నరసింహ అవతారం.. దశావతారాల్లో ఒక్కో అవతారం ఒక్కో విశేషం. అందులో మన తెలుగునేలకు అత్యంత దగ్గరైన అవతారం శ్రీ నారసింహావతారం. #ఆయా సందర్భాలలో ఆయా క్షేత్రాలలో స్వామి స్వయంభూగా వెలిశారని ప్రతీతి. ఆ నవక్షేత్రాల గురించి సంక్షిప్తంగా
తెలుసుకుందాం....
తెలుసుకుందాం....
1)ఆహోబిలం:
#నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైన అహోబిల నరసింహ స్వామి దేవాలయం కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నుండి సుమారు 25 కి మీ దూరం లో ఉంది . #నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశాపుని చీల్చి చెండాడిన క్షెత్రమిదెనని స్థల పురాణం చెబుతుంది . #హిరణ్యకశాపుని చీల్చి చెండాడిన నరసింహ స్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం ,అహో ..బలం అని ఆశ్చర్యంతో పొగడరటా అందుకీ ఈ క్షేత్రానికి అహోబిల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం గా పేరు వచ్చింది అని చెబుతారు .
#బ్రహ్మాండ పురాణం లో ఈ క్షేత్ర మహత్యం బాగా వివరించడం జరిగింది . #శ్రీ మహావిష్ణువు ఉగ్రనారసింహ అవతారం లో స్థంబం నుంచి ఉద్బవిన్చినట్లు చెప్పే స్థంబాన్ని కూడా అహోబిలం లో చూడవచ్చు . #దిగువ అహోబిలం లక్ష్మి నరసింహ స్వామి శాంతి మూర్తి అయి వెలసిన క్షేత్రం, కొండ పైన ఎగువ అహోబిల నరసింహుని చుడవొచ్చు . #హిరణ్య కసపుడిని సంవరించి అహోబిలమ కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి . (1) భార్గవ నరసింహ స్వామి (2) యోగానంద నరసింహ స్వామి (3) చత్రపట నరసింహ స్వామి (4) ఉగ్ర నరసింహ స్వామి (5) వరాహ నరసింహ స్వామి (6) మాలాల నరసింహ స్వామి (7) జ్వాల నరసింహ స్వామి ( పావన నరసింహ స్వామి (9) కారంజ నరసింహ స్వామి నవ నరసింహ క్షేత్రాలు ఇక్కడ ఫాల్గుణ మాసం లో ఇక్కడ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి .
2)యాదాద్రి:
#నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహ స్వామి కి ఘనమైన చరిత్ర ఉంది . పూర్వం ఋష్య శ్రున్గుని కుమారుడైన యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. అప్పుడు మహా విష్ణ్వు ప్రత్యక్షమవ్వగా తనకు నరసింహస్వామిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాల నరసిమ్హుండు,యోగానంద నరసిమ్హుండు అనే రూపాలలో కనిపించాడట. ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట . స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.ఇప్పుడు ఈ ప్రదేశాన్ని తొలచి ఇంకా విశాలంగా తిర్చిదిద్దరట. లోనికి దిగేముందు పంచముఖ ఆంజనేయ స్వామి కోవెల ఉంది . ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండ పై గండబేరుండ నరసింహమూర్తి ఉంది గర్బ గుడి లో జ్వాల నరసింహ,యోగానంద నరసింహ మూర్తులు ఉన్నాయి . కొండపైన స్వామి వారి పుష్కరాని కూడా ఉంది . ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే సకల కష్టాలు, రోగాలు నయమయిపోతాయని భక్తుల నమ్మకం.
3)మాల్యాద్రి లక్ష్మీనారసింహస్వామి:
#అగస్త్య మహాముని ఈ మాల్యాద్రి పైన తపమాచరించగా లక్ష్మి నారసింహుడు జ్వాల రూపుడై దర్శనమిన్చ్చాదని ,జ్వాల నరసిమున్హి గ కొండ పైన వెలిసారు అని పురాణం గాథ . మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కందుకూరు - పామూరు రోడ్డు లో వలేటివారిపాలెం మండల పరిధి లోని ఈ ఆలయం ఉన్న కొండలు పూలమాల ఆకారం లో ఉండటం తో ఈ ప్రాంతానికి మాలకొండ, మాల్యాద్రి అని పేరు వచ్చాయి. ప్రకృతి శోభకు నిలయమైన మాలకొండ ఏకశిలా నిర్మితం కావడం విశేషం . జ్వాల నరసింహుని పూజించిన మార్కండేయ ముని సమీపం లోని యేరులో స్నానం ఆచరించారని అదే మార్కండేయ నది అని చెబుతారు.
4)సింహాద్రి:
#విశాఖపట్టణానికి 16 కి మీ దూరం లో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున గల కొండ పైన వెలసిన నరసింహ క్షేత్రం ఇది . నవ నరసింహ క్షేత్రాల్లో ఇది ఒకటి . ఈ దేవాలయాన్ని సుమారు 9 వ శతాబ్దంలో నిర్మించారు అని శాసనాలు చెబుతున్నాయి . గర్భాలయం లో స్వామీ వారు వరాహ ముఖం , మానవాకారం , సింహపు తోక కలిగి ఉంటారు . వరాహ -నరసింహ మూర్తుల సమ్మేళనం లో వెలసిన ఈ స్వామి ని సింహాద్రి అని పిలుస్తారు . ఈ గుడి ముఖ మండపం లో ఒక స్తంభం ఉంది. దానిని కౌగిలించుకొని భక్తులు వరాలు కోరుకుంటే తప్పక నేరువేరుతాయని భక్తుల విశ్వాసం. అద్బుతమైన శిల్ప సంపద, అందమైన చెక్కడాలు ఎంతో రమణీయంగా ఉంటాయి . వరాహ పుష్కరిణి కొండ క్రింద ఆడవి వరం గ్రామం లో ఉంది . ప్రతి సంవత్సరం పుష్యమాసం లో స్వామి వారు తన దేవేరుల సమేతంగా కొండ దిగి వచ్చి పుష్కరిని లో ఉన్న భైరవ స్వామి ని దర్శించి అనంతరం కొండ కి చేరి స్వామిని దర్శనం చేసుకోవాలని చరిత్ర చెబుతుంది .
5)ధర్మపురి లక్ష్మీ నారసింహస్వామి:

No comments:
Post a Comment