Tuesday, April 20, 2021

*పట్టిసం క్షేత్ర విశేషాలు*

*పట్టిసం క్షేత్ర విశేషాలు*


పవిత్ర గోదావరి నదీ తీరంలోని ఓ పర్వతం పై వీరభద్రుడు లింగ రూపంలో కొలువై ఉన్నారు. ఇలా వీరభద్రుడు శివలింగం రూపంలో కొలువై ఉన్న పుణ్యక్షేత్రం భారత దేశంలో ఇక్కడ మాత్రమే ఉంది. ఇక ఇక్కడే వీరభద్రుడు భద్రకాళిని వివాహం చేసుకొన్నట్లు చెబుతారు.

ఇక ప్రమధ, భూత గణాలకు అధిపతి అయిన వీరభద్రుడు కొలువై ఉన్న ఈ క్షేత్రం 🙏🙏🙏

 శివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. అదే విధంగా పౌర్ణమి రోజున, సోమవారాల్లో కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇంతటి విశిష్టమైన పుణ్యక్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు
 పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం మండలం నందు పట్టిసం అను గ్రామం కలదు.  ఈ పాంతమును పట్టిసీమ గా పిలుస్తారు.  అఖండ గోదావరి నదీ గర్భములో దేవకూట పర్వతం ఉంది.  పూర్వం " పట్టిసాద్రి " గా పిలిచేవారు.  ఇది హరి హర క్షేత్రం గా ఖ్యాతి పొందినది.  దక్షుడ్ని సంహరించిన వీరభద్రుడు తన ఆయుధమగు పట్టసాన్ని (కత్తి) గోదావరి నదిలో కడిగి, కొండపైన స్వయంభూ లింగమగా వెలిసాడు.  ఆ లింగమును " శ్రీ వీరేశ్వర స్వామి " గా పిలుస్తారు.  స్వామి ఉగ్రరూపం ను శాంతి పర్చుటక, మహావిష్ణువు కమలములుతో ఆ లింగమును ఆరాధించినట్లు స్ధల పురాణం తెల్పుతుంది. ఇది పంచ శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రతీతి.  ఈ క్షేత్రం నకు దూరంగా గల పర్వతాలును "ఏనుగుల కొండ" గా పిలుస్తారు.  ఇచ్చట గజేంద్ర మోక్షం జరిగినట్లుగా చెప్పుచుంటారు.  దేవకూట పర్వతం నకు దక్షిణ భాగంలో శైవాలయం ఉంది.  ఇది గొప్ప శిల్ప సంపద కలిగియున్నది.  కొండకు ఉత్తర భాగంలో వైష్ణ్వాలయం ఉంటుంది.  ఇది పంచ భావనారాయణ ఆలయాల్లో ఒకటి.  ఈ రెండు ఆలయాలుకు మధ్యన " అనిస్త్రీ - పునిస్త్రీ " అను గ్రామదేవతులు మరియు సీతారామస్వామి ఆలయాలున్నాయి.

 కొండపైన గల ఆలయాలు చేరుటకు మెట్లు మార్గం  కొండకు దక్షిణ భాగంలో ఉన్నాయి.  ఆలయ ప్రవేశం రాజగోపురం క్రింద నుంచి జరుగుతుంది.  ముందుగా శివాలయం దర్శనం అవుతుంది.  గర్భాలయం నందు శ్రీ వీరభద్రస్వామి లింగ రూపంలో తూర్పు అభిముఖంగా దర్శనమిస్తాడు.  స్వామికి నిత్య పూజలుతో పాటు మహాశివరాత్రికి గొప్ప మేళా జరుగుతుంది.  కార్తీక మాసం నందు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించుతారు.  పూజ సామగ్రి కొండపైన విక్రయించుతారు.  ఆలయ దర్శనం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలు వరకు లభ్యమవుతుంది.  వీరభద్ర స్వామి గర్భాలయం చుట్టూ నందీశ్వరుడు, త్రిశూళం, భద్రకాళి దేవి, సూర్యనారాయణ స్వామి, లక్ష్మీ-గణపతి, నవగ్రహ మండపం మొదలగు సన్నిధిలు కలవు.

శివాలయం దాటగానే అనిస్త్రీ - పునిస్త్రీ అను గ్రామదేవతల సన్నిధి పశ్చిమ ముఖంగా ఉండును. పట్టిసీమ ప్రాంత ప్రజలు సంతానం మరియు సౌభాగ్యం కోసం గ్రామదేవతులును ఆరాధించుతారు.  మరికొంత దూరంలో సీతారామస్వామి ఆలయం పశ్చిమాభి ముఖంగా ఉంటుంది.  శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 

 శ్రీ భావనారాయ స్వామి ఆలయం కూడ పశ్చిమాభి ముఖంగా ఉండును.  శ్రీ వైష్ణువులు కొండ ప్రాంతమును "నీలా చలం" గా ఆరాధించుతారు.   గర్భాలయం నందు  శ్రీ - భూ - నీల సమేత స్వామి చక్ర - శంఖు - గద -అభయ ముద్రతో దర్శనమిస్తాడు.  ఇచ్చట స్వామి వారి వామన హస్తం నందు శ్రీ చక్రం చూడగలం. ఇది క్షేత్రం విశేషం గా చెప్పుచుంటారు.  స్వామికి నిత్య అర్చనలుతో పాటు చైత్ర శుద్ధ ఏకాదశి కి కళ్యాణోత్సవాలు నిర్వహించుతారు.  

సమీప రైల్వే స్టేషన్  కొవ్వూరు.  ఇచ్చట ప్యాసింజర్ మరియు కొన్ని ఎక్సెప్రెస్ సర్వీసులు  ఆగుతాయి.  రాజమండ్రి రైల్వే స్టేషన్ లో అన్ని ముఖ్య రైలు ఆగుతాయి.  ప్రయాణికులుకు మంచి సౌకర్యములు రాజమండ్రి లో దొరుకుతాయి.  రాజమండ్రి మెయిన్ బస్ స్టాండ్ నుంచి పోలవరం కు (రూట్ నెం. 110) బస్సులు ప్రతి 20 నిముషాలుకు బయులుదేరును. ఇవి కొవ్వూరు బస్ స్టాండ్, తాళ్ళపూడి, పట్టిసం మీదగా ఉంటాయి.  ప్రయాణికుల అభ్యర్ధన బట్టి బస్సులు పట్టిసం తీర్ధాల రేవు వద్ద ఆగుతాయి. భక్తులు ముందుగా పుణ్య స్నానములు ఆచారించుతారు.  పిమ్మట తీర్ధాలు రేవు నుంచి అవతలి తీరం కు లాంచీ లో ప్రయాణం సాగించుతారు. ప్రయాణం నకు రుసం  చెల్లించాలి. ఆవలి తీరం నుంచి మెట్లు వరకు ఇసుక తిన్నెలు (దిబ్బలు) పైన నడక ప్రయాణం.  రాజమండ్రి నందలి కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి పోలవరం కు షేరింగ్ ఆటోలు బయులు దేరుతాయి.  ఇవి గోదావరి నది గట్టు (కట్ట) మీదగా వయా కొవ్వూరు(గోష్పాద), కుమారదేవం, తాళ్ళపూడి, పట్టిసం మీదగా ఉంటాయి.

శ్రీరామ నవమి విశిష్టత మరియు ప్రాముఖ్యత.

💐💐💐శ్రీరామ నవమి విశిష్టత మరియు ప్రాముఖ్యత.💐💐💐

💐💐శ్రీరామ జయరామ జయ జయరామ..!!💐💐

శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన  పండుగ .....   
హిందువులు ఈపండగను అత్యంత భక్తి శ్రద్దలతో 
ఈ పండగను జరుపుకుంటారు .....   
శ్రీరాముడు వసంతఋతువులో చైత్ర శుద్ధ నవమి,  గురువారమునాడు పునర్వసు నక్షత్రపు 
కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో 
అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో    జన్మించినాడు ....  

ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా  జరుపుకుంటారు ...
పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము,
రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా  అయోధ్యలో  పట్టాభిషిక్తుడైనాడు .. 
ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమినాడే  జరిగినదని ప్రజల విశ్వాసము .....   
శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది ....  

ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలుగు ప్రజలు  భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని  వైభవోపేతంగా జరుపుతారు .....
రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని 
జిహ్వ ---జిహ్వే కాదు .....   
శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ 
పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం 
ఓ సంప్రదాయం .....  

భక్తుల గుండెల్లో కొలువై,
సుందర సుమధుర చైతన్య రూపమై, 
కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు  శ్రీరామచంద్రుడు .. 
శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా 
ఇంటి ఇలవేలుపుగా  కొలుస్తారు .....  
నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూ వుంటుంది .....     
భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా  జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు .....   
కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి  ఆ దేవదేవుడి  ఆశీస్సులు పొందుతారు .....  

సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం,  
సకల దోష నివారణం,  
సర్వ సంపదలకు నిలయం,  
సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం .....    
శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత  ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం .....   
భద్రుడు అనగా రాముడు అని  
అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై  నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం ..... ! 

శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడ 
గడపడమే  ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం ...
శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని  సకల శాస్త్రాలూ చెబుతున్నాయి ..... 
భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన  కారణంగా  పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ  పంచమినాడు జరిగినట్లుగా,  
అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ  నవమినాడు శ్రీరామచంద్రుని పుట్టినరోజు వేడుకలు,  కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు ...  
శ్రీ సీతారామ కళ్యాణము,  
రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి  వచ్చింది  శ్రీరామనవమినాడే ..
 
ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి  జరిగింది ....    
కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు  సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి  దిగి వస్తారంటా….
శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, 
నేత్ర పర్వంగా పట్టాభిషేక  సమయాన తిలకించి పులకితులవుతారట .....   
ఆంజనేయుని  పదభక్తికి మెచ్చి, హనుమ గుండెల్లో  కొలువైన శ్రీరాముని భక్త పోషణ  అనన్యమైనదై  గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి ....  శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు,
 ఏకపత్నీ వ్రతుడు,  
 పితృ, మాతృ భాతృ,
 సదాచారం, నిగ్రహం,
 సర్వ సద్గుణాలు మూర్తీభవించిన  దయార్ద
 హృదయుడు ..... 

శ్రీరామనవమి  రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న,ఆంజనేయ  సమేతముగా ఆరాధించి, 
వడపప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు ....
ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామకళ్యాణము  చూసి తరించిన వారి జన్మసార్థకం చెందుతందనేది 
భక్తుల విశ్వాసం .!! 

మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామ నవమి శుభాకాంక్షలు💐🚩🌹

Saturday, April 17, 2021

RASI PHALITHALU 2021-2022PANCHAGA PATANAM UGADI PLAVANAMA SAMVASTHARA PHALITALU #Ugadi #RasiPhalalu #HoroScope

RASI PHALITHALU 2021-2022PANCHAGA PATANAM UGADI PLAVANAMA SAMVASTHARA PHALITALU #Ugadi #RasiPhalalu #HoroScope     https://youtube.com/playlist?list=PLe3Rs4Hh16A01xk-qriUZx65-DH4KX_vA





















 

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS