Sunday, December 30, 2018

పంచలింగాలు

పంచలింగాలు

పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు.
ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
అందులో కీలకమైన పంచలింగాలు.
పృథ్విలింగం,
ఆకాశలింగం,
జలలింగం,
తేజోలింగం,
వాయులింగములను
పంచభూతలింగాలు అంటారు.
1. పృథ్విలింగం:
ఇది మట్టిలింగం.
కంచిలోఉంది.
ఏకాంబరేశ్వర స్వామి అంటారు.
పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి.
అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.
2. ఆకాశలింగం:
ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది.
ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది.
లింగ దర్శనముండదు.
అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.
3. జలలింగం:-
ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు.
ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది.
ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు.
అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి.
బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.
4. తేజోలింగం:
తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది.
అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు.
ఈయన పేరే అరుణాచలేశ్వరుడు.
అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.
5. వాయులింగం:
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని
శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం.
ఈయన పేరు కాళహస్తీశ్వరుడు.
అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ.
సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం.
ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.
ఓం నమః శివాయ..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
    ఓం శ్రీ సాయి రామ్                   శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS