Wednesday, April 23, 2025

భైరవుని వివిధ పేర్లు

భైరవుని వివిధ పేర్లు:

అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. 
వివివరాలు:
అసితాంగ భైరవుడు:
శివుని యొక్క ఒక రూపం, ఇది సూర్యుడు, అగ్ని మరియు చంద్రుని శక్తిని కలిగినది.
రురు భైరవుడు:
భయంకరమైన మరియు కోపావేశం కలిగిన రూపం.
చండ భైరవుడు:
భయంకరమైన రూపం, ఇది శివుని యొక్క కోపావేశం మరియు శక్తిని సూచిస్తుంది.
క్రోధ భైరవుడు:
కోపం మరియు క్రోధానికి ప్రతీక.
ఉన్మత్త భైరవుడు:
ఉన్మాదంతో కూడిన రూపం, ఇది శివుని యొక్క విచిత్రమైన మరియు విపరీతమైన శక్తిని సూచిస్తుంది.
కపాల భైరవుడు:
కపాలం (శిరస్సు) ధరించిన రూపం, ఇది శివుని యొక్క అపారమైన శక్తిని సూచిస్తుంది.
భీషణ భైరవుడు:
భయానకమైన మరియు భయంకరమైన రూపం.
సంహార భైరవుడు:
సంహారం మరియు వినాశనం చేసే రూపం. 
భైరవుడు హిందూ మతం మరియు బౌద్ధ మతంలో పూజించే ఒక దేవుడు. శైవ మతంలో, అతను శివుని యొక్క శక్తివంతమైన అభివ్యక్తి లేదా అవతారం. కాశ్మీర్ శైవిజం సంప్రదాయంలో, భైరవుడు పరమ వాస్తవికతను సూచిస్తుంది, ఇది పరబ్రహ్మానికి పర్యాయపదంగా ఉంటుంది.

Sunday, April 13, 2025

అరుణాచల క్షేత్రానికి వెళ్లినప్పుడు గుడిలో ఏ నామాలను స్మరించాలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నిర్ణయించారు.

అరుణాచల క్షేత్రానికి వెళ్లినప్పుడు గుడిలో ఏ నామాలను స్మరించాలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నిర్ణయించారు. 


ఆ నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారు. 
అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో లేదా గిరి ప్రదక్షిణ లో ఈ నామాలతో పరమేశ్వరుని ప్రార్ధన చేస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతారు. 

ఇవి మొత్తం 89 నామాలు.
అరుణాచలం లో తప్పకుండా చదవ వలసిన శివ నామాలు

1) శోణాదీశుడు
2) అరుణా ద్రీశుడు
3) వాధీశుడు
4) జనప్రియుడు
5) ప్రసన్న రక్షకుడు
6) ధీరుడు
7) శివుడు
8.సేవకవర్ధకుడు
9) అక్షిప్రేయామృతేశానుడు
10) స్త్రీపుంభావప్రదాయకుడు
11) భక్త విఘ్నప్తి సంధాత
12) దీన బంధ విమోచకుడు
13) ముఖ రాంఘైంపతి
14 శ్రీమంతుడు
15) మృడుడు
16) ఆషుతోషుడు
17) మృగమదేశ్వరుడు
18) భక్తప్రేక్షణ కృత్
19) సాక్షి
20) భక్తదోష నివర్తకుడు
21) జ్ఞానసంబంధనాధుడు
22) శ్రీ హాలాహల సుందరుడు
23) ఆహవైశ్వర్య దాత
24) స్మర్త్యసర్వా ఘనాశకుడు
25) వ్యత్యస్తను త్యధ్వజధృక్
26) సకాంతి
27) నటనేశ్వరుడు
28) సామప్రియుడు
29) కలిధ్వంసి
30) వేదమూర్తి
31) నిరంజనుడు
32) జగన్నాధుడు
33) మహాదేవుడు
34) త్రినేత్రుడు
35) త్రిపురాంతకుడు
36) భక్తాపరాధ సోడూడు
37) యోగీశుడు
38) భోగ నాయకుడు
39) బాలమూర్తి
40) క్షమామూర్తి
41) ధర్మ రక్షకుడు
42) వృషధ్వజుడు
43) హరుడు
44) గిరీశ్వరుడు
45) భర్గుడు
46) చంద్రశేఖరావతంసకుడు
47) స్మరాంతకుడు
48) అంధకరిపుడు
49) సిద్ధరాజు
50) దిగంబరుడు
51) ఆరామప్రియుడు
52) ఈశానుడు
53) భస్మ రుద్రాక్ష లాంచనుడు
54) శ్రీపతి
55) శంకరుడు
56) స్రష్ట
57) సర్వవిఘ్నేశ్వరుడు
58) అనఘుడు
59) గంగాధరుడు
60) క్రతుధ్వంసి
61) విమలుడు
62) నాగభూషణుడు
63) అరుణుడు
64) బహురూపుడు
65) విరూపాక్షుడు
66) అక్షరాకృతి
67) అనాది
68) అంతరహితుడు
69) శివకాముడు
70) స్వయంప్రభువు
71) సచ్చిదానంద రూపుడు
72) సర్వాత్మ                               73) జీవధారకుడు
74) స్త్రీసంగవామసుభగుడు
75) విధి
76) విహిత సుందరుడు
77) జ్ఞానప్రదుడు
78) ముక్తి ధాత
79) భక్తవాంఛితదాయకుడు
80) ఆశ్చర్యవైభవుడు
81) కామీ
82) నిరవద్యుడు
83) నిధిప్రదుడు
84) శూలి
85) పశుపతి
86) శంభుడు
87) స్వాయంభువుడు
88) గిరీశుడు
89) మృడుడు

అరుణాచల శివ అరుణా చల శివ అరుణా చల శివ అరుణా చలశివ 🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

Saturday, April 12, 2025

మహామృత్యుంజయ మంత్రం అంటే ఏమిటి

మహామృత్యుంజయ మంత్రం      దయచేసి అందరూ పూర్తిగా చదవండి 

               
మహామృత్యుంజయ మంత్రం అంటే ఏమిటి? 
ఆ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ? 
అసలు ఈ మంత్రానికి అర్ధం ఏమిటి ? ఈ మంత్రం మరణాన్ని జయిస్తుందా ?

ఈ మంత్రంలో ఓం, త్ర్యంబకం, యజామహే, సుగంధిం, పుష్టివర్థనం, ఉర్వారుకం, మృతోర్ముక్షీయ, అమృతాత్ …
ఈ పదాలకు యెంత అద్భుతమైన , అమృతతుల్యమైన భావం ఉందో, 
శ్రీ ఆంజనేయ స్వామి వారు మృత్యుంజయులు ఎలా అయ్యారో తెలుసుకుందామా మరి…

మహా మృత్యుంజయ మంత్రంను “మరణం జయించే మంత్రం” లేదా “త్రయంబక మంత్రం” అని అంటారు. 
మహా మృత్యుంజయ మంత్రం రోగాలను నయం చేయుటలో అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటిగా భావిస్తారు. 
మహా మృత్యుంజయ మంత్రం శివుని గొప్ప మంత్రం. 

ఋషి మార్కండేయుల వారి ద్వారా సృష్టించబడిందని చెబుతారు. ఋషి మార్కండేయనిచే వ్యవహరించబడే ఒక రహస్య మంత్రంగా ఉంది. ఒకసారి చంద్రుడు దక్షరాజుతో నిందించబడి ప్రకాశం కోల్పోయాడు. అప్పుడు మార్కండేయడు ఈ మంత్రాన్ని ఇచ్చి కాపాడాడు.

” ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ “

ప్రతి పదార్ధం:

ఓం = ఓంకారము, శ్లోకమునకు గాని, మంత్రము నాకు గాని ముందు పలికే ప్రణవ నాదము; 

త్రయంబకం = మూడు కన్నులు గలవాడు; 

యజామహే = పూజించు చున్నాము;

సుగంధిం = సుగంధ భరితుడు;

పుష్టి = పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి ; 

వర్ధనం = అధికము / పెరుగునట్లు చేయువాడు / పెంపొందించు వాడు;

ఉర్వారుకం = దోస పండు;

ఇవ = వలె; 

బంధనాత్ = బంధమును తొలగించు;

మృత్యోర్ = మృత్యువు నుండి;

అమృతాత్ = అమృతత్వము కొరకు / అమరత్వము కొరకు;

మాం = నన్ను; 
ముక్షీయ = విడిపించు.

తాత్పర్యం: 

అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించు చున్నాము. ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినటుల (అంత సునాయాసముగా లేక తేలికగా) నన్ను (మమ్ము) అమరత్వము కొరకు మృత్యు బంధనము నుండి విడిపించు గాక!

ప్రాశస్త్యము:

మనకు ఉన్న, తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ “మహా మృత్యుంజయ మంత్రం” పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. 
క్షీర సాగర మథనంలో జనించిన హాలాహలాన్ని రుద్రుడు  దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. 
ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని పలువురి నమ్మకం. 

ఇది ఒక విధమైన మృత-సంజీవని మంత్రం అని చెప్ప వచ్చు. అంతేకాక ఆపదలు కలిగినపుడు కూడా దీనిని చదువుకో వచ్చును. సాధారణంగా ముమ్మారు గాని, తొమ్మిది మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు.

ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి 
ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు, మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.

ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది.

ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో “మూడు” కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలాధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది. 

ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాతఃకాలన్నే 𝟏𝟎𝟖 సార్లు, ప్రదోషకాలంలో 𝟏𝟎𝟖 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. 
ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది.

ఓం: 
భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుండి ‘ అ ‘ కారం. యజుర్వేదం నుండి ‘ ఉ ‘ కారం, సామవేదం నుండి ‘ మ ‘ కారాలు పుట్టి,ఆ మూడింటి సంగమంతో ‘ ఓంకారం ‘ ఉద్భవించింది.

ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది.

అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరచుకుని, యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి, పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మను స్మరించాలి.

త్ర్యంబకం: 

భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్ర్యంబక మంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్యంబకం అని కీర్తిస్తున్నాం.

యజామహే: 
అంటే ద్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ విష్పు ప్రచండ జ్వాలలకు సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి.

సర్వత్రా ఆర్తనాదాలు…హాహాకారాలు. సమస్తలోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి క్రుంగిపోయిన స్వామీ, హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్తలోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం.

సుగంధిం:
సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే, ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని ఆడగడు. 

చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవెరుస్తాడు.

పుష్టివర్థనం :
మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున్న ఆ స్వామి సర్వత్రా నెలకొని ఉన్నాడు. సృష్టియావత్తు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మనలను తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒకరోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగి పోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. 

ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది.

గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో, శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.

ఉర్వారుకం –ఇవ – బంధనం :
దోసకాయ పక్వానికి వచ్చినపుడు, దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు.

మృతోర్ముక్షీయ: 
అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడ రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమేకాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే. ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునేవారికి, అంతా వికారంగానే కనబడుతుంది. 

ప్రతి విషయానికి సందేహపడే సదేహప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటివన్నీ చావువంటివే. ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం.

అమృతాత్ : 
స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు.

శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు

శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్ప తరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు.

మనకున్న చిరంజీవులలో ఆంజనేయస్వామి ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే. ఆ కథ ప్రకారం, రావణ వధానంతరం అయోధ్యకు చేరుకున్న రామచంద్రుడు ప్రజారంజకంగా పరిపాలన గావిస్తున్నాడు. ఒకరోజు అగస్త్యమహర్షి తదితరులు శ్రీరామచంద్ర మూర్తిని దర్శించుకుని హనుమంతుని ప్రశంసించ సాగారు.

అప్పుడు శ్రీరాముడు, మహావీరుడైన లక్ష్మణుని ప్రశంసింపక, ఎందుకు హనుమంతుని పొగుడుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యాది మునులు, హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని, హనుమంతునితో సరితూగగల బలపరాక్రమ వంతులు ఎవరూ లేరని, అతని బలం గురించి అతనికి తెలియకపోవడమే శాపమని, అందుచేతనే అతడు వాలిని సంహరించలేకపోయాడని చెప్పారు.

అలాగే నూరు యోజనాలు దాటి లంకను చేరడం, అతి చిన్న రూపాన్ని ధరించడం, సీతమ్మవారిని దర్శించడం, లంకాదహనం వంటివన్నీ సామాన్యులు చేయలేరని చెప్పారు. అదేవిధంగా బాల హనుమ, సూర్యుని చూసి ఎగిరి వెళ్ళి, ఇంద్రుని వజ్రాయుధ ఘాతానికి గురై భూమిపై పెడతాడు. 

అప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు కుమారుని ఉజ్జయినికి తీసుకెళ్ళి శివార్చన చేసి, శివుని కరుణతో బాల ఆంజనేయుడు చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని పొందాడు. ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని అనుగ్రహించిన హనుమత్కేశ్వర లింగాన్ని చూడగలం. ఈ విధంగా స్వామి తన భక్తులను మృత్యువు నుంచి కాపాడి, ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు.

ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి, సమస్త దుష్ట శక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాము. 

మృత్యుర్యస్వాప సేచనం అని శ్రుతులు చెబుతున్నాయి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం. మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణకోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది. 

తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడ పిలువబడుతున్నాడు. ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో, వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు. 

అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం.
శివ సంకల్పమస్తు శుభమస్తు.
(సేకరణ)

Wednesday, April 2, 2025

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు – 


భూమండలంపై గ్రహాల ప్రభావం:
జ్యోతిషశాస్త్రంలో శని గ్రహాన్ని కర్మఫలదాతగా భావిస్తారు. శని అనేది పాపగ్రహంగా ప్రసిద్ధి పొందింది. ఏలినాటి శని అనేది ఒక రాశిలో శని 7 ½ సంవత్సరాలు సంచరించే కాలాన్ని సూచిస్తుంది. ఇది మూడు దశలుగా ఉంటుంది: ముందువైపు (2 ½ సంవత్సరాలు), మధ్య భాగం (2 ½ సంవత్సరాలు), మరియు చివరి భాగం (2 ½ సంవత్సరాలు). ఈ కాలంలో వ్యక్తికి శని ప్రభావం అనుభవమవుతుంది. అయితే, కొన్ని రాశులు, లగ్నాలపై శని అనుకూల ఫలితాలను ఇస్తుంది లేదా వ్యతిరేక ప్రభావం చూపించదు.

ఏలినాటి శని బాధపడని రాశులు:

1. మిథున రాశి (Gemini):

శని మిథున రాశిలో శత్రువుగా ఉండకపోవడం వల్ల, ఈ రాశి వారికి ఏలినాటి శని బాధ తక్కువగా ఉంటుంది.

శని బుధుని మిత్రుడుగా ఉండడం వల్ల అనుకూల ఫలితాలు పొందే అవకాశముంటుంది.

2. కన్య రాశి (Virgo):

శని, బుధుని మిత్రుడే కావడంతో కన్యరాశి వారికి ఏలినాటి శని పెద్దగా దుష్ప్రభావం చూపదు.

ఈ రాశి వారు శని ప్రభావం కింద ఉన్నప్పటికీ స్థిరమైన విజయాలు సాధిస్తారు.

3. ధనుస్సు రాశి (Sagittarius):

శని ధనుస్సు రాశిలో సంచరించినప్పుడు గురుని మిత్రుడుగా ఉండడం వల్ల తీవ్ర దుష్ఫలితాలు ఉండవు.

ఆధ్యాత్మిక ప్రగతి, గురు అనుగ్రహం కలుగుతుంది.

4. మీనం రాశి (Pisces):

శని మీనం రాశిలో సంచరించినప్పుడు తీవ్ర దోషం ఉండదు.

గురు అనుకూలత వల్ల శని ప్రభావం మృదువుగా ఉంటుంది.

ఏలినాటి శని ప్రభావం లేని లగ్నాలు:

1. మిథున లగ్నం:

శని మిత్ర గ్రహంగా ఉండడం వల్ల దోషప్రభావం తగ్గుతుంది.

2. కర్కాటక లగ్నం:

శని 7వ, 8వ స్థానాధిపతిగా మంచి ఫలితాలు ఇస్తుంది.

3. ధనుస్సు లగ్నం:

శని 2వ, 3వ స్థానాధిపతిగా అనుకూల ఫలితాలు ఇస్తుంది.

4. మీనం లగ్నం:
. మకర లగ్నం (Capricorn Ascendant):

లగ్నాధిపతి శని: మకర లగ్నంలో శని స్వరాశిలో ఉంటుందనేది అత్యంత అనుకూలమైన అంశం.

శని స్వగ్రహంలో ఉండడం వల్ల శని దశలు అనుకూలంగా ఉంటాయి.

ఏలినాటి శని సమయంలో వ్యక్తికి కొంత శ్రమపడినా, దీర్ఘకాలికంగా సత్ఫలితాలు కలుగుతాయి.

శని అధిక బాధ కలిగించకపోయినా, ఓర్పు పరీక్షించవచ్చు.

ఈ లగ్నంలో ఏలినాటి శని కార్యసిద్ధిని దారితీస్తుంది.

 లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలంలో విజయాలు, స్థిరమైన ఆర్థిక ప్రగతి.

కుంభ లగ్నం (Aquarius Ascendant):

లగ్నాధిపతి శని: ఇది శని స్వరాశి కావడం వల్ల, ఈ లగ్నంలో శని బలంగా ఉంటుంది.

ఏలినాటి శని సమయంలో శ్రమ ఎక్కువగా అనిపించినా, దీర్ఘకాలంలో గొప్ప ఫలితాలు కలుగుతాయి.

కుంభ లగ్నంలో శని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

వ్యక్తి కార్యదీక్ష, ధైర్యసాహసాలతో ముందుకు సాగతాడు.

సానుకూలమైనదే. క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే విజయవంతం అవుతారు.

వృషభ లగ్నం (Taurus Ascendant):

శని యోగకారక గ్రహం: వృషభ లగ్నంలో శని 9వ, 10వ స్థానాధిపతిగా ఉండి యోగకారకుడు అవుతుంది.

ఏలినాటి శని సమయంలో శ్రమ, సవాళ్లు ఎదురైనా, శని మంచి ఫలితాలు ఇస్తుంది.

ఈ కాలంలో వ్యక్తి కృషితో మానసిక స్థైర్యం పెంపొందించుకుంటాడు.

దీర్ఘకాలిక ప్రాజెక్టుల్లో, ఆర్థిక వ్యవహారాల్లో విజయవంతం అవుతారు.

ప్రభావం: శ్రమ ఎక్కువైనా శని అనుకూలంగా మారి కీర్తి, ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది.

మకర, కుంభ లగ్నాల్లో శని స్వరాశిలో ఉండడం వల్ల శని ప్రభావం శుభదాయకంగా ఉంటుంది.

వృషభ లగ్నంలో శని యోగకారకుడిగా ఉండి కల్యాణకారక ఫలితాలు ఇస్తుంది
శని 11వ, 12వ స్థానాధిపతిగా ఉండి అధికంగా కష్టాలు కలిగించదు.

ముగింపు:
జ్యోతిషశాస్త్ర ప్రకారం, శని ప్రభావం ప్రతి రాశికి వేరుగా ఉంటుంది. అయితే, కొన్ని రాశులు, లగ్నాలు శని ప్రభావాన్ని తక్కువగా అనుభవిస్తాయి. శని దశల్లో దైవభక్తి, ధర్మాచరణ, శనిగ్రహ ఉపాసన ద్వారా శని అనుగ్రహాన్ని పొందవచ్చు

Tuesday, April 1, 2025

తెలుగు సంవత్సరాల పేర్లు-వాటి అర్థాలు!!!*

తెలుగు సంవత్సరాల పేర్లు-వాటి అర్థాలు!!!*


1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక.
2. విభవ - వైభవంగా ఉండేది.
3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.
4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.
5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.
6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.
7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.
8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.
9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.
10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.
11. ఈశ్వర... పరమేశ్వరుడు.
12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.
13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.
14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.
15. వృష ... చర్మం.
16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.
17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం
18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.
19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.
20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.
21. సర్వజిత్తు.... సర్వాన్ని జయించినది.
22. సర్వధారి -...సర్వాన్ని ధరించేది.
23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.
24. వికృతి... వికృతమైనటువంటిది.
25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.
26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.
27. విజయ... విశేషమైన జయం కలిగినది.
28. జయ.... జయాన్ని కలిగించేది. 
29. మన్మథ... మనస్సును మధించేది.
30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.
31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.
32. విలంబి... సాగదీయడం.
33. వికారి.... వికారం కలిగినది.
34. శార్వరి... రాత్రి.
35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.
36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.
37. శోభకృత్... శోభను కలిగించేది.
38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.
39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.
40. పరాభవ ... అవమానం.
41. ప్లవంగ... కోతి, కప్ప.
42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.
43. సౌమ్య... మృదుత్వం.
44. సాధారణ... సామాన్యం.
45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.
46. పరీధావి... భయకారకం.
47. ప్రమాదీచ... ప్రమాద కారకం.
48. ఆనంద... ఆనందమయం.
49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.
50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.
51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.
52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.
53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.
54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.
55. దుర్మతి... దుష్ట బుద్ధి.
56. దుందుభి ... వరుణుడు.
57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.
58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.
59. క్రోదన... కోప స్వభావం కలది.
60. అక్షయ... నశించనిది

                 స్వస్తి🙏🌹

RECENT POST

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.............!!  కుబేర మంత్రం : (ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యదీప్తాయै ధనధాన్య...

POPULAR POSTS