Thursday, May 27, 2021

వైశాఖ శుద్ధ పౌర్ణమి ఉగ్ర నరసింహుని అవతార సమాప్తి అరవీర భయంకర శరభేశ్వర జయంతి.

🌸
వైశాఖ శుద్ధ పౌర్ణమి
ఉగ్ర నరసింహుని అవతార సమాప్తి
అరవీర భయంకర శరభేశ్వర జయంతి.

హిరణ్యకశిపుడి
 కడుపును చీల్చి
ప్రేగులను  N వేసుకొని , రక్తాన్ని త్రాగి సంహరించిన ?
ఉగ్ర నరసింహుడు అ.సుర లక్షణాలతో
మరింత ఆగ్రహావేశాలు జ్వాలల్లా పెరిగి , అదేపనిగా ఆకాశమే దద్ధరిల్లే విధంగా , 
విశ్వMmmM?.మే భయంతో వణికిపొయ్యేలా , 
అరణ్యములో వేగంగా తిరుగాడుతుంటే 
భూమి యావత్తు కంపించిపోతుంటే...
అహోబిలానికి విచ్చేసిన 
ముక్కోటి దేవతలు భయభ్రాంతులకు లోనై భీతిల్లిపోతూ , అనేక విధాలుగా నారసింహుని శాంతించమని వేడుకోసాగినా , మరింత ఉగ్రావేశంతో అడుగులు వేస్తుంటే.. అడవిలో జ్వాలలు పెరగసాగాయి.
సర్వ దేవతలు భయబ్రాంతులకు లోనై పరమశివుణ్ణి వేడుకొనగా ... వీరభద్రున్ని పంపి , విష్ణువు యొక్క ఆగ్రహాన్ని లొంగదీయమని తెలిపి పంపించగా... తన తీక్షణమైన చూపులతోనే అతిలోక భయంకరుడైన వీరభద్రున్నే అదృశ్యం చేయడంతో..  ఇక పరమశివుడే అత్యంత భీకర శక్తివంతమైన రూపంతో సగం మానవుడిగా , సగం మృగంగా , మరో సగంగా పక్షి రూపంలో అతిపెద్ద పరిమాణంలో , ఒళ్ళంతా పొక్కులతో , అనేక చేతులతో , పటిష్టమైన పంజాలతో , నిప్పు కణితల్లే మండుతూ వున్న మూడు కన్నులతో , అతి పెద్ద శిరోజాలతో , పెద్దదైన తోకతో ,  అతిపెద్ద రెక్కలతో , పొడవైన సూదిగా వుండేలా దంతాలతో , 
భరించలేని బుసలు కొడుతూ ,
వినలేని ఉరుముల్లాంటి గొంతుతో ప్రతిధ్వనులు చేస్తూ... నరసింహునికి శక్తికి మించిన ఆకారంతోనూ పరమశివుడే
వైశాఖ శుద్ధ పౌర్ణమి నాటి సాయంత్రం వేళల్లో
శ్రీ శరభేశ్వర అవతారాన్ని ధరించి
నారసింహుని ఎదుట ప్రత్యక్షమై ,
నరసింహునితో హోరాహోరీగా తలపడగా.. పరమేశ్వరుడు ఇక నరసింహుని అవతార సమాప్తి చేయాలని తన పొడవాటి తోకతో నారసింహుని చుట్టి పైకెత్తి గిరగిరా తిప్పి పడబోయే సమయంలో... వచ్చినది పరమేశ్వరుడే అని నారసింహుడు తలచి ..
ఓ శరభేశ్వరా ! శరభ ! శరభ !! అని పిలుస్తూ..  
నా ఉగ్రరూపాన్ని విరమిస్తున్నాను అని తెలిపి ,
శరభేశ్వరునికి తన సింహపు చర్మ శరీరాన్ని వలచి కానుకగా సమర్పించగా , నారసింహుని తలను పరమేశ్వరుని మెడలోని పుర్రెల హరంలో ఒక్కటై స్థిరపడుతుంది.
ఈవిధంగా నరసింహుని అవతారం
వైశాఖ శుద్ధ చతుర్దశితో జన్మించి
( సరిగ్గా ఇరవై నాలుగు గంటలు మాత్రమే )
వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజుతో
అవతార సమాప్తి కాగా ,
పరమేశ్వరుడు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున శరభేశ్వరునిగా అవతరించి లోక కళ్యాణం గావిస్తాడు.
అనంతరం , శ్రీ నరసింహుడు నిజరూపమైన 
శ్రీ మహావిష్ణువు రూపాన్ని స్వీకరించి , శ్రీలక్ష్మీ సమేతుడై వైకుంఠానికి ప్రయాణం కాగా ,
ప్రదోష సమయంలోనే శరభేశ్వరుడు అవతరించిన పౌర్ణమి అత్యంత పవిత్రమైన పుణ్యపర్వదినంగా ఆరాధించుకోవాలని శివ పురాణం నందు వివరింపబడింది.

No comments:

Post a Comment

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS