Wednesday, December 30, 2020

దేవుడి గది ఎలా ఉండాలి..?

ఇంటిలో దేవుడి పటాలకు, ప్రతిమలకు మనం పూజలు చేసుకుంటాం. గృహంలో దేవుడి గది ప్రత్యేకం. అయితే ఎవరి ఆర్ధిక స్ధోమతను బట్టి వారు దేవుడికి అలమరాలలో ఒక అరగాని, ప్రత్యేకించి ఒక మందిరంగాని లేదా ప్రత్యేకంగా ఒక గదినిగాని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇంటిలో ఎక్కడ వీలు దొరికితే అక్కడ దేవుడి గదిని ఏర్పాటు చేసుకోకూడదు. దేవుడి గది కోసం కూడా వాస్తును పాటించాల్సిందే. 

దేవుడికి ప్రత్యేకించి ఒక గదిని ఏర్పాటు చేయలనుకుంటే, ఈశాన్యం గదిని అందుకు వాడుకోవటం మంచిది. అయితే ఈశాన్యం గదిలో ఎత్తుగా అరుగుగాని మందిరం మాదిరి కట్టడంగాని నిర్మించుకూడదు. దేవుడి పటాలను ఈశాన్యం గదిలో దక్షణ, పశ్చిమ నైరుతిలలో పీట వేసిగాని, ఏదైనా మంచి వస్ర్తము వేసి దానిపై పటాలు, ప్రతిమలు వుంచి పూజించుకొనవచ్చును. 

పటాలను గోడకు వ్రేలాడదీయదలిస్తే దక్షిణ, పశ్చిమ గోడలకు వ్రేలాడదీయాలి. ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమగోడలలో గల అలమారలో కూడా దేవుణ్ణి వుంచవచ్చును. 

ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయడం వీలుకాని పక్షంలో తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, వాయవ్యాలలో దేవుడిగదిని ఏర్పాటు చేసుకోవచ్చు. నైరుతి ఆగ్నేయ గదులు మాత్రం దేవుడి గదులుగా చేయకండి. ప్రత్యేకించి దేవుడిగదిని ఏర్పాటు చేయటం అనుకూలం కాని పక్షంలో గృహములో ఏ గదిలోనైనా సరే (నైరుతి, ఆగ్నేయ, గదులలో అయిన సరే) అలమారలలోగాని, పీటమీదగాని దేవుడి పటాలు, ప్రతిమలు వుంచుకొని పూజించవచ్చు. 

అయితే దేవుడి పటాలు, ప్రతిమలు ఎటువైపు(ఏ దిక్కుకు) అభిముఖంగా వుండాలి? అనేది అనేకమంది ప్రశ్న కొందరు తూర్పు, ఉత్తరాలకు దేవుడు అభిముఖంగా వుండాలని, మరికొందరు పూజించేవారి ముఖము తూర్పు, ఉత్తరాలకు అభిముఖంగా వుండాలని చెబుతున్నారు. మీరు ఏ వైపుకు అభిముఖంగా వున్నా ఇందు వాస్తుకు సంబంధం లేదని, అది మనలోని భక్తికి సంబంధించినదని చెప్పవచ్చు. అయితే ధ్యానం చేసే అలవాటు వుంటే తూర్పుకు అభిముఖంగా వుండి ధ్యానం చేయటం ఉత్తమం. ఉత్తరాభిముఖము కావటం రెండవ పక్షంపై అంతస్తుల్లో కూడా పూజగదిని ఏర్పాటు చేసుకొనవచ్చును. 

దేవుని గది నిర్మాణంలో జాగ్రత్తలు

గృహ నిర్మాణంలో మిగతా వాటిలాగే పూజ గదికి కూడా వాస్తు ప్రాముఖ్యత వుంది. నిజానికి ఈశాన్యంలో పూజ గది ఉండాలని, ఈశాన్యం గదిని పూజ గదిగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈశాన్యం గదిలో నుంచి రాకపోకలు వుండే విధంగా రెండు ద్వారాలు వుంచి బరువులు వుంచకుండా, పరిశుభ్రంగా వుంచుతూ వాడుకోవడం మంచిది. 

తూర్పు, ఉత్తర దిక్కులలో పూజా గదిని ఏర్పాటు చేసుకోవడంలో ఏ మాత్రం దోషం లేదని గ్రహించండి. దక్షిణ, పశ్చిమాల వైపు పూజ గదిని ఏర్పాటు చేయడం వల్ల ఇతర అవసరాల కోసం ఇంటిలో ఎక్కువగా తూర్పు, ఉత్తర భాగాలను వాడడం జరుగుతుంది. ఇది ఒక రకంగా శుభకరం అని గ్రహించండి. 

మరో ముఖ్య విషయం ఏమిటంటే.. పూజ గదికి ఎటువైపు కూడా అనుకుని బాత్ రూమ్ లేదా టాయిలెట్సు ఉండకూడదు. ఇదే విధంగా పూజ గది పైనగాని, కింద గాని టాయిలెట్సు, వుండకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి పొరపాటు చేయకూడదు. వీటి విషయంలో అపార్ట్ మెంట్ లో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు అపార్ట్ మెంట్స్ లో ఒకరి పూజ గది పైన ఇతరుల టాయిలెట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు.

అలాగే పూజ గది మీద 'లో-రూఫ్' వేసి అనవసరమైన సామాను వేయడం చాలా మంది చేస్తుంటారు. ఇలా చేయకూడదు. పూజ గదిలో అరుగులు నిర్మించి దానిపై దేవుని పటాలను వుంచి పూజ చేసుకోవడం చాలా ఇళ్లల్లో అలవాటుగా వుంది. పూజ పటాలను అరుగులపై వుంచే కన్నా, కొయ్యపీట, మండపములో వుంచుకోవడం మంచిది. అరుగు మీద లేదా నేల మీద పూజ పటాలు వుంచినప్పుడు నేలపై కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసి దానిపై పూజ పటాలను ఏర్పాటు చేయాలి. వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. చాపగాని, వస్త్రముగాని వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి. పూజా గృహంలో నిత్య దీపారాధన ఎంతో శుభకరం. 

ఇక చాలా మంది తమ పెద్దల ఫోటోలను దేవుని ఫోటోల పక్కన వుంచి పూజించడం అలవాటుగా వుంది. పెద్దల విషయంలో మనకున్న గౌరవానికి గాను వారి ఫోటోలకు ప్రత్యేకంగా వుండాలేగాని, పూజ గదిలో దేవుడి ఫోటోలతో సమంగా వుంచడం శుభకరమైన విధానం కాదు...

🙏🙏🙏🌹🌹💐💐

Saturday, December 26, 2020

*చిలుకూరు బాలాజీ దేవాలయం*

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల మరొకటి తెలంగాణ లోని చిలుకూరు గా ప్రతీతి. తెలంగాణ తిరుమల గా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర is కలదు. 
ఆలయం యొక్క వివరాలు మరియు  ప్రత్యేకత :-

• ప్రధాన దైవం: బాలాజీ.  (బాలాజీ వెంకటేశ్వరుని అనేక నామాల్లో ఒకటి.)
• ప్రధాన దేవత: రాజ్యలక్ష్మి
• ఉత్సవ దైవం: వెంకటేశ్వరుడు
• ఇతిహాసం నిర్మాణ తేదీ: క్రీ.శ.1067
• వీసాల దేవుడు
•  ఐదు వందల సంవత్సరాల చరిత్ర
•  వీఐపీ దర్శనాలు, టిక్కెట్లు, హుండీలులేని దేవాలయంగా ప్రసిద్ధి
• ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సీదా సాదాగా ఉంటుంది. 
• అనతికాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి
• ప్రదేశము: చిలుకూరు గ్రామము, రంగారెడ్డి జిల్లా,తెలంగాణ రాష్ట్రం, భారత దేశం.

*చిలుకూరు బాలాజీ:*
చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ కు చేరువలో .. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో కలదు. హైదరాబాద్ కు చేరువలో ఉండటం, రవాణా సౌకర్యాలు కూడా చక్కగా అందుబాటులో ఉండటం వల్ల బాలాజీ ఆలయాన్ని దర్శించటానికి ప్రతిరోజూ వేలల్లో భక్తులు వస్తుంటారు. ప్రతి రోజూ 20 - 30 వేల మంది భక్తులు, సెలవుదినాలలో
 30 -50 వేల మంది భక్తులు వేంకటేశ్వరుని దర్శిస్తుంటారు. విఐపి దర్శనాలు, టికెట్లు, హుండీ లు లేని దేవాలయంగా చిలుకూరు ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఒకే ప్రాంగణంలో ఒకవైపు వెంకటేశ్వర స్వామి, మరోవైపు శివుడు పూజలందుకోవటం ఈ ఆలయ విశిష్టత.

*క్షేత్ర పురాణం:*
 ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లివచ్చేవాడట. అయితే, కొంత కాలానికి ఆయన జబ్బుపడి తిరుపతికి వెళ్లలేకపోయాడట. దీంతో ఆయన బాధపడుతుండగా కలలో శ్రీ వెంకటేశ్వరస్వామి కనిపించి నీకు నేనున్నాను అని అభయమిస్తాడట. అప్పుడు స్వామి కలలో ఒక ప్రదేశం గురించి చేబుతాడట. అతను ఆ ప్రదేశం వద్దకు వెళ్లి తవ్వగా శ్రీదేవి, భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి కనిపించాడట. దీంతో ఆ భక్తుడు అక్కడ శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్టించి మందిరాన్ని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడట.
1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. నాలుగవ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది.

*మందిరం యొక్క ప్రాముఖ్యత :*

వెంకటేశ్వర స్వామి కోరిన కోర్కెలను తీర్చే కలియుగ వైకుంఠుడిగా ప్రసిద్ధి. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మొదటిసారి దర్శించి 11 ప్రదక్షిణలు చేసి కోర్కెలను కోరుకోవటం, పిమ్మట ఆ కోరిక నెరవేరిన తరువాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కును చెల్లించుకొనే పద్ధతి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. చిలుకూరు బాలాజీ ఆలయానికి వీసా గాడ్ అని కూడా పేరు. కొన్నేళ్ల క్రితం పై చదువులకు పశ్చాత్త్య దేశాలకు వెళ్లి చదువుకొనే విద్యార్థులకు వీసా దొరకక ఇబ్బందిపడేవారు. చిలుకూరి బాలాజీ విశిష్టత తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవటం .. ఆ కోరిక నెరవేరటం వెంటనే జరిగిపోయాయి. దాంతో ఇక్కడి బాలాజిని వీసా బాలాజీ (వీసా గాడ్ )అని పిలుస్తారు. 

*చిలుకూరు బాలాజీ స్వామి వారి దర్శనం :*

చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 :45 వరకు భక్తుల దర్శనార్ధం తెరిచే ఉంచుతారు. దర్శనం టికెట్లు, ప్రత్యేక పూజ టికెట్లు వంటివి ఏమీ ఉండవు. ఎంతటివారైనా క్యూలైన్ లో వెళ్ళవలసిందే!
ఇతర విశేషాలు
దేవుని విగ్రహాన్ని కనులు మూసుకొకుండా చూడాలి అని చెబుతారు. దేవాలయం అర్చకులు "వాక్" అనే ధార్మిక మాసపత్రికను ప్రచురిస్తున్నారు.
 
*రవాణా సౌకర్యాలు:*

రవాణా సౌకర్యాలు హైదరాబాద్ నగరం నుండి చిలుకూరు బాలాజీ ఆలయానికి చక్కటి రోడ్డు రవాణా సదుపాయాలూ కలవు. మెహదీపట్నం నుండి ప్రతి 5 నిమిషాలకొకసారి 222D నెంబరు గల బస్సు బయలుదేరుతుంది. ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, కూకట్ పల్లి నుండి కూడా సిటీ బస్సు సర్వీసులు కలవు. లంగర్ హౌస్ నుండి ఆటోల్లో ఎక్కి గుడి వద్దకు చేరుకోవచ్చు. ప్రయాణ సమయం గంట పడుతుంది.

గోవిందా గోవింద 🌹🙏🏻🌺🌸🙇🏼‍♂️🙆🏻‍♂️🌹🌺
* ప్రహ్లాదపురి ఆలయం ముల్తాన్ పాకిస్తాన్ *

 అసలు ప్రహ్లాదపురి ఆలయాన్ని విష్ణువు యొక్క ప్రహ్లాద గొప్ప భక్తుడు మరియు రాక్షసుడు హిరణ్యకశిపు కుమారుడు నిర్మించారు.
     అక్.  అవిభక్త రాష్ట్రమైన పంజాబ్‌లోని ముల్తాన్ నగరంలో త్రతయుగలో ముల్తాన్‌లో జన్మించిన చరిత్రకారులకు ప్రహ్లాదా.  రాక్షస తండ్రి అతన్ని హింసించినప్పుడు, విష్ణువు స్వయంగా రాక్షసుడిని చంపడానికి నరసింహ రూపంలో కనిపించాడు.

     ముల్తాన్ యొక్క సూర్య దేవాలయం వంటి ఈ ఆలయం కూడా నాశనం చేయబడింది.  విభజన సమయంలో ముల్తాన్ నుండి బాబా నసయన్ దాస్ బాత్రా చేత నరసింహ విగ్రహం భారతదేశానికి తీసుకువచ్చింది మరియు హరిద్వార్ వద్ద ఉంచబడింది.

Friday, December 25, 2020

సగం పక్షి, సగం సింహంఉండే రూపమే శరభ... ఇది మహాశివుని అవతారం.

 సగం పక్షి, సగం సింహం.ఉండే రూపమే శరభ.. ఇది మహాశివుని అవతారం.


విష్ణుమూర్తి దశావతారాల గురించి చాలామంది టకటకా చెప్పేస్తారు. కానీ మహాశివుడు ఎత్తిన అవతారాల గురించి మన అవగాహన తక్కువే. అలాంటి శివుని అవతారాలలో ఒక్కటే శరభ. ఎనిమిది పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉండే రూపమే శరభ! దక్షిణాది ఆలయాలలో ఎక్కువగా కనిపించే ఈ రూపం వెనుక ఓ ఘనమైన కథ ఉంది.



విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించేందుకు నరసింహావతారాన్ని ఎత్తిన విషయం తెలిసిందే! అయితే హిరణ్యకశిపుని సంహారం తరువాత కూడా ఆయన కోపం చల్లారనే లేదట. ఆ ఉగ్రనారసింహుని క్రోధానికి లోకమంతా అల్లకల్లోలమైపోయింది. నరసింహుని నిలువరించకపోతే ఆయన కోపానికి ప్రకృతి సర్వనాశనం కాక తప్పదని భయపడ్డారు దేవతలు. అందుకోసం నరసింహుని నిలువరించమంటూ వారంతా కలిసి శివుని ప్రార్థించారట. అప్పుడు శివుడు తన అవతారాలైన వీరభద్ర, భైరవులని పంపాడట. కానీ నారసింహుని ముందు ఆ రెండు అవతారాలూ నిలువలేకపోవడంతో శరభ అవతారాన్ని ధరించాడు శివుడు.


కొన్ని పురాణాల ప్రకారం శరభ, నరసింహ అవతారాల మధ్య తీవ్రమైన పోరు జరిగింది. ఈ పోరులో నరసింహుడు ఓడిపోయాడు కూడా. మరి కొన్ని పురాణాల ప్రకారం శరభ అవతారాన్ని ఎదుర్కొనేందుకు విష్ణుమూర్తి గండభేరుండ పక్షిగా అవతరించాడు. రెండు తలలతో ఉండే ఈ పక్షి శరభని దీటుగా ఎదుర్కొంటుంది. ఎంతసేపు యుద్ధం జరిగినా గెలుపు ఓటములు తేలకపోవడంతో, రెండు అవతారాలూ యుద్ధాన్ని విరమించుకుంటాయి. ఎవరి మధ్య యుద్ధం జరిగినా, ఆ యుద్ధంలో ఎవరు గెలిచినా శివకేశవులు ఇరువురూ ఒక్కటే కాబట్టి శరభను విష్ణుమాయగా వర్ణించేవారు కూడా లేకపోలేదు. కేవలం శివకేశవుల పురాణాలలోనే కాదు, బుద్ధుని జాతక కథలలో కూడా ఈ శరభ ప్రస్తావన కనిపిస్తుంది. ఈ జాతక కథల ప్రకారం శరభ బుద్ధుని పూర్వ అవతారాలలో ఒకటి!


శరభ రూపం దక్షిణాదిన, అందునా తమిళనాట ఉన్న శివాలయాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా శైవ మతాన్ని ప్రోత్సహించిన చోళులు నిర్మించిన ఆలయాలలో ఈ ప్రతిమ తప్పక ఉంటుంది. ఒకో చోట ఈ శరభ రూపం కేవలం నామమాత్రంగానే ఉంటే, మరికొన్ని చోట్ల సకల ఆయుధాలతోనూ, దుర్గాదేవి సమేతంగా దర్శనమిస్తుంది. శివుని శరభేశ్వరునిగానో, శరభేశ్వరమూర్తిగానో కొలుచుకునే సంప్రదాయం తమిళనాట ఇంకా ప్రచారంలోనే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని శైవాలయాలలో కూడా ఈ రూపం కనిపిస్తున్నప్పటికీ, దానిని శరభ అవతారంగా పోల్చుకునే భక్తులు అరుదు. అలాగని శరభ అవతారాన్ని తెలుగువారు గుర్తిచలేదని కాదు. ఈ అవతారం పేరు మీదుగా శరభాపురం వంటి ప్రాంతాలు మన రాష్ట్రాల్లో ఉన్నాయి. వీరశైవులు చేసే నృత్యాలలో శరభ, అశ్శరభ, దశ్శరభ అంటూ ఒళ్లు గగుర్పొడిచే అరుపులు వినిపిస్తాయి. తెలుగునాట శరభ ఉపనిషత్తు కూడా ప్రచారంలో ఉండేదని చెబుతారు.


ఉత్తరావృత శంఖం, ఉత్తరావృత శంఖం విశేషాలు పాంచజన్యం ఉత్తరావృత శంఖం

 ఉత్తరావృత శంఖం, ఉత్తరావృత శంఖం విశేషాలు




పాంచజన్యం ఉత్తరావృత శంఖం


భగవాన్‌ శ్రీకృష్ణపరమాత్ముడి శంఖం పాంచజన్యం. ఆయన ఈ శంఖాన్ని కురుక్షేత్ర యుద్ధంలో పూరించేవాడు. వసుదేవుడు బలరామ , కృష్ణులకు గర్గాచార్యుడనే పురోహితుడి ద్వారా ఉపనయనం చేయించాడు. అనంతరం ఆచార్యులు వారికి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారు. తరువాత బలరామ కృష్ణులను సాందీప మహాముని ఆశ్రమానికి తీసుకువెళతారు. ఆ ఆశ్రమంలో అన్ని విద్యలను ఆచార్యుల వారు వారికి బోధించారు. ఈ ఆశ్రమంలోనే కుచేలుడు  కృష్ణునికి స్నేహితుడిగా పరిచయమవుతాడు.


కొంతకాలం అనంతరం శిక్షణ ముగియడంతో బలరాముడు , కృష్ణుడు ఆచార్యులకు ప్రణమిల్లి గురుదక్షిణ ఏమివ్వాలో ఆజ్ఞాపించమని కోరతారు. వీరు సామాన్యులు కాదని వైకంఠం నుంచి భువిపై అవతరించిన వారని తన దివ్యజ్ఞానంతో సాందీపుడు తెలుసుకొంటాడు. తన మరణించిన కుమారుడిని తిరిగి బతికించమని కోరతాడు. గురుపత్ని శోకాన్ని నివారించినట్టు అవుతుందని వారికి సూచిస్తాడు.


గురుకుమారుడు కొంతకాలం క్రితం సముద్రస్నానం చేస్తూ భారీ అల రావడంతో కడలిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఆ సముద్రతీరానికి వెళ్లిన బలరామ కృష్ణులు గురుకుమారుడిని తిరిగివ్వమని సాగరుణ్ని కోరారు. సాక్షాత్తు నారాయణుడే తన దగ్గరకు రావడంతో సముద్రుడు వారికి వినమ్రంగా నమస్కరించి ‘గురుపుత్రుడిని మింగింది పంచజనుడనే రాక్షసుడనీ , కడలి గర్భంలో దాగి వున్నాడనీ’  వెల్లడిస్తాడు. దీంతో వారు సముద్రంలోపలికి వెళ్లి పంచజనుడితో యుద్ధం చేసి అతన్ని సంహరిస్తారు. అనంతరం అతని కడుపును చీల్చిచూడగా గురు కుమారుడు కనిపించడు. ఒక శంఖువు మాత్రమే కనిపిస్తుంది. శంఖాన్ని శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. గురుకుమారుడు నరకంలో వున్నాడని గ్రహించిన వారు అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఆ శంఖువును పూరిస్తాడు కృష్ణుడు. ఆ శబ్దానికిభీతిల్లిన యమధర్మరాజు అక్కడకు చేరుకొని ఇద్దరినీ తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేసి ఎందుకొచ్చారో తెలుసుకుంటాడు. భగవంతుని ఆజ్ఞ కావడంతో వెంటనే సాందీపుని కుమారుడిని వారితో పంపిస్తాడు. మునికుమారుడిని వెంటబెట్టుకొని ఆశ్రమానికి చేరుకుంటారు. మృతుడైన తమ కుమారుడు తిరిగి రావడంతో సాందీప దంపతులు ఎంతో సంతోషిస్తారు. పంచజనుడి నుంచి తీసుకున్న శంఖం కనుకనే దానికి పాంచజన్యం అని పేరొచ్చింది.


#శంఖం  ప్రాముఖ్యత


దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. ఉత్తరావృత శంఖానికి ఎడమప్రక్క ఆవృతం(కడుపు) ఉంటుంది. శంఖాన్ని తూర్పుదిక్కుకి పట్టుకున్నప్పుడు ఉత్తరం వైపు ఆవృతం ఉంటుంది.


కాబట్టి ఈ శంఖాన్ని ఉత్తరావృత శంఖం అంటారు. విజయానికి సంకేతంగా శంఖాన్ని పూరిస్తారు. శంఖ ధ్వని విజయానికి , సమృద్ధికి, సుఖానికి , కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక.

ఉత్తరావృత శంఖాన్ని దుకాణాలలోను ఆఫీసుల్లోను ఫ్యాక్టరీలలోను స్థాపించి అభివృద్ధిని పొందుతున్నారు.


ఉత్తరావృత శంఖాన్ని ఊదటం కేవలం ఆద్యాత్మికపరమైన ప్రయోజనాలే కాకుండా శాస్త్రీయ మరియు ఆయుర్వేద ప్రయోజనాలు కూడా ఉంది. శంఖాన్ని ఊదినప్పుడు స్వచ్చమైన గాలి ఊపిరితిత్తులకు చేరుతుంది. మలినాలతో కూడిన గాలి బయటకు వస్తుంది. ఉత్తరావృత శంఖాన్ని ఊదటం వలన ఊపిరితిత్తుల వ్యాదులు నశించటమే కాకుండా ప్రేగులకు సంబందించిన వ్యాదులు నివారణవుతాయి. ఎవరికైనా మాటలు తడబడటం , నత్తి , గొంతు సంబంద సమస్యలు ఉన్నవారు ఉత్తరావృత శంఖాన్ని పూరించిన , ఉత్తరావృత శంఖ ద్వని విన్న గొంతు సంబంద వ్యాదులు నివారణవుతాయి. ఆస్తమా ఉన్నవారు క్రమం తప్పకుండా ఉత్తరావృత శంఖాన్ని పూరించినట్లైతే వ్యాది నుండి నివారింపబడతారు.


శాస్త్రవేత్తలు అభిప్రాయానుసారం ఉత్తరావృత శంఖ ధ్వని వల్ల వాతావరణంలో హాని చేసే కీటకముల నాశనం జరుగుతుందని - అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు.  జర్మన్ శాస్త్రవేత్తల ప్రయోగాల పలితంగా ధైరాయిడ్ , హార్మోన్ లోపాల వంటి వ్యాదులు నివారింపబడతాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు.


ఆశ్చర్యకరంగా కొన్ని ప్రాంతాలలో శంఖాన్ని పూరించినప్పుడు వెలువడే శబ్ధ కెరటాలు పరిసరాల్లో నివసించే ప్రజలకు ప్లేగు , కలరా వంటి వ్యాదులు ప్రబలవని నమ్ముతారు. ఉత్తరావృత శంఖాన్ని పూరించిన ఇంటిలో గాని , వ్యాపారసంస్ధలలో గాని నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఉత్తరావృత శంఖాన్ని పూజ మందిరంలో గాని , ఇంటికి ఉత్తర దిక్కున గాని ఉంచిన సమస్త వాస్తు దోషాలు నశిస్తాయి.

 

వివాహాలు కుదిర్చేటప్పుడు పొంతన చూస్తారు వరుడిది , వధువుది , జాతకపరిశీలనలో కుజదోషం అమ్మాయిలో ఉందనో , లేక అబ్బాయిలో ఉందో చెప్పడం వలన ఆ సంబంధాన్ని కుదుర్చుకోరు ,

 వివాహాలు కుదిర్చేటప్పుడు పొంతన చూస్తారు వరుడిది , వధువుది , జాతకపరిశీలనలో కుజదోషం అమ్మాయిలో ఉందనో , లేక అబ్బాయిలో ఉందో చెప్పడం వలన ఆ సంబంధాన్ని కుదుర్చుకోరు , కొన్ని అనంతకాల సర్పదోషం ఉంది అనో , సప్తమస్థానానికి రాహుదోషం పట్టింది లేదా లగ్నములోనె రాహువు ఉన్నాడనో లేదా మాంగల్యస్థానంలో రాహువు ఉన్నాడనో, ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళు చెడిపోతుంటాయి . నిశ్చితార్థం అయిన తరువాత కూడా కొన్ని చిన్న చిన్న కారణాలతో అపశకునముల వలన పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. వివాహాలు అయిన తరువాత కొంత కాలానికే విడిపోయే సంఘటనలు ఏర్పడుతాయి. ప్రేమ వివాహాలు కూడా జరగక వేరే వేరే వ్యక్తులను వివాహం చేసుకోవాల్సి వస్తుంది.... ఇలాంటి వాటికి తగిన పరిష్కారాం ...




యక్షిణి కుందెళ్ళు:- 


ఏ ఇంట్లో అయితే వివాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయో ఆ ఇంట్లో ఒక మగ , ఆడ కుందేలును స్వచ్చమైన తెల్లగా ఉన్న కుందేలును తీసుకుని వచ్చి ఆ రెండింటికీ వివాహం చేస్తారు ఇది కేరళ తంత్రం . పెళ్లి చేసిన  తర్వాత ఆ కుందేలును ఆ ఇంటివారికి ఇస్తారు . కుజదోషం ఉంటే ఎర్రని పదార్థాలు ఆ కుందేలుకు ఆహారంగా పెట్టాలి. రాహు కేతువుల దోషం ఉంటే భూమిలో నుంచి వచ్చే దుంపలను ఆహారం పెట్టండి. శుక్రదోషం ఉంటే తెల్లని పదార్థాలు, తీపి పదార్థాలు ఎక్కువగా వేయాలి. బుధగ్రహదోషం ఉంటే ఆకుపచ్చని గడ్డి లేదా పెసలను నానబెట్టి ఆహారంగా వెసి పెంచమని చెబుతారు. ఇలా చేయడం వల్ల మూడు నెలల కాలంలోనే వివాహం కుదిరి సంతోషంగా దాంపత్య  జీవితాన్ని కొనసాగిస్తారు . అనతి కాలంలోనే చక్కని సంతానం కలుగుతుంది.యక్షిణీ కుందేలు దొరకని వారు అటువంటి కుందేలు బొమ్మలను రెండింటినీ తీసుకుని వచ్చి బొమ్మల పెళ్ళి చేయవచ్చు. నల్ల ఇరుగుడు చెక్కతో గానీ , ఎర్రచందనం చెక్క తో గాని చేసినటువంటి బొమ్మలకు వివాహం చేసి ఆ ఇంట్లో పెడితే శుభకార్యాలు జరుగుతాయి. ఇది కేరళలో ఉన్న చాలా పురాతనమైన తంత్ర ప్రక్రియ.

మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి...

 మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి...



1.  అర్ధ దోషం

2.  నిమిత్త దోషం         

3.  స్ధాన దోషం

4.  గుణ దోషం   

5.  సంస్కార దోషం.


ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు 


🔸 అర్ధ దోషం


ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు


భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ గదిలోనే  శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. 


హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు.


తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు  


తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు


వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును  తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు. 


శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి!  యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు.


ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం.  మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం 


🔸 నిమిత్త దోషం

 

మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి


వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు  వంటివి పడ కూడదు.


అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి


భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో  కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే  వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు


అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు?  అని అనుకొన్నది


ఆమె ఆలోచనలు *గ్రహించిన భీష్ముడు

'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను. 


నా స్వీయ బుధ్ధిని ఆ *ఆహారం తుడిచి పెట్టింది. *శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను

ఇప్పుడు పవిత్రుడినైనాను


నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు


చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది  తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి 'నిమిత్త దోషం ' ఏర్పడుతోంది


🔸 స్ధాన దోషం


ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటకూడా పాడైపోతుంది


యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు.


దుర్యోధనుడు  ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,  ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి, అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే  తీసుకొని  ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో  కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు


మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి


🔸 గుణ దోషం


మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని  లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది


🔸 సంస్కారదోషం


ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది.సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది

మహాభారతం తరువాత ఇక ఏ కథలోనూ దివ్యాస్త్రాల ప్రస్తావన రాలేదేమిటి..?

 మహాభారతం తరువాత ఇక ఏ కథలోనూ దివ్యాస్త్రాల ప్రస్తావన రాలేదేమిటి..? ఆ పరిజ్ఞానం తరువాత కాలానికి సంబంధించిన కథానాయకులకు ఎందుకు లేకుండాపోయింది..? కురుక్షేత్రం తరువాత ఈ దివ్యాస్త్రాలు ఏమయ్యాయి..? ఇంట్రస్టింగు ప్రశ్న కదా… అప్పుడప్పుడూ ఈ అంశంపై కూడా నెట్‌లో కొన్ని చర్చలు, వ్యాఖ్యలు కనిపిస్తుంటాయి… ఓసారి పరిశీలిద్దాం… దివ్యాస్త్రాలు అంటే నాగాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, గరుడాస్త్రం, సమ్మోహనాస్త్రం, పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం… ఇలాంటివి…



కురుక్షేత్ర కాలానికే ధర్మం క్షీణదశకు చేరుకుంది… ఆ ద్వాపర యుగం దాటి ఇక కలియుగం ప్రారంభమైతే ఇంకా ధర్మం ఒంటికాలితో కుంటక తప్పదని కృష్ణుడి భావన… ధర్మ పరిరక్షణ పేరుతోనే కురుక్షేత్ర సమరం జరిపించినా సరే, ఒక్కసారి కలియుగం ఆరంభమైతే ఇక ధర్మక్షీణత అనివార్యమని తనకూ తెలుసు… మనుషుల్లో కక్షలు, కార్పణ్యాలు పెరుగుతాయి… విచక్షణ, సంయమనం మరింత అదుపు తప్పుతాయి… అందుకని దివ్యాస్త్రాలు కలియుగంలోకి ప్రవేశించొద్దు అనేది కృష్ణుడి నిర్ణయం… ఓసారి ఆ దివ్యాస్త్రాల పరిజ్ఞానం ఎవరెవరికి ఉన్నదో, ఎవరి ద్వారా అవి కలియుగంలోకి కూడా వచ్చే అవకాశాలున్నాయో పరిశీలిస్తాడు…


1) కృష్ణుడు… అంటే తనే… తను ఎలాగూ కలియుగంలోకి రాడు… అప్పటికే అవతారం చాలిస్తాడు…



2) అర్జునుడు… తన జీవనం చివరి అంకంలో స్వర్గం వైపు సాగే మహాప్రస్థానంలో ఏ హిమాలయ పర్వతంపైనో రాలిపోతాడు… ఆ భవిష్యత్తు కృష్ణుడికీ తెలుసు…


3) అభిమన్యుడు…అర్జునుడి ద్వారాా కొన్ని దివ్యాస్త్రాల పరిజ్ఞానం నేర్చుకున్నాడు సరే, కానీ కురుక్షేత్రంలోనే కుట్రవ్యూహాలకు హతుడైపోయాడు…


4) భీష్ముడు… ప్రతి దివ్యాస్త్రం మీద పట్టు ఉన్న యోధుడు… కురుక్షేత్రంలోనే, అంపశయ్యపై వేచీ వేచీ, చివరకు ప్రాణాలొదిలాడు…


5) ద్రోణుడు… దృష్టద్యుమ్నుడి చేతలో శిరోఖండనానికి గురై, కురుక్షేత్ర సమరంలోనే ప్రాణాలు వదిలేశాడు…


6) అశ్వత్థామ… తండ్రి ద్వారా అన్నిరకాల దివ్యాస్త్రాల జ్ఙానాన్ని సంపాదిస్తాడు… కానీ పాండవులు అనుకుని, కురుక్షేత్రం చివరిరోజు ఉపపాండవులను సంహరించి, ఆ దివ్యస్త్ర పరిజ్ఞానాన్ని మరిచిపోయే శాపం కృష్ణుడి నుంచి పొందుతాడు… పిచ్చివాడై ఏ అడవుల్లో పడి ఎలా బతికాడో ఎవరికీ తెలియదు…


7) పరుశురాముడు… తను యోగనిద్రలోకి వెళ్లిపోతాడు… ఈ ప్రాపంచిక ధ్యాస నుంచే దూరమవుతాడు… ద్వాపర యుగం అనంతరం ఈయన ప్రస్తావన మరే పురాణంలోనూ కనిపించదు…


8) సాత్యకి… యాదవులు పరస్పరం సంఘర్షించుకుని, అందరూ మరణిస్తారు… అందులో సాత్యకి కూడా… ఏ ఇతర యాదవ వీరుడికీ ఈ విద్య తెలియదు…


9) కర్ణుడు… పరుశురాముడి నుంచి దివ్యాస్త్రాల పరిజ్ఞానం పొందినవాడే… కానీ కురుక్షేత్రంలో మరణించాడు… తను ఎవరికీ తన విద్యను బోధించలేదు…


10) దృష్టద్యుమ్నుడు… తనకు కొన్ని దివ్యాస్త్రాలు తెలుసు… కానీ కురుక్షేత్రం చివరిరోజున అశ్వత్థామ చేతుల్లో హతుడైపోయాడు…


11) ధృతరాష్ట్రుడు… తను ఏ యుద్ధంలోనూ పోరాడకపోయినా తను దివ్యాస్త్రాల పరిజ్ఞానం కలిగిన వాడే,.. కురుక్షేత్రం తరువాత సన్యాసాశ్రమం తీసుకుని, అడవుల్లో నివసిస్తాడు… ఓరోజు దావానలం చుట్టుముట్టి ఆ మంటల్లోనే పడి మరణిస్తాడు…


12) బర్బరీకుడు… ఘటోత్కచుడి కొడుకు… దివ్యాస్త్ర సంపన్నుడు… అంతులేని గందరగోళంలోకి నెట్టేసి, కృష్ణుడు ఈ పాత్రను కురుక్షేత్రానికి ముందే ముగించేస్తాడు…


13) బభ్రువాహనుడు… అర్జునుడి చిత్రాంగద వల్ల పుట్టిన కొడుకు… అర్జునుడిని మించిన యోధుడు…


14) పరీక్షిత్తు… అభిమన్యుడి కొడుకు… అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రం దెబ్బకు తల్లి గర్భంలోనే మరణిస్తే, క‌ృష్ణుడు బతికిస్తాడు,,, తనే ధర్మరాజు అనంతరం అఖండ ఆర్యావర్తానికి చక్రవర్తి అవుతాడు…


15) వృషకేతు… కర్ణుడి చిన్నకొడుకు… కురుక్షేత్రం అనంతరం అర్జునుడు అమితంగా ప్రేమిస్తాడు ఇతన్ని… అన్నిరకాల విద్యలూ నేర్పిస్తాడు…


అంటే… ఈ చివరి ముగ్గురూ మిగిలారు… ఈ ముగ్గురూ ద్వాపర యుగం అనంతరం కలియుగంలోకి ప్రవేశించే పాత్రలు… అందుకని కృష్ణుడు వేర్వేరు సందర్భాలలో ఆ ముగ్గురి నుంచీ మాట తీసుకుంటాడు… ఎవరికీ ఈ విద్యల్ని నేర్పించవద్దు అని… దానికి కట్టుబడి ఉంటారు… ఇక వారి తరువాత ఎవరికీ ఆ విద్య దక్కలేదు… ఆ పరంపర వారితోనే ఆగిపోయింది… తమ వారసులకు కూడా ఆ విద్యను బోధించలేదు… వారితోనే దివ్యాస్త్రాల కథ ముగిసిపోయింది…

రాహు,కేతు పూజకై, శ్రీ కాళహస్తి...

 రాహు,కేతు పూజకై, శ్రీ కాళహస్తి...



శ్రీకాళహస్తి లోని గుడికి రాహు కేతువుల గ్రహణ సమయం కాలంలో పూజలు జరుగుటకు గల ఆంతర్యము

 ఈ దేవాలయంలో పరమేశ్వరుడు తూర్పు దిశ యందు కూర్చుండి  పశ్చిమము చూస్తూ ఉంటారు 

మనము గమనించ దగ్గ విశేషం. 

 అలాగే పడమర లో అమ్మవారు కూర్చొని   తూర్పు లో ఉన్న ఈశ్వరుని చూడడం  గమనించగలము.  (ఆది అంతము)( ప్రకృతి పురుషుడు) ఒకరి కొకరు ఎదురెదురుగా ఉండటము .


ఈ విషయమును మరొక విధముగా చెప్పదలచుకుంటే రాశి చక్రమూలో  రాహువు కేతువు లు  ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటారు. 

ఈ దేవాలయములో  పరమేశ్వరుని శిరముపై పంచ తలలు కేతు గాను . అమ్మవారు ఏక సిర రాహు గాను  పరిగణించ వలెను. 

 ఈ దేవాలయంలో రాహుకాలంలో రాహు కేతువుల పూజ ప్రశస్తము అయితే ప్రతి రోజు రాహుకాలము వచ్చును. కానీ  ఆ సమయంలో స్వామివారిని దర్శించుకున్న స్వామి వారి తల పై పంచ నాగులు కేతువు దర్శనము  కనపడును.  అయితే రాహు గా అమ్మవారిని పరిగణించినపుడు  సోమవారము నాడు శుక్రవారం మాత్రమే   అమ్మవారికి నడుమునకు అలంకరించ్చే   వడ్రాణం రూపంలో రాహు కనబడును . అమ్మవారికి శుక్రవారం రోజున వజ్రాల కిరీటం నడుమునకు   ఒక తల  నాగుపాము వడ్రాణం గాను  బంగారము తో తయారు చేసిన చీర తో  అలంకరింపబడును. 

కనుక శ్రీకాళహస్తి లో సోమవారం శుక్రవారం రాహుకాల సమయంలో మాత్రమే . 

ఈ విషయమును  గమనించి రాహు కేతువుల దోషనిమిత్తము సోమవారం శుక్రవారం రాహుకాలంలో ప్రశస్తమని గమనించగలరు.

మహిళలు ధరించే ఆభరణాల గురించి వేరే చెప్పక్కర్లేదు.

 మహిళలు ధరించే ఆభరణాల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఒక్కో ఆభరణం వెనుక ఒక్కో ప్రయోజనం దాగి వుంటుంది. అలాగే ముక్కుపుడక వెనుక కూడా సైంటిఫిక్ ప్రయోజనాలున్నాయి.


ముఖ్యంగా మహిళల పునరుత్పత్తి అవయవాలతో సంబంధం కలిగి ఉన్న ఎడమ ముక్కు భాగంలోని నరాలను శాంతపరచే క్రమంలో భాగంగా మహిళలు ముక్కు పుడకలను ధరిస్తారని చెప్పబడింది. అలాంటి ఈ ధారణ మహిళ ప్రసవ సమయంలో ఎంతో మేలు చేకూర్చుతుందట. అంతేకాదు, మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే బహిష్టు నొప్పిని కూడా ఇది నిరోధిస్తుందట.


పూర్వ విశ్వాసాల ప్రకారం భార్య తన ముక్కు ద్వారా వదిలే శ్వాస భర్త ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందట. అందువల్ల మహిళ ముక్కుపుడకను ధరిస్తే ఆ గాలి స్వచ్చంగా మారి ఎటువంటి చెడు అనారోగ్య ప్రభావాలను కలిగించదట

ముక్కుపుడక బంగారంతో చేస్తారు కనుక ఆ లోహానికి అలాంటి గుణం ఉన్నది.

 👆 ఇది నాడీ దోషానికి సంబంధించిన విశేషాలను కొంతవరకూ నిరోధిస్తుంది. 


నాడీ దోషము అంటే మనం చూసే అష్ట కూటముల లో ఒకటిగా ఉండి 8 పాయింట్లు ఇచ్చే విషయం

  నాడీ దోషము నుండి వివాహం జరిగి పోయిన వారు దయచేసి ఈ ముక్కును కుట్టించుకున్న చో ఆ దోషం కి కొంత తెరిపి రావచ్చు.

శివుని అష్టమూర్తులు

శివుని అష్టమూర్తులు :

1) భవుడు, 2) శర్వుడు, 3) ఈశానుడు, 4) పశుపతి, 5) ఉగ్రుడు, 6) రుద్రుడు, 7) భీముడు, 8) మహాదేవుడు అన్నవే శివుని ఎనిమిది మూర్తులు, శివుని అష్టమూర్తులు నాలుగు చేతులు కలిగివుండి మూడవ కంటితో జటాజూటముతో ఎఱ్ఱని వస్త్రముతో భూషణములతో వర్ణించబడి వున్న అష్టమూర్తులందరూ అభయ ముద్రను టంకమును కుడివైపున ధరించి, ఎడమచేతులలో వరదముద్రను, లేడిని ధరించివుంటారు ఈ అష్టమూర్తులలో భవుడు తెలుపువర్ణము, శర్వుడు నలుపు, ఈశానుడు ఎఱుపు, పశుపతి నల్లనివర్ణము, ఉగ్రుడు పసుపు కలిసిన తెలుపు, రుద్రుడు కుంకుమ వర్ణం ఎరుపు, భీముడు ప్రవాళ (పగడమువంటి) ఎరుపు, మహాదేవుడు నలుపు వర్ణముతోనూ, వర్ణింపబడి ఉన్నారు
1. ఏకాదశ రుద్రులు :
రుద్రునికి శైవాగమం ప్రకారం 1) శంభుడు, 2) పినాకి, 3) గిరీశుడు, 4) స్థాణుడు, 5) భర్గుడు, 6) సదాశివుడు, 7) శివుడు. 8) హరుడు, 9) శర్వుడు, 10) కపాలి, 11) భవుడు అన్న మూర్తులు చెప్పబడివున్నాయి ఈ
ఏకాదశరుద్రులుకాక శివునికి అష్టమూర్తులు, అనగా ఎనిమిది రూపాలూ చెప్పబడి వున్నాయి
1. చంద్రశేఖరుడు :
పగడము వంటి ఎఱ్ఱని శరీరకాంతి కలిగినవాడు మృదుమధురమైన ప్రేమభావమును వ్యక్తముచేయు ఆకృతికలిగి, విశాలమైన నుదురు, త్రినేత్రము లతో, శిరస్సున అర్ధచంద్రునితో పాద పీరముపై నిలిచి నాలుగు బాహువులు కలిగి కుడిచేతిలో ఒకటి అభయముద్ర రెండవదానిలో పరశువు ధరించి ఉంటాడు ఎడమచేతిలో ఒకచేత వరదముద్ర, మరోచేత లేడిని ధరించిన చతుర్భుజమూర్తిగా ధ్యానించాలి!
2. ఉమామహేశ్వరుడు : -
ఉమ అనగా పార్వతీదేవి ఉమతో కూడిన ఈ ఉమామహేశ్వరుడు తెల్ల తామరపుష్పము వంటి ఉమాదేవి సహితుడై కూర్చుండి నల్లకలువల వంటి కన్నులతో ప్రసన్న ముఖము కలిగి చతుర్భుజములతో కుడిచేతులలో అభయముద్ర, టంకము ధరించి, ఎడమచేతులతో వరదముద్ర, లేడిని ధరించిన ప్రశాంతముఖుడైన, మూర్తిగ పరమాత్ముడైన ఉమామహేశుని ధ్యానించవలెను వృషభారూఢ శివుడు :
ఈ మూర్తిని శివుడు వృషభవాహనముపై కూర్చుండి ఎడమవైపున పార్వతీదేవిని పట్టుకొనివుండి కుడిచేత కటకముద్రతో, కుడితొడపై కూర్చుని వున్న వినాయకుని కౌగిలించుకొని ఒకచేత జపమాలను, వరదహస్తమునూ, లేడినీ ధరించిన తెల్లని కాంతిగల వృషభవాహనుడిగా శివుని ధ్యానించవలెను
3 నటరాజమూర్తి :
గుండ్రని అగ్నిజ్వాలామండలములో తాండవము చేయు నటరాజ మూర్తి తన ఒకచేత పాముయొక్క శిరస్సును పట్టుకొని, ఎడమపాదము పైకెత్తి కుడిపాదముతో అపస్మార పురుషుని అణగతొక్కుచూ ఎఱ్ఱని పాదములూ, హస్తములూ కలిగి 4 చేతులు కలిగి కుడిచేతులలో ఢమరుకము, అభయ ముద్రలనూ, ఎడమవైపున ధోలాహస్తము, అగ్నిని ధరించిన విధంగా నటరాజ మూర్తిని ధ్యానించవలెను
4.అర్ధనారీశ్వరమూర్తి :
కుడివైపున శంకరుని మూర్తి ఎడమవైపున పార్వతి ఈశ్వరుడు ఎఱ్ఱని శరీరఛాయ కలిగి, గంగాదేవి చంద్రరేఖ గల జటాజూటముతో అర్ధపాల నేత్రముతో కపాలకుండలముతో పులితోలు వస్త్రములుగాగల సగముభాగము నడుముతో ప్రకాశించుచుండును ఎడమభాగములో పార్వతీదేవి నల్లటి శరీరఛాయ పాపట, తిలకములతో చెవినత్తులు ధరించి ఏకగ్ధనముతో నాల్గు చేతులు కలిగివుండును వీరహస్తమునందు టంకమునూ, పార్వతి హస్తము నడుముననుంచుకొని వరదహస్తము, కలువపువ్వూ ధరించివుండునుకుడిపాదము ఈశ్వరభాగము వంచబడి ఎడమపాదము అందెలతో అలంకరించబడిన అర్ధనారీశ్వరమూర్తిని - ఈ రెండువర్ణములలో ధ్యానించ వలెను
5.దక్షిణామూర్తి :
వటవృక్షము క్రింద సుఖాసీనుడైన మహేశ్వరుడు, తెల్లని సర్వావయ వములతో, శిరస్సున అర్ధచంద్రునితో, నాగభూషణములతో పులితోలును వస్త్రముగా ధరించి సమస్త ముని గణములచేత సేవించబడుచూ ఆరాధ్య మూర్తియై ఉపదేశముద్ర ధరించి, సురాసురులు, కిన్నెర, కింపురుష ప్రమధులచే సేవింపబడుచున్న జ్ఞాన ఉపదేశమూర్తిగా ధ్యానించవలెనుకుడిచేత ధ్యానముద్ర, జపమాలలను ధరించి ఎడమచేతులలో పుస్తకమును, వీణను ధరించివుండును కుడివైపు జమదగ్ని, వశిష్టుడూ, భృగువు, నారదుడు నిలువబడియుండగా ఎడమభాగములో అపస్మార పురుషుని పాదములతో తొక్కును సకల లోకములను బ్రహ్మ జ్ఞానోపదేశము చేయువానిగా దక్షిణామూర్తిని ధ్యానించవలెను
6. వీరభద్రమూర్తి :
నల్లని శరీరకాంతితో ఎఱ్ఱని వస్త్రములతో కనుబొమ్మలు ముడిపడి కోపించిన క్రోధములో అగ్నివలే మండుచున్న కేశములు కలిగి, మూడు కన్నులతో సింహచర్మము ధరించి ఎనిమిది చేతులతో ప్రకాశించును కుడివైపు బాహువులలో దండము, శూలము, గొడ్డలిని ధరించి, ఎడమ భాగమున 1) ఖేటము, 2) కపాలము, 3) టంకము, 4) రోకలిని ధరించి, చిరుగంటతో, దండతో అలంకరించబడిన వీరభద్రమూర్తిని ధ్యానమూర్తిగా ధ్యానించవలెను
7. మహాకైలాసమూర్తి :
ఈ మహాకైలాసమూర్తిని స్కాందపురాణంలోని శంకరసంహిత ఇలా వర్ణిస్తున్నది మేరుపర్వతానికి ఉత్తరభాగమున ఉన్న కైలాసగిరిపై ఎడమ భాగమున సర్వమంగళాదేవితో కూడిన చంద్రశేఖరుడైన పరమశివుడు భక్తు లతో ప్రమధ గణములతో పరివేష్టితుడై ఉండును గొప్పదైన సింహాసనముపై శ్రీమన్మహా పరమశివుడు చక్కగా వికసించిన కమలములవంటి ఇరువది అయిదు (25) ముఖములతో. వివిధాయుధము లను ధరించిన ఏబది (50) చేతులతో, ఎఱ్ఱతామరపూవుల వంటి హస్తము లతో, పాదములతో వివిధములైన మణులు పొదిగిన బంగారు నగలతోభూషితుడై, కోటిసూర్యుల కాంతులను వెక్కిరించు ఆనందదాయకమైన రూపములో గంగా జటాజూటముతో, నెలవంక శిరోభూషణముతో, విభూతిని పూనుకొన్న సర్వాంగములతో, నాగయజ్ఞోపవీతుడై కపాలమాలను ధరించి, పులితోలును వస్త్రముగా ధరించి, ప్రతిముఖమునందు మూడుకన్నులతో కుడికాలును చాపి ఎడమకాలిని కుంచించి, భక్తుల కోరికలను అనుగ్ర హించుచూ అధివసించును!
1) అభయ ముద్ర, 2) చక్రము, 3) శూలము, 4) టంకము, 5) బాణము, 6) గద, 7) పద్మము, 8) ఖడ్గము, 9) తామరము, 10) శక్తి, 11) గొడ్డలి, 12) ప్రాసము, 13) నాగము, 14) నాగలి, 15) అంకుశము, 16) జపమాల, 17) చిన్నకత్తి, 18) ధ్వజము, 19) దండము, 20) వజ్రము, 21) కుంతము, 22) ఎముక, 23) దంష్ట్రము, 24) అంపము, 25) ఖిండినాలము కుడిచేతు లలో ధరించియుండి, 1) వరముద్ర, 2) విల్లు, 3) లేడి, 4) శంఖము, 5) ఖేటము, 6) పాశము, 7) గొడ్డలి. 8) ముధరము, 9) ఢమరుకము, 10) గంట, 11) రుద్రవీణ, 12) పునకము, 13) కపాలము. 14) పుట్టె, 15) ఖట్వాంగము, 16) భుశుండీ ఎడమ చేతులలో ధరించును
8. మృత్యుంజయ మూర్తి :
అమృత మృత్యుంజయమూర్తిగా శివుడు తెల్లని శరీరఛాయ కలిగి శిరస్సున అమృతము స్రవించే అర్ధచంద్రునితో యోగసమాధిలో బంధింపబడిన పెదవులు, రెండుచేతులలో అమృతము నింపిన బంగారు కలశములు పట్టుకొని, మరిరెండు చేతులతో అమృతమును శిరస్సుపై అభిషేకించు కొనుచూ, పసుపురంగుగల జటలతో శిరస్సున చంద్రుడు, సూర్య, చంద్ర, అగ్నులూ, త్రినేత్రములతో నాగభూషణుడై సర్పయజ్ఞోపవీతమును ధరించి పులితోలు వస్త్రముగా ధరించి, భస్మము ధరించిన సర్వాంగములు కలిగి, కూర్చున్నవానిగా ధ్యానించవలెను

ఏఫ్రియల్ నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు

ఏఫ్రియల్ నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:  ఏఫ్రియల్-1:    A).    రాధాకృష్ణమాయి ఆధ్వర్యంలో వంటలు, ప్రసాదాలు తయారు చేయడం ప్రారంభం. B).  నారాయణ మహదేవ్ తోసర్ సాయిని దర్శించుట.   C).   నారాయణ మహాదేవ్ తోసర్ నిర్మించిన హనుమాన్ మందిరం. D). హనుమంతుడి విగ్రహం పైన "ఓం శ్రీ సాయి హనుమాన్" అని చెక్కించుట.      E).   బాబా వఝే అనే భక్తుడిచే " శ్రీ సత్యనారాయణ వ్రతం" చేయించుట.     F).    బాబా వఝేకి 25/- రూ:లు దక్షిణ ఇప్పించటం.      G).    " శ్రీ సాయిసత్య చరిత్ర" అనే పుస్తకం విడుదల.     H).    "శ్రీ శిరిడి సాయినాథులు" అనే పుస్తకం విడుదల.   ఏఫ్రియల్-3:      A).    ఉపాసనీ బాబా కాశీలో నిర్వహించిన శత చండీయాగం.     B).    కాశీలో ఉపాసనీ బాబా ఏర్పాటుచేసిన అన్నదానం.     C).   కాశీలో ఉపాసనీ బాబా సాయికి, గురువులకి ఉత్తరక్రియలు చేయుట.   D).    ఉపాసనీ బాబా ఏర్పాటు చేసిన అన్నదానానికి కాశీ బ్రాహ్మణుల నిరాకరించుట.     ఏఫ్రియల్ -4:   A).   కృష్ణాజిల్లా గుడివాడ వెంట్రప్రగడలో సాయి మందిరంలో  శ్రీ. బి.వి నరసింహస్వామిజీ గారి చేతులమీదుగా ధుని ప్రారంభం.     B).   నాగరత్నమ్మ గారికి వచ్చిన దద్దుర్ల వ్యాధి ఊదితో నయమగుట.   C).   వెంకటరత్నం, నాగరత్నమ్మ గార్ల దంపతులు సాయి మందిరానికి శంకుస్థాపన చేయుట.    D).   వెంట్రప్రగడ గ్రామంలో సాయి మందిరం ప్రతిష్ట.     E).    శ్రీ. బి.వి.  నరసింహస్వామీజీ గారి చేతుల మీదుగా చలువరాతి రూపంలో ఉన్న బాబా గారి విగ్రహ ప్రతిష్ట.    ఏఫ్రియల్ -5:    A).   శ్రీ సాయి శరణానందుల వారి జననం.     B).  శ్రీరామనవమికి షిరిడి వచ్చిన భక్తులకు బాబా ప్రసాదం వితరణ.      C).  రాజమండ్రి శ్రీరామ్ నగర్ లో  "శ్రీ సాయి రామ మందిరం ప్రతిష్ట".       D).   గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహరాజ్  రచించిన "ఓం శ్రీ సాయిరాం" కోటి లేఖనం.     E).   సాయిభక్తులతో కలసి గురుదేవులు శ్రీఆదిపూడి మోహన్ రావు మహారాజ్,  దుర్గాంబ గారి చేతుల మీదుగా ఏర్పాటుచేసిన కోటి స్థూపం.   F).  కోటి స్థూపం చుట్టూ భక్తులు 108 ప్రదక్షిణాలు చేయుట.  ఏఫ్రియల్ -6:    A).   డాక్టర్ రాజారామ్ సీతారాం కాపాడిగారి జననం.     B).   డా: రాజారాం వైద్య విద్య చదవడానికి సాయి ఇచ్చిన ప్రోత్సాహం.     C).  డా: రాజారాం వైద్య విద్యను పూర్తి చేయుట.      D).    శ్రీ షిరిడి సాయిబాబా ఆఫ్ సౌత్ శాన్ ఫ్రాన్సిస్కో  (డివైన్ టచ్) అనే పుస్తకం విడుదల.   ఏఫ్రియల్ -7:     A).    బి.వి. పురి సాయి మందిరంలో దేవ్ బాబా చేతుల మీదుగా ధుని ప్రారంభం.   B).  నారాయణ పురోహిత్ గారికి వచ్చిన స్వప్నం.   C).   దీక్షిత్ వాడా గృహ ప్రవేశం.   D).   దీక్షిత్ వాడా మ్యూజియంగా మార్పు చేయుట.     ఏఫ్రియల్ -9:   శ్రీ సాయి బాబా పూజా విధి సగుణోపాసన అనే పుస్తకం విడుదల.   ఏఫ్రియల్ -10:    A).  పిఠాపురంలో దత్త బృందావనం ప్రతిష్ట.   B).  ఉపాసనీ మహారాజ్ ఓంకారేశ్వర పుణ్యక్షేత్ర దర్శనం.    C).   ఓంకారేస్వరంలో ఉపాసనీ బాబాకి కలిగిన అనుభవం.  ఏప్రిల్-11:    A).  శిరిడిలో శ్రీరామ నవమి, ఉరుసు ఉత్సవాలు ప్రారంభం.     B).  శ్రీ సాయి రాధాకృష్ణ విగ్రహాల ప్రతిష్ట.      C).  శ్రీ సాయి ఆశ్రమం-2 ప్రారంభోత్సవం.     D).   శ్రీ సాయిబాబా సద్గురు చరిత్ర పుస్తకం విడుదల.   ఏప్రిల్- 13:    A).  దేవ్ బాబా జననం (హేమాడ్ పంతు మనుమడు).    B).  వినాయక దాజీ భావే గారు సద్గురువు కోసం అన్వేషణ.    C).  శ్రీరామనవమి ఉత్సవాలకు షిరిడి వచ్చిన కృష్ణాబాయిని బాబా రక్షించుట.    ఏప్రిల్- 14: భగవాన్ రమణ మహర్షి దేహత్యాగం.     ఏప్రిల్ -15:    A).  శ్రీ సాయిపాదానంద రాధాకృష్ణ స్వామి జననం.    B).  అణ్డాచించిణీకర్  సాయి సాన్నిధ్యం చెందుట.   C).   వామన  గోండ్ కర్  సాయి సాన్నిధ్యం చెందుట.    ఏప్రిల్ -16:    A).  ములేశాస్త్రి సాయి సాన్నిధ్యం చెందుట.    B).  శ్రీ రామకృష్ణ పరమహంస గారు సమాధి చెందటం.   C).   కోర్టు ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించి సంస్థానాన్ని ట్రస్టీలకి అప్పగించటం.    D).   కలియుగ దత్తావతార శ్రీ సాయినాథ చరిత్ర పుస్తకం విడుదల.     ఏప్రిల్- 21:    A).  తెనాలి రామలింగేశ్వర పేట లో శ్రీ సాయిబాబా మందిరం విగ్రహ ప్రతిష్ట.       B).షిరిడీలో ముఖదర్శనం హాలు ప్రారంభోత్సవం.      ఏప్రిల్ - 22:      A).   సర్ శంకర్ నాయర్ గారి నిర్యాణం.    B).  బాలాషింపీ  కుమారుడు రఘునాథ్ షింపీకి కుమారుడి జననం.     ఏప్రిల్ -23:    నెల్లూరు విద్యానగర్ లో శ్రీ సాయిబాబా మందిరం ప్రతిష్ట.     ఏప్రిల్- 25:      A).  The incredible Saibaba - (The Life and Miracles of a Modern day Saint) పుస్తకం విడుదల.     B).  ఆనందాశ్రమ వ్యవస్థాపకులు రామదాసు గారు సాయి సమాధిని దర్శించుట.     C).  శ్రీ ఆలూరు గోపాలరావు గారు జననం.    ఏప్రిల్ - 26:   శ్యామా సాయి సాన్నిధ్యం చెందుట.    ఏప్రిల్ -28:   A).  డాక్టర్ కేశవ భగవాన్ గవాంకర్ జననం.      B).  డాక్టర్ కేశవ భగవాన్ గవాంకర్ సాయిని దర్శించుట.    B).  బాబా ఇచ్చిన శాలువా ని పెద్దవాడైన గవాంకర్ కి శ్యామా ఇవ్వడం.    ఏప్రిల్- 30:    A).  అక్కల్ కోట్ కర్ మహారాజ్ సమాధి చెందటం.   B).  లక్ష్మీబాయ్ షిండే అనారోగ్యం.    C).  చందూలాల్ మెహతా గారి అనుభవం.    D).   శ్రీ ఆలూరు గోపాలరావుగారి పదవీ విరమణ.

ప్రకాశం జిల్లా* *త్రిపురాంతకం* *బాల త్రిపుర సుందరి దేవి

*ప్రకాశం జిల్లా*
*త్రిపురాంతకం*
*బాల త్రిపుర సుందరి దేవి*


తారకాసురులను సంహరించే సమయంలో సాక్షాత్తు ఆ పరమశివుడికి బాల త్రిపుర సుందరి సహాయం చేసింది. ఇందు కోసం ఓ యాగ కుండం నుంచి ఆ బాలత్రిపుర సుందరి స్వయంభువుగా ఉద్భవించింది. ఆ ఘటన జరిగిన ప్రాంతం నేడు ఓ పుణ్యక్షేత్రంగా మారి విరాజిల్లుతోంది. పూర్వం ఇక్కడ ఎక్కువ జంతుబలులు ఉండేవి. అందుకు నిదర్శనంగా ఇక్కడ దాదాపు అర్థ అడుగు లోతు, 2 అడుగుల వ్యాసం గల రాతి పాత్ర ఉంది. జంతు బలుల ఎంత రక్తం ఇందులో వేసినా ఇక్కడ ఇది నిండేది కాదని చెబుతారు. 

తారకాసుని కుమారులైన తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటాడు. ఇందు కోసం బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి అమిత బలవంతులుగా మారుతారు. అంతేకాకుండా వారు బంగారం, వెండి, ఇనుముతో మూడు నగరాలు నిర్మించుకొని ఆకాశయానం చేస్తూ ఉంటారు. అవి మూడు ఒకే వరుసలో వచ్చినప్పుడు ఒకే సారి మూడు బానులను ప్రయోగించి వాటిని ధ్వంసం చేస్తేనే వారికి చావు ఉంటుంది.

ఇలాంటి విచిత్ర వర గర్వంతో వారు లోక కంఠకులుగా మారిపోతారు. దేవతలను, బుుషులను నానా బాధలు పెడుతుంటారు. దీంతో దేవతలు, మునులు ఈశ్వరుడిని ప్రార్థించి తమను రక్షించాల్సిందిగా వేడుకొంటారు. బ్రహ్మ వరం పొందిన ఆ రాక్షసులను సంహరించాలంటే తనకు అపూర్వ రథమూ, అపూర్వ బాణాలు కావాలని చెబుతారు

దీంతో విశ్వకర్మ జగత్తత్వంతో రథాన్ని, వేద తత్త్వంతో గుర్రాలను, నాగతత్త్వంతో పాగ్గాలను, మేరు శిఖర తత్త్వంతో ధనుస్సుని, వాసుకి తత్త్వంతో వింటినారిని, సోమ, విష్ణు, వాయు తత్త్వాలతో మూడు బానాలను తయారుచేస్తాడు. ఇక ఆ రథానికి బ్రహ్మ స్వయంగా రథసారథి అవుతాడు. దీంతో పరమశివుడు తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుల పై యుద్ధానికి వెలుతాడు.

అయితే భీకర యుద్ధంలో ఎంత ప్రయత్నించినా ఆ ముగ్గురు రాక్షసులను పరమేశ్వరుడికి చేతకాదు. విల్లు నుంచి సంధించిన బాణాలు ఆకాశంలో ఎగురుతున్న నగరాలను ఛేదించలేకపోతాయి. అంతే కాకుండా ఆ రాక్షసుల తప:ప్రభావంతో ఆ రథం భూమిలోకి కుంగి పోతుంది. దీంతో పరమశివుడు ఆదిపరాశక్తిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ పరాశక్తి తన ప్రతిరూపమైన బాల త్రిపుర సుందరిని అక్కడికి వెళ్లి పరమశివుడికి యుద్ధంలో సహాయం చేయాల్సిందిగా ఆదేశిస్తుంది.

దీంతో బాలత్రిపుర సుందరి ఒక యాగ కుండం నుంచి బయటికి వచ్చి శివుడు ధరించిన విల్లులోకి ప్రవేశిస్తుంది. దీంతో శివుడు ఆకాశంలో ఎగురుతున్న మూడు నగరాలను ఛేదించి ఆ రాక్షసులను సంహరిస్తాడు. అటు పై బాల త్రిపుర సుందరి ధనస్సు నుంచి బయటికి వస్తుంది. తనకు యుద్ధంలో సహాయం చేసినందుకు ఏదైనా వరం కోరుకోవాల్సిందిగా పరమశివుడు బాల త్రిపుర సుందరికి చెబుతారు.

దీంతో ఈ సృష్టి ఉన్నంత వరకూ మీరు ఇక్కడ త్రిపురాంతకుడిగా ఉండిపోవాలని కోరురుకొంటుంది. ఈ క్షేత్రం త్రిపురాంతకంగా ప్రసిద్ధి చెందాలని కూడా కోరుకొంటుంది. ఇందుకు పరమేశ్వరుడు సంతోషంగా అంగీకరిస్తాడు. అంతే కాకుండా యుద్ధంలో తనకు సహాయంచేసిన బాల త్రిపురసుందరిని సేవిస్తే అన్నింటా విజయం కలుగుతుందని చెబుతాడు. అందుకే ఏదైనా ఒక కార్యం ప్రారంభించే ముందు ఇక్కడకు చాలా మంది వచ్చి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు.

శ్రీశైలం నాలుగు ద్వారాల్లో త్రిపురాంతకం తూర్పుద్వారం. ఇక్కడ ఆలయం చిన్న కొండ పై ఉంటుంది. నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉంటాయి. గర్భగుడిలో స్వామివారు లింగ రూపంలో ఉంటారు. ఇక్కడ శివలింగం పై భాగంలో ఒక అంగులం లోతు గుంట ఉంటుంది. ఆ గుంటలో నీరు ఎల్లవేలలా ఉండటం విశేషం. ఇక ఆలయం ప్రాంగణంలో ఒక చీకటి గుహ ఉంది. ఇక్కడి నుంచి శ్రీశైలానికి సొరంగ మార్గం ఉండేదని చెబుతారు.

ఈ ఆలయానికి దగ్గరగా ఉన్న చెరువులో బాల త్రిపుర సుందరి ఆలయం ఉంది. ఈ ఆలయం శ్రీ చక్ర ఆకారంలో ఉంటుంది. ఇక బాల త్రిపుర సుందరి ఆవిర్భవించిన యాగకుండాన్ని ప్రస్తుతం నడబావి అంటారు. అమ్మవారిని దర్శించాలంటే 9 మొట్లు దిగి వెళ్లాలి. స్కాంద పురాణంలో శ్రీ శైలఖండంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది.

పూర్వం ఇక్కడ ఎక్కువ జంతుబలులు ఉండేవి. అందుకు నిదర్శనంగా ఇక్కడ దాదాపు అర్థఅడుగు లోతు, 2 అడుగుల వ్యాసం గల రాతి పాత్ర ఉంది. జంతు బలుల ఎంత రక్తం ఇందులో వేసినా ఇక్కడ ఇది నిండేది కాదని చెబుతారు. ఇది ఇక్కడ విశేషం. అమ్మవారి ఆలయం బయట, చెరువు కట్టమీద కదంబ వృక్షాలు కనిపిస్తాయి. వారణాసి తర్వాత కదంబ వ`క్షాలు కనిపించే పుణ్యక్షేత్రం ఇది మాత్రమే. అందువల్లే అమ్మవారిని కదంబ వనవాసిని అని పిలుస్తారు.

ప్రకాశం జిల్లాలోని మార్కాపురానికి 40 కిలోమీటర్ల దూరంలో గుంటూరు కర్నూలు జాతీయ రహదారి పై త్రిపురాంతకం ఉంటుంది. శ్రీ శైలం నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. బస్సు సౌకర్యం ఉందిది. ఇక్కడ ఉండటానికి వసతి అంతగా బాగుండదు.
హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం.

*శ్రీ మాత్రే నమః*

హిందూ ధర్మంలో తమలపాకు ప్రాముఖ్యత

హిందూ ధర్మంలో తమలపాకు ప్రాముఖ్యత..........!!


హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో(1. పూలు 2. అక్షింతలు, 3. ఫలాలు,4,అద్దం, 5. వస్త్రం, 6. తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8. కుంకుమ)  ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు.పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం.  భారత దేశం లో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదల లోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.

📌తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం?
క్షీర సాగర మథనం లో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణం లో చెప్పబడింది. శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు చెబుతున్నాయి . తమలపాకు యొక్క మొదటి భాగం లో కీర్తి, చివరి భాగం లో ఆయువు, మధ్య భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.

📌 తమలపాకు లోని ఏయే భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాం 
తమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.

📌సరస్వతీదేవి మధ్యభాగం లో ఉంటుంది.

📌తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది.

📌జ్యేష్టా దేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.

📌విష్ణుమూర్తి తమలపాకు లో ఉంటాడు.

📌శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగం లో ఉంటారు.

📌తమలపాకు లోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు.

📌భూమాత తమలపాకుకి కుదిభాగం లో ఉంటుంది.

📌సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు అని శాస్త్రంలో ఉంది.

శ్రీ అచలేశ్వర్ మహాదేవ్-ధోల్పూర్-రాజస్థాన్

*శ్రీ అచలేశ్వర్ మహాదేవ్-ధోల్పూర్-రాజస్థాన్*


మానవమేధస్సుకు 
అందని మరో శివలీల....

ప్రతీ రోజు మూడు రంగుల్లో శివలింగ దర్శనం. ఉదయ, మధ్యాహ్న, సాయంత్ర సమయాలలో శివయ్య సహజంగా తన లింగాకృతి వర్ణం మార్చుకుని దర్శనమిస్తాడు.

ఈ ఆలయం రాజస్థాన్ రాష్ట్రం ధోల్పూర్ లోని
మౌంట్ అబూ పర్వతాలకు11 కిలోమీటర్ల ఉత్తరాన
అచల్ ఘర్ కొండలపై ఉన్న కోట సమీపంలో ఉన్నది.

2500 సంవత్సరాలకు పూర్వపు ఆలయం ఇది.
ఈ ఆలయంలో శివుని బొటన వేలును లింగంగా ఆరాధిస్తారు.
 
మన దేశం లోని శైవశేత్రాలలో పరమేశ్వరుడు అత్యధికంగా లింగాకృతిలో, కొద్దిచోట్ల సాకార విగ్రహ స్వరూపంలో దర్శనమిస్తారు. కానీ ఇక్కడ బొటనవేలు ఆకారంలోని లింగ స్వరూపం గా దర్శనమివ్వడం విశేషం.
 
ఇక్కడ వలయాకారపు సొరంగ బిలం అందులో నీరు చేతికి అందే ఎత్తులో ఉంటుంది. అదే బిలంలో బొటనవేలు ఆకారంలో శివలింగాన్ని దర్శిస్తారు భక్తులు.

అది పరమేశ్వరుని కాలి బొటనవేలు. పూజలు కూడా ఆ బొటనవేలుకే జరుగుతాయి.
 
చలన లక్షణమున్న పర్వతాలను చలించకుండా చేసేందుకు ఇక్కడ స్వామిని అచలేశ్వర్ గా పిలుస్తారు.

శివుని బొటనవేలు ఆకారం ఉన్న సొరంగం పాతాళం వరకూ ఉందని నమ్ముతారు. నీటితో ఈ సొరంగం నిండడానికి ఆరు నెలలు కాలం పట్టిందని అంటారు.

అచలేశ్వర్ ఆలయాన్ని 9వ శతాబ్దం లో పారమార రాజ వంశీయులు నిర్మిచారని చెబుతారు.

ఈ ఆలయంలో ఐదు టన్నుల బరువుండే పంచలోహ నందీశ్వర విగ్రహం ఉంటుంది. ఆ నంది ప్రక్కనే పిల్లవాని విగ్రహం కూడా కనిపిస్తుంది. ఆలయం విచ్చిన్నం చేసే ప్రయత్నం చేసిన దుష్టశక్తులపై నందీశ్వర విగ్రహం నుండి తేనెటీగలు లేచి దాడిచేసి ఆలయాన్ని రక్షించాయి అన్నది స్థలపురాణం.

వశిష్టముని తపస్సు చేసిన ప్రదేశం. ఒక గోమాత ఈ బిలం లో చిక్కుకుంటే ముని ప్రార్ధన మేరకు గోమాతను రక్షించేందుకు సరస్వతీ నది పాయను శివుడు బిలం లోనికి పంపారని స్థల మహత్మ్యం చెబుతోంది.

ఈ అలయం సమీపం లో ఉండే తటాకం ఒడ్డున మూడు రాతి గేదెలు ఉంటాయి.
ఈ క్షేత్రాన్ని అర్థ కాశీ అని పిలుస్తారు.

శివయ్య బొటనవేలు క్రింద ఒక సహజ కొలను ఉంది.ఇది ఎప్పటికీ నిండదు. ఈ నీరు ఎక్కడికి వెళుతోంది కూడా అంతుపట్టని రహస్యం
 
ఈ లింగాకృతి ప్రతీ రోజు మూడు రంగుల్లో భక్తులకు దర్శనమిస్తుంది. ఉదయం ఎరుపు వర్ణంలో, మధ్యాహ్నం కాషాయ వర్ణంలో,
సాయంత్రం నలుపు వర్ణం లో
కనిపించడం ఎవ్వరూ తెలుకోలేని శివలీలగా నిలిచి ఉన్న సత్యం.

ఆలయ ప్రాంగణంలో పురాతన చంపా వృక్షం ఉంది.

 
పురాతన స్మారక చిహ్నాలు మరియు దేవాలయాలకు రాజస్థాన్ ప్రసిద్ధి చెందింది. 
ఈ పురాతన రాచరిక రాజ్యం సంవత్సరాలుగా భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన స్మారక చిహ్నాలు, కోటలు మరియు దేవాలయాలకు నిలయంగా మారింది. 

ఈ ఆలయం ఇప్పుడు దేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి మరియు దర్శించే వారిపై గొప్ప శివ దర్శనానుభవం చూపుతుంది...

ఓం నమః శివాయ.

_నిజామాబాద్ , కామా రెడ్డి జిల్లా , రామారెడ్డి పల్లి , ఇసన్నపల్లిలో కాలభైరవుడు_


*_నిజామాబాద్ , కామా రెడ్డి జిల్లా , రామారెడ్డి పల్లి , ఇసన్నపల్లిలో కాలభైరవుడు_*




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️





ఇక్కడ కాలభైరవున్ని పూజిస్తే సకల గ్రహదోషాలు , అపమృత్యుదోషాలు తొలగిపోతాయి.


సాక్షాత్ పరమశివుడే కొలువైన క్షేత్రం కాశీ క్షేత్రం. ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. పరమశివుడి మానస పుత్రుడే ఈ కాలభైరవుడు. బ్రహ్మణే సంహరించిన శక్తి శాలీ. దుష్టశక్తులకు సింహ స్వప్నం. మనసారా నమ్మినవారికి కొంగుబారాన్ని అందించే కాలభైరవుడు.

శరణు భైరవయ్యా అని పిలిస్తే నేనున్నానంటూ అభయమిచ్చే నిలువెత్తు కాలభైరవ స్వామి నిజామాబాద్ కామా రెడ్డి జిల్లా , రామారెడ్డి పల్లి , ఇసన్నపల్లిలో 8 అడుగుల కాలభైరవ స్వామి మూల విగ్రహం కనిపిస్తుంది.


ఆదిశంకరాచార్యులచే స్తుతించబడిన కాలభైరవుడు ఉత్తర ప్రదేశ్ లోని కాశీ క్షేతం తర్వాత దక్షిణ భారత దేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ గుర్తించబడిన *ఇసన్నపల్లిలో శ్రీ కాలభైరవ క్షేత్రంలో నెలకొని ఉన్నాడు*. ఈ కాలభైరస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం..


శ్రీ కాలభైరవ స్వామి ఆలయం దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి గుడి. రామారెడ్డి పేటలోని శివాలయం , రామాలయాల నిర్వహణకోసం.. దోమకొండ సంస్థానాధీశులు రాసిచ్చిన అగ్రహారమే ఇసనపల్లి. ఈగుడికి వెళ్ళే మార్గంలో చుట్టూ పచ్చటి పొలాలు , ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది. ఇక్కడున్న గ్రామానికి ఎనిమిది దిక్కులా అష్టభైరవులున్నారు. ఈ ఆయం దగ్గరకు వెళ్ళగానే కాస్తంత దూరం నుండే ఈ గుడి సిందూరం రంగులో ఉన్న గుడి అభయమిస్తున్నట్లు కనబడుతుంది.


ఈ ఆలయంలో ఉన్న కాలభైరవుని విగ్రహం క్రీ.శ.13వ శతాబ్ధ కాలం నాటిదని చెబుతారు. సహజంగా ఈ గుడిలోని విగ్రహాన్ని కనుక చూసినట్లైతే కొంత మంది దిగంబర జైన విగ్రహమని కొందరి వాదన. అయితే కాలభైరవుడిని దిగంబరుడిగా చెప్పిన పురాణాలు , తంత్ర గ్రంథాలున్న కాలభైరవ విగ్రహం సనాతన వైదిక దేవతా విగ్రమనే వాదన.  కరువు సమయంలో ఇక్కడి ఆలయంలోని కాలభైరవుని విగ్రహానికి స్థానికులు పేడ పూస్తారు. తర్వాత ఆపేడను తొలగించుకోవడం కోసం వర్షాలు బాగా పడేవని అక్కడ ప్రజలు ప్రఘాడమైన నమ్మకం.


ఎవరైతే చేతబడి కలిగి ఉంటారో అలాంటి వారు ఈ దేవాలయంలో 21 రోజులు లేదా 41 నిద్ర చేస్తే మంచిదని , ఆలయ ప్రాంగణంలో ఉండే కోనేరులో స్నానం ఆచరిస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని భక్తుల నమ్మకం. ఈ కాలభైరవుడు దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తి మంతుడు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని , సంకల్ప సిద్ధిని పొందడం కాలభైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి.


కాలస్వరూపం తెలిసినవాడు , ఇంకా సంతానభాగ్యం పొందడానికి , వివాహ మరియు ఉద్యోగ సమస్యలున్నవారు ఈ ఆలయాన్ని సందర్శించి నియమం చేస్తే వారి కోరికలు తప్పక తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని , అతీంద్రమైన శక్తులను ప్రసాధించే కాలభైరవునికి గారెలతో మాల వేస్తారు. బెల్లం , కొబ్బరి నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.


శ్రీ శివపురాణం ప్రకారం ప్రధానంగా అష్టభైరవులు వరుసగా చండభైరవ , అసితాంగ భేరవ , సంహార భైరవ , రురు భైరవ ,  క్రోథ బైరవ , కపాల భైరవ , భీషణ భైరవ , ఉన్మత్త భైరవ. ఈ ఇసన్నపల్లి గ్రామంలో అష్టభైరవులు వెలసినట్లు అక్కడివారు చెబుతారు.


అష్టబైరవులలో కాశీభైరవుడు పైభాగంలో ఉంటాడు , క్రింది ఈశాన్య భాగంలో కాలభైరవుడు ఉంటారు , *ఈశ్యాన్య దిక్కును ఈవానుడు పాలించడం వల్ల ఈ గ్రామానికి ఇసన్నపల్లి అని పేరు వచ్చింది.* భైరవుడంటే పోషకుడని , భయంకురడనే అర్థాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం)కూడా అణిగి ఉంటాడు , కనుకనే కాలబైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది.


బ్రహ్మ గర్వం అణచడానికి అవతరించిన కాలభైరవుడు , శివుడి మానసపుత్రుడు కాలభైరవుడు. బ్రహ్మ యొక్క అహాన్ని తగ్గించడంలో బ్రహ్మా యొక్క ఐదవ తలను ఖండిచడం వల్ల అతనికి బ్రహ్మ హత్యా మహాపాతకం తగలడం వల్ల దాన్ని పోగొట్టుకొనడం కోసం బిక్షాటన చేసి , కాశీకి వెళ్ళి అక్కడ విముక్తుడయ్యాడని , అప్పటి నుండి అక్కడే కాశీ క్షేత్రపాలకుడుగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది.


అదేమిటంటే  త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ దేవుడికి మొదట ఐదు తలలుండేవట , తను సృష్టికర్త కావడంతో బ్రహ్మలో గర్వం పెరిగిందట. త్రిమూర్తుల్లో తానే అధికుడని చెప్పుకోవడం మొదలు పెట్టాడట. అప్పుడు శ్రీమహావిష్ణువు వచ్చి *‘నా నాభికమంల నుండి పుట్టినవాడివి , అందువల్ల నేనే గొప్పవాణి అన్నారట. వాళ్లిద్దరూ వాదించుకుంటుండగా అక్కడ ఒక జ్యోతి స్థంభం ప్రత్యక్షమైనది. అప్పుడు అది చూసి శ్రీ మహా విష్ణువు ఈ వాదన నుండి విరపించుకున్నాడు , కానీ బ్రహ్మకు మాత్రం అహంకారం పోలేదు.


అప్పుడు శివుడినుండి ఓ ఘోరరూపం ఆవిర్భవించిందట. నాలాగే తనకూ ఐదు తలలున్నాయి కాబట్టి నాతో సమానుడని గర్వంతో విర్రవీగుతున్నాడు. ఈ ఐదో తలను నీ కొనగోటితో తుంచెయ్. అని ఆ రూపాన్ని ఆదేశించాడట. కొనగోటి బ్రహ్మఐదోతలను తొలగిస్తే కానీ ఆ బ్రహ్మకు తత్వంేదు. అప్పుడు శివుడు ఆ రూపంతో నువ్వు బ్రహ్మ తలను తెంచావు కాబట్టి కాలం వలె కనిపిస్తున్నావు. అందుకే నిన్ను కాలభైరవుడు అని పిలుస్తారు.


అయితే బ్రహ్మతలను ఖండిచినందుకు బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకోవడం వల్ల ఈ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండేళ్ళు భిక్షాటన చేసి ఇందులో తింటే పాపం పరిహారమవుతుంది. ఇక పైన నా దేవాలయాల్లో నువ్వే క్షేత్రపాలకుడివి . కాశీ పట్టణానికి అధిపతిగా , నా ఆలయాలకు వచ్చే భక్తుల పాపాలను భక్షిస్తావు అని చెప్పాడట.


కాలభైరవుని దేవాలయాలు మనదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. నేపాల్‌ , ఇండోనేషియా , థాయ్‌లాండ్‌లలో కాలభైరవుణ్ణి విశేషంగా పూజిస్తారు. అలాంటి పుణ్యక్షేత్రమే ఒకటి  తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలోనూ ఉంది.


*ఇక్కడ కార్తీక మాసంలో ఘనంగా స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇసన్నపల్లిలో వెలసిన ఈ కాలభైరవున్ని దర్శించుకోవడానికి చుట్టుపక్కల జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్టాల నుండీ కూడా భక్తులు సందర్శిస్తుంటారు.*

శ్రీగురు_దక్షిణామూర్తి

#శ్రీగురు_దక్షిణామూర్తి


దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు 
ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. 
మరో కాలు పైకి మడిచి ఉంటుంది.
చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. 
ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం.

బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన 
సనక, సనందన, సనాతన, సనత్కుమారులు 
బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. 
అయినా వారికి అంతుపట్టలేదు. 
వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. 

అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా 
ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. 
ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. 

ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.
ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే..
జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, 
కేవలం అనుభవించదగినది అని. 
గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. 
అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో 
విస్తృతంగా వర్ణించారు.

శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. 
దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. 
దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. 
అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోతాయి. 
దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే 
ఆ రూపమే దక్షిణామూర్తి.

మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. 
ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. 
దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. 

విష్ణు, 
బ్రహ్మ, 
సూర్య, 
స్కంద, 
ఇంద్ర 
తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.

మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.

ఆ రూపాలు వరుసగా..!💐
శుద్ధ దక్షిణామూర్తి, 
మేధా దక్షిణామూర్తి, 
విద్యా దక్షిణామూర్తి, 
లక్ష్మీ దక్షిణామూర్తి, 
వాగీశ్వర దక్షిణామూర్తి, 
వటమూల నివాస దక్షిణామూర్తి, 
సాంబ దక్షిణామూర్తి¸
హంస దక్షిణామూర్తి, 
లకుట దక్షిణామూర్తి, 
చిదంబర దక్షిణామూర్తి, 
వీర దక్షిణామూర్తి, 
వీరభద్ర దక్షిణామూర్తి¸ 
కీర్తి దక్షిణామూర్తి, 
బ్రహ్మ దక్షిణామూర్తి¸ 
శక్తి దక్షిణామూర్తి, 
సిద్ధ దక్షిణామూర్తి.

ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. 

భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు, 
చంద్రకళాధరుడు, 
జ్ఞానముద్ర, 
అక్షమాల, 
వీణ, 
పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. 
తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.

పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. 
సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. 
మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను 
సొంతం చేసుకుంటారు.

చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,
సంపద(ధనము) దగ్గర నుండి, 
పెద్దలకు మోక్షము వరకు, 
దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షముకి అదిష్టానం 
అయి ఉంటాడు.

ఓం శ్రీ గురు దక్షిణామూర్తియే నమః..!

⭐️⭐️⭐️సర్వంశివసంకల్పం  ⭐️⭐️⭐️

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS