార్వతులు, అగ్ని, వాయువులు

🚩 ఆంజనేయుడి గురువు సూర్య భగవానుడు

🚩 ఆంజనేయుడిని శపించినవారు భృగు శిష్యులు

🚩 ఆంజనేయుడినికి గల శాపం తనశక్తి తనకు తెలియకుండా ఉండడం

🚩 ఆంజనేయుడి శాప పరిహారం స్తుతించినా, నిందించినా తన శక్తి తను గ్రహించుట.

🚩 ఆంజనేయుడు నిర్వహించిన పదవి సుగ్రీవుని మంత్రి

🚩 ఆంజనేయుడు శ్రీరాముని తొలుత చూసిన స్థలం పంపానదీ తీరం

🚩 ఆంజనేయుడు వాలిని సంహరింపని కారణం యేందిరా అంటే - తల్లిఅజ్ఞ

🚩 ఆంజనేయుడి సంపూర్ణ చరిత్ర కలిగిన మహత్ గ్రంథం శ్రీ పరాశరసంహితం

🚩 సీతాదేవిని నెతుకుటకు ఆంజనేయుని దక్షిణ దిక్కుకు తోలినారు

🚩 ఆంజనేయుడి ఆదేశంతో వానరులు ప్రవేశించిన బిలం స్వయంప్రభది.

🚩 సముద్ర లంఘనం కోసం ఆంజనేయుడు ఎక్కిన పర్వతం మహేంద్రపర్వతం

🚩 ఆంజనేయుడు దాటిన సముద్ర విస్తీర్ణము 100 యోజనములు

🚩 ఆంజనేయుడికి అడ్డు వచ్చిన పర్వతం మైనాకుడు

🚩 ఆంజనేయుడికి  ఆతిథ్యం ఇవ్వాలని సముద్రుడు తలచినాడు 

🚩 మైనాకుని ఆంజనేయుడు రొమ్ముతో తాకాడు

🚩 ఆంజనేయుడు మైనాకుడిని చేతితో స్పృశించి అనుగ్రహించాడు

🚩 ఆంజనేయుడికి ఏర్పడిన 2 వ విఘ్నం సురస

🚩 సురస నాగజాతి జాతి స్త్రీ

🚩 ఆంజనేయుడి శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు దేవతలు సురసను  తోలినారు
 
🚩 ఆంజనేయుడికి ఏర్పడిన 3 వ విఘ్నం సింహిక

🚩 సింహిక ఆంజనేయుని నీడ పట్టి ఇగ్గినాది

🚩 లంకను కాపాడడం సింహిక వృత్తి 

🚩 ఆంజనేయుడు లంకలో సువేల పర్వత ప్రాంతంలో వ్రాలినాడు

🚩 ఆంజనేయుడు వెళ్లిన పర్వతం పేరు త్రికూటాచలం

🚩 ఆంజనేయుడు లంకలోకి పిల్లిపిల్ల అంత రూపంలో దూరినాడు

🚩 లంక ప్రవేశద్వారం కాడ లంకిణి ఆంజనేయుని అడ్డగించినది

🚩 లంకిణిని ఆంజనేయుడు ఎడమ చేతిపిడికిలితో కొట్టాడు 

🚩 ఆంజనేయుడు లంకలోకి ప్రాకారందూకి  ప్రవేశించాడు 

🚩 శతృపురంలోకి *ఎడమ కాలు ముందు పెట్టి ప్రవేశించటం* అనే శాస్త్ర నియమం ఆంజనేయుడు పాలించినాడు

🚩 మండోదరిని చూసి ఆంజనేయుడు సీతమ్మగా భ్రమించాడు

🚩 ఆంజనేయుడు ప్రవేశించిన వనం అశోకవనం

🚩 ఆంజనేయుడు అందించిన అద్భుత సందేశం యేందిరా అంటే *జీవనృద్రాణిపశ్యతి* (బ్రతికి ఉండిన కార్యములు సాధించవచ్చును)

🚩 ఆంజనేయుడు సీతమ్మను శింశుపా వృక్షము క్రింద చూచాడు

🚩 సీతమ్మకు ఆంజనేయుడు రాముడి ఉంగరం ఆనవాలుగా ఇచ్చాడు

🚩 సీతమ్మ ఆంజనేయునికి చూడామణిని తన ఆనవాలుగా ఇచ్చింది

🚩 ఆంజనేయుడు అశోకవనం ద్వంసం అనంతరం జంబుమాలిని చంపాడు

🚩 ఆంజనేయుడి చేతిలో రావణ సుతుడు అక్షయ కుమారుడు మరణించినాడు 

🚩 ఆంజనేయుడు సముద్రం తిరిగి దాటడానికి అరిష్ట పర్వతం ఆధారం చేసుకున్నాడు 

🚩 ఆంజనేయుడు సముద్రం దాటడానికి 30 ఘడియలు సమయం పట్టింది ?

🚩 *జయము జయము వీరాంజనేయులు* 🚩

No comments:

Post a Comment

RECENT POST

మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు.

చాలా బాగుంది - పూర్తిగా చదవండి మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు.  ఆమె తన ఐహికమైన బరువుబా...

POPULAR POSTS