Tuesday, February 20, 2018

వీరాంజనేయ స్వామి –పొన్నూరు






వీరాంజనేయ స్వామి –పొన్నూరు

గుంటూరు జిల్లా పొన్నూరులో కూడా భారీ విగ్రహ రూపం లో శ్రీ వీరాంజనేయ స్వామి వెలుగొందుతున్నాడు.

స్వామి విగ్రహం 24అడుగుల ఎత్తు ,12అడుగుల వెడల్పు తో ఉంటాడు .

పొన్నూరు అంటే-పొన్ను అంటే బంగారం ఊరు అంటే గ్రామం కనుక బంగారు గ్రామం లేక స్వర్ణ పట్టణం అని అర్ధం.

వైశ్య స్వామి సద్గురు జగన్నాధ స్వామి గారు పూనుకొని చేయించిన కార్యక్రమం ఇది. ఆయన స్వయంగా గ్రామ గ్రామాలు తిరిగి శిష్యులకు జపదీక్ష నిచ్చి ,విగ్రహం తయారై బయల్దేరే సమయం లో అన్ని గ్రామాల భక్తులను ఆహ్వానించి యడ్లపాడు నుండి పొన్నూరు దేవాలయం చేరేవరకు ఏ విధమైన ఆటంకాలు కలుగ కుండా చూడమని తాము చేసిన జపఫలితాన్ని ధారాదత్తం చేసి అత్యంత క్రమశిక్షణతో దీక్షతో శోభాయాత్రలా నిర్వహించారు.

యడ్లపాడులో బయల్దేరినప్పుడు వెలిగించిన కర్పూరజ్యోతి పొన్నూరు ఆలయం చేరేవరకు అఖండంగా వెలిగెట్లు చూస్తూ, అత్యంత భక్తీ శ్రద్ధలతో స్వామిని అంగ రంగ వైభోగం గా తోడ్కొని తెచ్చి ప్రతిష్ట చేశారు. ఆ జ్యోతి నేటికీ అఖండం గానే వెలుగుతూనే ఉండటం ప్రత్యేకత. అందరి జప ఫలాలను ధార పోసి తెచ్చిన స్వామి అంటే గొప్ప మహిమాన్వితుడై విరాజిల్లుతున్నాడు .

విగ్రహ నిర్మాణానికి రెండు సంవత్సరాలు పట్టింది. అక్కడి నుండి పొన్నూరుకు చేర్చటానికి ఒక ఏదాది పట్టింది అంతటి అకుంఠిత దీక్షతో భక్తులు స్వామిని పొన్నూరుకు తెచ్చుకొన్నారు. అందుకే భక్తులపాలిటి ‘’కొంగు పొన్ను’’ అంటే బంగారం అయ్యాడు వీరాంజనేయస్వామి. భయంకరంగా కనిపిస్తాడు. ఎడమ చేతిలో భారీగదతో ,కుడి చేయి పైకెత్తి దర్శనమిచ్చే నల్ల రాతి భారీ ఆంజనేయస్వామి తోక శిరస్సుదాకా వెనక కనిపిస్తుంది. ఆభరణాలతో వెండినేత్రాలు నుదుట వెండి తిరునామం తో ఉంటాడు లంగోటి కట్టికనిపిస్తాడు .

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS