Wednesday, June 28, 2023

మంత్రసిద్ధికి ఉపాయాలు:...

మంత్రసిద్ధికి ఉపాయాలు:...


విధి విధానంగా మంత్రపుశ్చరణం చేసినా మంత్రం సిద్దింపకుండా ఉంటే తిరిగి మళ్లీ ఆ మంత్రాన్ని పురశ్చరణ చేయాల్సిందే !! జన్మాంతరార్జిత పాపములు ( అంటే పూర్వ జన్మ లో చేసిన పాపం , తల్లి తండ్రుల నుండి వచ్చిన పాపం , ఈ జన్మలో ఇది వరకు నువ్వు చేసిన పాడు పనులు ) మంత్రసిద్ధికి రకరకాల ఆటంకం కలిగిన తిరిగి మళ్లీ పురశ్చరణ చేయాల్సిందే.. ఈ విధంగా మూడు సార్లు ( అంటే ఆ మంత్రాన్ని మూడుసార్లు పురశ్చరణ చేయాల్సిందే ఒక వేళ ఈ మూడు సార్లు పురశ్చరణ చేసినా కూడా ఆ మంత్రాం సిద్దించక పోతే .. తంత్ర శాస్త్రం 7 రకాల ఉపాయాలు ( పరిష్కార మార్గాలు చూపుతోంది ) అవి ఈ కింది గమనించండి .

1. *భ్రామణము :-* కర్పూరం , గంధం , కూంకుమ మొదలైన రసముల మిశ్రమాలతో ఒక వాయు బీజం ( యం ఆనే బీజం ) ఒక మంత్రాక్షరము , మరోక వాయుబీజం , మంత్రమందలి రెండవ అక్షరం అనువిధాముగా మంత్రం యందలి అన్ని అక్షరాలను వాయు బీజాన్ని సంపుటితో వ్రాయాలి . అలా పూర్తి మంత్రాన్ని వ్రాసిన యంత్రముని విధి విధానాలతో ధూప దీప నైవేద్యాలు సమర్పించి పూజించి జపం , హోమం , బ్రాహ్మణ భోజనం చేసి , వారికి తగిన దానం చేయాలి .. ఈ విధానాన్ని భ్రామణం అని తంత్ర శాస్త్రం చెబుతోంది . తర్వాత మంత్ర పురశ్చరణ చేసిన వేగంగా సిద్ది కలుగును .

2 . *రోదనం :-*

వాగ్భీజం ( అంటే ఐం ) తో సంపుటి ( సంపుటి అంటే కలపడం ) సంపుటి చేసిన మూల మంత్ర జపం ఈ విధానాన్ని రోదనం అని శాస్త్రం చెబుతోంది ..

3 . *వశీకరణం :-*

అలక్తకము ( లక్క ) రక్తచందనము , కూట , దత్తూరబీజములు , మణిశిలలను మిశ్రమం చేసి భూర్జపత్రపత్రం పై లేదా ఓ రాగి రేకు పై మంత్రాన్ని లిఖించి సాధకుడు తన కంఠమున ధరించిన వశీకరణ అని శాస్త్రం చెబుతోంది.

4 . *పీడనం :-*

అధరోత్తయోగముతో మంత్రజపం , అధరోత్తర స్వరూపిణియగు దేవతా పూజను చేయాలి .. ఆ తర్వాత జిల్లేడు పాలతో మంత్రాన్ని లిఖించి దానిని హోమం చేయాలి . ఇది పీడనం అంటారు .

5 . *పోషణం:-* 

వధూబీజము ( స్త్రీం) అనే బీజం తో మూల మంత్రాన్ని సంపుటి చేసి మంత్రజపం చేసి , ఆవుపాలతో ఆ మంత్రాన్ని వ్రాసిన చేతికి కట్టుకొనుట పోషణం అంటారు .

6 . *శోషణం:-* 

వాయు బీజం ( యం) అనే బీజం తో ఆ మంత్రాన్ని సంపుటి చేసి జపించి యజ్ఞభస్మంతో రాగి పత్రముపై మూల మంత్రాన్ని వ్రాసి కంఠమున ధరించడాన్ని శోషణం అంటారు .

7. *దాహానము:-* 

మంత్ర యందలి వర్ణములతో అగ్ని బీజం ( రం) అనే బీజాల్ని జోడించి జపం చేసి ఫలాశ ( మోదుగ ) విత్తనముల నుంచి తీసిన తైలం తో మంత్రాన్ని లిఖించి కంఠమున ధరించే ప్రక్రియ ను ధాహానం అంటారు .

ఈ ఏడు ( 7 ) రకాల ఉపాయాలనూ అనుసరించాలని నియమం లేదు .. ఏదో ఒక ఉపాయం తో ఆ మంత్రం సిద్దించనప్పుడు రెండవ ఉపాయం , అప్పుడు కూడా సిద్ది కలుగుక పోతే మూడవ ఉపాయం ఇలా క్రమం తప్పకుండా చేయవలసిన అవసరం ఉంది .. ఈ ఉపాయాల ద్వారా తప్పకుండా మంత్రం సిద్ధిస్తుంది అని ఎన్నో మంత్ర శాస్త్ర గ్రంథాలు , ఎంతో మంది సిద్ది పొందిన మహానుభావులు వారి అనుభవం ద్వారా తెలియజేశారు .

*ఇప్పుడు ఉపాసన చేస్తున్న మంత్రం సిద్దించిందా !? లేదా? అని ఎలా తెలుసుకోవచ్చనో చూద్దాం:-* 

సాధకుడికి *మనసు- మంత్రం- దేవతా* ఈ మూడు వేరు వేరు గా తోస్తూ ఉంటుంది . అయితే పురశ్చణాది క్రియల ద్వారా ఈ త్రిపుటి ( అంటే మనసు - మంత్రం - దేవత ) అనే భావన నశించి , ఈ మూడు తన ఇష్ట దైవ రూపంగానే భాసిస్తుంది .. ఈ స్థితిలో సాధకుడు , సాధన , సాధ్యం ( సాంధించదలచినది ) అనే మూడింటిలో భేదం కనబడదు !! అలాంటి ఏకత్వ సిద్ది లభించినప్పుడు సాధకుని లో రోమాంచితము ( వెంట్రుకలు నిక్కబొడుచుకు ఉంటాయి ) స్తబ్దత ఏర్పడతాయి . అతని కంటి నుంచి ప్రేమాశ్రువులు ( ఆనందబాష్పాలు ) శ్రవిస్తాయి . మనస్సు , మంత్రములు దైవంలో విలీనమైనప్పుడు సాధకుడికి సమాధి స్థితి కలుగుతుంది . ఇలాంటి సమాధి స్థితిని సాధకుడు పొందటమే మంత్ర సాధన యొక్క అంతిమ ఫలితం అదే మంత్ర సిద్ధి అదే దేవతా దర్శనము గా చెప్పాలి . 

ఇలాంటి సమాధి స్థితే సాధకులకు లభిస్తుందో ఆ సాధకునకు ఆ మంత్రం సిద్ధించింది అని చెప్పాలి .సాధకుడిలో అలాంటి సమాధి స్థితి లంబించనిచో ఆ మంత్రం సిద్దించలేదు అని గ్రహించాలి. అలాంటి స్థితిలో మంత్ర సిద్ధిని పొందడానికి ఏఏ కర్మలను ఆచరించాలి అని పైన చెప్పిన 7 ఏడు ఉపాయాలు లేదా దానికి తగిన కర్మలను ఆచరించి మంత్రసిద్ధికి ప్రయత్నం చేయాలి .

*సాధకుడు మంత్రం, దైవం* ఈ మూడూ ఒకటే అనుభావాభవమే సమాధి అలాంటి సమాధి స్థితిని అనుభవించు సాధకుడు తనకు ఆ మంత్రం సిద్ది అయింది అని గమనించాలి . అలా సిద్ది పొందిన మంత్రాన్ని ఉపయోగించి ఎలాంటి కామ్య కర్మలునైనా పొందగలడు అనేది సత్యం అదే మంత్ర సిద్ధి , యోగ సిద్ది , ఆ సాధకుడే యతి అవుతాడు , అవధూత , 

నిజంగా అలాంటి సిద్ధిని పొందిన సాదకుడిలో తన కోరికలు ఏమిటో అనే జ్ఞానం ఉండదు .. ఆ కోరికలపై మక్కవ చూపడు .. ఆ సాధకుడిలో ఆ దేవత ఆనంద నర్తనం చేస్తుంది .. అతడి భార్య పిల్లలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆ దేవత అతడి ప్రమేయం లేకుండానే అతని బాధ్యతని చూసుకుంటుంది .. అది ఓ సచ్చిదానంద స్థితి .. ఆ సాధకుడిలో స్వార్ధ పూరిత భావాలు పూర్తిగా నశించి పోయి నిరంతరం సర్వకాల సర్వావస్థల యందు ఈ సమస్త ప్రకృతితో ఆ దైవాన్ని దర్శిస్తునే ఉంటాడు .. లోకకల్యాణమే అతని కాంక్ష .. సేవ .. ప్రేమ ... ఆనందం.. సృజనాత్మక శక్తి.. అతని హృదయం లో నిరంతరం సౌందర్యం వెదజల్లుతూ ఉంటుంది .. అందుకోసమే తన క్రియాకలాపాలు .. అలాంటి లోకకల్యాణం కోరే సాధకుడి కోరిక ఆ దేవత తప్పకుండా అతి శీఘ్రముగా నెరవేరుస్తుంది ..

అదే సిద్ది .. అదే దాని పూర్తి ఫలం..అతడే సిద్ధుడు .. ఈ విధంగా లోకకల్యాణం కోరే నిస్వార్థ సాధకుడికి ఏ మంత్రం అయినా సిద్ధిస్తుంది.. అసలు ఆ సాధకుడికి ఏ మంత్రంతోనూ పని ఉండదు .. ఏ దేవత అయినా అతన్ని సదా సర్వదా రక్షిస్తుంది.. తన వెంటే ఉంటుంది .. ఇది సత్యం .. పరమ సత్యం .. ఇందులో ఏ సందేహమూ లేదు .. అనుమానం లేదు.. ఇదే అనుభవ వేధ్యం !! ఎందరో మహానుభావులు , యతులు , సిద్ద పురుషులు ఇలా ఎన్నో ఎన్నో ఈ చరిత్రలో .. ఇలాంటి సిద్దియే మంత్ర సిద్ధి అని ప్రతీ సాధకుడు గమనించండి .. గ్రహించాలి.

Monday, June 26, 2023

మంత్రం? దాని దోషాలు

మంత్రం?
దాని దోషాలు 

హరితత్త్వ ధేథితి అన్న గ్రంథంలో మంత్రాలకు ఎనిమిది రకాల దోషాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది.  అవి అభక్తి, అక్షరభ్రాంతి, లుప్తత, ఛిన్నత, హ్రస్వత, దీర్ఘత, కథనము, స్వప్నకథనం 

*1. అభక్తి :-* ఒక గురువు ఇచ్చిన మంత్రాన్ని మరొక గురువు దగ్గరకు తీసుకొని వెళ్ళి చూపించిండం, ఆ గురువేమో ఇంతకంటే గొప్ప మంత్రం  నేను ఇస్తాను అని వేరొక మంత్రం ఇవ్వడం! మొదలైన దోషములే అభక్తి. గురువు ఇచ్చిన మంత్రాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. అజ్ఞానం వలన, అతి ఉత్సాహం వలన శిష్యులు అలా వేరొక గురువు వద్ద చెప్పినా ఆ గురువు ఆ మంత్రాన్ని తరచి తరచి చూడకూడదు. అదే అభక్తి. గురువు యందు మంత్రం యందు భక్తి లేకపోవడమే ఇంకొకరి వద్దకు వెళ్ళడం. 

*2.అక్షరభ్రాంతి :-* గురువు గారు "ఓం హ్రీం ఓం" అని మంత్రం ఇచ్చారు. అయితే శిష్యుడికి అది సరిగా వినబడకపోవడం వలన "ఓం శ్రీం ఓం" అనుకున్న . అదే అక్షరభ్రాంతి. ఈ విధమైన అక్షరభ్రాంతి లేకుండా ఉండటం కోసమే గురువు జాగ్రత్తలు తీసుకోవాలి. 

*3. లుప్తత :-* గురువు గారు "శ్రీరామ చంద్ర పరబ్రహ్మణే నమః" అని మంత్రం ఇస్తే శిష్యుడు "శ్రీ రామ బ్రహ్మణే నమః" అని జపం చేస్తాడు. అంటే గురువు ఇచ్చిన మంత్రం సరిగా జ్ఞాపకం పెట్టుకోక పోవడం వలన ఇలా జరుగుతుంది. దీని గురించి మళ్ళీ గురువును అడగలేడు. ఇది న్యూనత లోపం వలన జరుగుతుంది. అసలు మంత్రం మర్చిపోయి సొంత కవిత్వం పెట్టడం లుప్తత. కొన్ని తగ్గించి, కొన్ని తీసేసి, కొన్ని వదిలిపెట్టి మంత్రాన్ని ఉఛ్ఛరించడం లుప్తత. 

*4. ఛిన్నత:-*  వత్తులు ఉండవలసిన చోట వత్తులు లేకుండా పలకడం ఛిన్నత. ఉదాహరణకు ఛిన్నమస్తా అనవలసిన చోట చిన్నమస్తా అని పలకడం ఛిన్నత.

,*5. హ్రస్వత :-* ధీర్ఘం ఉండ వలసిన చోట దీర్ఘం తీసివేసి హ్రస్వంగా పలకడం హ్రస్వత . ఉధా :  ఓం రాం రామాయ నమః అనడానికి బదులు | ఓం రం రామాయ నమః| అని పలకడం.

*6. దీర్ఘత :-* హ్రస్వంగా పలకవలసిన చోట దీర్ఘాన్ని చేర్చడం ఉదా : ఓం నమః శివాయ అనవలసిన చోట ఓం నామా శీవాయా అనడం. 

*7. కథనం :*- గురువు ఇచ్చిన మంత్రాన్ని ఇతరుల వద్ద చర్చించడం లేక ఆ మంత్రాన్ని వేరొకరికి చెప్పడం, లేక ఇంకో గురువు వద్ద ఆ మంత్రాన్ని గురించి అడగటం మొదలైనవి కథనం కిందకి వస్తాయి. మంత్రం గురు శిష్యుల మధ్యనే ఉండాలి తప్ప మూడో వ్యక్తికి చెప్పకూడదు. 

*8.స్వప్న కథనం :-* గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తూ చేస్తూ అలాగే నిద్రలోకి జారిపోయి ఆ నిద్రలో కలవరిస్తూ ఉంటారు కొంత మంది. లేకపోతే కలలో బయటకు చెప్పేస్తారు. అదే స్వప్న కథనం ఇది కూడా దోషమే.
(సేకరణ)

హర హర మహాదేవ శంభో శంకర
ఓం నమఃశివాయ సిద్ధం నమః
శివ సంకల్పమస్తు

Sunday, June 25, 2023

ఆధ్యాత్మిక గ్రంధాలలో " ధ్యానానికి వున్న విశిష్టత

ఆధ్యాత్మిక గ్రంధాలలో " ధ్యానానికి వున్న విశిష్టత


పూజకోటి సమం స్తోత్రం,   
 స్తోత్రకోటి సమో జపః
 జపకోటి సమం ధ్యానం ,         
 ధ్యానకోటి సమో లయః

భావం:

కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం,
కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం,
కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం,
కోటి ధ్యానాదులు ఒక లయానికి సమానం.

 నాస్తి ధ్యాన సమం తీర్థం;   
 నాస్తి ధ్యాన సమం తపః| 
 నాస్తి ధ్యాన సమో యజ్ఞః 
 తస్మాద్యానం సమాచరేత్

భావం:

ధ్యానంతో సమానమైన తీర్ధం కానీ , ధ్యానంతో సమానమైన తపస్సు కానీ ధ్యానంతో సమానమైన యజ్ఞాలు కానీ లేవు , అందువలన | అన్నింటికన్నా ఉత్తమమైన ధ్యానం తప్పక అభ్యసించాలి

Tuesday, June 20, 2023

శ్రీజగన్నాధుడి_56రకాల_మహాప్రసాదాలు

శ్రీజగన్నాధుడి_56రకాల_మహాప్రసాదాలు



*పదాల ఉచ్చారణ అర్థం చేసుకొని చదవగలరు....*.

*1. సాధ అన్నా*(తెలుపు అన్నం)      సాధారణ బియ్యం నీరు
 *2. కనికా* - బియ్యం, నెయ్యి మరియు చక్కెర(పొంగలి లాగా)
 *3. దహి పాఖల్* - పెరుగు బియ్యం మరియు నీరు(దద్ధోజనం లాగా)
 *4. అడా పాఖల్* - బియ్యం, అల్లం మరియు నీరు
 *5. తాలి ఖేచెడి* - పప్పు, చక్కెర మరియు నెయ్యితో బియ్యం 
 *6.ఆజ్య అన్నం* - నెయ్యితో కలిపి వండిన బియ్యం
 *7. ఖేచెడి* - లెంటిల్‌తో కలిపిన వండిన బియ్యం
 *8. మిథా పాఖల్* - బియ్యం, చక్కెర మరియు నీరు
 *9. ఒరియా పఖల్* - బియ్యం, నెయ్యి, నిమ్మ మరియు ఉప్పు
 స్వీట్స్
 *10. ఖాజా* - గోధుమలతో తయారవుతుంది
 *11. గజా* - గోధుమ, చక్కెర మరియు నెయ్యితో తయారు చేస్తారు
 *12. లాడు* - గోధుమ, చక్కెర మరియు నెయ్యితో తయారు చేస్తారు
 *13. మగజ లాడు*
 *14. జీరా లాడు*
 *15. జగన్నాథ్ బల్లవ్* - గోధుమ, చక్కెర మరియు నెయ్యి
 *16. ఖురుమా*-గోధుమ, చక్కెర మరియు ఉప్పుతో తయారు చేస్తారు
 *17. మాతాపులి* - నెయ్యి,అల్లం మరియు ఒక రకమైన బీన్స్ ను మందపాటి పేస్ట్ లోకి తయారు చేస్తారు
 *18. కాకర* - నెయ్యి మరియు గోధుమలతో తయారు చేస్తారు
 *19. మారిచి లాడు* - గోధుమ మరియు చక్కెరతో తయారవు తుంది
 *20. లుని ఖురుమా* - గోధుమ, నెయ్యి మరియు ఉప్పుతో తయారు చేస్తారు
 (సునా వేశ సమయంలో బాహుద యాత్రకు తిరిగి రావడం, రస గోల్లను భోగాస్ గా అర్పిస్తారు, కానీ మరే రోజున భోగో కోసం రస గోల్లలను అనుమతించరు)
 కేకులు, పాన్కేక్లు మరియు పట్టీలు
 *21. సువార్ పితా* - గోధుమ మరియు నెయ్యితో తయారు చేస్తారు
 *22. చాడై లాడా* - గోధుమ, నెయ్యి మరియు చక్కెరతో తయారు చేస్తారు
 *23. జిల్లి* - బియ్యం పిండి, నెయ్యి మరియు చక్కెర
 *24. కాంతి* - బియ్యం పిండి మరియు నెయ్యి
 *25. మాండా* - గోధుమమరియు నెయ్యితో తయారు చేస్తారు
 *26. అమాలు* - గోధుమ, నెయ్యి మరియు చక్కెరతో తయారు చేస్తారు
 *27. పూరి* - గోధుమ మరియు నెయ్యితో తయారు చేసి, చిన్న సన్నని పాన్ కేక్ లాగా లోతుగా వేయించాలి
 *28. లూచి* - బియ్యం, పిండి మరియు నెయ్యితో తయారు చేస్తారు
 *29. బారా* - పెరుగు, నెయ్యి మరియు ఒక రకమైన బీన్స్
 *30. దహి బారా* - ఒక రకమైన బీన్స్ మరియు పెరుగుతో చేసిన కేక్
 *31. అరిసా* - బియ్యం పిండి మరియు నెయ్యితో చేసిన ఫ్లాట్ కేక్
 *32. త్రిపురి* - బియ్యం, పిండి మరియు నెయ్యితో చేసిన మరో ఫ్లాట్ కేక్
 *33. రోసపాక్* - గోధుమలతో చేసిన కేక్ మరియు పాల సన్నాహాలు
 *34. ఖిరి* - పాలు,బియ్యంతో చక్కెర
 *35. పాపుడి* - పాలు క్రీమ్ నుండి మాత్రమే తయారుచేస్తారు
 *36. ఖువా* - స్వచ్ఛమైన పాలు నుండి తయారుచేయడం చాలా గంటలు నెమ్మదిగా ఉడకబెట్టడం వంటి మృదువైన కస్టర్డ్‌కు
 *37. రసబాలి* - పాలు, చక్కెర మరియు గోధుమలతో తయారవు తుంది
 *38. టాడియా* - తాజా జున్ను, చక్కెర మరియు నెయ్యితోతయారు చేస్తారు
 *39. ఖేనా ఖాయ్* - తాజా జున్ను, పాలు మరియు చక్కెరతో తయారు చేస్తారు
 *40. బాపూడి ఖాజా* - పాలు, చక్కెర మరియు నెయ్యి క్రీమ్
 *41. ఖువా మండా* - పాలు, గోధుమ మరియు నెయ్యితో తయారు చేస్తారు
 *42. సరపుల్లి* - ఇది తయారు చేయడానికి అత్యంత ప్రసిద్ధ మరియు కష్టతరమైన పాల వంటకం.  ఇది స్వచ్ఛమైన పాలతో గంటలు నెమ్మదిగా ఉడకబెట్టి పెద్ద పిజ్జా ఆకారపు పాన్లో వ్యాపిస్తుంది.
 కూరగాయలతో కూర
 *43. డాలీ*
 *44. బిరి డాలీ*
 *45. ఉరిడ్ దళ్*
 *46. ​​ముగదళ్*
 *47. దలామా* - ఒరియా హోమ్‌లో విలక్షణమైన వంటకాల్లో ఇది ఒకటి.  ఇది దహ్ల్ మరియు వెజిటబుల్ కలయిక.  సాధారణంగా వంకాయ, బీన్స్, చిలగడదుంప మరియు టమోటాలు, టమోటాలు ఆలయ సన్నాహాలలో ఉపయోగించబడవు.  కొబ్బరికాయలు మరియు ఎండిన కూరగాయల బోధి అని పిలుస్తారు, ఇది ఒక ముష్ గదిలాగా కనిపిస్తుంది మరియు ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

 *48. మౌర్*
 *49. బేసర్*
 *50.సాగ్* -ఒక చిటికెడు వంటకం
 *51. పొటాల రాస*
 *52. గోతి బైగనా*
 *53. ఖాటా*
 *54. రైతా* - పెరుగు మరియు ముల్లంగితో కూడిన వంటకం వంటి పెరుగు.
 *55. పిటా*
 *56. బైగిల్ని*

మహాప్రసాదం మానవ బంధాన్ని పటిష్టం చేస్తుంది, కర్మలను పవిత్రం చేస్తుంది.
🪷🪷🪷🪷🪷🪷

Saturday, June 17, 2023

ఆషాఢమాసం* - *నూతన వధూవరులకు ఎడబాటు ఎందుకు*?

ఆషాఢమాసం* - *నూతన వధూవరులకు ఎడబాటు ఎందుకు?


ఆషాడమాసము : ఈ మాసము గ్రీష్మ రుతువు లో వస్తుంది . పౌర్ణమి రోజున ఉత్తరాషాడ నక్షత్రము వచ్చినందువల్ల ఈ నెలకు ఉత్తరాషాడ ... షార్ట్ కట్ లో ఆషాడ మాసము అని పేరు వచ్చినది . *ఈ మాసము లో వచ్చే ఆర్ధ్ర కార్తి మూలం గా విపరీతమైన వేడి పుడుతుంది . ఈ వేడే సృష్టికి మూలము* . ఆర్ధ్ర కార్తిలో వర్షము పడితే భూమిలో విత్తతనాలు మొలకెత్తుతాయి . ఇదే భగవంతుని లీల . భగవంతుని సృష్టికి వ్యతిరేకంగా మారు సృష్టి జరగ కూడదు . *వేడి వాతావరణం లో వర్షము అనేక జీవుల ఉత్పత్తికి దోహదము చేస్తుంది . భూమిపై కొత్త కొత్త జీవుల జననాకి ఆస్కారము అవుతుంది* . వర్షము తో నీరు కలుషితమువుతుంది . 

     గాలి వాతావరణము లో ఒక్కసారిగా మార్పు జరుగుతుంది . ఈ విశ్వములో ఒక జీవి ఇంకొక జీవిని తింటూ బ్రతుకుతాయి . అందువలన మానవులు ఎన్నో రకాల వ్యాదులకు గురవుతారు ... కొత్త సూక్ష్మ జీవులు పుడుతూ మనుషులలో కొత్త జబ్బులు కలుగజేస్తాయి. ఇది సర్వ సాదారణము . ముఖ్యము గా నేటి సమాజము లో వైరల్ వ్యాధులు ఎక్కువ . విత్తనము మొలకెత్తేటపుడు ఈ సీజన్ లో విపరీతం గా జణించిన సూక్ష్మ జీవులు ... మొలకెత్తే జీవులపై దాడి చేసి అనేక వ్యాదులకు గురిచేస్తాయి .

     *ఆషాడమాసము లో కడుపులో పడ్డ బిడ్డకు ఇదే గతి పడుతుంది . పూర్వము వైద్యసదుపాయాలు , పారిశుద్ది పరికరాలు , మంచినీటి సౌకర్యాలు , సురక్షిత ప్రయాణ యేర్పాట్లు మున్నగు సదుపాయాలు , లేని కారణం గా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల సాంగత్యము పనికి రాదని , అనారోగ్యకరమైన సంతానకు కలుగ కుండా ఉండేందుకు ... పెద్దలు ఈ నియమావలి పెట్టేరు* . ఈ నెలలో అత్తగారు .. కొత్తకోడలు ఒకేచోట ఉండకూడదని పుట్టింటికి పంపుతారు .. *భర్త కూడా అత్తవారింట ఈ నెలరోజులూ అడుగు పెట్టకూడదన్నది ఆచారముగా వస్తోంది .
ఇదే అచారము దైవత్వము తో మిలితం చేసి ... ఆద్యాత్మికముగా ప్రచారము చేసారు* నాటి పెద్దలు , 

     *శ్రీమహావిష్ణువు 6 మాసాలు నిద్రలోను ... 6 మాసాలు మెలకువలోను ఉంటారు . ఆషాడము మొదలు కొని ఆరు మాసాలు పాలకడలి పైన శయనిస్తాడు కావున ఈ మాసాలలో ఆయన తేజము తగ్గుతుంది* . విష్ణు తేజము లేని ఈ నెలను సూన్యమాసము అంటారు , ఏ శుభకార్యము ఈ నెలలో చేయరు . తదుపరి నిద్రావస్త కాలములో విష్ణు తేజములో అంతగా క్షీనత ఉండదని జ్యోతిశ్యాస్త్ర నిపుణుల నమ్మకము . *ఈ నెలలో కడుపులో పడ్డ బిడ్డ విష్ణు తేజము లేని వాళ్ళుగా పుడతారని , జ్ఞానహీనులవుతారని , రాక్షసతత్వము కలవారుగా పుడతారని ప్రచారము లోనికి తెచ్చారు . నిగూఢ రహస్యము ఏమిటంటే ... ఆరోగ్యకరమైన సంతాతము కోసమే ఈ ఏర్పాట్లన్నీ* .

     ఆషాడమాసములొ తొలకరి జల్లులతో పుడమి పులకరిస్తోంది .. చినుకుల సందడే కాదు పెళ్ళికూతుళ్ళ సందడి కూడా ఎక్కువే . ముసిముసి నవ్వులతోచెప్పలేని భయము తో బెరుకుగా అత్తవారింట అడుగు పెట్టే పెళ్ళికూతుళ్ళకు ఆనందము తెచ్చేది ఈ ఆషాడమాసమే . కొత్త ప్రపంచములోని కొత్త వ్యక్తులతో సహజీవనము సరదాగా , ఆనందముగా , భయము గా ఉన్నాతాము పెరిగిన వాతావరణానికి మళ్ళీరావడం వారికి ఆనందమే . భర్తను వదలి నెల రోజులు దూరంగా ఉండడం ఇబ్బందే అయినా కన్నవారింట్లో ఉండడం వారికి నూతన ఉత్సా హాన్ని తెస్తుంది . 

     కొత్త కోడలిని ఆషాఢమాసం ప్రారంభానికి ముందే కన్నవారింటికి పంపుతారు . అమ్మాయిని .. అల్లుడి నుంచి నెల రోజుల పాటు దూరం చేయడం వల్ల అల్లుడు అలగకుండా అతనిని సంతృప్తిపరచడం కోసం కొన్ని కట్నకానుకలు ఇచ్చి తల్లిదండ్రులు తమ కుమార్తెను ఇంటికి తీసుకెళ్తారు .. దీనిని ఆషాడాపట్టీ అంటారు (ఆల్లుడికిచ్చే కానుకలు). అదేవిదంగా శ్రావణమాసము లో కోడలిని తమఇంటికి తీసుకువచ్చే సందర్భముగా అత్తవారు శ్రావణపట్టీ ఇస్తారు(కోడలికిచ్చే కానుకలు) . ఇది ఒక ఆచారము . ఇచ్చిపుచ్చుకునే ఆహ్లాదకరమైన వాతావరణము .

    *ఆషాడమాసము లో జరిపే " చాతుర్మాస వ్రతము " : - >
ఆషడ , శ్రావణ , భాద్రపద , ఆశ్వీయుజ మాసాల్లో శ్రీ మహావిష్ణువు పాల కడలి మీద శయనిస్తాడు* కావున ఈ నాలుగు నెలల్లో ఒక్కోనెల ఒక్కో పదార్ధాన్ని తినరు (వదలివేస్తారు ) దీనినే ' చాతుర్మాస ' వ్రతము అంటారు .
ఆషాడమాసము లో ... ఆకుకూరలు , (విరోచనాలు వాంతులు ఉన్న కాలము కావున ఆకుకూరలు తినకుండా ఉంటే మంచిది ),
శ్రావణ మాసములో ... పెరుగు (గాస్టిక్ ఎసిడిటీ పెరగకుండా ఉండడానికి-- ఈ కాలములో ఎసిడిటీ ప్రొబ్లంస్ ఎక్కువ కాబట్టి ),
భాద్రపద మాసము లో ... పాలు ( గొడ్లు ఎదకట్టే కాలము కావున ),
ఆశ్వీయుజ మాసము నుంచి కార్తీకము వరకు పప్పుదినుసులు వదిలేస్తారు.

     ఈ నాలుగు నెలలు ఈ పదార్ధాలు తినరు. ఆశ్వీయుజ , కార్తీక మాసాలలో శాకవ్రతము చేస్తూ ఆకుకూరలు , కంద , చేమ.. తో చాలామంది భోజనం చేస్తారు . ఇవన్నీ అరోగ్యకరమైన సూత్రాలు

సేకరణ 🙏

Friday, June 16, 2023

శ్రీ మహాలక్ష్మి నివాస స్థానాలు

శ్రీ మహాలక్ష్మి నివాస స్థానాలు


సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహా లక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉండరు. ఆమె దృష్టి మన మిద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలూ చేస్తూ ఉంటాము. కానీ, శ్రీ లక్ష్మి దేవి యొక్క నివాస స్థానాలు, ఆమె ప్రీతి కొరకు ఏమి చేయాలి అనేది మనం సూక్ష్మం గ తెలుసుకొందాము. పూజలు, వ్రతాలూ చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వార లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు.
1. సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పదేయకూడదు. గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు. పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమ తో అలంకరించాలి.
2. ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసిన మంచిదే.
3. శుచి, శుభ్రత ఉన్న ఇళ్లు లక్ష్మి దేవికి ఆలవాలం. కనుక, ఇంట్లోని పనికిరాని వస్తువులు, విరిగి పోయిన, చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి.
4. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి, వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు.
5. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఊడ్చి ముగ్గులు వేసుకోవాలి.
6. ఇంటి ఇల్లాలు గట్టిగ గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు.
7. ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం కోట్లడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తి గా ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మి దేవి ప్రవెశించదు.
8. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించే వారు, బద్దకస్తులు ఎక్కడ ఉంటారో, అక్కడ లక్ష్మి దేవి ఉండదు.
9. ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.
10. సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసిన మంచిదే.
11. సత్యవాదులు, ధార్మిక , నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మి దేవి ప్రసన్నురాలై ఉంటుంది.
12. వెండి, బంగారు వంటి లోహల్లో, రత్నాలు, ముత్యాలు లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.
13. అతిగా మాట్లాడే వారు, గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు, జుదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట లక్ష్మి దేవి ఉండలేదు.
14. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి, ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి, లక్ష్మి పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు.
15. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు🙏.

⚜️⚜️⚜️⚜️⚜️

Thursday, June 15, 2023

తీర్థానికి, క్షేత్రానికి తేడా ఏమిటో తెలుసా?

తీర్థానికి, క్షేత్రానికి తేడా ఏమిటో తెలుసా?


మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం అప్పుడప్పుడు తీర్థ యాత్రలు, పుణ్య క్షేత్రాలు అంటూ దైవ క్షేత్రాలకు వెళ్తుంటాం.

ఎవరడిగినా మన నోటికి వచ్చిన పదం చెప్తుంటాం. కానీ అలా చెప్పడం సరైన పద్ధతి కాదు.ఎందుకంటే పుణ్య క్షేత్రాలకు, తీర్థ క్షేత్రాలకు చాలా తేడా ఉంది.

అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.వాస్తవానికి తీర్థం, క్షేత్రం రెండూ వేరు వేరు.

నదీ నదాలు, సముద్ర తీరాన వెలసిన ఆలయాలను తీర్థాలు అంటారు.పవిత్ర గంగ, గోదావరి, కృష్ణ, తుంగ భద్ర వంటి నదుల తీరంలో ఉన్న వారణాసి, గోకర్ణ, రామేశ్వరం వంటివి తీర్థాలు.

అలాగే నదీ జలాలు లేని ప్రాంతాల్లో కొలువైన ఆలయాలను క్షేత్రాలు అంటారు.ఇవి స్థల క్షేత్రాలు, గిరి క్షేత్రాలు అని రెండు రకాలు ఉంటాయి.

నేలపై ఉన్న ఆలయాలను స్థల క్షేత్రాలు అంటారు.అలాగే కొండల పై వెలసిన గుడులను గిరి క్షేత్రాలు అంటారు.

తిరుమల, మగళ గిరి, సింహాచలం, శ్రీశైలం, యాదగిరి గుట్ట వంటివి గిరి క్షేత్రాలు.

అహోబిలం నరసింహ స్వామి ఆలయం ఆలంపూరు జోగులాంగ దేవాలయం, బాసర సరస్వతీ ఆలయం, వేములవాడు రాజ రాజేశ్వర స్వామి ఆలయం వంటి మొదలగునవి స్థల క్షేత్రాలు.

పక్కన నది ఉన్నప్పటికీ కొండపై వెలసిన ఆలయాలను కూడా క్షేత్రాలు గానే పరిగణిస్తుంటారు.అందుకే పక్కనే నది ఉండి.

కొండపై వెలసిన విజయవాడ కనక దుర్గ అమ్మవారి ఆలయాన్ని కూడా క్షేత్రంగానే పిలుస్తారు.🍁

Tuesday, June 13, 2023

శివ క్షేత్రాలు:

కొన్ని విశిష్టమైన శివ క్షేత్రాలు:

భైరవకోన :: 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల 'ప్రకాశం' జిల్లా కొత్తపల్లి గ్రామానికి 5 కి.మీ. నడక దూరంలో ఈ క్షేత్రము కలదు. ఎక్కడ చూసినా కోనేరులు, శివ లింగాలు కనిపించే ఈ కొనలో ఒకే రాతిలో చెక్కబడిన 8 శివాలయాలు క్రీ.శ. 7, 8 శతాభ్దాలలో నిర్మించబడినట్లు చరిత్ర. పురాణాలలో వర్ణించిన శివుడు తన 8 రూపాలకు సంకేతంగా శశినాగ, రుద్ర, విశ్వేశ్వర, నగరికేశ్వర, భర్గేశ్వర, రామేశ్వర, మల్లిఖార్జున, పక్షఘాతక లింగాల రూపంలో దర్శనమిస్తాడు.

ధర్మస్థల :: 

కర్నాటక రాష్ట్రంలో గల 'ఉడిపి' నుండి 120 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇది మంగుళూరు నుండి 75 కి.మీ. దూరంలో ఉన్నది. నేత్రావతి నదీ తీరంలోనున్న ఇచ్చటి ఆలయం పేరు 'మంజునాథేశ్వరాలయం'. క్రీ.పూ. 10వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించబడింది.ఈ ఆలయంలో అసత్యం పలికే విపత్తు కలుగుతుందనే నమ్మకం వలన కోర్టులో తెగని కేసులు స్వామి ఎదుట పరిష్కారం పొందుతారు. ఆలయంలో మూలవిరాట్ ను జైనులు ప్రతిష్ఠించారు. 800 సంవత్సరాల నుండి నిత్యాన్నదానం ఇచ్చట జరుగుతుంది.

తంజావూరు ::

తమిళనాడు రాష్ట్రంలో గల 'చెన్నై' నుండి 335 కి.మీ. దూరంలో గల 'తంజావూరు' అద్భుత క్షేత్రం. ఇచ్చటి ఆలయం పేరు బృహదీశ్వరాలయం. ఇది 10వ శతాబ్దంలో రాజరాజచోళుడు అనే చక్రవర్తిచే నిర్మించబడినది. ప్రపంచంలోని ఏ ఆలయానికి ఇంత ఎత్తయిన ప్రాకారాలు లేవని అంటారు. ఈ ప్రాకారం పొడవు 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు, 13 అంతస్తులుగా నిర్మించిన 216 అడుగుల ఎత్తుగల ఆలయ గోపురం పై 80 టన్నుల రాయిని శిఖరాగ్రంగా ఆ రోజుల్లో 4 మైళ్ళ దూరం నుండి ఏటవాలు రాళ్ల వంతెనపై దొర్లించుకొచ్చి నిలిపారట. ఆలయం లోపల ఎత్తయిన వేదికపై 13 అడుగుల ఎత్తుగల శివలింగం ఉంటుంది. ఆలయానికి కొంచెం దూరంలో రాజరాజచోళుని కుమారుడు నిర్మించిన గంగైకొండ చోళపురంలో శివాలయం అద్భుత శిల్పకళతో ఈ ఆలయంతో పోటీ పడుతుంది. ఈ ఆలయం 'యునెస్కో' వారిచే ప్రపంచ సంస్కృతీ చిహ్నంగా గుర్తింపు పొందినది.

దుగ్ధేశ్వరనాథ్ :: 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల 'గోరఖ్ పూర్-బటని' మార్గంలోనున్న 'గౌరీబజార్' స్టేషన్ నుండి 15 కి.మీ. దూరంలో గల ఈ క్షేత్రం రుద్రపురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగము 12 జ్యోతిర్లింగాలలో ఒకటయిన ఉన్నయినిలోని మహాకాళేశ్వర లింగానికి ఉపజ్యోతిర్లింగం. ఆలయంలోని శివలింగం అప్పుడప్పుదు తనకు తానుగా కదులుతుంది. ఒక్కక్కసారి రోజంతా కదులుతుంది. హఠాత్తుగా ఆగిపోతుంది. అప్పుడు లింగాన్ని గట్టిగా పట్టీ ఉంచినప్పటికీ కదలిక లేకపోవటం ఆశ్చర్యం.

తలకాడు :: 
(1)
కర్నాటక రాష్ట్రంలో గల 'మైసూర్' నుండి 60 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. కావేరీ నదీ తీరంలోనున్న ఇచ్చటి ఆలయం పేరు 'వైద్యేశ్వరాలయం'. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇసుకతో కప్పబడి 1978, 1999, 2002 సంవత్సరాలలో కార్తీకమాసం 5 సోమవారాలలో దర్శనం ఇచ్చింది. మరలా పునర్దర్శనం క్రీ.శ. 2014లో అంటున్నారు. ఈ విధంగా ఇచ్చటి లింగాకారం 12 సంవత్సరాల కొకసారి కార్తిక మాసంలో 5 సోమవారాలు పడినపుడు మాత్రమే దర్శనం ఇస్తుంది. అప్పుడు జరిగే 'పంచలింగ దర్శనం' అనే మహోత్సవానికి లక్షల కొలదీ జనం వస్తారు.

(2)
కర్ణాటక రాష్ట్రంలోని 'మైసూర్' నుండి 600 కి.మీ. దూరంలో గల క్షేత్రం 'తలకాడు'. ఈ ఆలయం పేరు 'పాతాళేశ్వరాలయం'. క్రీ.శ. 1004 వరకు పాలించిన గంగవంశ రాజుల కాలం నుండి ఈ ఆలయ ఉంది. కాల ప్రవాహంలో ఇసుకతో కప్పబడింది. పురావస్తు శాఖవారి దయ వలన బయటపడింది. నేల మట్టంకన్నా చాలా లోతుగా ఉన్న ఆలయంలోని శివలింగం ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంకాలానికి తెలుపు రంగులోకి మారుతూ కనిపిస్తుంది.

మహేశ్వర్ :: 

మధ్యప్రదేశ్ రాష్త్రంలో 'ఇండోర్' నుండి 100 కి.మీ. దూరంలో గలదు ఈ క్షేత్రం. ఇచ్చటి ఆలయంపేరు 'రాజరాజేశ్వరాలయం'. పురాణాలలో 'మాహిష్మతి'గా పిలువబడే ఈ క్షేత్రం అనడు కార్తవీర్యార్జునుని రాజధాని. అయన సహస్ర బాహువులకు ప్రతీకలుగా 'సహస్రధార'గా నర్మదానది ప్రవహిస్తుంది. ఇండోర్ రాణి అహల్యాబాయి నిర్మించిన ఏకశిలా నిర్మిత ఆలయాల సముదాయం 'అహల్యేశ్వరాలయం' చూడవలసినది. అనేకమైన ప్రాచీన మందిరాలు విభిన్న దేవతలకు ఉన్నాయి. 108 దేవీ పీఠాలలఓ ఒకటైన 'స్వాహాదేవి' మందిరం ఉంది. రాజరాజేశ్వరాలయంలో పెద్ద శివలింగంతో పాటు 8 లోహాలతో నిర్మించబడిన శివపార్వతుల విగ్రహం ఉంది. వాటికీ ఎదురుగా 1000 సంవత్సరాల క్రిందటి అఖండదీపం దర్శనం ఇస్తుంది.

కోటప్పకొండ :: 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'గుంటూరు' నిల్లాలోని నరసరావుపేట నుండి 11 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. శివుని దక్షిణామూర్తి రూపానికి గల ఏకైక ఆలయం. కనుక ఇచ్చట అమ్మవారు ఉండరు. స్వామికి ఉత్సవాలు ఉండవు. త్రికూట క్షేత్రంలో స్వయంభూ శివలింగం. కొండమీద ఆలయం ఉంది. ఆలయం వరకు బస్సు సౌకర్యం కలదు. బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు మూడింటిమీద 3 శివాలయాలు ఉన్నాయి. వేలకొలది ప్రభలు మొక్కుబడిగా శివరాత్రికి వస్తాయి.

సురుటుపల్లి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నందు గల 'సత్యవేడు'కు దగ్గరలో గల క్షేత్రం ఇది. అరుణానదీ తీరంలో గల ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'పల్లికొండేశ్వరాలయం'. శివశైవ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో గరళం త్రాగిన శివుడు పరుండి యుంటే బయట ఏకాంతంగా నంది ఉంటుంది. స్వయంభూ శివలింగంతో పాటు స్వయంభూ గణపతి విగ్రహం కలదు. స్కాంద పురాణ శివరహస్య ఖండంలో శివుడు హాలాహలం మ్రింగి విశ్రమించి నందున 'కాలకూటానన'క్షేత్రంగా ఇది వర్ణించబడింది. నిదురించే శివుని చుట్టూ బ్రహ్మాది దేవతలు అందరూ ఉన్నారు.

పోండా :: 

గోవా రాష్ట్ర రాజధాని 'పానాజీ' నుండి 22 కి.మీ. దూరంలో గల ఈ క్షేత్రంలో ఆలయం పేరు మంగేష్ ఆలయం. ఈ ఆలయం 16వ శతాబ్దంలో పునఃప్రతిష్ఠ చేయబడింది. అందమైన సరస్సు తీరానున్న ఈ ఆలయం బంగారు కలశంతో ధర్శనమిస్తుంది. ఇండో-పోర్చుగీసు-ఇస్లాం నిర్మాణ శైలీ విన్యాసాలు ఈ ఆలయంలో గోచరిస్తాయి. ప్రతి సభా మంటపం, దీప స్తంభం ఆలయ శోభను ఇనుమడింపజేస్తాయి. గర్భాలయంలో రజత తోరణం మధ్య మంగేష్ స్వర్ణ ప్రతిమ కిరీటంపై నరసింహ స్వామి ఉగ్రరూపం దర్శనమిస్తుంది. శాలువాలతో, ఆభరణాలతో, పుష్పాలతో, స్వర్ణ ప్రతిమను నిత్యం అలంకరిస్తారు. ఆలయంలోని ఈ ప్రాచీన శివలింగం క్రీ.శ. 1560 వరకు 'కుశస్థలి'లో గల ఆలయంలో పూజలందుకునేది.

ఖాట్మండు :: 

(1)
నేపాల్ దేశ రాజధాని అయిన 'ఖాట్మండు' క్షేత్రంలోని ఒక ఆలయం పేరు 'విశ్వరూప మందిరం'. ఇది ప్రసిద్ధి చెందిన పశుపతినాథ దేవాలయానికి దగ్గరలో ఉంది. ఈ మందిరానికి వెళ్ళే దారిలో ఎడమవైపున 11 శివాలయాలు ఉన్నాయి. అతి ప్రాచీనమైన ఈ ఆలయం విశాలమైన ప్రాంగణం కలిగి, గర్భాలయ, అంతరాలయాలను కలిగి ఉంది. అంతరాలయం చుట్టూ ఎత్తైన గోడ కలిగి ప్రదక్షిణానికి అనుకూలంగా ఉంది. ప్రధానాలయంలో శివుడు వేయి చేతులతో పార్వతిని ఆలింగనం చేస్తున్నట్లు సుమారు 50 అడుగు విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని ఉ. 5.00 గం.లకు, సాయంకాలం 7.00 గం.లకు మాత్రమే తెరుస్తారు. ఆ సమయంలో సుమారు అరగంట మాత్రమే దర్శనం ఉంటుంది.

(2)
శివుని అష్టమూర్తి క్షేత్రాలలో యాజమాన లింగంగా ప్రసిద్ధినొందినది పశుపతినాథలింగం నేపాల్ లోని ఖాట్మండులో కలదు. నేపాల్ లోని అత్యంత పవిత్రమైన 'ఖాట్మండు' ప్రదేశం;హిందూధర్మానికి, సంస్కృతికి పట్టుకొమ్మగా నిల్చింది. ఇచ్చటి దేవత పశుపతినాథ్, అమ్మవారు గుహ్యేశ్వరి (పార్వతి). ఖట్మాడులో విరాజిల్లుతున్న ఈ జ్యోతిర్లింగం 'పశుపతి' అనే నామంతో ప్రసిద్ధి పొందినది. ఇది శివుని అష్టమూర్తులలో 'యాజమాన' మూర్తిగా కూడా కొలువబడుతున్నది. మహేశ్వరునకు ఉన్న అనేక నామములలో పశుపతి ఒకటి.

తిరువల్లం :: 

తమిళనాడు రాష్ట్రంలో 'రాణిపేట'కు మరియు చిత్తూరుకు దగ్గరలో ఉంది. ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'బిల్వనాథేశ్వరాలయం'. దీనిని 5వ శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 1500 ఏళ్ళనాటిదిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని విగ్రహం క్రీ.పూ. 794లో రూపొందించబడినదని శాసనం. పల్లవ రాజులు 850 బి.సి. లో గర్భగుడిపై విమాన గోపురాన్ని నిర్మించారు. చోళుల కాలంలో 1000 స్తంభాల మండపం నిర్మించబడింది. ఇక్కడ ఉన్న బిల్వవృక్షంలోని ఆకులతో శివుని విగ్రహానికి నిత్యపూజలు చేస్తారు. ఆ ఆకులను తింటే రోగాలు నయమవుతాయని స్థానికుల నమ్మకం.

నత్తరామేశ్వరం :: 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా 'అత్తిలి' నుంది 6 కి.మీ. దూరంలో గల క్షేత్రమిది. గొనని నదీ తీరాన ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'రామలింగేశ్వరాలయం'. ఆలయంలోని శివలింగాన్ని పరుశురాముడు ప్రతిష్టించినట్లు చరిత్ర. ఈ ఆలయంలోని లింగం ఎప్పుడూ నీటిలో మునిగి నత్తల సంపుటితో కుడి ఉంటుంది. లింగంపై వ్రేలి ముద్రలుగా నిలువు చారలు ఉంటాయి.

కాళేశ్వరం :: 

అంధ్రప్రదేశ్ రాష్త్రంలో 'కరీంనగర్' జిల్లా కేంద్రం నుండి 130 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. గోదావరి, ప్రణీత, సరస్వతుల త్రివేణీ సంగమంలో ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'కాళేశ్వరాలయం'. వేంగి రాజైన విష్ణువర్ధనుడు నిర్మించినట్లు చరిత్ర. ఇచ్చటి ఆలయంలో ఒక స్వయంభూ లింగం ముక్తీశ్వరుడు, రెండవది శివుని ఆదేశం ప్రకారం యమధర్మరాజే లింగంగా వెలిసిన కాళేశ్వరుడు అనే రెండు లింగములు ఒకే పానవట్టంపై ఉండటం విశేషం. ఈ ఆలయంలో ప్రాకారం క్రింద వివిధ దిక్కులలో వివిధమైన ఆలయాలుంటాయి. ఆలయం పరిసరాలలో ఉన్న 'యమకోణం' చూచి తీరవలసింది.

పృధుదక్ :: 

హర్యానా రాష్త్రంలో కురుక్షేత్రం నుండి 50 కి.మీ. దూరంలో గణ పిహోవా స్టేషను నుండి 4 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇక్కడి ఆలయం పేరు 'సంగమేశ్వరాలయం'. దీనిని 'అరుణాయి మందిరం' అని కూడా పిలుస్తారు. భూగర్భంలో ఎంతలోతు వరకుందో తెలియని స్వయంభూ లింగం గల ఈ ఆలయం అరుణ, సరస్వతి నదుల సంగమ స్థలంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగంను చుట్టుకొని ఎప్పుడూ ఒక సర్పం ఉంటుంది. శివశక్తే అలా సర్పరూపంలో ధర్శనమిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ సర్పం ఇప్పటి వరకు ఎవరికీ హాని చేహలేదని చెబుతారు.

గార్హముక్తేశ్వర్ :: 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 'ఢిల్లీ-మొరాదాబాద్' లైనులో గల 'బ్రజ్ ఘాట్' నుండి 6 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. ఒక సిద్ధుని ద్వారా ఇచ్చటి ఆలయానికి చేరిన శివలింగం తెల్లని స్ఫటికంతో నిర్మితమై సప్త వర్ణాలను వెదజల్లుతుంది. ఏడాదికొకసారి పెద్ద శివలింగం నుండి చిన్న శివలింగం పుడుతుంది. బహు ముఖాలతో కూడిన శివలింగం నుండి అనేక భాగాలు విడివడిన సంగతి బాగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఇంతకు పూర్వం చిన్న లింగం వెలువడిన స్థానంలో నుండి మరొకటి బయటపడుతోంది.

శివగంగ :: 

కర్ణాటక రాష్ట్రంలోని 'బెంగళూరు' నుండి 60 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చటి ఆలయం పేరు 'గంగాధరేశ్వరాలయం'. గుహలోపల ఉన్న 2-1/2 అడుగుల ఎత్తుగల శివలింగానికి పసుపుగా ఉన్న నెయ్యిని మర్దిస్తే అది చూస్తుండగానే తెల్లటి వెన్నగా మారుతుంది. కాదని తొలచి చేసిన ఓ విశాలమైన గుహలో ఉన్న ఈ శివలింగాన్ని చేరుకోవాలంటే దాదాపు 200 మెట్లు ఎక్కి వెళ్ళాలి. అర్చన టికెట్ తో పాటే నెయ్యి కూడా ఇస్తారు. యూరోపియన్ హేతువాదులు తపదేశం నుండి (మనల్ని నమ్మక) నెయ్యిని తెచ్చి లింగానికి రుద్ది వెన్నగా మారే వాస్తవాన్ని అంగీకరించారు. ఈ వెన్నని బాధా నివారణ మందుగా వాడుతుంటారు.

కాంచీపురం :: 

ఏకామ్రేశ్వరుడుగా (క్షితిలింగం) పరమశివుడు పృథ్వీలింగంగా వెలసి అనంత మహిమలతో భక్తులను తరింపజేసేదే ఈ కాంచీ క్షేత్రం. 'ఏక' అంటే ఒక, 'అమ్ర' అంటే మామిడి. ఈశ్వరుడు అంటే శివుడు. (ఏక+అమ్ర+ఈశ్వరుడు) అంటే మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి వారు గనుక ఈ స్వామికి ఏకామ్రేశ్వరుడు అనే పేరు ఏర్పడినట్లు చెప్పబడింది. ఈ ఆలయాన్ని 'పెద్దపడి' అని పిలుస్తారు. దీనినే 'తిరువేంకంబం' అని 'తిరుకుచ్చి ఏకంబం' అని 'తిరు ఆలయం' అని తమిళులు పిలుస్తారు. శివకంచి ఏకమ్రేశ్వరస్వామి ఆలయం విశాలమైన మూడు ప్రాకారాలతో, ఎత్తైన గోపురంతో అద్భుతమైన శిల్పకళావైభవోపేతంగా ఉంటుంది.

పంచరామాలు :: 

ఈ పంచారామ క్షేత్రాలు ఆంధ్రరాష్ట్రంలో మూడు జిల్లాలలో వెలసినవి. అవి - గుంటూరు జిల్లాలోని అమరావతిలోను, పశ్చిమ గోదావరి జిల్లాలోని గునుపూడి భీమవరంలో ఒకటి, పాలకొల్లులో ఒకటి, తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలోని ఒకటి, సామర్లకోట కుమారారామ భీమేశ్వరంలో ఒకటి వెలసి భక్తుల పూజలందుకొంటున్నాయి. ఇక ఆలయ విశేషాలు పరిశీలిస్తే శివుని లింగాకృతిలో విచిత్రమైన విభేదాలు - అమరారామంలో 36 అడుగుల ఎత్తులో 9 అడుగులు మాత్రమే దర్శిస్తాము. ద్రాక్షారామంలో 14 అడుగులు, సామర్లకోటలో 12 అడుగులు ఎత్తుగల శిలింగం. భీమవరం, పాలకొల్లులో రెండడుగుల ఎత్తు ప్రమాణం గల శివలింగం దర్శిస్తాము. అమరారామంలో బాలరాముండేశ్వరి సహిత అమరేశ్వరస్వామిగాను, ద్రాక్షారామంలో మాణిక్యాంబ సహిత భీమశ్వరునిగాను, కుమారారామంలో బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వరునిగాను, సోమారామంలో పార్వతి, అన్నపూర్ణసమేత సోమేశ్వరునిగానూ, క్షీరామంలో పార్వతి సహిత శ్రీరామలింగేశ్వరునిగాను పూజింపబడుతున్నారు. ఈ పంచారామ క్షేత్రాలైదింటిలోను ద్రాక్షారామానికి ప్రత్యేక విశిష్టత కలదు. ఇక్కడి అమ్మవారు మాణిక్యాంబదేవి అష్టాదశపీఠాలలో 12వ శక్తిపీఠంగాను, భీమేస్శ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగ ఉపలింగంగాను ప్రసిద్ధి చెందినది.

చిదంబరం :
పరమశివుని పంచభూతాల్లో అయిదవది, శివుని అష్టమూర్తి స్వరూపాల్లో ఒకటైనది -- ఆకాశరూపంలో కొలువుతీరిన చిదంబరం క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరానికి సుమారు 250 కి.మీ. దూరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లాలో ఉంది. నటరాజస్వామి ఆనంద తాండవం చేసే చిదంబరాన్ని ప్రాచీనకాలంలో తిల్లయ్-వనం, వ్యాఘ్రపురం, పొన్నాంబళం, పురియార్, పుండరీకపురం, భూలోక కైలాస్ అనే పేర్లు ఉండేవి. కాలక్రమంలో ఈ స్థలానికి చిదంబరం అనే పేరు వ్యాప్తిలోకి వచ్చి స్థిరపడింది. చిదంబరం అంటే చిత్ + అంబరం, చిత్ అంటే జ్ఞానము, అంబరం అంటే అనంతమైన ఆకాశం. చిదంబరంలో (చిత్ సభ, కనుక సభ, దేవసభ, నృత్యసభ, రాజసభ) పంచ సభలకి ప్రాధాన్యం ఉంది గనుక ఆ పేరు వచ్చింది. 'తిల్లయ్' అనే వృక్షాలు అధికంగా ఉండడం వాళ్ళ ఈ క్షేత్రానికి 'తిల్లయ్' వనం అనే పేరు వచ్చింది. ఇక్కడి అమ్మవారి పేరు "శివకామసుందరి'.

తిరువణ్ణామలై :: 

'తిరు' అంటే పెద్దది, 'అణ్ణా' అంటే అగ్ని 'మలై' అంటే కొండ అని అర్థం. ఎత్తైన కొండపై వెలసిన స్వామి అరుణగిరి రూపంలో అవతరించిన శివమహాదేవుని మహిమాన్వితమైన జ్యోతిస్వరూపమే అణ్ణామలయ్యార్ స్వామి. ఇక్కడ పర్వతమే శివ స్వరూపం. ఇదికాక లింగరూపంగా ఆలయంలో కొలువున్నారు. అమ్మవారి పేరు 'అపీతకుచాంబ'. తిరువణ్ణామలై క్షేత్రం తమిళనాడులోని (ఉత్తర ఆర్కాట్ జిల్లా) ప్రస్తుతం సంబురాయర్ జిల్లాలో ఉంది. ఈ పట్టణం తాలూకా కేంద్రం విల్లిపురం. కాత్పాడి రైలు మార్గంలో చెన్నైకి 226 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీకాళహస్తి :: 

శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంభువుగా బిల్వకావనములో సువర్ణముఖీ నదీ తీరంలో వెలిశాడు. 'శ్రీ' అంగ సాలెపురుగు, 'కాళీ' అనగా పాము, 'హస్తి' అనగా ఏనుగు, ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుజ్యమంది శివునిలో లీనమైపోయాయి. అందువలన ఇచ్చటి స్వామివారికి శ్రీకాళహస్తీశ్వరుడని, ఈ పురమునకు శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఇచ్చట అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కృతయుగంలో ఇక్కడ స్వామి వాయురూపంలో ఉండి మహాయోగులను స్పర్శ మాత్రమునే గ్రహింపదగియుండేవారట. త్రేతాయుగంలో స్వర్ణ రూపంగా, ద్వాపరయుగంలో రజిత రూపంగా, ప్రస్తుత కలియుగంలో శ్వేతశిలా రూపం పొంది తన సహజ వాయుతత్వ నిదర్శనంగా గర్భాలయంలో స్వామికి కుడి ప్రక్కనున్న దీపములను రెండింటిని ఎల్లప్పుడూ చలింపజేస్తూండటం గమనించదగినది. ఇక్కడి జగదంబ 'జ్ఞానప్రసూనాంబ'.

శీర్కాళి :: వైదీశ్వరన్ కోయిల్ :: 

చిదంబరానికి, కుంభకోణానికి మధ్యలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్, శీర్కాళ్ గొప్ప క్షేత్రాలు. వైదీశ్వరన్ కోయిల్, శీర్కాలి రెందు, కేవలం 8 కి.మీ. దూరం ఉన్న ప్రక్క ప్రక్క ఊళ్ళు. వైదీశ్వరన్ కోయిల్ ఉత్తర తమిళనాడు వారికి చాలా ముఖ్యమైన పవిత్రస్థలం. ఒకానొక ముని తనకు గొప్ప జబ్బు చేయగా పరమేశ్వరుని గూర్చి ఎంతో భక్తితో తపస్సు చేయగా శంకరుడు ఒక వైద్యుని రూపంలో ప్రత్యక్షమై, అతని జబ్బు నయం చేశాడమొ స్థల పురాణం. ఈ ప్రాంతం వారు ఇంట్లో ఎవరికీ ఏ జబ్బు చేసినా, ఈ వైదీశ్వరునికి మొక్కుకుంటారు. ఊరు మాత్రం అతిచిన్న పల్లెటూరు. అయినా దేవాలయం మాత్రం ఎన్నడూ భక్తులతో నిండి ఉంటుంది. ఈ మధ్య ఈ ఊరికి చెందిన 'నాడీగ్రంథ' జ్యోతిష్కులు అన్నిచోట్ల వెలియడంతో ఈ ఊరికి జ్యోతిషం చెప్పించుకుంటానికి వచ్చేవారు ఎక్కువ అయ్యారు. వైదీశ్వరన్ కోయిల్ కు శీర్కాలి మధ్యదూరం కేవలం ఐదు మైళ్ళు. తమిళులందరికి శిర్కాలి చాలా పవిత్రమైన యాత్రాస్థలం. తమిళులకు ఈ దేవాలయం సంస్కృతిక కేంద్రం లాంటిది. ఈ ఊరిని గూర్చి వారందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. గొప్ప శివభక్తాచార్యుడు 'జ్ఞాన సంబంధర్' ఈ శిర్కాలిలోనే జన్మించారు. ఈ సంబందర్ పసికూనగా ఉన్నప్పుడు పార్వతీదేవి స్వయంగా తన స్తన్యమిచ్చి ఆ పిల్లవాని ఆకలి తీర్చింది. ఆ తరువాత నుంచి ఆ పిల్లవాడు అమిత జ్ఞానవంతుదై చిన్నతనం నుండే గొప్ప శివభక్తుడై శివతత్వాన్ని అందరకూ ప్రభోదిస్తూ కేవలం పదహారు సంత్సరాలు మాత్రమే జీవించి, తనువూ చాలించారు. అయితే, ఆ పదహారు సంవత్సరాల లోపునే అయన అనేక వేల కీర్తనలు రచించారు. అందులో దాదాపు నాలుగు వందల కృతులు.

పిల్లాడి రుద్రయ్య

Monday, June 12, 2023

శంకర నారాయణ డిక్షనరి కథ

శంకర నారాయణ డిక్షనరి కథ

 

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.
ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి....
వాడి భాష మనకి రాదు...
వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు.
మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది.
మనం "రాజమహేంద్రి" అన్నాం...
వాడికి "రాజమండ్రి"లా వినిపించింది.
మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు.
వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు.
చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కానీ అందరికీ అంత దృశ్యం ఉండేది కాదు. వీళ్లు ముక్కస్యముక్కానువాదం చేసేవారు.
గుడిమెట్ల బంగారయ్య అంటే .....  Temple steps golden father అని..
పత్తికొండ నాగప్ప అంటే  cotton mountain cobra father అని 
తోటకూర అంటే Garden to come  అనీ చిత్ర విచిత్రంగా అను"వధించే" వారు.
అలాంటి సమయంలో తెల్లోడి భాషను తెల్లోడి కన్నా తేటతెల్లంగా నేర్చుకుని, ధారాళంగా మాట్లాడేయడం అంటే మాటలు కాదు. ఇంకా ఇంగ్లండుకు పోయి ఉన్నత విద్య నేర్చుకోవడం వంటివి అలవాటు కాలేదు. అలాంటి రోజుల్లో తెల్లోడే తెల్లబోయేలా ఇంగ్లీషు మాట్లాడే వాడికి బోలెడంత డిమాండ్ ఉండేది.
అలాంటి వాడే మన నాయకుడు. ఆయన పేరు పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి. సొంతూరు నెల్లూరు. కానీ మద్రాసులో స్థిరపడ్డారు. తండ్రి రామానుజం చెట్టి నుంచి ఇంగ్లీషు నేర్చుకున్నారు. తండ్రిలాగానే దుబాషీ అయ్యారు. తండ్రి గంజాంలో రస్సెల్ అనే తెల్లదొరకు దుబాషీగా పనిచేసేవాడు. ఈయన విజయనగరం మహారాజా, జయపురం మహారాజా, పిఠాపురం, కొచ్చి, నూజివీడు జమీందారీ కుటుంబాల పిల్లలకు ఇంగ్లీషు చదువులు చెప్పారు. ఆ తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్కల మేస్టారుగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో పరీక్షాధికారిగా కూడా పనిచేశారు. అంటే తన జీవిత కాలంలో ఆయన తమిళనాడు రాజధాని మద్రాసు, ఒరిస్సాలోని గంజాం, జయపురం, మన రాష్ట్రంలోని విజయనగరం, పిఠాపురం, నూజివీడు, నెల్లూరు, కేరళలోని కొచ్చి లను సందర్శించాడన్న మాట. ఆ రోజుల్లోనే ఆయన ఉద్యోగాల కోసం ఊరు వదలిన మహాసాహసి అంటే అడ్వెంచరర్ అన్న మాట.
రాచబిడ్డలకు చదువులు చెబుతున్నప్పుడే ఆయన వారి సౌలభ్యం కోసం ఇంగ్లీషు పదాలు, వాటి తెలుగు అర్థాల జాబితాను తయారు చేశారు. తరువాత దాన్నే వ్యవస్థీకరించి తెలుగువాడు తయారు చేసిన తొలి ఇంగ్లీషు తెలుగు డిక్షనరీని తయారు చేశారు. అంతే కాదు ... ఆయన తమిళ - ఇంగ్లీషు, ఇంగ్లీషు - తమిళ డిక్షనరీలను కూడా తయారు చేశారు. 1900 ప్రాంతంలో తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ కూడా తయారు చేశారు.
తన అవసరం కోసం ఇంగ్లీషు వాడు తయారు చేసినవి కాకుండా మన అవసరం కోసం మనవాడు తయారుచేసిన మొట్టమొదటి డిక్షనరీలు ఇవేనేమో!
ఆయన తయారుచేసిన తెలుగు డిక్షనరీ 1897లో ప్రచురితమైంది. దాని పేరే శంకరనారాయణ డిక్షనరీ. అప్పటి నుంచీ ఇంగ్లీషు నేర్చుకోవాలనుకున్న వారందరికీ శంకరనారాయణ డిక్షనరీయే ఆధారమైంది. అందరికీ ఆధునిక వేదమైంది. ఆయన బతికుండగానే అయిదు ముద్రణలకు నోచుకుంది. ప్రతి ముద్రణకీ కొత్త పదాలు జోడయ్యాయి. ఆయన 1924-25 ప్రాంతంలో చనిపోయారు. ఆ తరువాత 1927 లో గిడుగు సీతాపతి గారు, 1951 లో చిలుకూరి నారాయణ రావు గారు, తరువాత వేదం లక్ష్మీనారాయణ గారు కొత్తకొత్త పదాలను జోడించారు. 1953 లో నారాయణ అయ్యర్ దీనిని పరిష్కరించారు. ఇలా 1897 నుంచి 1953 వరకూ పదకొండు సార్లు పునర్ముద్రణ పొందింది ఈ డిక్షనరీ. కోస్తా జిల్లాల్లో ఇప్పటికీ ఈ డిక్షనరీయే ప్రామాణికం. తరతరాల విద్యార్థులకు ఇది హస్త భూషణంగా నిలిచింది. అనుమానం వస్తే చాలు ఆ పుస్తకం తీస్తారు. అంత ప్రజాదరణ ఉంది ఈ డిక్షనరీకి. 2004 అక్టోబర్లో విజయవాడకు చెందిన విక్టరీ పబ్లిషర్స్ దీన్ని మళ్లీ ముద్రించారు. ఆగస్టు 2005 నాటికి మలి ముద్రణ అవసరమైంది. మళ్లీ 2006, 2007లలో పునర్ముద్రించాల్సి వచ్చింది. ఈ నిఘంటువు ప్రజాదరణకు ఇదే నిదర్శనం.
కోస్తా, తమిళనాడుల్లో ఆంగ్ల భాష నేర్చుకోవడంలో ఆయన పాత్ర అనన్యసామాన్యం. ఆయన పేరుతోనే ఆయన వ్రాసిన డిక్షనరీ పేరొందింది. ఇప్పటికీ శంకరనారాయణ డిక్షనరీ అంటే ప్రామాణికమే.
పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి ఇప్పుడు లేరు. ఆయన పోయి దాదాపు తొంభై ఏళ్లు దాటింది. కానీ లక్షలాది మంది విద్యార్థులు ఆంగ్ల పదం విషయంలో అనుమానం రాగానే "శంకరనారాయణను తీసి చూడు" అనుకుంటూ అప్రయత్నంగానే ఆయనను తలచుకుంటూనే ఉంటారు.

కామాఖ్య గుడి

కామాఖ్య గుడి


కమాఖ్య గుడి మెట్లు ఎక్కే టప్పుడు కుడి వైపు కాళీ పీఠం ఉంటుంది అక్కడ గర్భగుడి లో అమ్మవారు ఇలా ఉంటారు ఒకటిన్నర అడుగు ఎత్తు రాయి లాగా కనిపిస్తూ ఎప్పుడూ పువ్వులు వస్త్రాలతో కప్పి ఉంటుంది ఇక్కడ గుడి బయట  ఉండే చిన్న వరండాలో హోమం చేస్తుంటారు భక్తులు ఇక్కడ స్వయంగా పూజ చేసుకుని వెళ్ళచు అందువల్ల మద్యం మాంసం కూడా అక్కడ తెచ్చి పెట్టి పూజ చేసుకుని వెళ్తుంటారు..

ఇక్కడ ఫొటోలో చూస్తున్న విధంగా ఇది కాళీ యోని పీఠం అని ఇక్కడ పిలుస్తారట.. ఇక్కడికి రావడానికి ముందు మెట్లు ఎక్కడానికి ముందే కాళీ గుడి బైరావుడు ఉన్న మందిరం ఉంటుంది అక్కడ ఇలానే మూల స్తానం ఉంటుంది వెనుక పీఠం పైన కాళీ విగ్రహం ఉంటుంది..

తర్వాత మెట్లు ఎక్కే మొదట్లో చిన్నమస్త గుడి ఉంటుంది.. కొంచెం లోపలికి ఉంటుంది నిలువుగా ఒక 10 మెట్లు దిగితే చిన్నమస్త మూల స్థలం ఉంటుంది ఒక వస్త్రం కప్పిన రాతి పలకలాగా పువ్వులు తో కప్పబడి ఉంటుంది.. విగ్రహం ఏమి ఉండదు.. దారిలో కొండపైన భువనేశ్వరి గుడికి కూడా వెళ్ళాము అక్కడ కూడా అమ్మవారు చూడటానికి ఇలానే ఉంటారు.. ఇలాంటి ఒక కప్పబడి ఉన్న  మూర్తిని ముట్టికొనిస్తారు పూజారి ఉంటారు అక్కడ కూర్చోబెట్టి అర్చన చేస్తారు..

ఇంక కమాఖ్య గర్భ గుడిలోకి వెళ్లే ముందు ఒక సింహసం పైన అమ్మవారి 12 ఇంచెస్ విగ్రహం ఉంటుంది ముఖ దర్శనం అంటారు కమాఖ్య యొక్క కుంజికా రూపం లో అమ్మవారు చిన్న ఇత్తడి విగ్రహం ముఖం మటుకు కనిపిస్తుంది..

అక్కడ నుండి గర్భ గుడిలోకి వెళ్తే అక్కడ కూడా ఇప్పుడు పెట్టిన ఫోటో లో చూస్తున్న విధంగా ఒక చతురాకారం అందులో ఒకటిన్నర ఎత్తు రాతి   (మూర్తి) వస్త్రాలతో పువ్వులతో కప్పబడి ఉంటుంది, ఈ మూర్తికి ముందు చిన్న నీటి కాలువ ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదీ జలాన్ని మనపైన చల్లుతారు అమ్మవారి మూర్తిని ముట్టుకుని నమస్కారం చేసుకోవచ్చు, పక్కనే ఇంకో రెండు చిన్న మూర్తులు ఉంటాయి అవి లక్ష్మీ సరస్వతి గా ఇక్కడ కొలిస్తారు అవి ముట్టుకుని మొక్కుకోవచ్చు,  గర్భ గుడిలో చిమ్మ చీకటి ఉంటుంది ఒక రెండు దీపాలు వెలుగులో నే స్పష్టంగా దర్శనం చేసుకోవచ్చు..

ఇక్కడ ఎక్కడ అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ట చేసి ఉండవు. అన్ని మూల స్థానాలు ఇలానే ఒక రాయి కప్పబతి ఉన్నట్టు చతురాకారం లో ఉన్న పీఠంలో ఉంటాయి.. గర్భ గుడిలో యోని ఆకారం ఏమి ఉండదు అమ్మవారి శరీర భాగం పడిన భాగం ఒక చిన్న భాగం అది కూడా ఒక రాయిలగా ఉంటుంది అంతే.. అక్కడ అర్చకులు మటుకే పూజ చేస్తారు మద్యం మాంసం లాంటివి గర్భ గుడిలో కనిపించవు , బలులు అన్ని బయట ఇస్తుంటారు కానీ గర్భ గుడిలోకి ఎవరికి ఏది అనుమతి లేదు ఆకారం కనిపించని ఒక పవర్ స్టేషన్ లాగా ఉంటుంది చాలా కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. మీరు ఫోటోల్లో చూస్తున్నట్టు యోని ఆకారాలు అక్కడ ఎక్కడా గుడిలో ఉండవు . ఒకరు మన గ్రూవ్ లో అడిగిన సందేహం వల్ల వివరిస్తున్నాను..తల్లి యోని స్తానం పడిన ప్రాంతం కాబట్టి యోని పీఠం అంటారు కానీ అటువంటి ఆకారాలు అక్కడ ఉండవు..ఇటువంటి అపోహలు వదిలేయండి తెలియక చాలా మంది అలా అనుకుంటున్నారు అని అర్థం ఐయ్యింది..

అంబువాచి సమయంలో కూడా ఆ కనిపిస్తున్నవిధంగా ఉన్న మూల మూర్తి పైనే ఒక ఎర్రటి వస్త్రాలు కప్పుతారు మూడు రోజులు తర్వాత అది వేలంలో అమ్ముతారు ముందుగా అది కావాలి అనుకునే వారు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.. ఆ మూడు రోజులు అధికమైన శక్తిని ఆకర్షించే కేంద్రం ,రజస్వల  సమయం  కనుక ఆ శక్తి ఆ వస్త్రాన్ని అధికంగా ఉంటుంది.. ఆ వస్త్రాన్ని కొని బీరువాలో పెట్టుకుంటారు.. కొందరు చిన్న ముక్కలుగా చేసి చేతికి కట్టుకుంటూ ఉంటారు.. 

అంబువాచి సమయంలో గుడి మూడు రోజులు తెరవరు 3 రోజులు తర్వాతే దర్శనం, గుడి దగ్గర వరకు వాహనాలు అనుమతి ఉండదు చాలా దూరంలో వాహనాలు అపేసి ఇక్కడ ఈ మెల కోసం ఏర్పాటైన వాహనాలు లోనే అంబువాచి మెల జరిగే ప్రాంతానికి వెళ్ళాలి. అప్పుడు అక్కడ ప్రదక్షిణ చేయడానికి వస్తారు..జనం చాలా అధికంగా ఉంటారు..

మీరు ఆన్లైన్ చూసే కమాఖ్య పీఠం అన్ని గోహతి గుడివి కాదు

🌷శ్రీ మాత్రే నమః🌷

Friday, June 9, 2023

ముద్రలు - దోష నివారణ


ముద్రలు - దోష నివారణ

గ్రహాదిపతులను పూజ సమయమున ఆయా గ్రహదీపతుల కు ఇష్టమైన ముద్రలను ప్రదర్శించాలి. 

జప పూజాదుల సమయము నందు ఆయా ముద్రలను ప్రదర్శించి ఆయా గ్రహధిపతుల కరుణాకటాక్షములను, ప్రసన్నం చేసుకోవడానికి ముద్రలను ప్రదర్శిస్తూ వుంటారు. 

మన చేతుల్లో శక్తి ప్రవహిస్తూ ఉంటుందని, మన చేతికున్న ఐదు వేళ్ళూ ఐదు తత్వాలకు సంకేతమని అంటారు. 

బొటని వేలు అగ్నికి, 

చూ పుడు వేలు వాయువుకు, 

మధ్యవేలు ఆకాశం, 

ఉంగరం వేలు పృధ్వి, చిటికెనవేలు జలానికి సంకేతాలు గా చెప్తారు. 

ఈ ఐదు తత్వాల అసమతుల్యత వల్లనే వ్యాధులు వస్తాయని, వీటిని ఆత్మశక్తి, ముద్రల సాయంతో సరిచేయవచ్చని అంటారు లేకపోతే మందులు.

ఈ ముద్రలను రోజూ అరగంట సాధన చేస్తే చాలు.

బ్రహ్మదేవుడు చెప్పిన 108 ముద్రలలో 55 ముద్రలు మాత్రమే పూజలలో వినియోగించబడతాయి.

జపం,ప్రాణాయామం,ధ్యానమ, ఆసనాలు అన్నీ ముద్రలు లేకుండా చేస్తే చేసిన పూజ నిష్పలమంటారు.

*శిఖరిణీ ముద్ర*

ఈ ముద్ర సూర్యు గ్రహానికి ప్రీతికరమైన ముద్ర.

కుడిచేతిని పిడికిలిగా బిగించి బొటన వ్రేలిని మాత్రం నిటారుగా ఉంచితే శిఖరిణీ ముద్ర అంటారు.

*అర్ధధేను ముద్ర*

ఈ ముద్ర చంద్రునికి ప్రీతికరమైన ముద్ర.

ఎడమ,కుడి చేతుల అనామిక కనిష్ట వ్రేళ్ళు నిటారుగా కలిపి ,తర్జనీ మధ్యమాంగుళులను ధేనుముద్రగా వస్తే అర్ధధేను ముద్ర అవుతుంది.

*సమ్మీలిని ముద్ర*

ఈ ముద్ర కుజునికి ప్రీతికరమైన ముద్ర. 

రెండుచేతుల వ్రేళ్ళ కొసలను విడివిడిగా ఉంచి,అరచేతులను,అరచేయి మూలాన్ని ఒకటిగా కలిపితే సమ్మీలినీ ముద్రా అవుతుంది.

*కుండ ముద్ర*

ఈ ముద్ర బుధునికి, శివునికి, సరస్వతికి ప్రీతికరమైన ముద్ర.

కుడిచేతియొక్క అన్నీ వ్రేళ్ళను ఒకటిగా కలిపి కొంచెం లోపలి వైపుకు వంచి,రెండు అరచేతులను కుండ ఆకారంలో కలిపితే కుండ ముద్ర అవుతుంది.

*చక్రముద్ర*

ఈ ముద్ర గురునికి, విష్ణువుకి, శివునికి ప్రీతికరమైన ముద్ర.

ఎడమచేతి యొక్క నాలుగు వ్రేళ్ళు బ్రొటన వ్రేలు కాకుండా కుడిచేతి యొక్క నాలుగు వ్రేళ్ళ మధ్యగా పోనిచ్చి , రెండుచేతుల బొటన వ్రేళ్ళ చివరాలు ఒకటిగా కలిపి , రెండు బొటన వ్రేళ్ళను సాధకుని వైపు వ్యాపించినచో అది చక్రముద్ర అవుతుంది.

*శూల ముద్ర*

ఈ ముద్ర శుక్రునికి,శివునికి ప్రీతికరమైన ముద్ర.

కుడిచేతి యొక్క బొటనవ్రేలుతో మద్యవ్రేలును కొంచెం లోపలివైపుకు వంచి మిగతా మూడు వ్రేళ్ళ చివరలు ఒకటిగా కలిపితే శూలముద్ర అవుతుంది.

*సింహముఖి ముద్ర*

ఈ ముద్ర దుర్గాదేవికి, విష్ణువుకు, శనీశ్వరునికి ఇది ప్రీతికరమైన ముద్ర.

రెండు అరచేతులు ఒకటిగా కలిపి ఎడమచేతి 5 వ్రేళ్ళ కొసలు కుడి అరచేతిలో ఉంచి ,ఎడమచేతిని కొంచెం క్రిందికి జార్చినచో సింహముఖి ముద్ర అవుతుంది.

*భగముద్రా*

ఈ ముద్ర శివునికి, విష్ణువుకు, రాహువునికి ప్రీతికరమైన ముద్ర.

రెండు చేతివ్రేళ్ళను గోముఖాకారంలో చేసి చెవుల దగ్గర ఉంచితే భగ ముద్ర అవుతుంది.

*త్రిముఖ ముద్ర*

ఇది కేతువుకు, విశ్వేదేవతలకు, మాతృగాణాలకు ప్రీతికరమైన ముద్ర.

కుడిచేతి బొటనవ్రేలు,చూపుడువ్రేలు మధ్యవ్రేళ్ళ యొక్క చివరలు ఒకటిగా కలిపి,అనామిక కనిశ్తికాంగుళులను లోపలకుముడిస్తే త్రిముఖ ముద్ర అవుతుంది.

నవగ్రహ ముద్రలను దైనందిన పూజా కార్యక్రమాల్లో వినియోగించుకొనిన యెడల , నవగ్రహల అనుగ్రహం కలుగుతుంది.
🙏🌹

శ్మశానాల్లో స్త్రీలు అడుగుపెడితే ఏమవుతుందో తెలుసా..?

శ్మశానాల్లో స్త్రీలు అడుగుపెడితే ఏమవుతుందో తెలుసా..?


⚜ హిందూమతంలో చాలా ఆచారాలు ఉంటాయి.ఇందులో 16 సంస్కారాలకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తారు.అయితే పుట్టుక నుండి అంత్యక్రియల వరకు జరిగే ప్రతి ముఖ్యమైన సంస్కారాలు కూడా మొత్తం 16 అని చెబుతారు.ఇందులో ఆఖరి సంస్కారం " అంత్యక్రియలు" 

⚜ మొదటి సంస్కారం నుంచి 15వ సంస్కారం వరకు ప్రతి దాంట్లోనూ కూడా స్త్రీలు ప్రత్యక్షంగా అక్కడ ఉంటారు.అలాగే ఆ కార్యక్రమంలో పాల్గొంటారు.

⚜ కానీ అంత్యక్రియలకు మాత్రం స్మశాన వాటికకు పురుషులు మాత్రమే వెళ్తారు.
స్త్రీలను అక్కడికి అనుమతించరు.
ఇది ఎందుకు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది.

⚜ ఒక వ్యక్తి మరణించిన తర్వాత దహన సంస్కారాలు నిర్వహిస్తారు అయితే ఈ మధ్యకాలంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా స్మశానానికి వెళుతున్నారు.
మగపిల్లలు లేని తల్లిదండ్రులకు ఆడపిల్లలే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.కానీ హిందూ ధర్మం ప్రకారం స్త్రీలను స్మశాన వాటికల్లోకి అనుమతించకూడదు.

⚜ దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
పురుషుల కన్నా స్త్రీల మనసు సున్నితమైనది.
బాధని పురుషుడు గుండెల్లో దాచుకుంటే, స్త్రీలు మాత్రం ఏడుపు రూపంలో బయటకు వ్యక్తం చేస్తారు.
ఒక వ్యక్తి చనిపోయిన సమయంలో ఏడుస్తూ ఉంటారు.

⚜ అయితే శరీరాన్ని స్మశానానికి తీసుకు వెళ్లిన తర్వాత కూడా మహిళలు అక్కడికి వచ్చి రోదిస్తే ఆత్మకు శాంతి కలగదు.ఆ ఆత్మలు ఏడుపు విని ఈ ఆత్మలు కూడా  రోదిస్తాయట.

⚜ అలాగే చనిపోయిన వ్యక్తి చితిని తగలబెట్టినప్పుడు ఎముకలు నలిగే శబ్దం వస్తుంది.ఈ శబ్దాలకు మహిళలు, పిల్లలు భయపడతారు.అందుకే స్త్రీలు స్మశాన వాటికకు రాకపోవడమే మంచిది.

⚜ హిందూ విశ్వాసాల ప్రకారం చనిపోయిన వ్యక్తి కుటుంబంలోని పురుషులు తన వారుపోయిన సమయంలో కర్మలు చేసినప్పుడు గుండు చేయించుకుంటారు. అందుకే మహిళలు అంత్యక్రియలు చేయకూడదని చెబుతారు.స్మశాన వాటికలో దహన సంస్కరాలు చేసిన తర్వాత కొన్ని ఆత్మలకు శాంతి లభించదు..అవి అక్కడే తిరుగుతూ ఉంటాయి. అలాంటి ఆత్మలు స్త్రీల శరీరంలోకి సులువుగా ప్రవేశిస్తాయి.

అందుకే స్త్రీలను స్మశానంలోకి అనుమతించరు.

పిల్లాడి రుద్రయ్య

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS