Saturday, February 23, 2019

*మహా శివునికి ముగ్గురు కుమార్తెలు.....*

* *మహా శివునికి ముగ్గురు కుమార్తెలు.....* మహా శివునికి ముగ్గురు కుమార్తెలు.....*
కార్తికేయ, వినాయకుడు, అయ్యప్ప.. ఈ ముగ్గురూ.. శివుడి కొడుకులని మనందరికి తెలుసు. కానీ శివుడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారని..చాలా తక్కువ మందికి మాత్రమే.. తెలుసు. అసలు శివుడికి కూతుళ్లు ఉన్నారనే విషయాన్ని ఎందుకు ఎక్కడా ఎక్కువ ప్రస్తావించలేదు ?
శివుడి కొడుకులు అయినంత ఫేమస్ కూతుళ్లు ఎందుకు కాలేదు. శివుడి ముగ్గురు కూతుళ్లను, కొడుకులను పూజించినట్టు ఎందుకు పూజించడం లేదు. అయితే ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ శివుడి కూతుళ్లను పూజిస్తారు.
అనేక పురాణాలు, కథలు, శివ పురాణంలో.. శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివపురాణంలోని రుద్ర సంహితలో శిడుకి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. అసలు వాళ్లు ఎలా జన్మించారు ? ఎప్పుడు పుట్టారు ? ఎందుకు అంత ప్రఖ్యాతి పొందలేదో తెలుసుకుందాం
శివ పుత్రికలు శివుడికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మానసనే వాసుకి అని కూడా పిలుస్తారు.
1. అశోక సుందరి...
పార్వతి దేవి ఒంటరితనాన్ని తగ్గించుకోవడం కోసం.. అశోక సుందరిని సృష్టించారు.
పద్మపురాణం....
పద్మ పురాణంలో.. అశోక సుందరి జన్మ రహస్యాన్ని పూర్తీగా వివరించారు. గుజరాత్, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వ్రత కథల ద్వారా.. అశోక సుందరి వచ్చింది. ఈమెను పార్వతిదేవి సృష్టించింది.
పేరులోని అర్థం ....
అశోక అంటే పార్వతీదేవి శోకం, బాధను తగ్గించడం అని, సుందరి అంటే.. అందమైన అని అర్థం.
వినాయకుడి తల ...
శివుడు వినాయకుడి తల నరికేసినప్పుడు.. భయంతో అశోక సుందరి ఉప్పులో దాక్కుందట. అందుకని.. ఈమెను ఉప్పుగా భావిస్తారు. ఉప్పు లేకుండా.. జీవితంలో రుచి ఉండదని సూచిస్తుంది. ఈమెను ముఖ్యంగా గుజరాత్ లో పూజిస్తారు.
2. జ్యోతి ....
ఈమె పార్వతి దేవి తలలో వచ్చిన మెరుపు, శివుడి తలలో ఉన్న నెలవంక నుంచి ఉద్భవించిందని కథలు చెబుతున్నాయి.
దేవత ...
జ్యోతిని హిందువులు పూజించే దీపానికి ప్రతికగా భావిస్తారు. ఈమె మాత్రం శివుడు, పార్వతి.. ఇద్దరి శారీరక వ్యక్తీకరణం ద్వారా జన్మించిందని చెబుతారు. మరొకటి పార్వతిదేవి తలలో మెరుపు ద్వారా పుట్టిందని చెబుతారు.
పూజించడం ....
జ్యోతి దేవిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు. ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో రాయకిగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో జ్యోతి.. జ్వాలాముఖిగా పూజిస్తారు.
3. మానస
శివుడి వీర్యం పాముల తల్లి కాడ్రు విగ్రహానికి తగలడం వల్ల.. పుట్టిందని పురాణ కథలు చెబుతున్నాయి. అందుకే ఈమెను శివుడి కూతురిగా చెబుతారు. పార్వతి కూతురు కాదని వివరిస్తాయి.
వాసుకి సోదరి ....
వాసుకి సోదరి మానస అని.. బెంగాలీ కథలు వివరిస్తున్నాయి. వాసుకి అంటే.. పాముల రాజు.
కోపం, సంతోషం లేకపోవడం ....
తన తండ్రి, భర్త, పార్వతి దేవి తనను తిరస్కరించడం వల్ల మానస చాలా కోపం, సంతోషం లేకుండా.. ఉంటుందని.. కథలు ఉన్నాయి.
పూజించడం ....
మానసను.. బెంగాల్లో చాలా ఎక్కువగా పూజిస్తారు. ఈమెను.. ఎక్కువగా వర్షాకాలంలో పూజిస్తారు. ఎందుకంటే.. ఆ సమయంలో పాములు యాక్టివ్ గా ఉంటాయి. అలాగే.. ఈమె పాము కాటు, ఇన్ఫెక్షన్స్, చికెన్ పాక్స్ వంటి వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS