Saturday, May 11, 2024

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం :

కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి. 

సుబ్రహ్మణ్య ఆలయ స్తుతి దర్శనం చేయాలి. షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య జననం జరిగిన కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయాలి. 

సంతానం లేని దంపతులు ఏడు ఆదివారాలు కుమారస్వామి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి.

ఎర్రని పుష్పాల మాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. 

కుజుని అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉండి కందిపప్పు బెల్లంతో చేసిన పదార్ధాలను నైవేద్యం పెట్టాలి. 

కార్యాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంచి ధూపదీప నైవేద్యములు సమర్పించి కార్యక్రమాలు ప్రారంభించాలి. 

మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుట చేయాలి. 

ఎర్రని వస్త్రాలను, ఎర్రని పండ్లను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం చేయాలి. 

స్త్రీలు ఎర్రని వస్త్రధారణ, పగడపు ఆభరణాలు ధరించి చేసి దుర్గాదేవిని పూజించుట, అమ్మవారికి ఎర్రని పూలను మాలలను సమర్పించి కుంకుమపూజ చేయాలి. దుర్గాదేవిని స్తుతించాలి. 

మంగళ వారాలు దుర్గాదేవి ఆలయదర్శనం చేసి ప్రదిక్షిణం చేసి స్తుతించి పూజించాలి. గణపతి స్తోత్రం చేయాలి. ఆంజనేయస్వామి దండకం స్తుతి చేయాలి. 

బలరామ ప్రతిష్ఠిత నాగావళీ నదీతీర పంచలింగాలను దర్శించాలి. 

మంగళ వారాలాలలో సింధూరవర్ణ ఆంజనేయ స్వామి దర్శనం, ప్రదిక్షిణం, స్తుతి చేయాలి. 

మంగళ వారం లేక కృత్తికా నక్షత్రం రోజున కుజుడికి శివాలయం లేక సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఏడు వేల కుజ జపం చేయించి ఎర్రని వస్త్రంలో కందిపప్పు మూట కట్టి దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. 

ఏడు మంగళవారాలు కుజుడికి ఉపవాసం ఉండి కుజ శ్లోకం డెబ్భై మార్లు పారాయణం చేసి ఏడవ వారం కందులు దానం ఇవ్వాలి. 

నానవేసిన కందులను బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 

కోతులకు తీపి పదార్ధములు పెట్టాలి, ఎర్రమి కుక్కకు ఆహారం పెట్టాలి. 

మంగళ వారం రాగిపళ్ళెంలో కందిపప్పు పోసి దక్షిణ తాంబూలాలతో యువకుడికి దానం ఇవ్వాలి.
.

అవధూత అంటే ఎవరు ? సన్యాసి అంటే ఎవరు ?



అవధూత అంటే ఎవరు ?
సన్యాసి అంటే ఎవరు ?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు :
అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటు గా వచ్చి వెళ్లి పోతూ ఉంటారు.
 సన్యాసం నాలుగు రకాలు ...

1. వైరాగ్య సన్యాసం :
వ్యర్ధమైన విషయం వినడం చూడటం పై ఆశక్తి తగ్గిపోతుంది .
 ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన  ఉండదు .
అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలౌతుంది.

2. జ్ఞాన సన్యాసం :
సత్ సాంగత్యం ద్వారా ,
లౌకిక వాంచలు తగ్గిపోయి
సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ ,
ఏది తనకు అంట కుండా వసిస్తూ ఉంటాడు .

౩. జ్ఞాన వైరాగ్య సన్యాసం :
సాధన ద్వారా , ధ్యానం ద్వారా
 అభ్యసించి తనకు తానూ అన్వయించుకుని నిత్య ఆనంద
స్దితిలో జీవిస్తాడు .

4. కర్మ సన్యాసం :
బ్రహ్మ చర్యము , గృహస్త , వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ ,
ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం .

ఈ సన్యాసులు ఆరు రకాలు :
1. కుటిచకుడు :
శిఖ, యజ్నోపవితము దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తీ మార్గంలో వసిస్తూ  అల్పాహారం తీసుకుంటూ ఉంటారు.
2. బహుదకుడు :
ఇతను రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాదాన చేస్తూ ఉంటారు
౩. హంస :
ఇతను జడధారియై కౌపినం ధరించి ఉంటాడు.
4. పరమహంస :
వెదుర దండాన్ని కలిగి , ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కోపినం మాత్రం ధరించి నిరంతర సాధన లో ఉంటారు .
5. తురియాతితుడు :
దేహాన్ని ఓ శవంలా చూస్తాడు .
6.అవధూత :
ఇతనికి ఏవిధమైన నిష్ఠ నియమాలు లేవు .జగత్ మిధ్య నేను సత్యం అంటూ ,
నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు. చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు. నాకు పాప పుణ్యాలు, సుఖ దుఖాలు లేవు, గర్వము మాత్సర్యము, దంభము, దర్పము, ద్వేషము, అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి అగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహరం అర్పణ చేస్తూ, దొరకని రోజు ఏకాదశి  దొరికిన రోజు ద్వాదశి అంటూ రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు. కర్మలు అన్ని క్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు ... ( నిర్వాణ షట్కానికి ప్రతి రూపం అవధూతల మరో రూపం)

సేకరణ
🌹🌹🌹🙏🙏🙏

Tuesday, May 7, 2024

జ్యోతిష్య ప్రియులకు,* *'బృహత్సంహిత ' లో ఏ నక్షత్రం వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పారో,

*జ్యోతిష్య ప్రియులకు,*
*'బృహత్సంహిత ' లో ఏ నక్షత్రం వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పారో, ఇక్కడ గమనిద్దాం*:

౧. అశ్విని : చక్కని రూపం, దక్షత కలిగిన వారు, నీతివంతులు, ప్రియభాషనులు.
౨. భరణి : దృడ నిశ్చయులు , సుఖవంతులు, సత్యవ్రతులు, ఆరోగ్యవంతులు.
౩. కృత్తిక : ప్రక్యతులు, తేజస్సులు.
౪. రోహిణి : సత్యవంతులు, శుభ్రత, ప్రియంవద, స్దిరమతి , సురూప.
౫. మృగశిర : చపలులు, ఉత్సాహవంతులు, చతురులు, భోగులు, భీకరులు.
౬. ఆరుద్ర : గర్వితులు, కృతఘ్నులు, అయిన వారిని ప్రేమించే వారు.
౭. పునర్వసు : మంచి స్వభావం కలవారు, అల్ప సంతుష్టులు , రోగులు.
౮. పుష్యమి : శాంతస్వభావం కలవారు. పండితులు, ధర్మ పరాయణులు.
౯. ఆశ్లేష : సర్వ భక్షకులు, కృతఘ్నులు, అమాయకులు , సున్నితత్వం కలవారు.
౧౦. మాఘ : భోగులు, ధనవంతులు, పిత్రు భక్తులు, మహొద్యమ కారులు.
౧౧. పూర్వఫల్గుణి : ఎప్పుడు ప్రియ వచనములు పలుకు వారు. దాతలు, ద్యుతిమానులు, రాజసేవకులు.
౧౨. ఉత్తరఫల్గుణి : భోగులు, సుఖములు కలవారు, విద్య ప్రాప్తి కలవారు.
౧౩. హస్త : ఉత్సాహవంతులు , చోర స్వభావం కలిగి ఉంటారు.
౧౪.చిత్త : మీననేత్రులు. గడసరులు.
౧౫. స్వాతి : కృపాళులు , ప్రియ వాక్కు కలవారు, ధర్మశ్రితులు .
౧౬. విశాఖ : ఈర్ష బుద్ధి కలవారు. ద్యుతులు, మాన్యవచనులు.
౧౭. అనురాధ : విదేశీ యానం కలవారు, ధర్మాత్ములు.
౧౮. జ్యేష్ఠ : పలువురు మిత్రులు కలవారు, సంతృప్తి కలవారు, కోప స్వభావం కలవారు.
౧౯. మూల : లక్ష్మి పుత్రులు , సుఖపడువారు, స్ధిర మనసు కలవారు.
౨౦. పూర్వషాడ : సౌహర్ర్ధ హృదయం కలవారు, ఇష్ట పూర్వకంగా పని చేయువారు, కళలను ఇష్టపడు వారు.
౨౧. ఉత్తరాషాడ : ధార్మికులు, బహు మిత్రులు కలవారు, కృతజ్ఞత కలిగిన వారు .
౨౨. శ్రవణం : ఉదార స్వభావం కలవారు, ఖ్యాతి పొందేడివారు , ధనవంతులు.
౨౩. ధనిష్ట : దాతలు, ధన లబ్దము కలిగిన వారు, సంగిత ప్రియులు.
౨౪. శతభిషం : సాహసికులు, కోప స్వభావం కలవారు, వ్యసన పరులు.
౨౫. పూర్వాభాద్ర : సంతోషమును తృప్తిగా అనుభవించలేని వారు, ధనవంతులు, దాతలు.
౨౬. ఉత్తరాభాద్ర : ఎక్కువ సంతానం కలవారు, ధార్మికులు, జితశత్రులు , వక్తలు.
౨౭.రేవతి : శూరులు, శుచివంతులు, సుభగులు, సంపూర్ణంగులు కలవారు.
*ఫార్వర్డ్ మెసేజ్*

Sunday, May 5, 2024

రుద్ర నమకం చమకం అంటే ఏమిటి?

రుద్ర నమకం చమకం అంటే ఏమిటి?

"రుద్రం, నమకం, చమకం అంటే ఏమిటి?" - ఇది చాలా పెద్ద సమాధానం అవుతుంది.

రుద్రం గురించిన వివరాలు వీలైనంత క్లుప్తంగా వ్రాస్తాను. విభాగాలకు ఉప శీర్షికలు పెట్టాను. కనుక ఓపిక లేని వారు ఎంత కావాలో అంతవరకే చదువుకోవచ్చు.

శ్రీ రుద్రాన్ని ప్రత్యేకించి ఒక ఉపనిషత్తుగా భావిస్తారు కొందరు. దీనినే 'శత రుద్రీయం' అని కూడా అంటారు. ఇందులో నమకం మరియు చమకం అని పిలువబడే రెండు స్తోత్రాలు కలిసి ఉంటాయి. నమకంలో, ప్రతి మంత్రం "నమః" లేదా నమస్కారయుతమైన పిలుపుతో ప్రారంభమవుతుంది. చమకంలో ప్రతి మంత్రమూ "చ మే" అనే పద బంధాన్ని కలిగి ఉంటుంది, అంటే 'మరియు నేను' లేదా 'నాతో' అని అర్థం.

కృష్ణ యజుర్వేద తైత్తిరీయ సంహితలోని 4 వ కాండ, 5వ ప్రశ్నలోని 11 అనువాకాలలో మొత్తం 167 మంత్రాల నమకంతో బాటు, అదే కాండలో 7వ ప్రశ్నలోని 11 అనువాకాల చమకంను కలిపి 'శ్రీ రుద్రం' అంటారు. శ్రీ రుద్రంలో పేర్కొన్న రుద్రుడు ఋగ్వేదంలో చెప్పబడిన సాధారణ వైదిక దేవత కాదు. సర్వోన్నతుడైన భగవంతుడు. అనేక రూపాలలో అతని సర్వ వ్యాపకత్వం, సర్వ శక్తిత్వం, సర్వజ్ఞత, ఒక స్థాయి నుండి మరో ఉన్నత స్థాయికి విశ్వాన్ని నిరంతరం పరిణామం చెందేలా శాసించే ఈశత్వం వంటివి వర్ణించబడినాయి.

ప్రపంచంలోని మత పరమైన సాహిత్యంలో ఈ రకమైన స్తోత్రం బహుశ ఇది ఒక్కటే అనిపిస్తుంది. ఈ స్తోత్రాలలో దైవం అనే భావన కేవలం ఆహ్లాదకరమైన, శుభకరమైన విషయాలతో మాత్రమే కాకుండా భయానకం, విధ్వంసం వంటి విషయాలతో కూడా సంబంధించి ఉంటుంది. అంటే, సాధారణంగా భక్తులు అనైతికంగా భావించే అంశాలతో సహా, దేవుడు ప్రతి చోటా, ప్రతి దానిలోనూ వ్యాపించి ఉంటాడని ఈ మంత్రాలు చెబుతాయి.

శ్రీ రుద్ర నమకంలోని 11 అనువాకాలనూ కలిపి 11 పర్యాయాలు పారాయణం చేస్తే ( 112
= 121 పర్యాయాలు) దాన్ని "రుద్ర ఏకాదశి" అని, రుద్ర ఏకాదశిని 11 సార్లు పారాయణం చేస్తే ( 113 = 1331 పర్యాయాలు) "మహా రుద్రం" అని, మహా రుద్రాన్ని 11 సార్లు పారాయణం చేస్తే ( 114

= 14641 పర్యాయాలు) దాన్ని "అతి రుద్రం" అని అంటారు.

రుద్ర మంత్రాల గురించి వివరాలు:

రుద్రుని ఋగ్వేదంలో, యజుర్వేదంలో కూడా అతడి శౌర్యం, అతడి శక్తివంతమైన బాణాలు, విల్లులు, అతడి స్వస్థత చేకూర్చే శక్తి, మానవులను పాపాలు, దుఃఖాల నుండి తరింపజేసే సామర్థ్యం గురించి ప్రశంసించారు. యజుర్వేదంలోని రుద్రం(నమకం) లో 1, 10, 11 అనువాకాల్లో వివిధ ఛందాల్లో 37 ఋక్కులు, అనువాకం 2 నుండి 9 వరకు, ఇంకా 11వ అనువాకంలోని చివరి మంత్రం కలుపుకొని మొత్తం 130 యజుస్సులు ఇంకొన్ని అదనపు మంత్రాలు కలిసి ఉన్నాయి. మొత్తం రుద్ర ప్రశ్నకు ఋషి రుద్ర భగవానుడు, కాండ ఋషి అగ్ని, చంధస్సు లహవిరాట్, దేవత చంబు. ఇది కాకుండా, వివిధ ఋక్కులకు వాటి వాటి స్వంత ఋషులు, ఛందస్సులు, దేవతలు ఉన్నారు. యజుస్ భాగంలో 2 వ అనువాకం నుండి 4వ అనువాకం వరకు ఉన్న మొదటి 47 యజుస్సులు ప్రారంభంలో, అంతంలో "నమః" అనే పదాన్ని కలిగి ఉన్నాయి. 5 నుండి 9 వరకు ఉన్న మిగిలిన అనువాకాలలోని యజుస్సులు "నమః" తో మొదలవుతాయి కానీ "నమః" తో ముగియవు.

రుద్రం యొక్క ప్రశస్తి:

అభ్యాస వనరులలో వేదాలు అత్యున్నతమైనవి. వేదాలలో రుద్ర ప్రశ్న సర్వోన్నతమైనది. రుద్రంలో పంచాక్షరి మంత్రమైన "నమశ్శివాయ" అన్నది అత్యున్నతమైనది. ఆ మంత్రంలోని "శివ" అనే రెండు అక్షరాల పదం అత్యున్నతమైనది అని వేద పండితులు చెబుతారు.

రుద్రం లేదా నమకం యొక్క సారాంశం:

మొదటి అనువాకం రుద్రుని దయను కోరుతుంది. 2 నుండి 9 వరకు ఉన్న అనువాకాల్లో, అతడు అత్యున్నత దైవంగా నమస్కరించబడ్డాడు. 10వ అనువాకంలో, అతన్ని వివిధ వరాల కోసం ప్రార్థించారు. 11వ అనువాకంలో, రుద్రుని యొక్క వివిధ అభివ్యక్తులను ప్రార్థించారు.

*** సమాధానం ఇప్పటికే బోరు కొట్టి ఉంటే ఇక్కడితో చదవడం ఆపేయవచ్చు. క్రింద ఇచ్చిన అదనపు వివరాలు చదవకపోయినా విషయం అర్థమైనట్లే***

రుద్ర నమకం వివరాలు క్లుప్తంగా:

మొదటి అనువాకంలో రుద్రుని భయంకరమైన కోప తీవ్రతను వర్ణిస్తూ శాంతించమని కోరే 15 మంత్రాలు ఉన్నాయి. భక్తుని పాపాలు నశింప జేయగల దేవుని దయ కోసం, జ్ఞానం కోసం ప్రార్థనలు ఉన్నాయి. ఇందులోని 3 వ మంత్రాన్ని "రుద్ర గాయత్రి" అని పిలుస్తారు, ఇది చాలా మందికి తెలియదు.

రెండవ అనువాకంలో 13 యజుస్సులు ఉన్నాయి. మధ్యలో శ్వాస తీసుకొనే వ్యవధానం కూడా లేనంత వేగంగా ఉచ్చాటన చేసే ఈ మంత్రాలు (9 వ అనువాక వరకు అదే టెంపో ఉంటుంది) రుద్రుని విశ్వ రూపాన్ని వర్ణిస్తాయి.

మూడవ అనువాకంలో 17 యజుస్సులు ఉన్నాయి. రుద్రుని వివిధ రూపాలు, రకరకాల ఉపాధులలో ఉన్న రుద్రుని లక్షణాలను వర్ణిస్తాయి.

నాల్గవ అనువాకంలో కూడా 17 యజుస్సులు ఉన్నాయి. ఇవి రుద్రుని యొక్క రెండు తీవ్రమైన వైరుధ్యం గల రూపాలను వర్ణిస్తాయి. అతడు ఉన్నతుడు మరియు శుభంకరుడు, కానీ అదే సమయంలో హీనుడు మరియు నీచుడు. అంతేగాక అతడు కళాకారుడు అన్ని రకాల పనులలోనూ నేర్పరి అని చెబుతాయి.

ఐదవ అనువాకంలో 15 యజుస్సులు ఉన్నాయి. వీటిలో అతని ప్రత్యేక లక్షణాలు, ప్రవహించే నీటిలో అతని ఉనికి గురించిన వర్ణనలు ఉన్నాయి.

ఆరవ అనువాకంలోనూ 15 యజుస్సులు ఉన్నాయి, ఇవి సమయం, కాలం వంటి భావనలతో రుద్రునికి ఉన్న సంబంధాన్ని గురించి, వివిధ రకాల ప్రపంచాలలో, నాలుగు రకాల పుట్టుకల గురించి, అతని లోని యోధుని లక్షణాల గురించి, అతని సైన్యం గురించి తెలుపుతాయి.

ఏడవ అనువాకంలో 16 యజుస్సులు ఉన్నాయి. ఇవి రుద్రుడిని రాయబారిగా, దూతగా వర్ణించాయి. నిశ్చలమైన నీరు, వర్షం, తుఫాను, మేఘాలలో అతని ఉనికిని వివరించాయి.

ఎనిమిదవ అనువాకంలో 17 యజుస్సులు ఉన్నాయి, ఈ అనువాకాన్ని చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే దీనిలోనే "నమః శివాయ" అనే పంచాక్షరీ మంత్రం ఉంది, ఇంకా "శివతరాయ" అన్న మాట కూడా. అంటే ఇంతకన్న శుభప్రదమైన వాడు ఎవరూ లేదు అని అతనిని స్తుతిస్తుంది. అతడు ఉమతో కూడి ఉన్నాడు. అతడు రాగి మరియు సూర్యుడి వలె ఎరుపు రంగులో ఉన్నాడు. అతడు ఒక్కడే ఆనందాన్ని ప్రసాదించగలడు. అతడు భయంకరుడు మరియు భయానకమైనవాడు, అతడు పాపాలను అధిగమించే సాధనం, మొదలైనవి ఈ అనువాక వర్ణిస్తుంది. రుద్రుడు కేవలం శివుడు మాత్రమే కాదు, శివతరమైన వాడు, శివతమమైన వాడు కూడా అని ఈ అనువాకం స్పష్టం చేస్తున్నది.

తొమ్మిదవ అనువాకంలో 19 యజుస్సులు ఉన్నాయి. రుద్రుడు సర్వవ్యాపి అని వర్ణిస్తాయి. అతడు అడవులు, పర్వతాలు, ఎడారులు, గడ్డి మైదానాలలోనూ ఉన్నాడు. ఆయనను ప్రార్థించినప్పుడు అతడు భక్తుల వద్దకు వెంటనే వస్తాడు, ఎవరూ ప్రవేశించలేని గుహల్లో, లోతైన నీళ్ళలో, మంచు బిందువులలోనూ, కంటికి కనిపించే మరియు కనిపించని దుమ్ము కణాలలోనూ నివసిస్తాడు వంటి వర్ణనలు ఉన్నాయి.

పదవ అనువాకంలో 12 మంత్రాలు ఉన్నాయి. ఇవి మొదటి అనువాకంలోని ప్రార్థనలకు కొనసాగింపు వంటిది. మమ్మల్ని, మా పశువులను బాధించకు. గ్రామాన్ని ఎలాంటి హాని జరగకుండా కాపాడు. మమ్మల్ని రోగ విముక్తులను చేయగల మందులను అందించు. మమ్మల్ని సంతోషంగా ఉంచు. మాకు దీర్ఘాయువు ఇవ్వు. మా పిల్లలకు, మా యువ, వృద్ధ బంధువులకు హాని కలగకుండా చూడు. పినాకమనే నీ విల్లును ఒక ఆభరణంగా కైగొని, పులి చర్మం ధరించి, మా వద్దకు ప్రసన్న వదనంతో, దయగల మనసుతో రావాలని అభ్యర్థిస్తున్నారు.

పదకొండవ అనువాకంలో 10 ఋక్కులు, 1 యజుస్సు ఉన్నాయి. భూమి మీద, ఆకాశంలో, అంతరాళంలో ఇంకా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఎగువ దిక్కులలో నిండి ఉన్న రుద్ర గణాలను ప్రార్థిస్తున్నారు.
సేకరణ

హనుమాన్ సర్వస్వం పరాశర సంహిత నుంచి సేకరించిన సమాచారం ప్రశ్నలు జవాబులు

*🌹హనుమాన్ సర్వస్వం🌹*

*పరాశర సంహిత నుంచి సేకరించిన సమాచారం  ప్రశ్నలు జవాబులు.* 

🚩1) శ్రీ హనుమంతుని తల్లి పేరు?
జవాబు : అంజనా దేవి !
🚩2) హనుమంతుని తండ్రి పేరు?
జవాబు : కేసరి !
🚩3) కేసరి పూర్వ జన్మలో ఎవరు?
జవాబు : కశ్యపుడు !
🚩4) అంజన పూర్వ జన్మలో ఎవరు?
జవాబు : సాధ్య !
🚩5) హనుమంతుని జన్మ తిథి ఏది?
జవాబు : వైశాఖ బహుళ దశమి!

🚩 6) హనుమంతుని జన్మ స్థలం ఏది?
జవాబు : తిరుమల  - అంజనాద్రి.
🚩7) హనుమంతుని నక్షత్రము ?
జవాబు : పూర్వాభాద్ర నక్షత్రము.
🚩8) హనుమంతుని జనన లగ్నం  ?
జవాబు : కర్కాటక.
🚩9) హనుమంతుడు ఏ యోగం లో పుట్టాడు ?
జవాబు : వైదృవీయోగం లో 
🚩10) హనుమంతుడు ఏ అంశతో పుట్టాడు ?
జవాబు : ఈశ్వరాంశ 

🚩11) ఎవరి వరం వలన హనుమంతుడు పుట్టాడు ?
జవాబు : వాయుదేవుని వరం వలన.
🚩12)హనుమ జనన కారకులు ?
జవాబు : శివ,పార్వతులు, అగ్ని,వాయువులు.
🚩13) హనుమంతుని గురువు ?
 జవాబు : సూర్య భగవానుడు.
🚩14) హనుమంతుని శపించిన వారు ?
 జవాబు : భృగుశిష్యులు.
🚩15) హనుమంతునికి గల శాపం ?
 జవాబు : తన శక్తి తనకు తెలియకుండా ఉండడం.

🚩16) హనుమంతుని శాప పరిహారం ?
 జవాబు : స్తుతించినా,
నిందించినా తన శక్తి తను గ్రహించుట.
🚩17) హనుమంతుని బార్య ?
 జవాబు : సువర్చలా దేవి.

🚩18) సువర్చాలా దేవి మాతామహుడు ?
జవాబు : విశ్వకర్మ.

🚩19) హనుమంతుని మాతామహుడు ?
 జవాబు : కుంజరుడు.

🚩20)సువర్చల తల్లి పేరు ?
 జవాబు : సంజాదేవి, ఛాయాదేవి.

🚩21) హనుమంతుని బావమరుదులు ?
 జ : అశ్వనీ దేవతలు, శని,యముడు.

🚩22) హనుమంతుని వివాహ తేదీ ?
 జ : జేష్ఠ శుద్ధ దశమి.

🚩23) హనుమంతుని తాత, అమ్మమ్మ ?
 జ : గౌతముడు , అహల్య.

🚩24) హనుమంతుని మేన మామలు ?
 జ : శతానందుడు, వాలి, సుగ్రీవులు.

🚩25)హనుమంతుడు నిర్వహించిన పదవి ఏది ?
 జ : సుగ్రీవుని మంత్రి.

🚩26) హనుమంతుడు నిర్వహించిన పదవి స్థానం ఏది ?
 జ : ఋష్యమూక పర్వతం.

🚩27) శ్రీరాముని కలియుటకు హనుమంతుడు ఏ రూపం ధరించాడు ?
 జ : భిక్షుక రూపం.

🚩28) హనుమంతుడు శ్రీరాముని తొలుత చూసిన స్థలం ఏది ?
 జ : పంపానదీ తీరం .

🚩29)హనుమంతుని వాక్ నైపుణ్యాన్ని తొలుత మెచ్చింది ఎవరు ?
 జ : శ్రీరాముడు.

🚩30)హనుమంతుడు అగ్ని సాక్షిగా ఎవరికి మైత్రి గూర్చాడు ?
 జ : శ్రీరామ సుగ్రీవులకు.

🚩31)హనుమంతుడు వాలిని సంహరింపని కారణం?
జ : తల్లి అజ్ఞ.

🚩32)హనుమంతుడు లక్ష్మణుని కి ఆసనంగా వేసినది ?
 జ : చందన వృక్ష శాఖ.

🚩33)హనుమంతుని సంపూర్ణ చరిత్ర కలిగిన మహత్ గ్రంథం ?
 జ : శ్రీ పరాశర సంహిత.

🚩34)హనుమంతుని మేన మామలు వాలి సుగ్రీవుల భార్యలు ?
 జ : తార, రమ.

🚩35) చైత్ర మాసంలో హనుమత్ పర్వదినం ?
 జ : పుష్యమి నక్షత్రం గల రోజు.

🚩36) సీతా దేవి నీ వెతుకుటకు హనుమంతుడు నీ ఏదిక్కుకు పంపారు.?
 జ : దక్షిణ దిక్కు.

🚩37)వైశాఖ మాసంలో హనుమత్ పర్వదినం ఏ నక్షత్రం కలది ?
 జ : ఆశ్లేష నక్షత్రం.

🚩38) హనుమంతుడి ఆదేశం తో వానరులు ప్రవేశించిన గుహ ఎవరిది ?
 జ : స్వయంప్రభది.

🚩39) ప్రాయోప ప్రవేశ యత్నం లో ఉన్న అంగదాదులను భక్షించిన పక్షి ?
 జ : సంపాతి.

🚩40) సముద్ర లంఘనం కోసం హనుమంతుడు ఎక్కిన పర్వతం ?
 జ : మహేంద్ర పర్వతం.

🚩41)హనుమంతుడు దాటిన సముద్ర విస్తీర్ణము ?
 జ : 100 యోజనాలు.

🚩42)హనుమంతునికి అడ్డు వచ్చిన పర్వతం ?
 జ : మైనాకుడు.

🚩43)హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని తలచింది ఎవరు ?
 జ : సముద్రుడు.

🚩44) మైనాకుని హనుమంతుడు ఎం చేశాడు?
 జ : రొమ్ము తో తాకాడు.

🚩45) మైనాకుడు హనుమంతుడిని ఎల అనుగ్రహించాడు.?
 జ : చేతితో స్పృశించి.


🚩46)హనుమంతుని కి ఏర్పడిన 2 వ విఘ్నం ?
 జ : సురస.

🚩47) సురస ఏ జాతి స్త్రీ ?
 జ : నాగజాతి.

🚩48) సురస నుండి హనుమంతుడు ఏలా తప్పించుకున్నాడు.?
 జ : ఉపాయంతో.

🚩49) సురసను పంపిన దెవరు ?
 జ : దేవతలు.

🚩50) సురసను దేవతలు ఎందుకు పంపారు ?
 జ : హనుమంతుని శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు .

🚩51) హనుమంతునికి ఏర్పడిన 3 వ విఘ్నం ?
 జ : సింహిక.

🚩52) సింహిక హనుమంతుని ఎం చేసింది ?
 జ : నీడ పట్టి లాగింది.

🚩53) సింహిక వృత్తి ఎమిటి ?
 జ : లంకను కాపాడడం.

🚩54) హనుమంతుని చరిత్ర ఎవరితో చెప్పబడింది ?
 జ : శ్రీ పరాశర మహర్షి చే.

🚩55) హనుమంతుడు లంక లో ఏ ప్రాంతంలో వాలాడు.?
జ : సువేల పర్వత ప్రాంతం లో.

🚩56) హనుమ వెళ్లిన పర్వతం మొత్తానికి గల పేరు ?
 జ : త్రికూటాచలం.

🚩57) సువేల పై హనుమంతుడు ఎందుకు అగాడు ?
 జ : సూర్యాస్తమయం కోసం.

🚩58) లంకలోకి హనుమంతుడు ఎంత రూపంలో వెళ్ళాడు?
 జ : పిల్లి పిల్ల అంత వాడు అయ్యి.

🚩59) లంకా ప్రవేశ ద్వారం వద్ద హనుమను అడ్డగించింది ఎవరు ?
 జ :లంకిణి

🚩60)  లంకిణిని హనుమంతుడు ఎల కొట్టాడు ?
 జ : ఎడమ చేతి పిడికిలి తో.

🚩61) లంకలో హనుమంతుడు ఎలా ప్రవేశించాడు ?
 జ : ప్రాకారం దూకి.

🚩62) శతృపుర ప్రవేశంలో హనుమంతుడు పాటించిన శాస్త్ర నియమం ఎమిటి ?
 జ : ఎడమ కాలు ముందు పెట్టీ పోవడం.

🚩63) ఎవరిని చూసి హనుమంతుడు సీతగా బ్రమించాడు ?
 జ : మండోదరిని.

🚩64)హనుమంతుడు ప్రవేశించిన వనం ?
 జ : అశోక వనం.

🚩65) అశోక వనం ఏ పర్వతం పైన ఉన్నది ?
 జ : సుందర పర్వతం.

🚩66)లంకా నగరం ఏ పర్వతం పై ఉన్నది ?
 జ : నీల పర్వతం.

🚩67)శ్రీ హనుమత్ చరిత్ర అంతా పరాశర మహర్షి చే ఎవరికి చెప్పబడింది ?
 జ : మైత్రేయ మహర్షి కి.

🚩68)హనుమంతుడు అందించిన అద్భుత సందేశం ?
 జ : జీవనృద్రాణిపశ్యతి. -(బ్రతికి ఉండిన శుభములు బడయవచ్చు)

🚩69) సీతను హనుమంతుడు ఏ చెట్టు కింద చూచాడు ?
 జ : శింశుపా వృక్షము.

🚩70) సీతకు హనుమంతుడు ఆనవాలుగా ఏమిచ్చాడు ?
 జ : రాముడి ఉంగరం.

🚩71) హనుమంతునికి తన ఆనవాలుగా సీత ఎమి ఇచ్చింది ?
 జ : చూడామణీ.

🚩72)హనుమంతుడు అశోక వనం ద్వంసం అనంతరం ఏ రాక్షస వీరుని చంపారు ?
 జ : జంబుమాలిని.

🚩73) హనుమంతుని చేతిలో మరణించిన రావణ సుతుడు ఎవరు ?
 జ : అక్షయ కుమారుడు.

🚩74)హనుమంతుడు ఎవరికి బందీ అయ్యాడు ?
 జ : ఇంద్రజిత్తు నకు.

🚩75) హనుమంతుని రావణ దర్భారు లో ఎవరు ప్రశ్నించారు. ?
 జ : ప్రహస్తుడు .

🚩76) సముద్రం తిరిగి దాటడానికి ఆధారం చేసుకున్న పర్వతం ?
 జ : అరిష్ట పర్వతం.

🚩77) సముద్రం మొదట దాటడానికి ఎంత సమయం పట్టింది ?
 జ : 30 ఘడియలు.


.              *🚩జై శ్రీరామ్🚩*

Wednesday, May 1, 2024

నవగ్రహాలకి ఇష్టం లేని పనులు.

.

నవగ్రహాలకి ఇష్టం లేని పనులు.

అద్దం నకు చంద్రుడు కారణము. 
అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు.
సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువుని కించపరచితే గురు భగవానునికి అగ్రహము కలుగుతుంది.
 చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే బుధ గ్రహానికి సంబంధించిన దోషాలు ఏర్పడతాయి. బుధవారం అస్సలు చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన,జ్ఞానం ఉంది అని గర్వం ఉండరాదు.
పెద్దల్ని కించపరచిన, 
మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా తల్లితండ్రిని చులకన చేసినా, శని భగవానునికి ఆగ్రహం వస్తుంది.
సేవకా వృత్తి చేసే వారిని గౌరవించాలి.
పితృ దేవతలని దూషించడం,
సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చేస్తే రవి భగవానుడు మీ జాతకంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తారు.

భార్య/భర్త అగౌరవ పరుచుకున్నా, గృహంలో శుచి శుభ్రత లేకపోయినా, గొడవలు పడుతున్నా,శుక్ర భగవానుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తారు దీనివలన లక్ష్మీ కటాక్షం తగ్గుతుంది.

అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపము.
వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడు.
జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకాడిన, 
మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపము. జాతకంలో కేతువు వ్యతిరేక ఫలితాలను ఇస్తే పిశాచపీడ కలుగుతుంది. 
రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించినా, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగును. 
ఈయన భ్రమ మాయ కి కారణము.
-- 

Tuesday, April 30, 2024

శాస్త్రవేత్తలకే అంతుచిక్కని సైన్స్.... మహాభారతంలో ఏంటో 🤔చూద్దాం పదండి*

శాస్త్రవేత్తలకే అంతుచిక్కని సైన్స్.... 
మహాభారతంలో ఏంటో 🤔చూద్దాం పదండి*

👉మహాభారతం వ్యాసుడు రచించి 5,000 సంవత్సరాలు అవుతుంది. అని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.

*5 వేల సంవత్సరాలకు పూర్వం ప్రపంచంలో సంసృుతం తప్ప వేరే భాష లేదు. ఇప్పటికీ వేరే ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా గ్రంధాన్ని రచించడం గొప్ప విషయం.*

👉 మహాభారతం మించిన ఇతిహాసం, అంత సాహిత్యం ఇంకోటి రాలేదు, ఇంతటి *5000 సంవత్సరాల తర్వాత కూడా అంత గొప్ప సాహిత్యం వేరే ఏదీ రాకపోవడం విచిత్రం.*

👉 భారతం అప్పటి గొప్ప చరిత్రను తెలియజేస్తుంది, ఇప్పటికీ అందని *సైన్స్ కనుక్కొని విషయాలను ఎన్నో మనకు మహాభారతం చెపుతుంది. 

వాటిలో కొన్ని:

*👉మహాభారతంలోని ఆదిపర్వం లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.*

👉ముఖ్యంగా ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టుక వ్యాసుడు *నియోగ ధర్మం* ద్వారా అంబా, అంబాలిక లకు కనడం. దాసికి *విదురుడు జన్మించడం.*

*👉 ఇందులో ఏం విచిత్రం ఉంది అంటున్నారా?*

👉ఇక్కడ ముగ్గురికి పుత్రుల జన్మించడం జరిగింది మరి దీన్ని వ్యాసుడు ఎలా నిర్ణయం చేశాడు.
*1974లో  అయోవ యూనివర్సిటీలో *డోనాల్డ్ లాకె* అనే ఇద్దరూ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు, *స్త్రీ పురుష సంభోగ సమయంలో వారి మానసిక స్థితి లే బిడ్డ లింగాన్ని నిర్ణయిస్తాయి, అని ప్రపంచానికి తెలియజేశారు.*

👉నేడు మనం వాడే *స్పెర్మ్ డొనేషన్* ఆనాటి
*నియోగపద్ధతి ఒకటే.*

గాంధారి కుంతి పై అసూయతో తన గర్భంపై కొట్టుకోగా ఆ పిండం కింద పడింది.
👉 వ్యాసుడు వచ్చి ఆ పిండాన్ని 101 కుండల్లో ఆవు నెయ్యి నింపి, ఒక పద్ధతి ద్వారా దాచి ఉంచాడు, గాంధారిని ప్రతిరోజు వాటిని తాకమని చెప్పేవాడు, మాతృ తల్లి ప్రేమ స్పర్శ ద్వారా ఆ కుండలలోని పిండాలు బయట కూడా పెరిగాయి.

*👉 వీటిని నేటి ఆధునిక  వైద్యులు మూడు రకాలుగా విభజించారు.*

పిండాలను ముక్కలు చేయడం మెడికల్ భాషలో 1.*స్లైసింగ్ ఎంబ్రియో*

2.*ఆర్టిఫిషియల్ యూటర్నెస్* కృతిమ గర్భాన్ని పోలిన వాతావరణాన్ని నిర్మాణం చేయడం. 

3. *మదర్ టచ్*

*👉 టెస్ట్ ట్యూబ్ బేబీ లు గా పుట్టిన వారు -వశిష్ఠుడు, అగస్త్యుడు. ద్రోణాచార్యుడు , క్రుతుడు, కృపి. 

అనగా ఆ రోజులలోనే స్త్రీ బీజం నుంచి అండ కణాన్ని  సేకరించి , గర్భాశయం బయట చుట్టూ పోషకాల నుంచి వీర్యకణాలను వదలడం అనేది 5 వేల సంవత్సరాల క్రితమే తెలుసు అంటే ఆశ్చర్యమే కదా!

*👉 ద్రోణుడిని కుంభసంభవుడు అని అంటారు* అంటే ప్రత్యేకమైన కుండ లో పుట్టిన వాడు అని అర్థం.

ఇక శిఖండి పాత్ర:-
*Transgender*  *Trans sexual* *లింగ మార్పిడి*
మహాభారతం కాలం నాటికే ఇది ఉంది భీష్ముడిని చంపేందుకు అంబా శిఖండి గా మారింది. *మొదటి అడ పిల్లగా పుట్టి మగవాడి లక్షణాలు గల పాత్ర శిఖండి. ఇప్పుడూ మనం చెప్పుకునే *Transsexualism* ఇపుడు surgery లు చేసుకోవడం కూడా చూస్తున్నాం. ఒక యక్షుడు ఆమెకు *సైకియాట్రిక్ treatment చేయటం జరిగింది.* అడ పిల్లగా పుట్టి పూర్తిగా మగ వాడిలా మారడం.

*బృహన్నల పాత్ర:-
*Temporary Trans-sexualisum* ఇప్పటి మోడర్న్ సైన్స్ లో *hermaphroditism*
అంటారు. కొంతకాలం స్త్రీగా ఉండి పురుషుడు గా మారే ప్రక్రియ ఇది ఉర్వశి శాపం వలన అర్జునుడు అజ్ఞాతవాసంలో  శాపం ఆయనకు అదే మేలు చేసింది.

*ఇద్దరు తల్లుల గర్భంలో కొన్నాళ్ళు పెరిగిన బలరాముడు:-
యోగ మాయ ద్వారా *రోహిణి గర్భం లోకి మార్పు  చేయ బడిన ఎంబ్రీయో ద్వారా ఇది సాధ్య పడింది.

దీనికి నేటి సైన్సు వివరణ:-
*Effortless reciprocal IVF* అని ఈ మధ్య ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది మీరు గానీ *3 నవంబర్ 2018 ఈనాడు పేపర్* తీసి అందులో ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే అమెరికాలో ఇద్దరు యువతులు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వాళ్ళిద్దరికీ ఒక పిల్లవాడిని కనాలనిపించింది. కానీ ఇద్దరు యువతులే కదా ఎలా కంటారు, ప్రకృతి ఒప్పుకోదు కదా! 

కాని దీనిని *Bedford hospital in Texas* వాళ్ళు చేశారు.
IVF ద్వారా ఎంబ్రియో కొన్నాళ్లు ఒక తల్లి గర్భంలో మరికొన్నాళ్లు ఇంకో తల్లి గర్భంలో పెరిగిన బిడ్డనుకన్నారు.

*జరాసంధుడు పాత్ర*
జర అనే రాక్షసి చేత సంధి చేయబడ్డాడు కాబట్టి జరాసంధుడు అయ్యాడు.

ఈమధ్య మోడన్ మెడిసిన్ లో *Replantation surgery* యాక్సిడెంట్లు జరిగినప్పుడు వారి శరీరంలోని ఏదైనా ఒక భాగం తెగిపోతే దాన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి సర్జరీ చేస్తే ఆ తెగిపోయిన భాగాన్ని శరీరానికి అతికించవచ్చు దాన్ని  మళ్ళీ యదావిధిగా చేయవచ్చు.

*1962 లో బోస్టన్ లో తెగిన చెయ్యిని 
అతికించారు, award కూడా పొందాడు.*

*అర్జునుడు-  సమ్మోహన ప్రయోగించిన సమ్మోహనాస్త్రం మరొక విచిత్రం.  దీనిని ఉత్తర కుమారుడి తో పాటు కౌరవుల మీద యుద్దం చేసే సమయంలో తను ప్రయోగించిన విషయం మనకు తెలుసు. (నర్తనశాల సినిమాలో మనకు చూపించారు).

ఇలాటిదే మనకు 1770 లో Mesumer ద్వార వచ్చినా mesumerisum BV పట్టాభిరామ్, ఆంధ్రప్రదేశ్, PC సర్కార్ వాళ్ళు చేసి చూపారట.

*మహాభారత యుద్దం సమయంలో ఇలాటివే 
అనేక అస్త్ర, శాస్త్రాలూ ఉపయోగించారన్నది 
మనం చదివాము. 
ఉదా:- బ్రహ్మాస్త్రం,  నారాయణ అస్త్రం, పాశుపతాస్త్రం etc*

ఇలాటిదే ఆ మద్య world war లో 06-Aug-1945 హీరోషిమా నాగసాకి పై జరిపిన అణు విస్ఫోటనం*

👉  Physics సూత్రాలు 
*నాసతో విద్యతే బహో నా భావవన్ విద్యతే సతః* అంటే ఉన్నదాన్ని పూర్తిగా నాశనం చేయలేము, లేని దాని నుంచి పుట్టించలేం.

👉పదార్థం శక్తిగా మారుతుంది, 
శక్తి పదార్థంగా మారుతుంది. E=mc2

*👉 ఓపెన్ హైమర్ అణుబాంబు గురించి అడిగితే గీతా లో దివి సూర్య సహస్రశ్చ అనే శ్లోకాన్ని విదేశీయుడు వివరించాడు.*
ఆటంబాంబ్ విస్ఫోటనం తో సమానం శ్రీ కృష్ణుని విశ్వరూప సందర్శనం అంధుడైన  ధృతరాష్ట్రుడు 
ఈ విశ్వరూపన్ని చూసినట్టు మహాభారతం చెబుతోంది. అంటే అందులకు కూడా 
కనిపించెంత శక్తి అదీ. 

మహాభారతంలో *భారతీయులు 
ఇలాంటివి ఎన్నో చేసి చూపారు.  

ఆధునిక కాలంలో ఈ విదేశీయులు చేస్తున్నది 
వేల సం॥ క్రితమే మన పూర్వులు చేసారు.

*AA Garbosky scientists* హర్యానా లోని  అస్తిపంజరాలు సేకరించి వాటిలో *రేడియో యాక్టివిటీ* ఎంత ఉందో పరిశోధన చేశాడు
ఆశ్చర్యంపోయి ఇలా అన్నాడు. *మహాభారతంలో ఇప్పుడు మనం వాడే అన్నిటికంటే గొప్ప ఆయుధాలను వాడారు కానీ వాటిని అయోగ్యులకు తెలియకూడదు అని గుప్తంగా ఉంచారు అని చెప్పారు.*

*👉 మాక్రో, మైక్రో  వైజేశన్ శరీరం పెరగటం వరల్డ్ ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రచయిత ఆసిమ్మం కూడా వివరించారు, స్థూల పెద్ద, సూక్ష్మ చిన్న రూపం.*

*ఎందరో విదేశీయులు మహాభారతంలోని గుర్తించిన విషయాలను మనం గుర్తించలేకపోయారు. మన ఊహకు కూడా అందనంత సైన్స్ టెక్నాలజీ మన గ్రంథాల్లో ఉంది.*

*ఇలాంటి విషయాలను తెలుసుకోలేని అజ్ఞానులు అసలు మహాభారతంలో, పురాణాల్లో ఏముందండి అంతా ట్రాష్, పుక్కిటి పురాణాల్లో అని చెప్తారు ఇప్పుడు అలాంటి వారే పాశ్చాత్యులు చెప్తే నోర్లు వెళ్ళబెట్టి చూస్తారు.*

*మన న దౌర్భాగ్యం ఏంటంటే మన పురాణ ఇతిహాసాల పైన పాశ్చాత్యులు పరిశోధనలు చేసి వాటిని మేమే నూతనంగా కడుక్కున్నాము వాటిని అని నమ్మిస్తే మనం కూడా వారికి జైజైలు కోడుతున్నాము.*

*ఇప్పటికైనా ఆలోచిద్దాం భావితరాలకు* 
*మన పురాణ ఇతిహాసాలలోని*
*గొప్పదనాన్ని వివరింద్దాము.*
సేకరణ

అతిరథ మహారథులు..అంటే..ఎవరు..!

అతిరథ మహారథులు..అంటే..ఎవరు..!

అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం.
అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం
మనకు అర్థమవుతుంది.
అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు.
మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు.
ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.
యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి.
ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..

రథి,
అతిరథి,
మహారథి,
అతి మహారథి,
మహామహారథి.

1) రథి..💐
ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.
సోమదత్తుడు,
సుదక్షిణ,
శకుని,
శిశుపాల,
ఉత్తర,
కౌరవుల్లో 96మంది,
శిఖండి,
ఉత్తమౌజులు,
ద్రౌపది కొడుకులు -
వీరంతా..రథులు.

2) అతి రథి (రథికి 12రెట్లు)..💐
60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.
లవకుశులు,
కృతవర్మ,
శల్య,
కృపాచార్య,
భూరిశ్రవ,
ద్రుపద,
యుయుత్సు,
విరాట,
అకంపన,
సాత్యకి,
దృష్టద్యుమ్న,
కుంతిభోజ,
ఘటోత్కచ,
ప్రహస్త,
అంగద,
దుర్యోధన,
జయద్రథ,
దుశ్శాసన,
వికర్ణ,
విరాట,
యుధిష్ఠిర,
నకుల,
సహదేవ,
ప్రద్యుమ్నులు
వీరంతా..అతిరథులు.

3) మహారథి (అతిరథికి 12రెట్లు).💐
7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.
రాముడు,
కృష్ణుడు,
అభిమన్యుడు,
వాలి,
అంగద,
అశ్వత్థామ,
అతికాయ,
భీమ,
కర్ణ,
అర్జున,
భీష్మ,
ద్రోణ,
కుంభకర్ణ,
సుగ్రీవ,
జాంబవంత,
రావణ,
భగదత్త,
నరకాసుర,
లక్ష్మణ,
బలరామ,
జరాసంధులు
వీరంతా..మహారథులు.
4) అతి మహారథి (మహారథికి 12రెట్లు).💐
86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.
ఇంద్రజిత్తు,
పరశురాముడు,
ఆంజనేయుడు,
వీరభద్రుడు,
భైరవుడు -
వీరు..అతి మహారథులు.
రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు,
అటు ఇంద్రజిత్తు -
ఇటు ఆంజనేయుడు.
రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.

5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) .💐
ఏకకాలంలో 207,360,000
(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు,
దుర్గా దేవి,
గణపతి మరియు
సుబ్రహ్మణ్య స్వామి,
వీరంతా..మహామహారథులు.
మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం
హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ..యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు.
అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు .... లెక్కలకు అందని గొప్ప ధర్మం మన హైందవ ధర్మం.... _శవాల సమాధుల శ్మశానాలా మనకు సాటీ_!!!

Wednesday, April 10, 2024

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు


ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది
ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి ఉంటే అది గణేశుని విశేష అనుగ్రహం కలుగజేస్తుంది🙏

🙏సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.🙏

🙏క్షేత్రచరిత్ర,స్థలపురాణం🙏

🙏సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే.. వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ‘గణనాథుని’ రూపం కన్పించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్‌’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారిందని ప్రశస్తి.🙏

🙏ఈ బొజ్జ గణపయ్య.. ప్రమాణాల దేవుడయ్య!🙏

🙏కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు ‘కాణిపాకం’లో ప్రమాణం చేద్దామా? అని సవాల్‌ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది..!

🙏నిత్యం పెరిగే స్వామి🙏

🙏వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపచేయడం సాధ్యం కావడం లేదు.🙏

🙏కాణిపాకం శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి.🙏

🙏బ్రహ్మహత్యా పాతక నివారణార్థం:🙏

🙏స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట! అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.🙏

🙏దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు🙏

🙏మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు.🙏

🙏సర్పదోష పరిహారార్థం🙏

🙏వరదరాజస్వామి ఆలయ నిర్మాణంస్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికిగానూ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూలవిరాట్‌ ఆకారంలో సుందరశిల్ప కౌశల్యం ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తుంటారు.

🙏పంచామృతాభిషేకం టిక్కెట్‌ ధర: రూ. 550🙏

🙏సేవాఫలితం: స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయడం పుణ్యఫలం. ఈ సేవల్లో పాల్గొనడం వలన అన్ని కష్టాలు తొలగుతాయి.
గణపతి హోమం టిక్కెట్‌ ధర: 500🙏

🙏సేవాఫలితం🙏

🙏‘కలౌ చండీ వినాయకః’ అంటే ఈ కలియుగమున పిలవగానే పలికే దేవతలు.. చండి(దుర్గా), గణపతి. మన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలు, ప్రతి పనికి పోటీ, ఏదో ఒక ఆటంకం జరగవచ్చు. అన్ని విఘ్నాలను అధిగమించాలి. అంటే గణపతిని అగ్నియుక్తంగా పూజించాలి. స్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి.🙏

🙏గణపతి మోదకపూజ టిక్కెట్‌ ధర: 300
గణపతి పురాణంలో సహస్రనామాల్లో ‘మోదక ప్రియాయనమః’ అని ఉంది. మోదకం అంటే కుడుములు అని అర్థం. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్న ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయంలో గణపతి మోదక పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతారు.🙏

🙏సహస్ర నామార్చన, వ్రతపూజ టిక్కెట్‌ ధర: రూ. 150, రూ. 58🙏

🙏సేవాఫలితం🙏

🙏‘కలౌ గణేశ’ స్మరణామున్ముక్తి అన్న నానుడిని అనుసరించి స్వామివారికి 1008 నామాలు అర్పించడం వల్ల విశేషఫలం కలుగుతుంది.🙏

🙏మూల మంత్రార్చన టిక్కెట్‌ ధర: రూ. 300🙏

🙏సేవాఫలితం: దీనినే నారికేళ పూ అంటారు. వినాయకుని గణాధిపతిగా నియమించిన తర్వాత.. అక్కడ విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. వినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. విష్ణువు అడిగినా తిరిగి ఇవ్వలేదు. దీనికి బదులుగా ఏదైనా వరం కోరుకొమ్మని విష్ణుమూర్తి అంటే త్రినేత్రములు గల శిరస్సు కావాలని గణపతి కోరతాడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారికేళాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గణపతిని అవాహనం చేసి నారికేళంతో పూజిస్తే మహాగణపతి సంతుష్ఠి చెందుతారు. సకల విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి.🙏

🙏సంకటహర గణపతి వ్రతం టిక్కెట్‌ ధర: రూ. 151🙏

🙏సేవాఫలితం🙏

🙏గణేశ పురానంలో ఈ వ్రతానికి విశేష స్థానం కల్పించారు. దీన్ని శ్రీ కృష్ణుడు, బ్రహ్మదేవుడు తదితరులు ఆచరించారు. సంతానం, వ్యాపార అభివృద్ధి, సకల విఘ్నాలు తొలగడం, ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జయం కలగడానికి దీన్ని ఆచరిస్తారు.🙏

🙏పూలంగి సేవ టిక్కెట్‌ ధర: రూ. 1,000🙏

🙏వివిధ రకాలైన పుష్పాలను గర్భాలయం, అంత్రాలయం, అర్ధమండపం, స్వామివారికి విశేష పుష్పాలకంరణ చేస్తారు. రంగుల పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం, సౌభాగ్యం కలుగుతాయి.🙏

🙏అక్షరాభ్యాసం టిక్కెట్‌ ధర: రూ. 116🙏

🙏సేవాఫలితం: చదువుల తండ్రి వినాయకుడు. అలాంటి వినాయకుడి ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లల చదువులు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో నిత్యం అక్షరాభ్యాసం జరుగుతుంటుంది.🙏

🙏అన్నప్రాసన టిక్కెట్‌ ధర: రూ.116🙏

🙏సేవాఫలితం: పిల్లలకు అన్నప్రాసనం, విశిష్ఠరోజున చేస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుని ఆలయంలో అన్నప్రాసన చేయడం శుభం. ఇక్కడ అన్నప్రాసన చేయడం వల్ల పిల్లలకు జీవితంలో మంచి జరుగుతుంది. మొదటి పూజలు అందుకునే వినాయకుడి ఆలయంలో అన్నప్రాసన చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి.🙏

వివాహ ఆహ్వానపత్రికలకు పూజలు టిక్కెట్‌ ధర: రూ. 51🙏

🙏సేవాఫలితం🙏

🙏వివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు జరగకుండా ఉండాలని వినాయకుని చెంత పూజలు చేస్తారు. మొదటి వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి పూజలు చేస్తే విఘ్నాలు తొలగుతాయి.🙏

🙏వసతి & రవాణా సౌకర్యాలు🙏

🙏కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కి.మీ.లు.. తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలో ఉంది. అత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం కాకుండా.. అటు తిరుమల.. శ్రీకాళహస్తిల సందర్శనకు వెళ్తుంటారు కనుక.. కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువే. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చేయాలనుకుంటే.. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తితిదే ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయి. ఇటు జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి.

🙏తిరుపతి నుంచి.. చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు.. ప్రైవేటు వాహనాలూ విస్తృతంగా లభిస్తాయి. దగ్గరలోని రైలు.. విమాన మార్గ సదుపాయం అంటే.. తిరుపతినే ప్రధాన కేంద్రంగా చెప్పుకోవాలి.🙏

🙏ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లు పఠిస్తే చాలా మంచిది🙏ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి ఉంటే అది గణేశుని విశేష అనుగ్రహం కలుగజేస్తుంది🙏

🙏ఎంతటి కష్టాలైనా తొలగించే మహామహిమాన్వితమైన సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతిరోజూ కనీసం 4 సార్లు అయినా, 6 నెలలు పాటు భక్తి శ్రద్ధ, విశ్వాసాలతో పఠిస్తే గణేశుని విశేష అనుగ్రహం కలుగుతుంది🙏

🙏మనం ఏ కార్యం తలపెట్టినా, అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా, విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తాము. సకల సంకటాలనూ తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే, శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎవరికి వారు స్వయంగా, అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ప్రతీరోజూ ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి, గణేశ అనుగ్రహం పొందుదాం🙏

🙏ఈ సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతీరోజూ పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వలన అన్ని సంకటాలు తొలగిపోతాయి🙏

🙏సంకట నాశన గణేశ స్తోత్రము - సంపూర్ణ అర్ధము🙏

🙏నారద ఉవాచ🙏

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే 1 

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ 2 

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ 3 

నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ 4 

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః 5 

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ 6 

జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః 7 

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్౹౹
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః 8 

🙏ఇతి సంకట నాశన గణేశ సంపూర్ణం🙏

🙏దేవతలందరికంటే  ముందుగా పూజిపబడే వాడు, గౌరీ తనయుడు, విఘ్నాధిపతీ ఐన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధన ధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా  నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించెదను🙏

ప్రధమ నామం : వక్రతుండ (ఒంపు తిరిగిన తొండము కలవాడు)

ద్వితీయ నామం: ఏకదంత (ఒకే దంతము కలవాడు)

తృతీయ నామం: కృష్ణపింగాక్ష (ముదురు గోధుమ రంగు కన్నులవాడు)

చతుర్థ నామం: గజవక్త్ర (ఏనుగు ముఖము వంటి ముఖము కలవాడు)

పంచమ నామం: లంబోదరం (పెద్ద పొట్ట కలవాడు)

షష్టమ నామం: వికట (భారీ కాయము కలవాడు)

సప్తమ నామం: విఘ్నరాజా (విఘ్నాలను తొలగించేవాడు)

అష్టమ నామం: ధూమ్రవర్ణ (ముదురు గచ్చకాయ రంగు కలవాడు)

నవమ నామం: ఫాలచంద్ర (చంద్రుని శిరస్సుపై ధరించేవాడు)

దశమ నామం: వినాయక (విఘ్నములకు నాయకుడు)

ఏకాదశ నామం: గణపతి (దేవగణములకు అధిపతి)

ద్వాదశ నామం: గజానన (ఏనుగు ముఖము కలవాడు)

🙏ఈ ద్వాదశ (పన్నెండు) నామముల శ్లోకం భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వలన జ్ఞానము కోరుకున్నవారికి జ్ఞానము, ధనధాన్యములు కోరుకున్నవారికి ధనధాన్య వృద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునేవారికి పుత్ర సంతానము మరియు మోక్ష సిద్ధి కోరుకునేవారికి మోక్షము సిద్ధించును🙏

🙏ఈ సంకట నాశన గణపతి స్తోత్రం ఆరు మాసాలపాటు జపించినవారికి కోరిన ఫలములు లభించును. ఒక సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు🙏

🙏ఈ సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధలతో రాసి ఎనమండుగురు బ్రాహ్మలకు దానం చేసినయెడల ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములు సిద్ధించును🙏

🙏ఓం గం గణపతయే నమః

Tuesday, April 9, 2024

గృహ నిర్మాణం చేయవలసిన స్ధలం యొక్క ఎత్తు పల్లాలు ఫలితాలు ............!!

గృహ నిర్మాణం చేయవలసిన స్ధలం యొక్క ఎత్తు పల్లాలు ఫలితాలు ............!!


వాస్తులో ఎత్తు పల్లాలు(ఉచ్చ నీచలు) ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆధునిక కాలంలో ఎత్తు పల్లాలకు అధిక ప్రాదాన్యతను ఇస్తూ చాలా ఎక్కువగా చూస్తున్నారు. ఉచ్చ నీచల విషయంలో వివిధ గ్రంధాలలోని శాస్త్రజ్ఞుల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. 

“వాస్తు విద్య” అను వాస్తు శాస్త్ర గ్రంధంలో తూర్పు ఎత్తుగా ఉంటే పుత్రహాని, ఆగ్నేయం ఎత్తుగా ఉంటే ధన లాభం, దక్షిణం ఎత్తుగా ఉన్న మంచి ఆరోగ్యం, నైరుతి ఎత్తుగా ఉన్నచో స్త్రీ సౌఖ్యం, పడమర ఎత్తుగా ఉన్నచో ధన హాని, ఉత్తరం ఎత్తుగా ఉన్నచో రోగం, ఈశాన్యం ఎత్తుగా ఉన్న మహా రోగం కలుగును.స్ధలం యొక్క తూర్పుదిశ పల్లంగా ఉన్న అభివృద్ధినిస్తుంది. ఉత్తర దిశ పల్లంగా ఉన్న ఐశ్వర్యం, పడమర దిశ పల్లంగా ఉన్న ధనక్షయం, దక్షిణం పల్లంగా ఉన్న మరణం కలుగుతాయి. 

“అపరాజిత పృచ్ఛ” అను వాస్తు శాస్త్ర గ్రంధంలో స్ధలం యొక్క తూర్పుదిశ పల్లంగా ఉంటే ఆయుర్ధాయం, సంపద, బలం పెంపొందిస్తుంది. ఆగ్నేయదిశ పల్లంగా ఉన్న స్ధలం అగ్ని భయం, శత్రువుల వలన ఇబ్బందులు, పాప కృత్యాలను చేపిస్తుంది. దక్షిణ భాగం పల్లంగా ఉన్న స్ధలం రోగం, ధన హాని, పురుషులకు ఇబ్బందులు, దేవాలయం నిర్మించిన అభివృద్ధి ఉండదు. నైరుతి దిశ పల్లంగా ఉన్న స్ధలంలో ధనహాని, పురుషులకు దీర్ఘకాల వ్యాధులు, గృహ యజమానికి మృత్యుబాధలు ఉంటాయి. పశ్చిమ దిశ పల్లంగా ఉన్న ధన ధాన్యాదులను నశింపజేస్తాయి. వాయువ్య దిశ పల్లంగా ఉన్న స్ధలంలో శత్రుబాధలు, స్త్రీ సంతతి తక్కువ, ఎప్పుడు కలతలు, అజీర్ణ వ్యాధి, భయాలు కలుగుతాయి. ఉత్తరం పల్లంగా ఉన్న స్ధలంలో గౌరవం, పుత్ర పౌత్రాభివృద్ధి, ధన ధాన్యాభివృద్ధిని కలిగిస్తుంది. ఈశాన్యం పల్లంగా ఉన్న స్ధలం సౌఖ్యం, సౌభాగ్యం, ధన ధాన్యాలను, ధర్మాన్ని వృద్ధి చేస్తుంది. 

“జ్యోతిర్నిబంధం” అను గ్రంధంలో తూర్పు, పడమర దిశలు పొడవుగా ఉండి ఉత్తర, దక్షిణ దిశలు ఎత్తుగా ఉన్న స్ధలం “ నాగపృష్ట స్ధలం” అని పిలుస్తారు. ఇందు గృహ నిర్మాణం చేసిన భార్య, పుత్ర నష్టం కలిగించి శత్రు వృద్ధిని కలిగిస్తుంది. 

తూర్పు ఆగ్నేయ, ఈశాన్య దిశలు ఎత్తుగా ఉండి పశ్చిమదిశ పల్లంగా ఉన్న స్ధలాన్ని “దైత్య పృష్టమని” పిలుస్తారు. ఇందు గృహ నిర్మాణం చేసిన ధన నాశనం, పుత్ర నాశనం, పశు సంపద లేకపోవటం జరుగుతుంది. 

మధ్యభాగం ఎత్తుగా నుండి నాలుగు దిశలు పల్లంగా ఉన్న స్ధలం “ కూర్మ పృష్ట స్ధలమని” పిలుస్తారు. ఇందు గృహ నిర్మాణం చేసిన సుఖం, ధనం, ధాన్యం, ఐశ్వర్యం సంప్రాప్తిస్తాయి. 

దక్షిణ, పశ్చిమ, నైరుతి వాయువ్య దిశలు ఎత్తుగా ఉండి మిగిలిన దిశలు పల్లంగా ఉన్న స్ధలాన్ని “గజ పృష్టం” అని పిలుస్తారు. ఇందు గృహ నిర్మాణం చేసిన ఐశ్వర్యప్రాప్తి, ఆయువృద్ధిని కలిగిస్తాయి. 

“వాస్తు విద్య” అను గ్రంధంలో ఉచ్చ నీచల గురించి తూర్పు ఆగ్నేయ దిశల మధ్యభాగం పల్లంగా ఉన్న స్ధలం “పితామహవాస్తు” అంటారు. ఇది అశుభాలనిస్తుంది. 

దక్షిణ ఆగ్నేయ దిశల మధ్యభాగం ఎత్తుగా ఉండి వాయువ్య ఉత్తరాల మధ్య దిశల మధ్యభాగం పల్లంగా ఉన్న స్ధలాన్ని “సుపధ వాస్తు” అంటారు. ఇది సర్వకర్మలకు యోగ్యమైనది. 

ఉత్తర, ఈశాన్య దిశలు పల్లంగా ఉండి నైరుతి దక్షిణ దిశలు ఎత్తుగా ఉన్న స్ధలాన్ని “దీర్ఘాయుర్వాస్తూ” అంటారు. ఇది వంశాభివృద్ధిని కలిగిస్తుంది. 

ఈశాన్య, తూర్పు దిశలు పల్లంగా ఉండి నైరుతి, దక్షిణ దిశలు ఎత్తుగా ఉన్న స్ధలాన్ని “పుణ్యక వాస్తు” అంటారు. ఇది శుభకరమైనది. 

తూర్పు, ఆగ్నేయ దిశలు పల్లంగా ఉండి వాయువ్య పశ్చిమ దిశలు ఎత్తుగా ఉన్న “ఆపద వాస్తు” అంటారు. ఇది కలహాలను కలిగిస్తుంది. 

దక్షిణ, ఆగ్నేయ దిశలు పల్లంగా ఉండి వాయువ్య, ఉత్తర దిశలు ఎత్తుగా ఉన్న స్ధలాన్ని “రోగ కృద్వాస్తు” అంటారు. ఇందు గృహ నిర్మాణం చేసిన రోగాలను కలిగిస్తుంది. 

నైరుతి, దక్షిణ దిశలు పల్లంగా ఉండి ఉత్తర ఈశాన్యాలు ఎత్తుగా ఉన్న “ఆర్గళ వాస్తు” అంటారు. పాప కృత్యాలను చేయిస్తుంది. 

ఈశాన్య, తూర్పు దిశలు ఎత్తుగా ఉండి పశ్చిమ నైరుతి దిశలు పల్లంగా ఉన్న “శ్మశానవాస్తు” అంటారు. ఇది వంశ నాశనాన్ని కలిగిస్తుంది. 

ఆగ్నేయం పల్లంగా ఉండి నైరుతి, ఈశాన్య, వాయువ్య దిశలు ఎత్తుగా ఉన్న స్ధలాన్ని “శ్యేనక వాస్తు” అంటారు. ఇది నాశనాన్ని, మరణాన్ని కలిగిస్తుంది. 

ఈశాన్య ఆగ్నేయ పశ్చిమ భాగాలు ఎత్తుగా ఉండి నైరుతి దిశ పల్లంగా ఉన్న “శ్వముఖ వాస్తు” అంటారు. ఇది ఎల్లప్పుడు దారిద్ర్యాన్ని కలిగిస్తుంది. 

నైరుతి, ఆగ్నేయ, ఈశాన్య దిశలు ఎత్తుగా ఉండి వాయువ్య, తూర్పు దిశలు పల్లంగా ఉన్న స్ధలాన్ని “బ్రహ్మఘ్న వాస్తు” అంటారు. ఇది సర్వదా నింద్యమైనది. 

ఆగ్నేయ దిశ ఎత్తుగా ఉండి నైరుతి ఈశాన్య వాయువ్య దిశలు పల్లంగా ఉన్న “స్ధావర వాస్తు” అంటారు. ఇది వంశ నాశనం కలిగిస్తుంది. 

నైరుతి భాగం ఎత్తుగా ఉండి ఆగ్నేయ, వాయువ్య, ఈశాన్య దిశలు పల్లంగా ఉన్న స్ధలాన్ని “స్ధండిల వాస్తు” అంటారు. ఇది సర్వ నాశనం కలిగిస్తుంది. 

ఈశాన్య భాగం ఎత్తుగా ఉండి ఆగ్నేయ నైరుతి వాయువ్య భాగాలు పల్లంగా ఉన్న స్ధలం “శాండుల వాస్తు” అంటారు. ఇది అశుభాలను కలిగిస్తుంది.

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS