Friday, February 18, 2022

సందేహం- సమాధానం

 సందేహం- సమాధానం


1. ప్రశ్న:

స్త్రీలు మంగళసూత్రం కట్టుకున్న త్రాడు

ఎన్నాళ్ళకి ఒకసారి మార్చి కొత్తది కట్టుకొనవలెను ?

జవాబు:

మాంగల్యం కట్టిన పసుపు త్రాటిలో

ఒక నూలు పోగు పోయినాసరే,

శని, మంగళవారాలు కాకుండా

మిగిలిన రోజులలో రాహుకాలం, మరణయోగం,       లేకుండా మంచి సమయం చూసి క్రొత్త పసుపు త్రాడు కట్టుకొనవలెను.( మాంగల‌్యం పసుపుత్రాడులో కట్టుకొనటమే విశేషము)

2. ప్రశ్న:

స్త్రీలు రెండు చేతులతో

రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తూ         వినాయకునికి నమస్కరించవచ్చునా?

జవాబు:

రెండు చేతులతో

రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తున్నట్టు

భావన చేస్తూ స్త్రీలు నమస్కరించవచ్చును 

3. ప్రశ్న:

సుమంగళి స్త్రీలు చందనం పెట్టుకోవచ్చునా ?

జవాబు:

నుదుట కుంకుమ పెట్టుకుని

దానిపైన చిన్నగా విభూతి పెట్టుకొనవచ్చును.        చందనం కంఠానికి రాసుకోవలెను.*

4. ప్రశ్న:

భర్త , పిల్లల ఆరోగ్యం

కుటుంబ క్షేమం కొరకు గృహిణి వారానికి

ఒక రోజు ఏ దేవతకి పూజ చేస్తే మంచిది?*

జవాబు:

శుక్రవారం అమ్మవారి పూజ చేయవలెను.         దేవాలయంలో పరాశక్తి అర్చన చేయవలెను

క్షేమం కలుగుతుంది.*

5.ప్రశ్న:

కుటుంబంలో దారిద్ర్యం తీరి పిల్లలకు వివాహాలు కావడానికి నేను ఏ స్తోత్రాలు చదవాలి ?

జవాబు:

మీరు ప్రతిరోజు

పారాయణం చేయవలసిన స్తోత్రం…

విదేహి దేవి కళ్యాణం విదేహి పరమం శుభం

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో‌ దేహి

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS