Friday, March 23, 2018

తారకమంత్రం పరమేశ్వరుడు, ముక్కంటి అయిన శివుడే విష్ణు స్తోత్రమునకు శ్రీరామ మంత్రాన్ని జపించినట్లు శాస్త్రాలు చెబుతున్నారు.



తారకమంత్రం

పరమేశ్వరుడు, ముక్కంటి అయిన శివుడే విష్ణు స్తోత్రమునకు శ్రీరామ మంత్రాన్ని జపించినట్లు శాస్త్రాలు చెబుతున్నారు. దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధమై చైత్రశుద్ధ నవమిన ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం 'శ్రీరామనవమి' గా విశేషంగా జరుపుకుంటాం.'రామ' యనగా రమించుట అని అర్ధం. కావున మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న 'ఆ శ్రీరాముని' కనుగొంటూ వుండాలని పండితులు అంటున్నారు.ఒకసారి పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, "ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!" అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు.శ్లో||శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వార్కి సధ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు 'రా' అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయని విశ్వాసం. అలాగనే 'మ' అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందుచేత శ్రీరామనవమి నాడు శ్రీరాముని అనుగ్రహం పొందాలంటే ఈ ఒక్క మంత్రముతో జపిస్తే చాలునని పండితులు అంటున్నారు.

鹿 *"#శ్రీరామ" #తారక #మంత్రముతో శుభ ఫలితాలెన్నో..* 鹿

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయంసీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్ఆజానుబాహుమరవింద దళాయతాక్షంరామం నిశాచర వినాశకరం నమామి - అంటూ శ్రీరాముడిని స్తుతించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి. జన్మతహ:కిరాతకుడై పుట్టిన ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి "శ్రీమద్రామాయణం" రాసేంత స్థాయికి చేరుకోగలిగాడు.అడవుల్లో తిరుగుతూ వేటాడుతూ కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు "రామ రామ రామ" అనే తారక మంత్రమే తోడ్పడింది. కిరాతకుడైన బోయవాడిని నారదుడు చూసి నీవు చేస్తున్న ఈ కిరాతకమైన పాప కార్యంలో నీ భార్యబిడ్డలు ఏమైనా పాలుపంచుకుంటారో తెలుసుకుని రా అని పంపుతాడు.వెంటనే ఆ కిరాతకుడు భార్యబిడ్డల వద్దకు వెళ్లి ఆ ప్రశ్న అడుగుతాడు. దానికివారు గృహస్తుడుగా మమ్ములను పెంచి పోషించే బాధ్యత నీది కానీ నీవు చేసే పుణ్యకార్యంలో భాగం పంచుకుంటామేతప్ప పాపకార్యంలో కాదు. అని నిష్కర్షగా పలుకుతారు. వారి పలుకులకు వైరాగ్యము చెందిన బోయవాడు మహర్షి నాకు చక్కని మోక్షమార్గానికి ఉపాయము చెప్పమని ప్రాధేయపడతాడు.కిరాతకుని విన్నపము మేరకు నారదుడు "రామ రామ రామ" అనే తారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడు. చివరకు నోరు తిరగక శరీరంపై పుట్టలు పోస్తున్నా "మర" అంటూనే ఆ తారకమంత్రాన్ని వీడలేదు. బ్రహ్మ అనుగ్రహముతో వల్మీకము నుండి పునర్జీవింపడి వాల్మీకి మహర్షిగా జ్ఞాన సంపదను ఈ తారకమంత్రముచే పొంది శ్రీమద్రారాయమణ అనుకమనీయకావ్యం రచించి కారణజన్ముడై ఊర్థ్వలోకమందు ఆ చంద్రతారార్కం తరగని నిధిని పొందిన మహాభాగ్యశాలి అయినాడు.అట్టి శ్రీమద్రారామాయణం మనకు ఎంతో ఆదర్శవంతమైంది. అందలి శ్రీ సీతారామచంద్రమూర్తి మూర్తీభవించిన ధర్మదేవతా స్వరూపం. ఆ కావ్యమే మనకు మనభావితరాలకు మార్గదర్శి కానుంది.కాబట్టి శ్రీరామ నవమి రోజున రామ నామ తారక మంత్రమును పఠించడంతో పాటు సీతారాముల కళ్యాణోత్సవం వీక్షించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. అలాంటి మహిమాన్వితులపై శ్రీరామచంద్రులను శ్రీరామనవమి నాడు స్తుతించి వారి అనుగ్రహము పొందుదుము గాక..!.

త్రేతాయుగంలోని వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని అనేక పురాణాలు పేర్కొంటున్నాయి. రాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల సమయంలో జన్మించాడు. పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం.

రామాయంలో కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు. వారికి సంతాన భాగ్యం లేకపోవడంత వశిష్ట మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేస్తాడు. దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయసాన్నిచ్చిన కొద్దికాలానికే వారు గర్భం దాల్చారు.

చైత్ర మాసం తొమ్మిదో రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మించాడు. ఆ తర్వాత భరతుడు కైకేయికి, లక్ష్మణ శతృఘ్నలు సుమిత్రకు జన్మించారు. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు ఏడో అవతారం రాముడు. లంకాధిపతి రావణ సంహారం కోసం రాముడు అవతరించాడు

రామరాజ్యంలో ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభా యాత్ర. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు.

రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖలు దిలీపుడు, రఘు. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు.

 *శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే* అనే శ్లోకం మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీమహా విష్ణువే కౌసల్యాపుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాం.

ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి సధ్గతి కలిగిస్తాడనేది ఐతిహసాలు ఘోషిస్తున్నాయి. ఇక భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించాడు. శ్రీరామ నీ నామ మేమి రుచిరా ఎంతోరుచిరా; మరి ఎంతో రుచిరా; అని కీర్తించాడు.

రామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు

 *రా అనగానే మన నోరు తెరచుకుని లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగే *మ అనే అక్షరం ఉచ్ఛరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవట. అందువల్లే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట.* 

 *ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా* *మృగం కాంచనం ! వైదేహీ హరణం జటాయు మరణం* *సుగ్రీవనమ్భాషణం !*
*వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ* *దాహనం ! పశ్చాద్రావణ కుంభకర్ణ హననం యేతద్ది రామాయణ* *జయజానకినాయక* 

 *రామాయ రామభద్రాయ రామచంద్రయ వేధసే !* *రఘునాదాయ నాధాయ సీతాయాః పతయే నమః !*
*రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః ! రాజా సర్వస్య లోకస్య దేవానాం మాఘ వానివ !* 

రాముడు మూర్తీభవించిన ధర్మం, సత్పురుషుడు, సత్యపరాక్రముడు, దేవతలకు ఇంద్రుడు ప్రభువైతే, రాముడు సకలలోకాలకు ప్రభువు.

ఈ వాక్యం అన్నది ఒక రాక్షసుడు -- రెండు సార్లు రాముడి చేతిలో పరాజితుడై, మూడవ సారి అతని చేతిలో మరణించిన మారీచుడు.

శ్రీరాముడు చక్రవర్తికి లేక లేక పుట్టిన కొదుకు. అల్లారుముద్దుగా పెంచారు. 16 సంవత్సరాల ప్రాయానికే సకలవిద్యా పారంగతుడయ్యాడు, తీర్ధయాత్రలు,లోకసంచారము చేసి వచ్చాడు. తండ్రి కుమారుడికి పెండ్లి చేద్దాం అనే ఆలోచనలోకి వచ్చారు. ఎందుకో రామచంద్రుల వదనం లో ప్రశాంతత కనిపించలేదు. తండ్రిగారు కంగారు పడి విషయం అడిగారు. శ్రీరాముడు ఈ విధంగా అన్నారు " తండ్రి, లోకం అంతా, ఈ సకలచరాచర జీవరాసి అశాశ్వతం, నశించి పోతోంది, శాశ్వతమైనది, ఆనందకరమైనది ఏమిటి ? నేనెవరు ? ఈ సృష్టి రహస్యం ఏమిటి ? ఇది విని దశరధుడు కంగారు పడ్డాడు, పెళ్లి చేద్దాం అంటే వైరాగ్యం లోకి వెళ్ళాడేమిటని, వశిష్టుల వారికి విన్నవించాడు. ఈ లోపు యాగరక్షణార్థమై రామ,లక్ష్మనులను తీసుకు వెళ్ళటానికి విశ్వామిత్రులవారు సభకి వచ్చారు. అప్పుడు రాముడి లోని చింతలకన్నిటికి సమాధానాలు ( యోగవాసిష్టం ) వశిష్టుల వారు వివరించి రాముణ్ణి కార్యోన్ముఖుడిని చేశారు. ఇదే మొట్టమొదటిమైలురాయి రాముడి ఆత్మసంయమనానికి.

విశ్వామిత్రుడి వెంట యాగరక్షణ కి వెళ్లిన రాముడి కి, ఋషి బల , అతిబల విద్యలు, అనేకదివ్యాస్త్రా లు అనుగ్రహించాడు. సీతను వివాహం చేసుకొని అయోధ్య కు తిరిగి వచ్చాడు రాముడు. దశరధుడు, శ్రీరాముని పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేసి రాముడికి చెప్పారు. రాముడు సరే అన్నారు. తెల్లవారింది, ఇంక పట్టాభిషేకం జరుగుతుంది అనగా అది రద్ధయింది . తండ్రిమాటకోసం సీత, లక్ష్మను లతో అరణ్యాలకి వెళ్ళాడు. దశరధుడు క్రుంగి పోయాడు, రాణివాసం, అయోధ్య విలపించాయి , కానీ రాముడి నిగ్రహం మాత్రం చెదరలేదు.

సీతారామలక్ష్మణులు అరణ్యం లో శరభంగ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఆ మహర్షి జరిగిందంతా తెలుసుకొని, నేను తపశక్తి వల్ల స్వర్గలోకాన్ని, బ్రహ్మలోకాన్ని జయించానని అది రాముడికి ఇస్తానని చెప్పారు . అప్పుడు రాముడు - ఓ మునివర్యా - మీరు చెప్పిన వన్నీ నేను సంపాదించుకోగలను, కాని అవి నాకు వద్దు, ఈ అరణ్యం లో నివాసయోగ్యమయిన ప్రదేశం చెప్పండి అని అడుగుతారు. . ఇతరులనుంచి ఏది ఆశించని గుణం రాముడిది.

అరణ్యం లో రాక్షసు లందరు, ఋషులను చాలా భాదలు పెడుతున్నారు. మమ్మల్ని కాపాడమని ఋషులు రాముడిని అడుగుతారు. రాముడు సరే అని మాట ఇస్తారు. అప్పుడు సీతాదేవి అంటుంది - ఆ రాక్షసు లెవరు మనజోలికి రాలేదు కదా - వాళ్లతో అకారణ వైరం ఎందుకు అని - శ్రీరాముడికి కోపం వచ్చింది - చాలా తీవ్రంగా ఇలా అన్నారు - క్షత్రియుడు ధనుర్భాణాలు ధరించింది ఆపదలో ఉన్నవారిని కాపాడటానికి, నిరాయుధు లైన యీ మునులను హింసించే రాక్షసులను వధించటం నా విధి. రాముడికి ధర్మం పట్ల అంత త్రీవ్రమైన నిష్ట ఉంది.

తల్లి కైకేయి చేసిన పనికి భరతుడు కుమిలిపోయి, రాముణ్ణి తిరిగి అయోధ్య కు తిసుకువెళ్ళటానికి అరణ్యానికి వస్తాడు రాముణ్ణి ఎంతో బ్రతిమాలుతాడు. రాముడు ఆడినమాట తప్పను అని - రాజ్య పరిపాలనకి అవసరమైన అన్ని రాజనీతి భొదలు చేస్తాడు. భరతుడు ప్రాయోపవేశం చేస్తానని గట్టి పట్టు పడితే పాదుకలు ఇచ్చి పంపిస్తాడు.

పంచవటిలో మారీచుడు బంగారు లేడి గా సీత దృష్టి ని ఆకర్షిస్తాడు. ఆ లేడి కావాలని ఆమె రాముణ్ణి కోరుతుంది. లక్ష్మణుడు ఇది మాయా మృగం అని అన్నగారితో అంటాడు. అప్పుడు రాముడు - లక్ష్మణా భార్య కోరిన కోరికను వీరుడైన భర్త ఎలా కాదనగలడు. శక్తి సామర్థ్యాలు ఉన్న సాహసి సంపాదించినదే అసలైన సంపద. ఒకవేళ ఈ లేడి రాక్షస మాయ ఐతే దాన్ని వధించటం క్షత్రియుడిగా నా కర్తవ్యం .

సీతను రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు. తీరని దుఖం తో చలించిపోయాడు. కోపం కట్టలుతెంచుకొని వచ్చింది, లక్ష్మణుడి అజాగ్రత్తని తిట్టాడు. దేవతలను నిందించాడు - లక్ష్మణా - నేను దేవతా ప్రీతి కోసం ఎన్ని పుణ్యకార్యాలు చేసాను , కష్ట నస్టాలు ఎదురైనా ధర్మ మార్గం వదలలేదు. ఇంద్రియాలను జయించి, దయామూర్తినై లోకాలకి మేలు చేయటమే లక్ష్యం గా పెట్టుకున్నాను అయినా కష్టం మీద కష్టం ఎలా వచ్చి పడుతోందో చూడు అని నిర్వేదానికి లోను అయ్యాడు.

కొంతదూరం, వెళ్ళగానే కబందుడు అనే రాక్షసుడు అడ్డగించటం తో అతడిని సంహరించి అతని ద్వారా తనలాగే దుర్దశ లో ఉన్న సుగ్రీవుడి గురించి తెలుసుకుంటాడు. ఆపదలు బలవంతుడైన శత్రువు వల్ల కలిగినప్పుడు వాటిని అధిగమించటానికి ఆరు ఉపాయాలు ఉన్నాయి, అందులో సమశ్రాయణం అంటే ఇంకొక బలవంతుడయి ఆపదలో ఉన్న వారి సహాయం తీసుకోవటం. ఇదే రాముడు ఎన్ను కొన్న మార్గం. రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయారు. రాముడు వాలి ని చంపుతానని ప్రతిజ్ఞ చేసాడు. ఆకాశమార్గం లో వెడుతూ సీత వదిలిన నగలమూట చూపించారు. సీతాన్వేషణ మొదలైంది. సీత లంకలో రావణాసురుడి దగ్గర ఉంది అని లంకకు చేరటానికి నూరు యోజనాలు సముద్రం దాటాలని హనుమంతుడు చెప్పాడు. రాముడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వ్యూహ రచన మొదలుపెట్టాడు. శత్రువు బలాబలాల గురించి ఆలోచించలేదు, తన పరాక్రమం పై నమ్మకం, భార్యను రక్షించు కోవాలన్న తపన.

లంకలో విభీషణుడు, రావణునికి మంచి చెప్పటానికి ప్రయత్నించాడు, అతడు వినలేదు, విభీషణుడికి కోపం వచ్చింది - రావణా, రాజు మెచ్చే మాటలు చెప్పేవాళ్ళు చాల మంది ఉంటారు, వాళ్ళ మాటలు వినటం వాల్ల వచ్చే ప్రమాదం తరువాత తెలుస్తుంది, తమ్ముడిగా నీ మేలుకోరి మాట్లాడాను - నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అని అక్కడ నుంచి రాముడి దగ్గరికి వచ్చి రాముడి శరణు పొందేడు . రామరావణ యుద్ధం జరిగింది , రావణుడు మరణించాడు. ఇక్కడ వాల్మీకి ఒక ఉపమానం చెపుతారు = సముద్రాన్ని వర్ణించటానికి సముద్రమే ఉపమానం - అలాగే రామరావణ యుద్ధం వర్ణించటానికి మరో ఉపమానం లేదు దానికదే పోలిక. రావణ సంహారానంతరం దేవతలు అందరు ప్రత్యక్షమై రాముడిని అభినందించి వరం కోరుకోమంటారు - అప్పుడు రాముడు యుద్ధం లో మరణించిన వానరులందరినీ బ్రతికించమంటాడు. దుష్టుడైన రావణుని చెరలో ఉన్నందుకు, ఉత్తరోత్రా ప్రజా విమర్శలకు అవకాశం రాకూడదని సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయమంటాడు. విభీషణుడిని పట్టాభిషక్తుడిని చేసి రాముడు అయోధ్య కు వచ్చి పట్టాభిషక్తుడై పరిపాలించాడు. ధర్మం కోసం బ్రతికి, ధర్మాన్ని బ్రతికించి మానవాళికి మార్గదర్శకుడయ్యాడు.

ఇలా రామాయణం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందులోని ప్రతి పాత్ర ఉదాత్తమైనవే. అలాగే శ్రీరాముడి కంటే రామ నామం ఇంకా గొప్పది - ఈ నామం తో తరించిన వాళ్ళు ఏంతో మంది - శబరి, త్యాగయ్య, రామదాసు మొదలైనవారు.
రామ రసం ప్రాముఖ్యత

దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు. భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.

శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను బెల్లం పానకం ... పెసర వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. సీతారాములకు జరిపే కళ్యాణ వైభవంలో మార్పులు వచ్చినా, తీర్థ ప్రసాదాలుగా ఆనాటి నుంచి ఈనాటి వరకూ పానకం ... వడపప్పును పంచడం వెనుక పరమార్థం లేకపోలేదు. శ్రీ రామనవమి నాటికి ఎండలు బాగా ముదురుతాయి. వేసవి తాపం వలన శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు తలెత్తుతుంటాయి. శరీరంలోని శక్తి చెమట రూపంలో బయటికి ఎక్కువగా పోవడం వలన నీరసం రావడం జరుగుతుంది.

ఇలాంటి అనారోగ్యాలను నివారించడం కోసమే ఈ రోజున బెల్లం పానకం ... పెసర బేడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. బెల్లం పానకం ... పెసరబేడలతో వడపప్పును స్వీకరించడం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని... పోషకాలను అందిస్తూ ఉంటాయి.

జీర్ణ సంబంధమైన ... మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత .. పిత్త ... కఫ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తుంటాయి. అందువలన బెల్లం పానకం ... వడపప్పే గదా అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వలన సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్య పరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పొచ్చు.

మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా,ఆయా ఋతువులను,దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే . వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఋతువులో వచ్చే గొంతువ్యాధులకు… పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెబుతోంది.

పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ దెబ్బ’ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా ఈ వేసవి లో వడపప్పు ,పానకం తీసుకుంటే మంచిది .

శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.

శ్రీరామ ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...
అజ మహారాజ వర్మణః పౌత్రాయ...
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.

సీతాదేవి ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...
జనక మహారాజ వర్మణః పుత్రీం...
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...

ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది.
శ్రీరామ నవమి
అయనము = బాట
రామాయణము = రాముడు నడచిన బాట

పానకం
తురిమిన బెల్లం --- 6 టీ స్పూన్లు
మిరియాల పొడి -- అర టీ స్పూను
యాలకుల పొడి -ఒక టీ స్పూను
అల్లం తురుము -- ఒక టీ స్పూను
నీళ్ళు --- రెండు గ్లాసులు

ఒక పాత్రలో నీళ్ళు తీసుకుని బెల్లం వేసి కరిగించాలి. దానిలో మిగిలిన పదార్ధాలను కలపాలి.
దీనితో సహజ పదార్ధాలతో పానకం తయారవుతుంది.
ఇది పానీయమే కాదు ఒక ఔషధం కూడా

వడపప్పు

నానబెట్టిన పెసరపప్పు --- ఒక కప్పు ( అన్నింటి కంటే ఉత్తమమైనది)
పచ్చి మిర్చి తురుము --- ఒక టీ స్పూను
సైంధవ లవణం లేదా ఉప్పు --- చిటికెడు
కొబ్బరి తురుము --- నాలుగు టీ స్పూన్లు
నిమ్మ రసం --- ఒక టీ స్పూను
తురిమిన కొత్తిమీర

మొదట పెసర పప్పు ను ఒక గిన్నెలో వేసి దానికి మిగిలిన పదార్ధాలను ఒక్కొక్కటిగా కలపాలి.

పప్పులన్నింటిలోకి పెసరపప్పు శ్రేష్టమైనది.

వేసవి కాలంలో ఆకలి తగ్గడం అనేది ముఖ్యమైన సమస్య . దీనికి పానకం చాలా అద్భుతమైన
ఔషధం.

వడపప్పు యొక్క ఉపయోగాలు :-- దీనిలోని పెసరపప్పు రక్తస్రావాలను ఆపుతుంది. దప్పికను తగ్గిస్తుంది. వాంతులను తగ్గిస్తుంది మరియు నివారిస్తుంది. నిద్రను కలిగిస్తుంది. దద్దుర్లను
తగ్గిస్తుంది. పొడి దగ్గును నివారిస్తుంది.

పానకం యొక్క ఉపయోగాలు :-- దీనిని తాగితే ఎన్ని నీళ్ళు తాగినా తగ్గని దాహం తగ్గుతుంది.
తక్షణం శక్తిని ఇస్తుంది. కఫాన్ని తొలగిస్తుంది. దుమ్ము, ధూళి వ లన వచ్చే జలుబును నివారిస్తుంది.
ఆకలిని పెంచుతుంది. ఇది ద్రవాహారం కాబట్టి నిర్జలీయతను రానివ్వదు. వడదెబ్బ నుండి
కాపాడుతుంది.

అరికాళ్ళ మంటలు :-- పెసర పప్పును నానబెట్టి నూరి కర్పూరం కలిపి పాదాలకు పూయాలి.

శిరోవేదన, మంటలు :-- పెసరపప్పును నానబెట్టి నూరి మాడు మీద అంటించాలి.

సేకరణ..
పి. రామ ప్రసాద్.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS