Sunday, March 31, 2024

*అన్నానికి దోషం అంటడమంటే ఏమిటి ? అదెలా పోగొట్టుకోవాలి ?*

*అన్నానికి దోషం అంటడమంటే ఏమిటి ? అదెలా పోగొట్టుకోవాలి ?*

ఎడమ చేతితో తినే తిండికి ,నిలబడి తినే తిండికి రాక్షస శక్తులు వస్తాయి . ఒకరి ఎంగిలి ఒకరు పంచుకు తింటే అది కూడా దోషాన్నమే . అన్నానికి జాతి దోషం , ఆశ్రయ దోషం , నిమిత్త దోషం అని మూడు రకాల దోషాలుంటాయి . 

జాతి దోషం అంటే సహజంగానే ఆ పదార్థానికి ఉన్న దోషము . అవి ఉల్లి , వెల్లుల్లి , ముల్లంగి లాంటివి . వీటిలో తామస గుణములు ఉంటాయి కనుక ఇవి వర్జనీయములు . సాత్త్విక సాధన చేసి భగవంతుడు కావాలి అనుకునే వారు వీటిని వదిలేయాలి . 
ఆశ్రయ దోషం అంటే పాత్రను బట్టి దోషము . పాలు శ్రేష్టమైనవి . కాని అవి రాగి పాత్రలో పోసి భగవంతునికి నివేదిస్తే అవి కల్లుతో సమానం . అది పాత్ర దోషం . 

నిమిత్త దోషం అంటే అవి పుట్టే చోటు బాగుండాలి . మారేడు దళాలు శివునికి ప్రీతి . కాని ఆ చెట్టు శ్మశానంలో ఉంటే అది దోషం . అంటే దుష్టమైన ప్రాంతంలో పెరిగినా దోషమే . కాకి , పిల్లి , కుక్క మొదలైనవి ముట్టుకున్న భోజనము కూడా దోషమే . 

మనము బయట నుంచి తెచ్చిన వస్తువులు ఎలా పండిస్తున్నారో , ఎక్కడ నుంచి తెస్తున్నారో తెలీదు . అందుకని భగవంతునికి నివేదించి భోజనం చెయ్యాలి . మన దగ్గరకు రాక మునుపు అవి ఏమైనా మన దాకా వచ్చాక జాగ్రత్త అవసరం కనుక భగవంతునికి నివేదించడం వలన ఆ దోషాలు పోతాయి . అందుకే దోషము లేని అన్నము ఇవ్వమ్మ అని వేడుకోవాలి . ప్రతి రోజు నీకు నివేదన చేసి తినే భాగ్యం కల్పించు తల్లీ అని కోరుకోవాలి .  బియ్యాన్ని రామ నామముతో ఏరుకోని ఆ బియ్యంతో వండుకొని తింటే ఇంక దానికి దోషము ఉండదు.

No comments:

Post a Comment

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS