Friday, February 2, 2024

నవదిన_కాశీయాత్ర

నవదిన_కాశీయాత్ర 


కాశీలో 9 రోజులు ఎందుకు ఉండాలి ?
నవ దిన కాశీ యాత్ర అంటే ఏమిటి ?

మనిషి తల్లి గర్భం లో తొమ్మిది నెలలుంటాడు .
జన్మ రాహిత్యం ఇచ్చేది కాశి ఒక్కటే .
అందుకని వ్యాస మహర్షి కాశీ లో తొమ్మిది నెలలు దీక్ష లో ఉండి ,
అ తర్వాతా స్వగ్రామం చేరి మంచి రోజు చూసి పూజ చేయాలి అని చెప్పాడు . .

అయితే కలికాలం లో ఇంత శ్రద్ధ తో అంతకాలం ఉండలేమని ఇంకేదైనా ఉపాయం చెప్పమని సామాన్యులు  కోరారు .
దానికి అయన తొమ్మిది రోజులుంటే ఆ ఫలితం 
ఢోకా లేకుండా వస్తుంది అని చెప్పాడు .

మరి ఆ రోజుల్లో ఏం చెయ్యాలి ?
విశ్వేశ్వర నామ స్మరణ ,
దానాలు చేయటం ,
ధర్మ ప్రసంగాలు వినటం , ,
ఏక భుక్తం ,
ప్రాతఃకాల స్నానం ,
ఉదయం రాత్రి విశ్వేశ్వర దర్శనం ,
కోపం లేకుండా ఉండటం ,
అబద్ధమాడకున్డటం ,
అనే ఎనిమిది అంశాలు ఖచ్చితంగా 
అమలు చేయాలి.

మొదటి రోజు కార్యక్రమం
ఆగత్య మణి కర్న్యామ్తు –
స్నాత్వా దత్పధనంబహు –
వపనం కారయిత్వాతు –
స్నిత్వా శుద్ధాహ్ వయోవ్రతః
సచేల మభి మజద్యా ధ–
కృతా సంధ్యాధిక  క్రియాహ్
సంతర్ప్య తర్మ్యాద పిత్రూన్ –
కుశ గంధ తిలొదకైహ్’’

మొదటిగా మనసులో ముప్పది మూడు కోట్ల దేవతలు,
తీర్ధాలతో సర్వ పరివారంతో సేవింప బడుతున్న 
శ్రీ కాశీ విశ్వేశ్వరా !శరణు !అనుజ్ఞ !
అని స్మరించుకొని మణి కర్ణికా తీర్దానికి వెళ్ళాలి .
దీనినే చక్ర తీర్ధం అంటారు .
సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహా దేవుని సేవలో ఇక్కడ ధన్యమైనాడు 
శివుడికి పార్వతి తర్వాతా ఇష్టమైన వాడు విష్ణువే .
అందుకే ‘’నారాయణీ సహా చరయ నమశ్శివాయ ‘’అన్నారు .
విష్ణు సేవా ఫలితం గా ఏర్పడిన మణి కర్ణిక కు గొప్పదనాన్ని ఆపాదించాడు విశ్వేశుడు .

యాత్రీకులు మణి కర్ణిక లో స్నానం చేయాలి .
బ్రాహ్మణులకు దానాలు చేయాలి .
కేశ ఖండనం చేసుకొని ,
మళ్ళీ స్నానం చేయాలి .
మహేశ్వరాదులను అర్చించి మళ్ళీ స్నానం చేయాలి.
రుద్రాక్ష మాల ధరించి ఈకింది శ్లోకం చదువు కోవాలి

’కిము నిర్వాణ పదస్య భద్ర పీతం –
మృదులం తల్ప మదోను మోక్ష లక్స్యః
అధవా మణి కర్ణికా స్థలీ పరమానంద సుకాండ జన్మ భూమి
చరా చరేషు సర్వేషు-యావంతస్చ సచేతనః –తావంతిహ్ స్నాంతి మధ్యాహ్నే –
మణి కర్నీజతే మలే..
ఆ గంగా కేశవస్చైవ –
ఆ హరిన్ద్రస్చ మండ పాత్ –
ఆ మద్ధ్యా ద్దేవ సరితః స్వర్ద్వారా  న్మణికర్ణికా 
నమస్తే నమస్తే నమః‘’అని నమస్కరించి 
అక్కడ నుండి డుండి వినాయకుడిని దర్శించి ఇరవవై ఒక్క గరికలను ,
ఇరవై ఒక్క కుడుములను సమర్పించి ,
ఇరవై ఒక్క సార్లు గుంజీలు తీసి 
ఇరవై ఒక్క  రూపాయలు దక్షిణ గా సమర్పించాలి.

దున్దీ రాజ గణేశాన –
మహా విఘ్నౌఘనాశన –
నవాఖ్యాదిన యాత్రార్ధం –
దేహ్యాజ్ఞానం కృపయా విభో’’
అని ప్రార్ధించాలి .
తర్వాతా అన్నపూర్ణా దేవిని సందర్శించాలి 
ఆ తర్వాతా విశాలాక్షి ,జ్ఞాన వాపి ,
సాక్షి గణపతులను చూడాలి .
ఇది పూర్తీ చేసి నివాసం చేరి భోజనం చేయాలి 
రాత్రికి విశ్వనాదుడిని దర్శించాలి 
ఫలాలు పాలు ఆహారం గా గ్రహించాలి

 ‘’హర సాంబ హర సాంబ సాంబ సాంబ హరహర –హర శంభో హర శంభో –శంభో శంభో హరహర
మహాదేవ మహాదేవ విశ్వనాధ శివ శివ –
మహాకారి మహా కారి రక్ష రక్ష హరహర ‘’
అంటూ పద కొండు సార్లు భజన చేసి నిద్రపోవాలి .

రెండవ రోజు కార్య క్రమం 
రెండో రోజు ఉదయానే గంగా స్నానం చేసి విశ్వేశ్వర ,అన్నపూర్ణా దర్శనం చేయాలి .
మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణి కర్ణికా 
ఘట్టం లో స్నానం చేయాలి .
తీర్ధ శ్రాద్ధం  చేయాలి 
వెయ్యి సార్లు గాయత్రీ జపం చేయాలి .
గురు ఉపదేశం తో‘’శ్రీ కాశీ విశ్వేశ్వరాయనమః ‘’
అనే మంత్రాన్ని వెయ్యి సార్లు జపించాలి .
మధ్యాహ్నం విశ్వేశుని దర్శించి సాయంత్రం కూడా మళ్ళీ దర్శించాలి.
రాత్రి ఫలహారం చేసి పడుకోవాలి .

మూడో రోజు కార్యక్రమం
తెల్లవారక ముందే అసీ ఘాట్ లో సంకల్ప 
స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి .
తర్వాతా దశాశ్వ మేధ ఘాట్ కు చేరాలి 
దీనికి ‘’రుద్ర సరోవర తీర్ధం ‘’అనే పేరుకూడా ఉంది .
ఇక్కడ స్నానం చేసి శీతలాదేవిని దర్శించాలి .
వరుణా ఘాట్ కు వెళ్లి స్నానం చేసి 
ఆదికేశవ స్వామిని దర్శించాలి .
పంచనదీ తీర్ధమైన బిందు మాధవ ఘట్టం లో సంకల్ప స్నానం చేయాలి ‘
కిరణ ,దూత పాపాచ –
పుణ్య తోయా సరస్వతీ గంగాచ యమునాచైవ –పంచ నద్యోత్ర కీర్తితః ‘’
అని స్మరిస్తూ స్నానం చేయాలి .

తర్వాతా బిందు మాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి .
మణి కర్నేశుని ,సిద్ధి వినాయకుని దర్శించి పూజించాలి .
అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం కావించి నివాస స్థలం చేరి భోజనం చేయాలి .
రాత్రికి పాలు ,పండ్లు మాత్రమె స్వీకరించాలి .

నాల్గవ రోజు
ఉదయమే గంగా స్నానం విశ్వేశరుడి దర్శనం చేసి డుండి వినాయకుడిని చూసి దండ పాణి అయిన   కాల భైరవుని ,పూజించాలి 
కాశీ క్షేత్ర రాజ్యాన్ని మనసు లో స్మరించి ‘
’ఓం కాశ్యైనమః ‘’అని 36సార్లు అనుకోవాలి 
తర్వాతా బిందు మాధవుని దర్శించాలి .
గుహను ,భవానీ దేవిని దర్శించాలి 
ఇలా మధ్యాహ్నం వరకు తొమ్మిది దర్శనాలు చేసి మణి కర్ణిక చేరి మట్టి లింగాన్ని పూజించి 
మళ్ళీ అన్నపూర్ణా విశ్వేశులను దర్శించి 
భోజనం చేయాలి .
రాత్రి నామ స్మరణ పాలు ,పండ్లు ఆహారం .
అంటే ఈరోజు పది దర్శనాలన్న మాట

అయిదవ రోజు
ప్రాతః కాలమే  గంగా స్నానం చేసి ,
కేదారేశ్వరుని దర్శించి ,
అక్కడే రుద్రాభిషేకం నిర్వహించాలి .
తర్వాతా తిలా భాన్దేశ్వర ,
చింతా మణి గణపతిని సందర్శనం చేయాలి .
దుర్గా దేవిని చూసి ,ఒడి బియ్యం 
దక్షిణా సమర్పించి ,
గవ్వలమ్మ ను చేరి అదే విధంగా పూజ చేయాలి .
ఈమెనే కౌడీబాయి అంటారు .
అన్నపూర్ణా విశ్వనాధ దర్శనం చేసి ,
భోజనం చేసి రాత్రి పాలు ,పండ్లు తీసుకోవాలి

ఆరవ రోజు
సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం చేసి బ్రాహ్మణ ముత్తైదువులకు పూజ చేసి ఆశీస్సులు పొంది ,
వైధవ్యం ఎన్ని జన్మ లకైనా రాకూడదని 
దీవెనలు పొంది మూసివాయన చేటలదానాన్ని చేసి ,
బేసి సంఖ్యలో జనానికి  వాయనదానాన్ని చేయాలి .
వ్యాస కాశీ చేరి వ్యాసుని రామ లింగేశ్వరుని 
శ్రీ శుకులను దర్శించి ,
కాశీ వచ్చి అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేయాలి .
తర్వాత భోజనం చేయాలి .
రాత్రి సంకీర్తనతో కాల క్షేపం చేసి 
పాలు పండ్లను స్వీకరించాలి

ఏడవ రోజు
గంగాస్నానం ,నిత్య పూజా చేసి వెయ్యి గరిక లను ఏరి సిద్ధం చేసుకోవాలి .
దొరక్క పోతే నూట ఎనిమిదితో సరి పెట్టుకోవాలి .
ఇరవై  ఒక్క ఉండ్రాళ్ళను  ,
నూట ఎనిమిఎనిమిది యెర్ర పూలతో పూజించాలి .
ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదువులకు భోజనం పెట్టి తామ్బూలాలివ్వాలి .  

డుండి వినాయకుడిని అర్చించి ,
అన్నపూర్నాలయం లో కుంకుమ పూజ చేయించాలి .
అమ్మవారికి చీరా జాకెట్టు ,ఒడి బియ్యం ,గాజులు సమర్పించాలి .
ఇలాగే విశాలాక్షి కీ చేయాలి .
విశ్వేశునికి అభిషేకం చేయాలి .
సహస్ర పుష్పార్చ
సహస్ర బిల్వార్చన ,
హారతి ఇచ్చి తీర్ధ ప్రసాదాలను స్వీకరించాలి
హర సాంబ హర సాంబ అంటూ పదకొండుసార్లు జపం చేయాలి .

ఎనిమిదో రాజు
గంగాస్నానం నిత్యపూజా తర్వాతకాల భైరవుడిని దర్శించి వడలు ,పాయసం నివేదించాలి .
ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి .
ఆ రోజంతా కాల భైరవ స్మరణతో 
నిష్టగా గడపాలి
అయిదుగురు యతులకు ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకూ భోజనం పెట్టాలి.
దక్షిణా తాంబూలం సమర్పించాలి.
భోజనం చేసి రాత్రి కాలభైరవ స్మరణ చేస్తూ 
నిద్ర పోవాలి

తొమ్మిదో రోజు
గంగా స్నానం విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్నాదేవిని దర్శించి పూజించి ,
నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి .
జ్ఞానులైన దంపతులను పూజించి భోజనం పెట్టి దక్షిణలివ్వాలి 
ఆశీస్సులు పొందాలి .
రాత్రి  అన్నపూర్నాష్టం చేసి నిద్ర పోవాలి 

పదవ రోజు కార్య క్రమం : 

నవ దిన యాత్ర పూర్తీ చేసి పదవ రోజు 
గంగా స్నానం చేసి గంగను పూజించి 
సహస్రనామ పూజ చేసి ,
అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసి 
తలిదండ్రులను గురు దంపతులను పూజించాలి అందరి ఆశీర్వాదాలు పొంది ఇంటికి ప్రయాణమవ్వాలి.
ఇలా చేస్తే విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.

Thursday, February 1, 2024

తిధులు అధిపతులు

తిధులు.......!!
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి. శుక్లపక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమ వరకు 15, మరల కృష్ణపక్షంలో పాడ్యమినుండి అమావాస్య వరకు 15. మొత్తం 30 తిథులు. రవి చంద్రుల మధ్య దూరం 0 డిగ్రీ ఉన్నప్పుడు అమావాస్య, 180 డిగ్రీలు దూరమున్నప్పుడు పూర్ణిమ ఏర్పడుతాయి. చంద్రుడు, రవి నుండి ప్రతి 12 డిగ్రీలు నడిచినపుడు తిథులు మారతాయి.


తిధులు అధిపతులు

అగ్నిః ప్రతిపదః - పాడ్యమికి అగ్ని అధిపతి

బ్రహ్మా ద్వితీయాయాః - విదియకు బ్రహ్మ

పార్వతీ తృతీయాయాః - తదియకు పార్వతి

చతుర్ధాః గణపతిః - గణపతి చవితికి

పంచమ్యాః శేషః - పంచమికి ఆదిశేషుడు

కుమారః షష్ఠ్యా: - కుమారస్వామి షష్ఠికి

సూర్య: సప్తమ్యా: - సూర్యుడు సప్తమికి

శివోష్టమ్యా: - అష్టమికి సదాశివుడు

వసవ : నవమ్యా: - నవమికి అష్టవసుపులు

దిగ్గజా: దశమ్యా: - దిగ్గజములు దశమికి

యమ ఏకాదశ్యా: - ఏకాదశికి యమధర్మరాజు

విష్ణు : ద్వాదశ్యా: - ద్వాదశికి విష్ణువు

మన్మథ: త్రయోదశ్యా; - త్రయోదశికి మన్మధుడు

కలిపురుష: చతుర్దశ్యాః - చతుర్దశికి కలిపురుషుడు

చంద్ర: పౌర్ణమాస్యా: - పున్నమకు చంద్రుడు

అగ్నిష్వాత్తాదిపితర : అమావాశ్యా: - అగ్నిష్వాత్తు మొదలైన పితృ దేవలు అమావాస్యకు

క్రమాదధిపా: - క్రమముగా నధిపతులు,

ఉత్తమ తిధులు:- 11. శుక్ల ఏకాదశి,12. శుక్ల ద్వాదశి,13. శుక్ల త్రయోదశి,14. శుక్ల చతుర్దశి,15. పూర్ణిమ, 1. కృష్ణ పాడ్యమి,2. కృష్ణ విదియ,3. కృష్ణ తదియ,4. కృష్ణ చవితి,5. కృష్ణ పంచమి.

మద్యమ తిధులు:- 6. శుక్ల షష్ఠి,7. శుక్ల సప్తమి,8. శుక్ల అష్టమి,9. శుక్ల నవమి,10. శుక్ల దశమి, 6. కృష్ణ షష్ఠి7. కృష్ణ సప్తమి,8. కృష్ణ అష్టమి,9. కృష్ణ నవమి,10. కృష్ణ దశమి.

అధమ తిధులు:- 12. శుక్ల ద్వాదశి,3.శుక్ల తదియ,4.శుక్ల చవితి,5.శుక్ల పంచమి.11.కృష్ణ ఏకాదశి,12.కృష్ణ ద్వాదశి,13.కృష్ణ త్రయోదశి,14.కృష్ణ చతుర్ధశి,15.అమావాస్య.

సంకల్పతిధి;-ఒక రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఏ తిధి ఉన్నదో ఆ తిధినే ఆ రోజంతా సంకల్పానికి చెప్పాలి.ఒక రోజు సూర్యోదయానికి ఒక తిధి ఉండి మరుసటి రోజు సూర్యోదయం లోపల ఇంకొక తిధి వస్తే మొదటి తిధి ‘ఉపరి’రెండవ తిధి అని చెప్పాలి.

తిధి సంధి:-పంచమి,షష్ఠి లయొక్కయు,దశమి,ఏకాదశి ల యొక్కయు 4 ఘడియలు తిధిసంధి అనబడును.ఈ సంధిన జననమైన యెడల పితృగండం.
గండతిధి:-పూర్ణ తిధులలో చివరి 48 నిమిషాలు,నంధ తిదులలో మొదటి 48 నిమిషాలు తిధి గండాతాలు అవుతాయి.శుభకార్యాలు చేయరాదు.

పంచపర్వతిధులు :-అష్టమి,చతుర్ధశి,అమావాస్య,పౌర్ణమి,సూర్య సంక్రమణం ఉన్న తిధి పంచపర్వ తిధులు అంటారు.ఇవి శుభకార్యాలకు పనికిరావు.

పక్ష రంధ్ర తిధులు:-చవితి మొదటి 8 ఘడియలు,షష్ఠి మొదటి 9 ఘడియలు,అష్టమి మొదటి 14 ఘడియలు,నవమి మొదటి 25 ఘడియలు,ద్వాదశి మొదటి 10 ఘడియలు,చతుర్ధశి మొదటి 5 ఘడియలు.ఈ ఘడియలలో వివాహం చేయరాదు.మిగిలిన ఘడియలు శుభప్రధములు.

పితృకార్యములకు తిధి:-అహఃప్రమాణమును (పగటి ప్రమాణం)ను ఐదు భాగాలుగా చేస్తే అందులో మొదటిభాగం ప్రాతఃకాలం,రెండవ భాగం సంగమ కాలం,మూడవ భాగం మధ్యాన్నం,నాల్గవ భాగం అపరాహ్నం,ఐదోభాగం సాయంకాలం .ఏ తిధి మద్యాన్నం మించి అపరాహ్నం వరకు వ్యాపించి ఉన్నదో ఆ తిధి పితృకార్యములకు మంచిది.

RECENT POST

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.............!!  కుబేర మంత్రం : (ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యదీప్తాయै ధనధాన్య...

POPULAR POSTS