Tuesday, December 10, 2024

గృహముకు ప్రవేశ ద్వారం ఎదురుగా నరఘోష యంత్రం ఉంటే దిష్టి వివాద రకాలు దోషాలను.

అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలూ ఏమిటి.............!!

అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలూ ఏమిటి.............!!

ప్రతి రోజు సాయంత్రం ప్రదోష కాలంలో అమ్మవారు, శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు.
ఈ సమయమంలో చేసే పూజలు అంటే అమ్మవారికి చాల ఇస్టం.

అవి ఆర్ద్రనతకరి అని, అనంత తృతీయ, రసకల్యని అని వ్రతములు చాలా ఇష్టం అని పురాణ వచనం.

ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయటం అత్యంత ప్రీతికరమ్.

ప్రతి మంగళవారం అమ్మవారిని సేవించడం, పూజ చేయటం, అర్చన చేయటం, వ్రతం చేయటం కూడా విశేషం అని అమ్మవారు చెపుతుంది.

ఎవరు మంగళవారం అమ్మవారిని పూజ చేస్తారో వారికీ శత్రు పీడలు ఉండవు, రోగ నివారణ, అప్పులు, రుణాలు తీరిపొతాయి అని, కుజ గ్రహ దోషాలు జాతకం లో ఎక్కడ ఉన్న కూడా దోష పరిహారం అవుతుంది అని, అమ్మవారికి అత్యంత ప్రీతికరమయిన రోజు ఈ బౌమవారం (మంగళవారం) అని చెపుతారు.

ఎవర్ని అయితే అమ్మవారు కరుణిస్తుందో వారి ఇంటికి అమ్మవారు కదిలి వస్తుందంట. 

పిలవని పేరంటం ఎవరు వస్తారో వారే అమ్మవారి స్వరూపంగా చెపుతారు.

కృష్ణ చతుర్దశి (బహుళ చతుర్దశి ) , ప్రతి మాసం లో అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశి రోజున అమ్మవారిని స్తుతించటం వలన అమ్మవారి కృపకి పాత్రులు కావచ్చు.

నవరాత్రి ద్వయం అంటే శరన్నవరాత్రులు (దుస్సేర నవరాత్రి), వసంత నవరాత్రులు (ఉగాది నుంచి శ్రీ రామ నవమి వరకు చేసేది). అమ్మవారికి అత్యంత ప్రీతికరమయిన నవరాత్రులు.

వసంత నవరాత్రులు ఎందుకు అమ్మవారికి ఇస్టం అంటే దేవిభాగవతం లో..
 " శ్రీ రామో లలితంబికా, శ్రీ కృష్ణో శ్యామలంబ " అంటారు, అంటే శ్రీ రాముడు ఎవరో కాదు లలితా పరమేశ్వరే... స్వరూపం రాముడు, అవతారం లలితాంబ అని చెపుతారు.

అందుకనే శ్రీ రామ నవరాత్రులలో కూడా అమ్మవారికి పూజ చేస్తారు.

అమ్మవారు మనల్ని ఎలా ఏరూపంలో అనుగ్రహిస్తుంది ?
కాలి, చండి, బాల, లలిత, దుర్గ అనేక రూపాలలో ఉండి మనల్ని నడిపిస్తుంది, కరుణిస్తుంది అని అనుమానం..
ఒకటి అని కాదు అమ్మవారు సకల వ్యాప్తం అయి ఉంది.

మాత్రు రూపం, 
శాంతి రూపం, 
ఆకలి రూపం లో, 
జాతి రూపం లో, 
చైతన్య స్వరూపం, 
నిద్ర రూపం లో, 
దయా రూపం లో, 
బుద్ది రూపం లో 
కూడా అమ్మవారు ఉండి మనల్ని నడిపిస్తుంది.

అమ్మవారిని ఏమి కోరుకోవాలి...

కొందరు పిల్లలు కావాలి అని , ఇల్లు కట్టుకోవాలి అని , పెళ్లి కావాలని రక రకాల కోరికలు కోరతారు. కానీ ఏది కోరిన మళ్ళీ దాని వలన కలిగే సుఖం అల్పం , క్షణికం . అది తీరగానె మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది.

మరి ఏమి కోరాలి ? గురు శంకరాచార్య అంటారు " నన్ను కరుణించు, నాతో ఉండు" మోక్షం వద్దు, విద్య వద్దు, సంపదలు వద్దు , కానీ నీ నామ స్మరణ చాలు, నాతో ఉండాలి. ఎప్పుడు నీ పాదాల చెంత భక్తీ కలిగి ఉండాలి, ఎప్పుడు కరుణిస్తూ ఉండాలి, నన్ను ధర్మమయిన మార్గం లో నడిపించాలి అని కోరుకోవాలి.అని అన్నారు..స్వస్తి.!

లోకా సమస్తా సుఖినోభవంతు..!!

Sunday, December 8, 2024

పంచ మహాపాత కాలను పోగొట్టే పారిజాతపుష్పం....

పంచ మహాపాత కాలను పోగొట్టే పారిజాతపుష్పం....


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌹పారిజాత పుష్పాలు 9రకాలు

🌿1.ఎర్ర(ముద్ద)పారిజాతం
2.రేకు పారిజాతం
3.తెల్లగా ఎర్ర కాడతో ఉండే పారిజాతం (ఎక్కువగా అందుబాటులో ఉన్నది)
4.పసుపు పారిజాతం
5.నీలం పారిజాతం
6.గన్నేరు రంగు పారిజాతం
7.గులాబీరంగు పారిజాతం
8.తెల్లని పాలరంగు పారిజాతం
9.ఎర్ర రంగు పారిజాత
ఎరుపు రంగు పారిజాతం తో విష్ణువును ఆరాధించరాదు.
ఎరుపు తమోగుణం
విష్ణువు సత్వగుణం.

🌸పారిజాత పుష్పాలు క్రింద పడిన వాటినే వాడాలి.
చెట్టు నుండి కోసి వాడరాదు.

🌿పారిజాత వృక్షం తపస్సు చేసి తన పూలను తాను ఇస్తేనే తప్ప తన నుండి ఎవరూ లాగు కోకూడదని వరం పొందినది.

🌸రంగు,..వైశాల్యం,..గుణం,..దేవతా స్వరూపాన్ని బట్టి దేవతలను ఆరాధించాలి.

🌿ఏ పూలను క్రింద పడ్డవి పూజకు వాడరాదు.
ఒక్క తెల్లగా ఎర్రని కాడతో పారిజాత పూవు తప్ప.

🌸భూ స్పర్శ,
మృత్తికా(మట్టి)స్పర్శ
జల స్పర్శ
హస్త స్పర్శ
తరువాత స్వామి
స్పర్శ...ఈ 5 స్పర్శల తోను
పంచ మహా పాతకాలను
పోగొట్టేదే పారిజాతం....🚩🌞🙏🌹🎻

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

నవగ్రహాల ప్రదక్షిణ విధానం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం |

నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి.. పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎలా చేయాలి..ఎన్నిసార్లు చేయాలి..

నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతుంటారు. కారణం ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు.

అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది.

గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది.

కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకూ ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి.

నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు, సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుండి (చంద్రుని వైపు నుంచి) కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.

ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు (బుధుడి వైపు నుంచి) రాహువు, కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.

చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి, నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది.

️ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి.

శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి.

"ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:”

అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణాలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి.

9 గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి

9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు (అంటే మొత్తం 11) చేస్తే చాలా మంచిదంటారు.

అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపర్చడం వల్ల వారి కారణంగా ఆటంకాలు వుండవని నమ్మకం.

మొదటి ప్రదక్షిణలో..

జపాకుసుమాల వర్ణం గలవాడా, కాశ్యపగోత్రుడా, నవగ్రహమండలనాయకుడా, శ్రీసూర్యభగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువు గాక!

రెండో ప్రదక్షిణలో..

కటకరాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు, శంఖాల వంటి ధవళవర్ణం గలవాడా, ఆత్రేయగోత్రోద్భవుడా, శ్రీచంద్రభగవానుడా, మమ్మల్ని కరుణించు!

మూడో ప్రదక్షిణలో..

బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చిక మేషరాశులకు అధిపతి అయినవాడా.. భరద్వాజగోత్రుడా, శ్రీ అంగారకుడా, మాకు మంగళాలను ప్రసాదించు అని స్మరించుకోవాలి.

నాలుగో ప్రదక్షిణలో..

నల్లని వర్ణం గలవాడా, కన్యా మిథునరాశులకు అధిపతి అయినవాడా, ఉత్తరదిశలో బాణరూపమండలంలో, వసించేవాడా, శ్రీబుధరాజా మాకు మేలు కలిగింతువు గాక!

ఐదో ప్రదక్షిణలో..

అంగీరసగోత్రుడా, ధనుస్సు, మీనరాశులకు అధిపతుడా, దేవగురువైన బృహస్పతీ, శ్రీగురుభగవానుడా, మాపై కరుణను వర్షించు!

ఆరో ప్రదక్షిణలో..

భార్గవగోత్రం గలవాడా, దైత్యగురువైన శుక్రాచార్యుడా, స్త్రీభోగాలను ప్రసాదించేవాడా, మా పైన కరుణావృష్టిని కురిపించు అని స్మరించుకోవాలి.

ఏడో ప్రదక్షిణలో..

కాశ్యపగోత్రుడూ, కుంభ మృగశీర్షాలకు అధిపతి అయినవాడూ.. దీర్ఘాయువును ప్రసాదించేవాడూ, అయిన శ్రీశనైశ్చరుడా, మాకు మంగళాలు కలిగేలా చూడు!

ఎనిమిదో ప్రదక్షిణలో..

సింహికాగర్భసంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్రమండలంలో వుండేవాడా, శ్రీరాహుభగవానుడా, మాకు సదా మంగళాలు కలిగించు!

️తొమ్మిదో ప్రదక్షిణలో..

జైమినిగోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్రస్వరూపంతో వుంటూ, రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీకేతుభగవానుడా, మాకు మేలు కలుగజేయి!అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయవలెను..స్వస్తి..!

లోకా సమస్తా సుఖినోభవంతు..!!

Tuesday, December 3, 2024

పంచముఖ హనుమాన్‌ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే.......!

పంచముఖ హనుమాన్‌ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే.......!!

శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలను జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు.
మీ ఇంట్లో ఏ దిక్కున హనుమంతుడి బొమ్మను ఉంచాలంటే..?
•తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.
•దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
•పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
•ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
•ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.
ఇక.. శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. అలాగే ఆంజనేయ స్వామికి "శ్రీరామజయం" అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

Monday, December 2, 2024

ఏ ఏ క్షేత్రాలలో అన్ని రకాల చక్ర స్థితులు కలుగుతాయి......!!

ఏ ఏ  క్షేత్రాలలో అన్ని రకాల చక్ర స్థితులు కలుగుతాయి......!!

మూలం : కపాల మోక్షం అను మోక్ష సాధనా గ్రంథం ...
1. *మూలాధార చక్రము* -  గణపతి క్షేత్రం (కాణిపాకం)
  
2. *స్వాధిష్ఠాన చక్రము* - నారాయణ క్షేత్రాలు, లక్ష్మీదేవి క్షేత్రాలు (కొల్హాపురం)

3. *మణిపూరక చక్రము* - 108 దివ్య విష్ణు క్షేత్రాలు,( పండరీపురం) శ్రీ కృష్ణ క్షేత్రాలు

4. *అనాహత చక్రం* -మహాకాళి క్షేత్రాలు, మహాకాలుడు క్షేత్రాలు (ఉజ్జయిని)

5. *విశుద్ధి చక్రము* -  మహా సరస్వతి క్షేత్రాలు , గాయత్రీ దేవి క్షేత్రాలు( బాసర)

6. *ఆజ్ఞా చక్రము* -  శివ శక్తి క్షేత్రాలు, శివ కేశవ శక్తి క్షేత్రాలు, రాధా కృష్ణ క్షేత్రాలు (కాశీ, శ్రీశైలం ,బృందావనం)

7. *గుణ చక్రం* -  దత్త స్వామి క్షేత్రాలు( గాణ్గాపురం)

8. *కర్మచక్రం* -  శ్రీరామ క్షేత్రాలు (అయోధ్య)

9. *కాలచక్రం* -  కాలభైరవ, భైరవి క్షేత్రాలు (కాశీ, శ్రీశైలం, ఉజ్జయిని)

10. *బ్రహ్మ చక్రం* -  బ్రహ్మ దేవుడి క్షేత్రాలు
 ( పుష్కర్, చిదంబర క్షేత్రం)

11. *సహస్రార చక్రం* -  మహాశివుడు క్షేత్రాలు ,మహావిష్ణు క్షేత్రాలు, శ్రీ కృష్ణ క్షేత్రాలు (ద్వారక, బృందావనం)

12. *హృదయ చక్రం* -  అనంతపద్మనాభ క్షేత్రం (తిరువనంతపురం)
 హనుమ క్షేత్రాలు( కాశి) ఇష్టలింగం  క్షేత్రం(కర్ణాటక)

13. *బ్రహ్మరంధ్రము* -   ఆది పరాశక్తి క్షేత్రం - దీప దుర్గ క్షేత్రం(తుముకూరు) - దీప కాళికా క్షేత్రం - దీప ఛంఢి క్షేత్రం 

🕉 త్రి గ్రంధులు - త్రిమూర్తుల క్షేత్రాలు, త్రిశక్తుల క్షేత్రాలు

🔯మన యోగ చక్రాల మీద ప్రభావము చూపే గ్రహాలు :

1. మూలాధార చక్రము – ఎరుపు - కుజుడు

2.స్వాధిష్ఠాన చక్రము - పసుపు పచ్చ- బుధుడు

3.మణిపూరక చక్రము – కాషాయరంగు- గురువు

4.అనాహత చక్రం – ఆకుపచ్చరంగు- శుక్రుడు

5.విశుద్ధి చక్రము –నీలం- శని

6.ఆజ్ఞా చక్రము - ముదురు వంకాయ రంగు-అర్ధచంద్రుడు

7. గుణ చక్రం -   ముదురు వంకాయ రంగు- మధ్యస్ధ చంద్రుడు

8. కర్మచక్రం -   ముదురు వంకాయ రంగు- చంద్రుడు

9.కాలచక్రం- ముదురు వంకాయ రంగు- అమావాస్య చంద్రుడు

10. బ్రహ్మ చక్రం- ముదురు వంకాయ రంగు- పౌర్ణమి చంద్రుడు

11.సహస్రార చక్రం – లేత వంకాయ రంగు- సూర్యుడు

12.హృదయ చక్రం- లేతనీలం- గ్రహణ సూర్యచంద్రుడు

13.బ్రహ్మరంధ్రము - తెలుపు – అంతరిక్షం.....

సర్వేజనా సుఖినోభవంతు

Sunday, November 24, 2024

కొన్ని తెలుసుకుందాము

కొన్ని తెలుసుకుందాము 


1. ఇంట్లో నిమ్మకాయ దీపాలు పెట్టకూడదు, ఒకవేళ రాహుకాలం లో పెట్టాలి అనుకుంటే తులసికోట దగ్గర పెట్టుకోవచ్చు.

2.ఎవరైనా మన ఇంట్లో ఉప్పు దొంగతనం చేసారంటే మనకు పట్టిన దరిద్రం పోయి నట్టే, ఉప్పు దానం గా ఇస్తే మన ఇంటి లక్ష్మీని ఇచ్చినట్టు..

3. శుభాకార్యలకు వెళ్ళినప్పుడు వెండి కానుకలు బహుమతి గా ఇవ్వకూడదు..

4. కుంకుమ చై జారి నెల పైన పడితే ఆపశకునం గా భావించకూడదు భూదేవీ స్వేకరించారు అని నమస్కారం చేసుకోవాలి, నెగటివ్ గా ఆలోచిస్తే నెగటివ్ ఎఫర్ట్ పడుతుంది.. 

5. ఆకండ దీపం కొండెక్కితే మళ్ళీ వెలిగించవచ్చు అది దోషం గా భావించకూడదు..

6. న్యూస్ పేపర్ లు పరిచి దేవుడు పటాలు, విగ్రహాలు పెట్టకూడదు..అందులో దుర్వార్థలు కూడా ఉంటాయి..

7. భగవంతుడు దగ్గర నైవేద్యం పెట్టే పాత్రలు పూజ ఐయ్యాక ఆ పాత్ర నుండి విడిగా తీసి గాని లేక గరిటతోగాని ప్రసాదం పంచుకోవాలి అందులోనే తిని భగవంతుడు ప్రసాదం పాత్రలు ఎంగిలి చేయకూడదు ఆలా చేసింది వాడకూడదు. 

8. గురు స్థానం లో ఉన్న వారికి మీరు తినే పల్లాల్లో భోజనం వడ్డీంచకూడదు అది దోషం, విస్తరాకు లో గాని విడిగా కొత్త పల్లెం లో పెట్టాలి..

9. ఇంట్లో తరచూ గోడవలు పిల్లలు చెప్పిన మాట వినకుండా విసిగించడం ఇలా కుటుంబం లో మనశాంతి లేకుంటే.. ఇంట్లో తరచూ సాంబ్రాణి పైన బిర్యానీ ఆకులు తెల్ల ఆవాలు వేసి దూపం వేస్తూ ఉండాలి కాకికి అన్నం పెట్టాలి.. ఇలా చేస్తూ ఉంటే కారణం లేని గోడవలు తగ్గుతుంది.

10. కొందరు భైరవుడికి సమర్పిస్తునట్టు భావించి మధ్యాన్ని కుక్కలకు పోస్తుంటారు అవి తాగడం వల్ల అవి మత్తేక్కి వాహనాలు కింద పడే అవకాశం ఉంటుంది అది మహా పాపం.. ఆలా మధ్యాన్ని ఇవ్వాలి అనుకుంటే ఏ పేద వాళ్ళకైనా భైరవుడి కి ఇస్తునట్టు భావించి ఇవ్వచ్చు.

11. స్నానం చేసుకుని వంటచేయాలి ఆలా వండిన పదార్ధం (అన్నం )పాత్ర తో సహా భగవంతుడు దగ్గర నివేదన చేసి తింటే ప్రసాదం అవుతుంది..

12. చీకటి పడ్డాక తల వెంట్రుకలు చిక్కు తియ్యకూడదు.. ఆడపిల్లలు తల స్నానం చేసినప్పుడు సాంబ్రాణి అప్పుడప్పుడు అయినా సాంబ్రాణి వేస్తుంటే దిష్టి పోతుంది ఆరోగ్యం గా ఉంటారు..

13. జాతకం చూపించకుండా వజ్రాలు
, నీలి రత్నాలు, ధరించకూడదు...

14.. దేవతలు విగ్రహం లాంటి ఉంగరాలు ధరించి నప్పుడు భగవంతుడు పాదాలు నెల వైపు ఉండాలి భూ దేవీ ఆ భారాన్ని బరిస్తుంది మన వైపు ఉండకూడదు..

15. ఆడవాళ్లు దంపతులు కలిసినప్పుడు రోజూ తలస్నానం అవసరం లేదు ఆడవాళ్ళకి పాపటి లో గంగమ్మ ఉంటుంది పాపటిలో కుంకుమ దరిస్తే చాలు, మగవాళ్ళు మటుకు భార్య తో కలిస్తే తలస్నానం చేయకుండా దీపారాధన చేయకూడదు.

16. ఇంట్లో ఆడవాళ్లు మైలు తో ఉంటే వారికి దూరం గా ఉంది నిత్య పూజ కుటుంబం సుభ్యులు చేయవచ్చు..

17. కాలం చేసిన పెద్దలు తరచుగా కలలోకి వస్తే మంచిదే, ఇంట్లో అన్నశాంతి చేయిస్తే వారికి ఆ పుణ్యం దక్కుతుంది.

18. తీర్తయాత్రలకు వెళ్లి ఇంటికి రాగానే స్నానాలు చేసి మీరు తెచ్చిన ప్రసాదం తో పాటు ఇంట్లో నైవేద్యం వండి భగవంతుడు కి సమర్పించాలి.. యాత్ర ఫలితం దక్కుతుంది.. అదే కాశీ క్షేత్రం గాని వేలి వస్తే వడలు దంట కుట్టి వీధి కుక్క గాని ఇంట్లో ఉండే పెంపుడు కుక్క అయినా వాటి మేడలో వేయాలి అందులో ఉప్పు వేయకూడదు ఇది వరకు కాలం లో ఇలా చేసే వారు..

19. నోటితో తరచూ, చావు అనే మాట, దరిద్రం అనే మాట, కష్టం అనే మాటలు వాడకూడదు ఆలా అంటూ ఉంటే.. అవి ఎంత దూరం లో ఉన్నా పిలుస్తున్నారు అని దగ్గరవుతాయి..
తధాస్తు దేవతలు భుజాలు పైనే ఉంటారు.. కారణం లేకుండా ఏడవటం శాపనార్ధాలు పెట్టడం ఆలా పెట్టే వాళ్ళు ఇంట్లో ఉన్నా కలిసి రాదు.

20. స్త్రీ శాపాలు, పితృ దోషాలు ఉన్న వారికి ఏ పని కలిసి రాదు రావాల్సింది చేతికి అందదు.. అసంతృప్తి జీవితం గడుపుతూ విలువైన జీవితం కోల్పోతారు.. అటువంటి పరిస్థితి లో ఉన్నవారు ఒడ్లు నువ్వులుతో రుద్ర హోమం చేయాలి, ఉపశమనం లభిస్తుంది.

21.కొబ్బరికాయ పాతవిగా ఉంటే కుళ్ళిపోతాయి ఆలా ఉంటే ఇంకో టంకాయ కొడితే సరిపోతుంది ఆపశకునం గా బాధ పడకూడదు దోషం పోయింది అనుకోవాలి.

21. జపం చేసే మాల మేడలో వేసుకోకూడదు, మేడలో వేసుకునే మాలను జపానికి వాడ కూడదు.. స్నానం చేయకుండా జప మాల ముట్టుకోకూడదు.

22.పాలు, పెరుగు, నైయ్యి, నీరు, ఇవి ఎక్కడైనా స్వేకరించవచ్చు అందులో లక్ష్మి నివాసం ఉంటుంది.

23. ఎంగిలి గిన్నెలు ఎదురు చూడకూడదు తిన్న వెంటనే కంచాలు కడిగేయాలి..

24. ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే సంవత్సరం వరకు పూజ చేయకుండా దీపం పెట్టకుండా ఉండకూడదు.. అది చాలా దోషం 11 రోజులు కార్యక్రమం తర్వాత పూజలు చేసుకోవచ్చు.
25. వారంలో ఏ రోజు అయితే జన్మిస్తామో ఆ రోజు క్షుర సంస్కారాలు చేయకూడదు..

శ్రీ వెంకటేశాయ నమః 🙏

Friday, November 22, 2024

శివుడు కాలభైరవుడి అవతారం ఎందుకు ఎత్తాడు?కాలాష్టమి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడం ఎలా?

శివుడు కాలభైరవుడి అవతారం ఎందుకు ఎత్తాడు?* 


 కాలాష్టమి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడం ఎలా?* 

*అష్టమి రోజును కాలాష్టమిగా జరుపుకుంటారు. ధార్మిక పురాణాల ప్రకారం, శివుడు ఈ రోజున కాల భైరవుడిగా అవతరించాడు. పరమ శివుడు భయంకరమైన రూపంలో బాబా కాల్ భైరవ్‌గా అవతారమెత్తిన రోజును కాల భైరవ అష్టమి లేదా కాల బైరవ జయంతిగా జరుపుకుంటారు.  కాలాష్టమి రోజున రోజంతా పవిత్రంగా భావించి శక్తివంతమైన కాల బైరవ బాబాను ప్రత్యేకమైన ఆచారాలతో ఆరాధిస్తారు. పరమేశ్వరుడి ఆశీస్సులు అందుకుని ఆధ్మాత్మికంగానూ, సుఖ సంతోషాలతోనూ జీవిస్తామని విశ్వసిస్తారు. మనిషిని నాశనం చేసే కోపం, దురాశ, కామం నుంచి రక్షణ దొరుకుతుందని నమ్ముతారు. శివ పురాణం ప్రకారం.. రోజు శివుడు కాలభైరవ అవతారం ఎందుకు తీసుకున్నాడో తెలుసుకుందాం.*

 *శివుడు కాలభైరవ అవతారం ఎందుకు ఎత్తాడు?* 

*శివ పురాణం ప్రకారం.. ఒకసారి విష్ణువు బ్రహ్మదేవుడిని ఈ విశ్వ సృష్టికర్త ఎవరు అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా బ్రహ్మ తనను తాను గొప్పగా వర్ణించుకుని తానే సృష్టికర్తనంటూ చెప్పుకొచ్చాడు. ఆ సమాధానం విన్న మహావిష్ణువు అతని మాటల్లోని అహంకారానికి, అతి విశ్వాసానికి ఆగ్రహించాడు. ఇద్దరి మధ్య వాదన పెరిగి ఈ ప్రశ్నకు సమాధానం కోసం నాలుగు వేదాలకు వద్దకు వెళ్ళారు. ముందుగా వారు ఋగ్వేదానికి చేరుకున్నారు. అతని సమాధానం విన్న ఋగ్వేదం , "శివుడే శ్రేష్ఠుడు, ఆయన సర్వశక్తిమంతుడు, సకల జీవరాశులు ఆయనలో ఉన్నాయి" అన్నాడు. ఆ తర్వాత ఇదే ప్రశ్నను యజుర్వేదాన్ని అడిగినప్పుడు, "యజ్ఞాల ద్వారా మనం పూజించే వాడు ఉత్తముడు, అతను మరెవరో కాదు శివుడు" అని జవాబిచ్చాడు.*

*దీంతో బ్రహ్మ దేవుడికి కోపం వస్తుంది అతని అహం చల్లారక వారిచ్చే సమాధానాలకు బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు. ఈ చర్య కాస్త తగవుగా మారడంతో పరిష్కారం కోసం పరమ శివుడ్ని కోరతారు. ఆ సమయంలో మహదేవ్ దివ్యకాంతి రూపంలో అక్కడికి చేరుకున్నాడు. ఎంతకీ బ్రహ్మదేవుడు సత్యాన్ని ఒప్పుకోడు. తనకు ఐదు తలలు ఉన్నాయని మహేశ్వరుడి మధ్యవర్తిత్వాన్ని తిరస్కరిస్తాడు. దాంతో ఉగ్ర రూపుడైన శివుడు నుదుటి నుంచి పరమశివుని అంశ అయిన కాల భైరవుడిగా ఉద్భవిస్తాడు. ఐదు తలలు ఉన్నాయని చెబుతున్న బ్రహ్మదేవుని తలల్లో ఒక దానిని ఖండిస్తాడు.*

*అలా కాలభైవర అవతారం ఎత్తిన శివుడు తన అవతారానికి 'కాలా' అని నామకరణం చేసి తాను కాళానికి రాజునని చెబుతాడు. కాలానికి, చావుకు రాజు మరెవరో కాదు శివుని అవతారమైన భైరవుడు. భైరవుడు కాలిపోతున్న బ్రహ్మ తలను తన మొండెం నుండి వేరు చేశాడు. అలా బ్రహ్మను చంపిన పాపం నుండి విముక్తతి పొందడానికి శివుడిని అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించమని భైరవుని కోరాడు. బ్రహ్మ శిరస్సు భైరవుడి చేతిలోంచి కింద పడింది. కాశీలో బ్రహ్మ నరికిన శిరస్సు పడిపోయిన ప్రదేశాన్ని కపాల్ మోచన్ తీర్థం అంటారు. ఆ రోజు నుండి కాలభైరవుడు శాశ్వతంగా కాశీలో నివసిస్తున్నాడని శివ పురాణం చెబుతోంది. కాశీ యాత్రకు వెళ్ళేవారు లేదా అక్కడ బస చేసే వారు తప్పనిసరిగా కపాల్ మోచన్ తీర్థాన్ని సందర్శించాలని నమ్ముతారు.*

 *┈┉┅━❀ \!/꧁ॐ꧂\!/ ❀━┅┉┈*
          *ఆధ్యాత్మికం ఆనందం*
🍁🍁🍁 🌹🕉️🌹 🍁🍁🍁

నరదిష్ఠి ప్రత్యేక మార్గం..........!!

నరదిష్ఠి ప్రత్యేక మార్గం..........!!
నివారణకు మనం చాలా చిన్న చిన్న పరిహారాలు కనుక పాటిస్తూ ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోయి సిరిసంపదలు మన ఇంటికి కలుగుతాయి.

అవి ఏమిటంటే మన ఇంటికి దాదాపుగా మన ఇంటి వైపు ఎవరైతే చూస్తూ ఉంటారో వారందరి కళ్ళల్లో ఉండేటటువంటి ద్రుష్టి దోషం అనేది మన ఇంటి మీద పడుతుంది.

అందుకని మనం ఇంటికి దిష్టి తీసేస్తూ ఉండాలి. అసలు దిష్టి అనేది ఎప్పుడు తీయాలి అంటే ప్రతీ అమావాస్య రోజున ఒక గుమ్మడికాయ అంటే కూర వండుకునే గుమ్మడికాయ తీసుకుని వచ్చి దాని మీద ముద్ద కర్పూరం పెట్టి వెలిగించి ఇంటి ముందు నిలబడి మూడు సార్లు సవ్యదిశాగా దిష్టి తీసి మూడు సార్లు అపసవ్య దిశగా దిష్టి తీయాలి. 

అలా దిష్టి తీసిన తరువాత వెలుగుతూ ఉన్న కర్పూరాన్ని దూరంగా పారేసి ఇంటి గడపకు ముందు కాని గేటు ముందు కాని గుమ్మడికాయను పగలగొట్టేసి దాని లో కొంచం పసుపు, కుంకుమ వేసి నమస్కారం చేసుకుని కాళ్ళు చేతులు కడుక్కుని కళ్ళు తుడుచుకుని కుడి కాలు లోపలకి పెట్టి ఇంట్లోకి వెళ్ళాలి.

ఇదంతా కూడా అమావాస్య రోజున ఉదయాన్నే చేయాలి.తరువాత రోజు ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కలను తీసి పారేయాలి.

అలాగే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకుని దాని ఇంటి గడప మీద పెట్టి కత్తితో రెండు ముక్కలుగా కోసి వాటికి కొంచం పసుపు కొంచం కుంకుమ తీసుకుని ఆ ముక్కలకు వేసి గుమ్మానికి రెండువైపులా  అలంకరిస్తే ఇంటికి ఉన్నటువంటి ద్రుష్టిదోషాలు అన్నీ కూడా తొలగిపోయి నరఘోష, నరపీడ, నరశాపం, నరద్రుష్టి, నకారాత్మకశక్తి అంతా కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరిసంపదలు వచేస్తాయి అని పెద్దలు చెబుతూఉంటారు.

 కాబట్టి ఈ పరిహారాన్ని జాగ్రత్తగా చేసుకుంటే మీ ఇంటికి ఉన్నటువంటి దృష్టిదోషాలు అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి.

చండీ హోమము ఎందుకు చేస్తారు...............!!

చండీ హోమము ఎందుకు చేస్తారు...............!!

అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే.! 
చండీ మాత ఓ ప్రచండ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, కుండలినీ శక్తి! అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం.

లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆదితత్త్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య.

అది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతోపాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి.

1. చండీ హోమం లో ఉన్న మంత్రాలు & అధ్యాయాలు :
చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే, ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, అర్థశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. బ్రాహ్మీ, నందజా, రక్తదంతికా, శాకంబరీ, దుర్గా, భీమా, భ్రామరీ అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహత్య్మ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోమం కనక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది.

దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా, 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో మూడు అధ్యాయాలు, మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, మహిషాసుర సంహారం, శుంభనిశుంభుల వధతోపాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. 

సప్తశతిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు. పూజ, పారాయణ, హోమం. ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణలో దశాంశం హోమం, దశాంశం తర్పణం ఇస్తారు. చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత (పది వేలు) చండీ యాగం, నియుత (లక్ష) చండీ యాగం, ప్రయుత (పది లక్షలు) చండీ యాగం ఉంటాయి.

2. చండీ పారాయణ వలన సమాజానికి జరిగే మేలు:
ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది.

కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు.

వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట.ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, మను చండి (చతుర్దశ చండి)తో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. 

ఇక, శత చండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. కోరికలు నెరవేరతాయి. లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనినే నియుత చండి అంటారు. ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు.

Tuesday, November 19, 2024

శ్రీశైల హటకేశ్వర, మరియు మల్లికార్జునస్వామి ఆలయ క్షేత్ర విశేషాలు

  శ్రీశైల హటకేశ్వర, మరియు మల్లికార్జునస్వామి ఆలయ క్షేత్ర విశేషాలు


*శ్రీశైలంలో హటకేశ్వరము అని ఒక దేవాలయం ఉంది. అది చిత్రమయిన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తాను కుండ పెంకునందు ఆవిర్భవించిన హాటకేశ్వర దేవాలయము క్షేత్రము కనుక దానిని ‘హాటకేశ్వరము అని పిలుస్తారు.

*అక్కడ మెట్లు బాగా క్రిందికి వస్తే ఫాల దారాలు, పంచ దారాలు అని అయిదు ధారలు పడుతుంటాయి. 

*పరమశివుని లలాటమునకు తగిలి పడిన ధారా ఫాలధార. అనగా జ్ఞానాగ్ని నేత్రమయిన ఆ కంటినుండి, పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి క్రింద పడిన ధార. ఇది శివుడి లలాటమును తగిలి వస్తున్నధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం మీరు గొప్ప ఫలితమును పొందుతారు.

*ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడయిన శంకరునికి తగిలి పడిన ధార ఫాలధార. పంచధారలు అయిదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలి పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. చెప్పులతో వెళ్ళకూడదు.

*శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు. అక్కడ ఆయనకు భ్రమరాంబికా దేవి ప్రత్యక్షం అయింది.

*చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే. అంత పరమమయిన ప్రదేశంలో పంచధారలు పడతాయి. అందులో ఒకటి బ్రహ్మధార. ఒకటి విష్ణు ధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార.

*ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త లోక సాక్షులయిన సూర్యచంద్రులు ఈ అయిదు తీర్థములను అక్కడ తీసుకోవచ్చు. అంత పరమపావన మయిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

*శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రమరీనాదము అంటారు.

*అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు.

*అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. 

*శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.

*పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. 

*భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు.

*తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది.

*ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి.

*శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.

*అక్కడ ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనపడతాడు. అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్ర పాలకుడు ఒకాయన ఉన్నాడు.

*రక్త సంబంధమయిన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఒక గంట సేపు శివనామములు చెప్పుకుని కొద్దిరోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి. 

*అలా నయమయిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్ర మూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు. చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమయిన గడ్డు కాలమును ఎదుర్కొంది. తన తండ్రే తనను మోహించాడు. 

*ఆమె పరుగెత్తి శ్రీశైల క్షేత్రమును చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దానిని శివలింగమని అనలేదు.

*అక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకుని ‘మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే – ఇది నీ సిగకు చుట్టుకుని నన్ను నీవు కాపాడు’ అని ప్రార్థించింది.

*అపుడు లింగోద్భవ మూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్నా రాజును చూసి నీవు పచ్చలబండవగుదువుగాక అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చలబండ అయి ఇప్పటికీ అలాపడి ఉన్నాడు.

*ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకుని స్వామి మల్లికార్జునా అని మరొకమారు పిలిపించుకున్నాడు.

*శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము.

*కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది. మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది.

*సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది. ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి 

*“నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నాను. అక్కడకు రా నిన్ను వివాహం ఆడతాను’ అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును, పొదను వెతుకుతోంది.

*అపుడు పార్వతీ దేవి “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్తారు. కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటినుంచి వచ్చింది అని శంకరుని అడిగింది. 

*అపుడు శంకరుడు ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. అపుడు పార్వతీ దేవి అయితే ఆమెకు ఉపాసనలో అంత భక్తి ఉన్నదా? అని అడిగింది.

*అపుడు శంకరుడు ఆమె ఎంత భక్తి తత్పరురాలో చూపిస్తాను చూడు అని వెంటనే 96 సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి పిల్లా నీవు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు? అని అడిగాడు.

*ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబు చెప్పింది. అపుడు ఆయన నేనే శివుడిని, ఇంత వృద్ధుడిని కదా నన్ను పెళ్ళాడతావా? అని అడిగాడు. నీవు వృద్దుడవో యౌవనంలో ఉన్నవాడివో నాకు తెలుసు.

*నాకు నీవే భర్త. వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవడం. చూశావా పార్వతీ, ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను..

*అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలికోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జున లింగమని తలచుకున్న వాళ్ళని, పొంగిపోతూ నేను చూస్తాను.
అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణములు చేస్తున్నారు. ఈవిధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం.

*ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు. అపుడు శంకరాచార్యుల వారు ‘నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయముననే పాతాళగంగ దగ్గరకు వెడతారు. అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు’ అని చెప్పారు.

*మరునాడు ఉదయం ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు ఆయన.

*ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహస్తోత్రంతో ప్రార్థన చేశారు. 

*ఈవిధంగా నరసింహస్వామి దర్శనం ఇచ్చిన క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అది జగద్గురువులను రక్షించుకున్న కొండ. అది మన తెలుగునాట ఉన్న కొండ.

*అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు,  కృష్ణా నది శ్రీశైల పర్వత శిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షినమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది. కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు.

*ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి.

*ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన చెట్టు.

*ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు. ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి.

*ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామీ నెమలితో ఉంటారు.

*శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద యిప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది.

*ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం...

🚩సర్వేజనా సుఖినోభవంతు 🚩

Sunday, November 17, 2024

నవకైలాస క్షేత్రాలు చూశారా?

నవకైలాస క్షేత్రాలు చూశారా?


హిందూ ధర్మంలో తొమ్మిదికి విశిష్ట స్థానం ఉంది. నవగ్రహాలు, నవ నందులు, నవ తిరుపతులు, ఇలా అనేక పుణ్యక్షేత్రాలు తొమ్మిది అంకెతో ముడిపడి ఉన్నాయి. అదే విధంగా నవ కైలాస క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ నవ కైలాస క్షేత్రాల్లో ప్రధాన దైవం ఆ పరమశివుడే. జీవితంలో ఒక్కసారైనా ఈ నవ క్షేత్రాలను సందర్శిస్తే మోక్షం ఖచ్చితమని శైవధర్మాన్ని అనుసరించే వారి నమ్మకం. ఈ నేపథ్యంలో ఆ నవ కైలాస దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి. వాటి విశిష్టతలు ఏమి తదితర వివరాలన్నీ మీ కోసం..
 ఈ నవ శైవ క్షేత్రాలను సందర్శిస్తే మోక్షమే
ఈ నవ కైలాస క్షేత్రాలకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. దీని ప్రకారం పూర్వం అగస్త్య మహాముని వద్ద ఒక శిష్యుడు ఉండేవాడు. అతనికి మోక్షం పొందాలన్న ఆశ ఉండేది.
అదే విధంగా అగస్త్య మహాముని కూడా శిష్యుడి నడవడిక చూసి అతనికి మోక్షం ప్రసాదించాలని భావిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు ధాన్యంలో గుర్చొన్న అగస్త్యమహాముని అకస్మాత్తుగా కళ్లుతెరిచాడు.
అంతేకాకుండా తన ఎదురుగా ఉన్న పువుల్లో తొమ్మిదింటిని తీసుకొని శిష్యుడికి ఇచ్చాడు. ఆ పుష్పాలను నీటిలో వదిలి వాటిని వెంబడిస్తూ వెళ్లాలని చెప్పాడు. అంతేకాకుండా ఒక్కొక్క పుష్పం ఎక్కడైతే భూమిని తాకుతుందో అక్కడ శివలింగాన్ని ప్రతిష్టింపజేయాలని శిష్యుడికి చెప్పాడు.
చివరికి ఆ నది సముద్రంలో కలిసే చోట పవిత్ర స్నానాన్ని చేయాల్సిందిగా శిష్యుడికి సూచించారు. గురువు చెప్పినట్లే చేసి ఆ శిష్యుడు మోక్షం పొందాడు. ఇక ఆ శిష్యుడు ప్రతిష్టించిన తొమ్మిది శివలింగాలను కలిపి నవ కైలాస క్షేత్రాలని అంటారు.
ఈ నవ కైలాస క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. అంతేకాకుండా పాపనాశం అని పిలుస్తారు. ఈ పాపనాశనం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా అంబసముద్రంలో ఉంది. తామిరభరణి నది ఒడ్డున ఈ పాపనాశం ఉంది.
ఇక్కడ కొలువై ఉన్న పరమశివుడిని పాపనాశనాథార్ అని పిలుస్తారు. అంటే పాపాలను నాశనం చేసేవాడు. ఇక్కడ ఉన్న అమ్మవారిని లోకనాయకి అని పిలుస్తారు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు నంది వాహన సమేతులై అగస్త్యమహామునికి దర్శనమిచ్చినట్లు చెబుతారు.
కాగా ఇక్కడ ఉన్న నీటిలో తామ్రం అంటే రాగి లోహం ఎక్కువగా ఉండటం వల్ల ఈ నీటిలో స్నానం చేస్తే చర్మరోగాలు సమిసిపోతాయని భక్తుల నమ్మకం. ఈ పాపనాశం చుట్టు పక్కల చూడటానికి అనేక జలపాతాలు ఉన్నాయి. అందులో అగస్తియార్ జలపాతం అత్యంత అందంగా కనిపిస్తుంది.
శివరాత్రి పర్వదినాన ఈ నవకైలాస క్షేత్రాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో స్వామివారిని సందర్శించుకొంటారు. ముఖ్యంగా పాపనాశం వద్ద భక్తుల రద్ది ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఒక్కొక్క శివుడి దేవాలయం ఒక్కొక్క గ్రహానికి ప్రతీకగా చెబుతారు.
అందువల్లే నవకైలాస యాత్ర నవగ్రహ యాత్ర దర్శన ఫలం అందిస్తుందని స్థానక భక్తుల నమ్మకం. ముఖ్యంగా శని, కాలసర్ప దోషాలతో బాధపడేవారికి ఈ నవ కైలాసయాత్ర వల్ల ఉపశమనం లభిస్తుందని చెబుతారు.
ఇక ఈ దేవాలయాలు తమిరభరణి నదీతీరంలో పాపనాశం నుంచి ప్రతి రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ప్రతి అరల్ముగు కైలాసనాథార్ దేవాలయం అనే పిలుస్తారు. వీటిని దర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని బలంగా నమ్ముతారు.

 ఈ నవ శైవ క్షేత్రాలను సందర్శిస్తే మోక్షమే.
ఆ తొమ్మది క్షేత్రాల వివరాలతోపాటు ఏ ఏ ప్రదేశంలోని దేవాలయంలోని మూలవిరాట్టు ఏ ఏ గ్రహాలను ప్రతిబింబిస్తుందన్న విషయం మీ కోసం...
పాపనాశనం .........సూర్యుడు, చరణ్ మహాదేవి ........... చంద్రుడు, కొడగన్నలూర్...........అంగారకుడు, కున్నత్తుర్............రాహువు, మరపన్నాడు...............గురుడు, తిరువైకుండమ్........శని, తెంతిరుప్పేరయ్...............బుధుడు, రాజపతి........కేతువు, సయిద పొమంగళం...............శుక్రుడు
Nava Kailasam Temples
Pavanasar Temple (Suriyan Temple): Located in Papanasam, Tirunelveli, associated with Suryan (Sun).పాపనాశం కైలాసనాథర్ ఆలయం
స్థానం : పాపనాశం తిరునెల్వేలి నుండి 45 కి.మీ.
ఆలయ సమయాలు : ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4:30 నుండి 8 వరకు.సూచనలు : మధ్యాహ్నానికి ముందు పాపనాశం చేరుకోవడానికి ప్రయత్నించండి, కాబట్టి మీరు ఆలయాన్ని సందర్శించి ఆపై అగస్తియర్ జలపాతానికి వెళ్లవచ్చు. అక్కడ ఉండగా, అగస్త్యుడు మరియు లోపాముద్ర కైలాస్‌లో జరిగే దివ్య కళ్యాణాన్ని కళ్యాణ తీర్థం పైకి ఎక్కండి. మీకు సమయం ఉంటే, ఆనకట్టను కూడా సందర్శించండి.
Sri Ammainathar Temple (Chandran Temple) Navakailayam 2: Found in Melkallur, Cheranmahadevi, Tirunelveli, associated with Chandra (Moon).చేరన్మహాదేవి కైలాసనాథర్ ఆలయం
స్థానం : చేరన్మహాదేవి తిరునెల్వేలి నుండి 20 కి.మీ.
ఆలయ సమయాలు : ఉదయం 7 నుండి 10 వరకు, సాయంత్రం 5 నుండి 8 వరకు

Wednesday, November 13, 2024

శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని రహస్య, విశిష్ట, మహిమాన్వితమైన శివాలయాలు..

శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని
రహస్య, విశిష్ట, మహిమాన్వితమైన శివాలయాలు..
*********************************************


🔸 మహానంది శివలింగం అడుగునుండి వచ్చే నీటితో కొన్ని వందల ఎకరాలు పంటభూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది. ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది..

🔸 ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య ) కె.అగ్రహారంలోని కాశివిశ్వేశ్వర దేవాలయంలోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు..

🔸 ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గ రామేశ్వరాలయం. 
ఈ ఆలయంలో శివలింగం నుండి నీరు ఊరుతూ ఉంటుంది..

🔸 కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరము దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణం వైపు తిరుగుతుంది. ఇది వండర్..

🔸 అలంపూర్ బాల బ్రహ్మేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి, కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు..

🔸 వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి, ఇక్కడ సంగీత స్తంభాలు గలవు. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది..

🔸 ద్రాక్షారామం ఈ శివలింగం పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి..

🔸 భీమవరంలో సోమేశ్వరుడు, ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా, పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు..

🔸 కోటప్పకొండ ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి, ఇక్కడికి కాకులు అసలు రావు..

🔸 గుంటూరు జిల్లా చేజర్ల ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి. లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే శవంకుళ్లిన వాసన వస్తుంది. ఉత్తరభాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు..

🔸 బైరవకొన ఇక్కడ కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు..

🔸 యాగంటి ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు..

🔸 శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక గోడకు చెవి ఆనించి వింటే, ఒకప్పుడు "జుం" అని తుమ్మెద శబ్దం వినపడేదట..

🔸 కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది. 6 నెలలు ఈ దేవలయం నీటిలో మునిగి ఉంటుంది. 6 నెలలు బయటకు కనిపిస్తుంది..

🔸 శ్రీకాళహస్తిలో పంచ భూతాలలో ఒకటైన వాయులింగేశ్వర రూపములో శివలింగం ఉంటుంది. ఇక్కడ స్వామి వారికి కుడివైపున (మనకు ఎడమ వైపున) రెండు జ్యోతులతో దీపం వెలుగుతూ ఉంటుంది. స్వామి వారి వాయు తత్వాన్ని నిరూపిస్తూ ఎల్లప్పుడూ దీపం కదులుతూ ఉంటుంది..

🔸 అమరనాథ్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచుతో శివలింగం ఏర్పడుతుంది..

🔸 కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యి వుంచితే వెన్న అవుతుంది. ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది. మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు..

🔸 మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది..

🔸 కంచి ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు..

🔸 తమిళ నాడు తిరు నాగేశ్వరము ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి..

🔸 చైనాలో కిన్నెర కైలాసము ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం తెలుపుగా, రాత్రి నీలంగా మారుతాడు..

🙏 నమః పార్వతీ పతయే నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ.....🚩🕉️

భైరవి -భైరవుడు....!! అష్టమి - నవమి.......!!


భైరవి -భైరవుడు....!!
అష్టమి - నవమి.......!!


అష్టమి అంటే 8 ఈ సంఖ్యకు అధిపది భైరవుడు, నవమి అంటే 9 ఈ సంఖ్యకు అధిపతి భైరవి ఈ అష్టమి నవమి తిధుల్లో ఉపాసకులు విశేషంగా జప తప ధ్యాన హోమ విధులు తో  దీపదుర్గా ఉపాసన ఇలా ఎవరి సాధనలో వారు విశేషం గా ఆరాధిస్తారు.. ప్రకృతి మొత్తం కాస్మిక్ పవర్ తో అద్వితీయ మైన శక్తితో నిండి ఉంటుంది ఈ పవర్ ని మనము ఎలా వినియోగించుకుంటే అటువంటి శక్తి పొందుతారు అంటే ప్రతి ఒక్కరిలో సహజ సిద్ధమైన స్వభావం అది మంచి కావచ్చు చెడు కావచ్చు ఆ తిది రోజుల్లో అధికంగా ఇతర రోజుల్లో కన్నా ఎక్కువగా ఉంటుంది ఆ సమయాన్ని ఉపాసనతో గడపటం వల్ల మాసం అంతా పొందే సాధనా శక్తి ఆ రెండు రోజుల్లో పొందవచ్చు ఈ కారణంగా నే అన్ని లోకాలలో అష్టమి నవమి తిధులు విశేషంగా అమ్మవారిని ఉపాసన చేస్తారు అమ్మవారినే ఎందుకు అంటే ఆమె ప్రకృతి స్వరూపం ఆమె ప్రకృతిలోని శక్తి మనలోని ఉపాసన తో అధికమైన శక్తిని పొందగలం మంత్ర సిద్ది త్వరగా సిద్ధిస్తుంది ఆ తిధులు అస్త్రాలు వంటివి మనలో పోసిటివి ఎనర్జీ పెరగవచ్చు నెగటివ్ ఎనర్జీ పెరగవచ్చు.. అందుకే ఆ తిధిలో మీరు చేసే ఆరాధన మీలో దోషాలు పోగొట్టే విధంగా ఉండాలి మంత్రం సిద్దించే విధంగా ఉండాలి మీకు ఉన్న గండాలు దోషాలు తొలగిపోయే విధంగా ఉండాలి , పూర్తి రోజు చేయలేకపోయిన ఈ తిధుల్లో విశేష మైన సమయం అష్టమి పూర్తి కావడానికి నవమి మొదలు కావడానికి 40 ని ముందు నుండి నవమి మొదలు అయిన అర్థ గంట వరకు విశేష మైన ఉపాసనా కాలం ఆ సమయంలో జపం లేక మీరు చేసే ఏ సాధన అయినా అత్యంత శక్తిని ఇస్తుంది పరిహార మంత్రాలు శీఘ్ర ఫలితం ఇస్తుంది.. మీతో చాలా కాలం గా ఈ తిధుల్లో ఖడ్గమాల పారాయణ లలితా పారాయణం చేయిస్తున్నాను..ఎన్నో ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు గండాలు అపనిందలు దిష్టి తగాదాలు భయం నిద్రలో ఉలిక్కి పడటం ఇటువంటి ఎన్నో సమస్యలకు ఈ తిధుల్లో దుర్గా దేవిని, భైరవుడు ని భైరవి ని విశేషం గా ఆరాధించాలి. 

ఇక్కడ ఇస్తున్న స్త్రోత్రం జపం చెయ్యవచ్చు ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు తొలగిపోతాయి. శత్రువులు బాధ తొలగిపోతుంది

సర్వఫలప్రదభైరవ స్తోత్రం.....

ఓం భైరవాయ అనిష్ట నివారణాయ స్వాహా
మమ సర్వేగ్రహ అనిష్ట నివారణాయ స్వాహా
జ్ఞనం దేహి ధనం దేహి మమ దారిద్య్రం నివారణాయ స్వాహా
సుతం దేహి యశం దేహి మమ గృహక్లేశం నివారణాయ స్వాహా
స్వాస్థ్యం దేహి బలం దేహి మమ శత్రు నివారణాయ స్వాహా
సిద్ధం దేహి జయం దేహి మమ సర్వ రుణాం నివారణాయ స్వాహా.

వివిధ భైరవ స్ట్రోత్రాలు , దేవి స్ట్రోత్రాలు పారాయణ విశేష ఫలితం ఇస్తుంది.
🌹🌹🌹🙏🙏🙏

Monday, November 11, 2024

కాలినడకన ఇంద్రకీలాద్రికి ప్రదక్షిణలు

అందరికీ స్వాగతం...💐🙏🏼 
ప్రతి నెల పౌర్ణమి రోజున గీరి ప్రదక్షిణలు జరుగుతాయి.. 
ఉదయం 6.గం.లకు ఇంద్రకీలాద్రి కొండ ఎంట్రన్స్ నుంచి మొదలు

మొత్తం 14 km distance  కాలినడకన ఇంద్రకీలాద్రికి ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది..

6 గం.లకు మొదలై 9.గం.లకు ప్రదక్షిణలు పూర్తవుతాయి.. మూడు గంటలు సమయంలో

అనంతరం కొండపైకి వెళ్లి పరిశుభ్రమై అమ్మవారి దర్శనం చేసుకొనవచ్చు 

దేవస్థానం ప్రచార రథం & అమ్మవారి ఉత్సవ మూర్తుల విగ్రహాలు రథం 
గీరి ప్రదక్షిణలో ఉంటాయి. భక్తులు వెనక ముందుగా నడుస్తూ ఉంటారు

ఇంద్రకీలాద్రికి గీరి ప్రదక్షిణలు చేయడం వలన సకల శుభాలు జలుగుతై.. నడవడం మూలన ఎక్కువ అనుగ్రహం కలుగుతుంది, అలాగే పొద్దున్నే నడవడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది, 

నెలలో ఒక్కసారి ఈ  ప్రదక్షిణలలో అందరూ విచేయండి, అమ్మవారి అనుగ్రహం క్షేత్ర అనుగ్రహం మరింతగా పొందండి ,

ఉదయాన్నే చలి అనుకునే వారు స్వేటర్ వేసుకుని రావచ్చు, ప్రదక్షిణలు తొందరగానే అయిపోతాయి.. మళ్ళీ రోడ్ పై ట్రాఫిక్ ప్రదక్షిణలు చేసే వారికి ఇబ్బంది కలగకుండా,

( వాతావరణం వర్షాలు ఉంటే ప్రదక్షిణ ఉండదు )
 
🥭 🥥 🍎 🌿 🌼 🌾 🍁

Welcome to VIJAYAWADA.. INDRAKILADRI

ఓం కనకదుర్గాయే నమః
జై కనకదుర్గా.. జై దుర్గా భవాని...
ఓం నమః శివాయ....🕉️ 🙏🏼

౹౹ ఇంద్రకీలాద్రి ౹౹

𝗞𝗮𝗻𝗮𝗸𝗮 𝗗𝘂𝗿𝗴𝗮 𝗧𝗲𝗺𝗽𝗹𝗲 - 𝗩𝗶𝗷𝗮𝘆𝗮𝘄𝗮𝗱𝗮 

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి 

#Kanakadurga | #Kanakadurgatemple | #Indrakiladri

#Durga | #DurgaBhavani | #DurgaMalleswara 

#Giripradakshina14kms | #Giripradakshina 

#indrakeeladri_giripradhkshina | #Pradakshina

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS