Sunday, August 31, 2025

అలవెల్లి మల్లవరం శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం మహిమ

 అలవెల్లి మల్లవరం శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం మహిమ 


పిల్లలు లేని వారు ఈ పవిత్ర క్షేత్రంలో ఒక రాత్రి నిద్రిస్తే సంతానం లభిస్తుందని అచంచలమైన నమ్మకం ఉంది. ఎన్నో కుటుంబాలు ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ మహిమను అనుభవించాయి.
ఈ ఆలయ మహిమను ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా తన ప్రవచనాలలో ప్రస్తావించారు.

📍 స్థానం:
గొల్లప్రోలు మండలం, పిఠాపురం నియోజకవర్గం, కాకినాడ జిల్లా (పూర్వ తూర్పుగోదావరి జిల్లా)

🚩 ప్రయాణ సౌకర్యం

1️⃣ పిఠాపురం వైపు నుండి

పిఠాపురం నుండి 14 కి.మీ. దూరంలో ఉంది.

విజయవాడ, హైదరాబాద్, చెన్నై, కాకినాడ వైపు నుండి వచ్చే వారు పిఠాపురం లేదా సామర్లకోట రైల్వేస్టేషన్‌ లో దిగాలి.

అక్కడ నుండి చేబ్రోలు చేరుకొని, 6 కి.మీ. ప్రయాణం చేస్తే అలవెల్లి మల్లవరం/పాముల మల్లవరం శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం దర్శనం లభిస్తుంది.

2️⃣ విశాఖపట్నం వైపు నుండి

విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశా నుండి వచ్చే వారు అన్నవరం ద్వారా రావచ్చు.

అన్నవరం రైల్వే స్టేషన్‌లో కొన్ని మాత్రమే ట్రైన్లు ఆగుతాయి.

అన్నవరం నుండి కత్తిపూడి → చేబ్రోలు → మల్లవరం శ్రీ సుబ్రహ్మణ్యం దేవస్థానం చేరుకోవచ్చు.

⚠️ గమనిక: అన్ని ట్రైన్లు సామర్లకోట జంక్షన్ వద్ద ఆగుతాయి. సామర్లకోట నుండి పిఠాపురం నుండి చేబ్రోలు నుండి మల్లవరం ఆలయానికి చేరుకోవడం సులభం.

🌐 మరిన్ని వివరాలు అధికారిక దేవస్థానం వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

🙏 అలవెల్లి మల్లవరం శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి క్షేత్రం మహిమ అనుభవించి, మీ కోరికలు తీర్చుకోండి.


గురువులు ఎన్ని రకాలు ఉంటారు ? గురువుల వలన నీకు ఏమిటి ఉపయోగం ? ఏ గురువుని నువ్వు ఎలా ఆశ్రయించాలి?




గురువులు ఎన్ని రకాలు ఉంటారు ? గురువుల వలన నీకు ఏమిటి ఉపయోగం ? ఏ గురువుని నువ్వు ఎలా  ఆశ్రయించాలి?

1) సూచక గురువు:- 

బాల్యం నుండి నీకు నాలుగు అక్షరాలూ నేర్పించి కే.జి నుండి పి.జి వరకు నీకు బ్రతుకు తెరువు కోసం భోదన చేసే గురువులు ఎందరో  నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నత స్దితిలో ఉండటం కోసం ఎన్నో సలహాలు ఇస్తారు. వీరిని సూచక గురువు అంటారు. వీరి ద్వారా భుక్తి మార్గం తెలుసుకుంటావు.

2) వాచక గురువు:-

 ధర్మా ధర్మ విచక్షణ , మంచి చెడు విశ్లేషణ , చతురాశ్రామాలు వాటి ధర్మాలు గురించి చెపుతారు. ( బ్రహ్మ చర్యము , గృహస్థము , వానప్రస్దానం , సన్యాసం )  వీరి ద్వారా ఎలా జీవించాలి అని అవగాహనతో నివసిస్తావు.

3) బోధక గురువు:-

 మహా మంత్రాలను ఉపదేశిస్తారు లౌకికంగా కోర్కెలు తీర్చే వాటిని , అలౌఖిమైన మోక్షానికి మార్గం చూపే వాటిని  వీరిని భోధక గురువు అంటారు. లోకికం నుండి అలౌఖికం వరకు మెల్లగా అడుగులు వేస్తావు...

4) నిషిద్ద గురువులు:-

 మారణ ప్రయోగాలు , వశికరణాలు , వినాశనాలు ఇలాంటివి నేర్పే గురువులను నిషిద్ద గురువు అంటారు. ఇలాంటి వారి దగ్గరకు వెళ్ళక పోవడం చాలా మంచిది చిత్తాన్ని శుద్ధి చేయరు విత్తాన్ని హరిస్తారు. ( పతనం కావాలి అనుకుంటే ఇలాంటి గురువులను ఎన్నుకోవాలి.)*

5) విహిత గురువు:- 

మన హితము గోరి సూచనలు సలహాలు ఇస్తారు , నశించి పోయే విషయ భోగాలు పై ఆసక్తి తగ్గించి, సత్యమైన శాశ్వతమైన విషయాలపై అంతర్ముఖం చేస్తాడు.( ఏది సత్యం ఏది అసత్యం అని విచక్షణతో జీవిస్తావు....

6) కారణ గురువు:- 

ఇతను మోక్షం గురుంచి మాత్రమే చెపుతారు. ఎన్ని సుఖాలు అనుభవించినా అంతిమ లక్ష్యం ముక్తి ఐహిక బంధాల నుండి విముక్తి అని చెప్పి శిష్యులను ఎప్పుడు ఎరుకలో ఉంచుతూ ఉంటారు. ( నిత్య ఎరుకతో కర్మ యోగిలా కదిలి పోతూ ఉంటావు.)

7) పరమ గురువు:- 

ఇతను సాక్షాత్ భగవత్ స్వరూపం పరిపక్వం చెందిన శిష్యుని వెతుకుతూ వస్తారు. శిష్యునికి సన్మార్గం భోధించి ‘’ఈ చరాచర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే’’ అని అనుభవ పూర్వకంగా తానూ తెలుసుకుని "అహం బ్రహ్మస్మి" అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని నీకు అవగహన కల్పించి నీవు అనుభూతి చెంద గలిగే స్దితికి తీసుకు వెళ్ళేవారు ఈ "పరమ గురువులు". వీరు ఎక్కడో కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు. నీ నిజజీవితంలో ఇలాంటి గురువు తారస పడితే సాక్షాత్ భగవంతుడు నీతో జత నడిచినట్లే. నువ్వు వచ్చిన పని నీకు తెలియచేసి నీజన్మల విడుదలకు మార్గం చూపేవారు ఈ "పరమగురువు"

మరాఠా గడ్డపై అష్ట గణపతి క్షేత్రాలు

మరాఠా గడ్డపై అష్ట గణపతి క్షేత్రాలు

పంచారామాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు ఇలా కొన్ని పుణ్యక్షేత్రాలు ఒక సంఖ్యతో చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ప్రసిద్ధి చెందాయి ఆ క్షేత్రాలు. ఆ కోవలో చెప్పుకోవలసినవే అష్టగణపతి ఆలయాలు. ఇవి వినాయక ఉత్సవాలకు అత్యంత ప్రసిద్ధి చెందిన, గాణాపత్య సంప్రదాయానికి పెట్టింది పేరైన మహారాష్ట్రలో, వివిధ ప్రదేశాల్లో కొలువుతీరి ఉన్నాయి. ఇవి స్వయంభూ వినాయక ఆలయాలు. ఈ దేవాలయాల గురించి హిందువుల పవిత్ర గ్రంథాలైన గణేశ్‌ ‌ముద్గల పురాణాలలో కూడా ప్రస్తావన ఉందని చెప్తారు పెద్దలు..

అష్టగణపతి ఆలయాలు దర్శించుకుంటే సకలకష్టాలు తొలగి, సర్వసుఖాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అష్ట గణపతి యాత్రలో మొట్టమొదట చెప్పుకోవలసినది మయూర గణపతి క్షేత్రం..

#మయూరగణపతి_క్షేత్రం

ఈ క్షేత్రం మహారాష్ట్రలోని బారామతి తాలూకాలోని ‘మోర్‌ ‌గావ్‌’ ‌గ్రామంలో ఉంది. ఈ క్షేత్రంలో ఉండే వినాయకుని ‘మయూరేశ్వర్‌’ అని పిలుస్తారు. నిజానికి వినాయకుని వాహనం ఎలుక కదా. కానీ, ఇక్కడ వినాయకుని వాహనం మయూరం (నెమలి). పూర్వం సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలోని ప్రజలను, మునులను, దేవతలను నానా కష్టాలు పెడుతూంటే తమను రక్షించమని వినాయకుని ప్రార్థించారు. అప్పుడు వినాయకుడు మయూరవాహనం మీద వచ్చి ఆ రాక్షసుణ్ణి సంహరించి అందరికీ ఆనందం కలిగించాడు. అందుకే ఇక్కడ వినాయకుడు మయూరవాహనం మీద దర్శనమిస్తాడు. హిందీలో మోర్‌ అం‌టే ‘నెమలి’. అందుకే ఈ స్వామిని ‘మోరేశ్వర్‌’ అని పిలుస్తారు. అరణ్యవాసకాలంలో పాండవులు ఈ స్వామిని పూజించారని, వారు పూజించిన అసలైన వినాయక విగ్రహం, ప్రస్తుతమున్న విగ్రహానికి వెనుకన ఉంటుందని చెప్తారు. ఈ ఆలయం చూడడానికి హిందూ ఆలయంలా కాక నాలుగువైపులా మినార్లతో ఒక మసీదు మాదిరిగా కనిపిస్తుంది. అప్పట్లో తురుష్క చక్రవర్తుల దాడులు ఎక్కువగా జరిగేవని ఆ దాడుల నుంచి కాపాడడం కోసం ఈ ఆలయాన్ని అలా కట్టారనీ చెప్తారు. ఈ క్షేత్రంలో వినాయకచవితినాడు, విజయదశమినాడు ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి..

#సిద్ధివినాయక_క్షేత్రం

ఈ క్షేత్రం అహ్మదునగర్‌ ‌జిల్లాలోని ‘శ్రీగొండ’ పట్టణానికి సమీపంలోనున్న చిన్నకొండమీద ఉంది. ఈ ఆలయం మొట్టమొదట శ్రీ మహావిష్ణువు చేత నిర్మించబడిందని, ఆ తరువాత ఈ ఆలయాన్ని పీష్వాలు నిర్మించారని స్థలపురాణం చెప్తోంది. సాధారణంగా వినాయకుని తొండం ఎడమ వైపునకు తిరిగి ఉంటుంది. కానీ ఇక్కడి వినాయకుని తొండం మాత్రం కుడిచేతి వైపునకు తిరిగి ఉంటుంది. అదే ఈ వినాయకుని ప్రత్యేకత. ఇక్కడ స్వామివారు సిద్ధి, బుద్ధి సమేతుడై కొలువుతీరి ఉంటాడు.

పూర్వం మధు, కైటభులనే రాక్షసులను సంహరించడం కోసం శ్రీమహావిష్ణువు ఈ వినాయకుని సహాయం తీసుకున్నాడనీ, అందుకు కృతజ్ఞతగా శ్రీమహావిష్ణువే స్వయంగా ఈ లంబోదరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించి, ఆలయం నిర్మించాడనీ స్థల పురాణం చెప్తుంది. వినాయకుడి వరం వలన కార్యసిద్ధి జరిగింది కాబట్టి ఈ ప్రాంతం సిద్ధక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి ఒక్క ప్రదక్షిణ పూర్తి చేయాలంటే సుమారు అరగంట సేపు కొండ చుట్టి రావాల్సి ఉంటుంది. అయినా కోరిన కోరికలు తీర్చే స్వామి, పనులను సానుకూల పరిచే కార్యసిద్ధి గణపతి కనుక, భక్తులు ఎంతో భక్తిగా, శ్రమకు వెనుకాడకుండా, గిరి ప్రదక్షిణం చేసి మొక్కులు తీర్చుకుంటారు..

#వరద_వినాయక_క్షేత్రం

పూణె నగరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలోని ‘మహద్‌’ ‌గ్రామంలో వెలిసిన స్వామి వరదవినాయకుడు. పూర్వం ఈ ప్రాంతాన్ని రుక్మాంగదుడు అనే రాజు పాలించేవాడు. ఒకరోజు రుక్మాంగదుడు భార్యాసమేతుడై ఈ గ్రామంలోని ‘వాచక్నవి’ దర్శనార్థం వచ్చాడు. రుషిపత్ని మహారాజుని, అతడి వైభోగాన్ని చూసి అతడి మీద మనసుపడుతుంది. మహారాజు ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించి వెళ్లిపోతాడు. ఈ సంగతి తెలిసి ఇంద్రుడు మహారాజు రూపంలోవచ్చి రుషిపత్నితో కలుస్తాడు. ఆ కారణంగా ‘గృత్సమధుడు’ అనే పుత్రుడు కలుగుతాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాక, తన జన్మరహస్యం తెలుసుకుని వినాయకుని గురించి తపస్సు చేస్తాడు. వినాయకుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు. ‘అందరి పాపాలు పోయేలా నువ్వు ఇక్కడ ఉండాలి’ అన్నాడు గృత్సమధుడు. అతడి భక్తికి మెచ్చిన వినాయకుడు అక్కడ స్వయంభువుడుగా వెలిసాడు. అదే వరదవినాయక క్షేత్రం. ఈ ఆలయంలోని దీపం కొన్ని శతాబ్దాల నుంచీ అఖండంగా వెలుగుతూనే ఉందని చెప్తారు..

#గిరిజాత్మజ్‌_వినాయక_క్షేత్రం

పూణేకు 90 కి.మీ.ల దూరంలో ఉన్న ‘లేన్యాద్రి’ పర్వతంమీద, బౌద్ధగుహల మధ్యన ఉన్న ఆలయమే ‘గిరిజాత్మజ వినాయక ఆలయం’. పార్వతీదేవి ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాతే నలుగుపిండితో చేసిన బాలగణపతికి ప్రాణం పోసిందనీ, తనకు కౌమారప్రాయం వచ్చేవరకూ గణపతి తన తల్లితో కలిసి ఇక్కడే ఉన్నాడనీ స్థల పురాణం చెప్తోంది. ఎత్తైన కొండ మీద గుహలో కొలువుతీరాడు స్వామి. స్తంభాలు లేకుండా కేవలం ఏకశిలనే ఆలయంగా మలిచి మెట్లు నిర్మించారు. 307 మెట్లు ఎక్కి ఆలయానికి చేరుకోవాలి. నడవలేనివారి కోసం డోలీల సౌకర్యం కూడా ఉంటుంది. విద్యుద్ధీపాల అవసరం లేకుండా పగటివేళలో సూర్యకిరణాలు ఆలయంలో పడేలా నిర్మించడంచేత ఈ స్వామిని చక్కగా దర్శించకోవచ్చు..

#చింతామణి_గణపతి_క్షేత్రం

షోలాపూర్‌-‌పూణె మార్గంలో, పూణేకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘థేవూర్‌’ ‌గ్రామంలో వెలిసాడు చింతామణి గణపతి. ఈ గ్రామంలో కపిల మహాముని కొంతకాలం తపస్సు చేసాడట. ఆయన దగ్గర భక్తుల కోరికలు తీర్చే ‘చింతామణి’ అనే మణి ఉంది. ఓసారి ఈ ప్రాంతాన్ని పాలించిన అభిజిత్‌ ‌మహారాజు కుమారుడు ‘గుణ’ కపిలమహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ మణి ప్రభావాన్ని గుర్తిస్తాడు. ఆ మణిని అపహరించుకొని వెళ్ళిపోతాడు. దాంతో కపిలమహర్షి గణపతి సాయంతో ఆ రాజును జయిస్తాడు. ఆ మణిని తిరిగి పొందుతాడు. స్వామివారి అనుగ్రహంతో వచ్చిన ఆ మణిని తిరిగి గణపతి మెడలో అలంకరిస్తాడు. అప్పటి నుంచి ఈ గ్రామం ‘కదంబనగర్‌’ ‌గానూ, ఈ స్వామి ‘చింతామణి గణపతి’ గానూ ప్రసిద్ధి పొందాడు. రాజుతో యుద్ధం కదంబ వృక్షం దగ్గర జరిగిన కారణంగా, ఆ ప్రాంతాన్ని కదంబ తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని పీష్వాల కాలంలో నిర్మించారు..

#మహాగణపతి_క్షేత్రం

రంజన్‌ ‌గావ్‌ ‌గ్రామంలో కొలువుతీరిన ఈ ‘మహాగణపతి’ పరమేశ్వరుడే స్వయంగా ప్రతిష్టించిన స్వామి. త్రిపురాసుర సంహార కాలంలో పరమేశ్వరుడు కూడా ఈ గణపతిని తలచుకుని, రాక్షసునితో యుద్ధం చేసి, అతడిని సంహరించాడని పురాణ కథనం. అందుకు ప్రతిగా శివుడే ఈ ‘మహాగణపతిని’ ఇక్కడ ప్రతిష్ఠించాడని గణేశపురాణం చెబుతుంది. దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా ఈ విగ్రహంమీద పడడం ఈ క్షేత్రం ప్రత్యేకత. 18వ శతాబ్దంలో పీష్వాలు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. సిద్ధి, బుద్ధి సమేతుడై పద్మంలో కొలువు తీరి ఉంటాడు స్వామి..

#విఘ్నహార్‌_వినాయక_క్షేత్రం

ఓఝూర్‌ ‌పట్టణంలో కుకడి నది ఒడ్డున ఉంది ఈ ఆలయం. ఆలయంలో సిద్ధి, బుద్ధి సమేతుడై కొలువుతీరి ఉంటాడు స్వామి. పూర్వం ఈ ప్రాంతంలో విఘ్నాసురుడు అనే రాక్షసుడు మునులను హింసిస్తూంటే, ఆ బాధలు భరించలేని ఆ మునులు తమను కాపాడమని వినాయకుని ప్రార్థించగా వినాయకుడు ఆ రాక్షసునితో యుద్ధం చేస్తాడు. వినాయకుని గెలవడం తనవల్ల కాదని గ్రహించిన ఆ రాక్షసుడు ఆయన శరణుకోరి, తన పేరుమీద ఇక్కడే కొలువుతీరమని వేడుకుంటాడు. అతడి కోరిక ప్రకారం గణపతి అక్కడ స్వయంభూ మూర్తిగా వెలిసాడు. అందుకే ఈ స్వామిని ‘విఘ్నహార్‌ ‌వినాయక్‌’ అని అంటారు. అప్పట్లో ఈ స్వామికి మునులే ఆలయం కట్టించారని, ఆ తరువాతి కాలంలో ‘చిమాజి’ ఆ ఆలయాన్ని పునర్నిర్మించాడని చారిత్రిక కథనాలు చెప్తున్నాయి. బంగారుపూతతో మిలమిల మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంటుంది ఆలయశిఖరం..

#బల్లాలేశ్వర_క్షేత్రం

పూణేకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది పాలి క్షేత్రం. అష్ట వినాయక క్షేత్రాలలో భక్తుడి పేరుమీద వెలసిన స్వామి ఈ బల్లాలేశ్వరుడు. పూర్వం ఈ గ్రామం పేరు ‘పల్లిపుర్‌’. ఈ ‌గ్రామానికి చెందిన వర్తకుడు కల్యాణ్‌ ‌సేఠ్‌. అతని కుమారుడు బల్లాల్‌. ‌బల్లాల్‌ ‌గణపతికి మహాభక్తుడు. బల్లాల్‌ ‌తన స్నేహితులతో కలసి అడవికి వెళ్లి అక్కడున్న రాతి వినాయకుని పూజించి, రోజూ ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడట. ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితుల తల్లిదండ్రులు బల్లాల్‌ ‌కారణంగానే తమ పిల్లలు కూడా కొండలు, గుట్టలు పట్టుకొని తిరుగుతున్నారని కల్యాణ్‌ ‌సేఠ్‌కు ఫిర్యాదు చేసారు. అలా ఇతరులు తనను వేలెత్తి చూపడంతో కోపం వచ్చిన సేఠ్‌ ‘‌బల్లాల్‌’‌ను అడవికి తీసుకునివెళ్లి,అక్కడ అతన్ని ఒక చెట్టుకి కట్టి స్పృహతప్పేలా కొట్టి, అతడు పూజించే రాతివిగ్రహాన్ని విసిరేసి వెళ్లిపోయాడు. అలా ఆపదలో పడిపోయిన బల్లాల్‌, ‌వినాయకుని ప్రార్థించాడు. తన భక్తుడు ఆపదలో ఉండడంతో వినాయకుడు వచ్చి బల్లాల్‌ ‌కట్లువిప్పి, విడిపించి, ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ‘ఈ రాతిలోనే నువ్వు ఉండాలి’ అని కోరుకున్నాడు. భక్తుని కోరిక మేరకు వినాయకుడు ఆ రాతివిగ్రహంలో ఐక్యమయ్యాడు. ప్రస్తుతం ఆలయంలో ఉన్న విగ్రహం అదే. ముందు ఈ ఆలయాన్ని చెక్కలతో నిర్మించారు. ఈ ఆలయం వెనుక దుండి వినాయకును విగ్రహం ఉంటుంది. బల్లాల్‌ ‌తండ్రి విసిరిపారేసిన రాతి వినాయక విగ్రహమే దుండి వినాయక విగ్రహం. భక్తులు ముందుగా దుండి వినాయకుని దర్శించిన తరువాత ప్రధాన ఆలయంలోని వినాయకుని దర్శిస్తే స్వామిని దర్శించిన ఫలితం లభిస్తుందని చెప్తారు. భక్తుడైన బల్లాల్‌ ‌కోరిక మేరకు వెలిసాడు కాబట్టి ఈ వినాయకుని ‘బల్లాలేశ్వర్‌’ అని పిలుస్తారు..

మహారాష్ట్రలోని పూణే నుంచి ఈ అష్టవినాయక యాత్ర చేయడం సౌకర్యంగా ఉంటుంది. అన్ని ప్రాంతాల నుంచి పూణేకి రైలు, విమాన, బస్సు సౌకర్యాలున్నాయి. మహారాష్ట్ర పర్యాటక శాఖ ఈ యాత్ర కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తోంది. ముంబై, షోలాపూర్‌ ‌నగరాల నుంచి అయితే అష్టవినాయక క్షేత్ర దర్శనం ప్యాకేజీ బస్సులు కూడా ఉన్నాయి...

మావూరు విజయలక్ష్మి, 9160370290

Jagriti Telugu Weekly 

#శ్రీ🚩

Friday, August 29, 2025

నరసింహ అవతారం..

నరసింహ అవతారం.. దశావతారాల్లో ఒక్కో అవతారం ఒక్కో విశేషం. అందులో మన తెలుగునేలకు అత్యంత దగ్గరైన అవతారం శ్రీ నారసింహావతారం. #ఆయా సందర్భాలలో ఆయా క్షేత్రాలలో స్వామి స్వయంభూగా వెలిశారని ప్రతీతి. ఆ నవక్షేత్రాల గురించి సంక్షిప్తంగా

తెలుసుకుందాం....
1)ఆహోబిలం:
#నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైన అహోబిల నరసింహ స్వామి దేవాలయం కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నుండి సుమారు 25 కి మీ దూరం లో ఉంది . #నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశాపుని చీల్చి చెండాడిన క్షెత్రమిదెనని స్థల పురాణం చెబుతుంది . #హిరణ్యకశాపుని చీల్చి చెండాడిన నరసింహ స్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం ,అహో ..బలం అని ఆశ్చర్యంతో పొగడరటా అందుకీ ఈ క్షేత్రానికి అహోబిల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం గా పేరు వచ్చింది అని చెబుతారు .
#బ్రహ్మాండ పురాణం లో ఈ క్షేత్ర మహత్యం బాగా వివరించడం జరిగింది . #శ్రీ మహావిష్ణువు ఉగ్రనారసింహ అవతారం లో స్థంబం నుంచి ఉద్బవిన్చినట్లు చెప్పే స్థంబాన్ని కూడా అహోబిలం లో చూడవచ్చు . #దిగువ అహోబిలం లక్ష్మి నరసింహ స్వామి శాంతి మూర్తి అయి వెలసిన క్షేత్రం, కొండ పైన ఎగువ అహోబిల నరసింహుని చుడవొచ్చు . #హిరణ్య కసపుడిని సంవరించి అహోబిలమ కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి . (1) భార్గవ నరసింహ స్వామి (2) యోగానంద నరసింహ స్వామి (3) చత్రపట నరసింహ స్వామి (4) ఉగ్ర నరసింహ స్వామి (5) వరాహ నరసింహ స్వామి (6) మాలాల నరసింహ స్వామి (7) జ్వాల నరసింహ స్వామి ( పావన నరసింహ స్వామి (9) కారంజ నరసింహ స్వామి నవ నరసింహ క్షేత్రాలు ఇక్కడ ఫాల్గుణ మాసం లో ఇక్కడ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి .
2)యాదాద్రి:
#నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహ స్వామి కి ఘనమైన చరిత్ర ఉంది . పూర్వం ఋష్య శ్రున్గుని కుమారుడైన యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. అప్పుడు మహా విష్ణ్వు ప్రత్యక్షమవ్వగా తనకు నరసింహస్వామిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాల నరసిమ్హుండు,యోగానంద నరసిమ్హుండు అనే రూపాలలో కనిపించాడట. ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట . స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.ఇప్పుడు ఈ ప్రదేశాన్ని తొలచి ఇంకా విశాలంగా తిర్చిదిద్దరట. లోనికి దిగేముందు పంచముఖ ఆంజనేయ స్వామి కోవెల ఉంది . ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండ పై గండబేరుండ నరసింహమూర్తి ఉంది గర్బ గుడి లో జ్వాల నరసింహ,యోగానంద నరసింహ మూర్తులు ఉన్నాయి . కొండపైన స్వామి వారి పుష్కరాని కూడా ఉంది . ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే సకల కష్టాలు, రోగాలు నయమయిపోతాయని భక్తుల నమ్మకం.
3)మాల్యాద్రి లక్ష్మీనారసింహస్వామి:
#అగస్త్య మహాముని ఈ మాల్యాద్రి పైన తపమాచరించగా లక్ష్మి నారసింహుడు జ్వాల రూపుడై దర్శనమిన్చ్చాదని ,జ్వాల నరసిమున్హి గ కొండ పైన వెలిసారు అని పురాణం గాథ . మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కందుకూరు - పామూరు రోడ్డు లో వలేటివారిపాలెం మండల పరిధి లోని ఈ ఆలయం ఉన్న కొండలు పూలమాల ఆకారం లో ఉండటం తో ఈ ప్రాంతానికి మాలకొండ, మాల్యాద్రి అని పేరు వచ్చాయి. ప్రకృతి శోభకు నిలయమైన మాలకొండ ఏకశిలా నిర్మితం కావడం విశేషం . జ్వాల నరసింహుని పూజించిన మార్కండేయ ముని సమీపం లోని యేరులో స్నానం ఆచరించారని అదే మార్కండేయ నది అని చెబుతారు.
4)సింహాద్రి:
#విశాఖపట్టణానికి 16 కి మీ దూరం లో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున గల కొండ పైన వెలసిన నరసింహ క్షేత్రం ఇది . నవ నరసింహ క్షేత్రాల్లో ఇది ఒకటి . ఈ దేవాలయాన్ని సుమారు 9 వ శతాబ్దంలో నిర్మించారు అని శాసనాలు చెబుతున్నాయి . గర్భాలయం లో స్వామీ వారు వరాహ ముఖం , మానవాకారం , సింహపు తోక కలిగి ఉంటారు . వరాహ -నరసింహ మూర్తుల సమ్మేళనం లో వెలసిన ఈ స్వామి ని సింహాద్రి అని పిలుస్తారు . ఈ గుడి ముఖ మండపం లో ఒక స్తంభం ఉంది. దానిని కౌగిలించుకొని భక్తులు వరాలు కోరుకుంటే తప్పక నేరువేరుతాయని భక్తుల విశ్వాసం. అద్బుతమైన శిల్ప సంపద, అందమైన చెక్కడాలు ఎంతో రమణీయంగా ఉంటాయి . వరాహ పుష్కరిణి కొండ క్రింద ఆడవి వరం గ్రామం లో ఉంది . ప్రతి సంవత్సరం పుష్యమాసం లో స్వామి వారు తన దేవేరుల సమేతంగా కొండ దిగి వచ్చి పుష్కరిని లో ఉన్న భైరవ స్వామి ని దర్శించి అనంతరం కొండ కి చేరి స్వామిని దర్శనం చేసుకోవాలని చరిత్ర చెబుతుంది .
5)ధర్మపురి లక్ష్మీ నారసింహస్వామి:

ఇదొక మంత్రోపాసన రహస్యం....

ఇదొక మంత్రోపాసన రహస్యం....



కూర్చున్న హనుమాన్, నిల్చున్న గణపతి ఒకే చోట ఉంటే అక్కడ జపం చేస్తే అది యే దేవతా మంత్రమైన తప్పకుండ సిద్దిస్తుంది 🌿ఇలా ఇద్దరు కూర్చునే గణపతి నిలుచుని, నిలుచునే ఆంజనేయులు కూర్చుని ఉండడం దుర్లభ అలభ్య యోగం ఇంట్లో కూడా ఇలా ఫోటోలు ఏర్పాటు చేసుకోవచ్చు 🌿🌹....
ఇద్దరు ఇలాంటి బంగిమల్లో ఉన్న క్షేత్రాలు చాలా తక్కువ... కర్నూలు దగ్గర కాల్వబుగ్గ లో ఒక మాతాజీ వారి ఆశ్రమం లో ఇలా ఏర్పాటు చేసుకొన్నారు వీరిద్దరిని, మంత్రాలయం అనుభందం క్షేత్రము పంచముఖి లో ఇలానే కూర్చున్న హనుమాన్, నిల్చున్న గణపతి ఉంటారు... వీళ్ళు అలభ్య మూర్తులు కానీ అనుగ్రహం మాత్రం జెట్ జెంబో స్పీడ్....

ఫోటోలు 
గోకర్ణ క్షేత్ర శ్రీ మహా గణపతి 
హంపి క్షేత్ర మారుతి (చక్ర తీర్థ యంత్రోద్ధారక ఆంజనేయులు, వ్యాస రాజ ప్రతిష్ట )

సేకరణ 
మీ 
మణి ద్వీప్

దేవతా పూజ లో ప్రత్యేకప్రదక్షిణలు , పంచాంగ ,అష్టాంగ నమస్కారములు వాటి ఫలం

దేవతా పూజ లో ప్రత్యేకప్రదక్షిణలు , పంచాంగ ,అష్టాంగ నమస్కారములు వాటి ఫలం*

 #దేవతాప్రదక్షిణలు 

#చండీశప్రదక్షిణలు
#విష్ణుప్రదక్షిణలు
#प्रदक्षिणा 
#परिक्रम 
#शिवप्रदक्षिण
#विष्णुप्रदक्षिणा 
#साष्टांगप्रदक्षिण 

#Sahshtangapradakshina 
#Panchangapradakshina 

బృహన్నారదీయే
శివం ప్రదక్షిణీకృత్య సవ్యాసవ్య విధానతః | యత్ఫలం సమవాప్నోతి తన్మేనిగదతః శృణు ||
రాజత్ప్రదక్షిణైకేన ముచ్యతే బ్రహ్మహత్యయా। ద్వితీయేనాధికారిత్వం తృతీయేనేంద్ర సంపదమ్ ||

శివుడికి సవ్య-అపసవ్య విధానంలో ప్రదక్షిణ చేయడం వల్ల ఏ ఫలితం లభిస్తుందో, తెలుసుకుందాం ఒక ప్రదక్షిణ చేయగానే బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందుతాడు. రెండో ప్రదక్షిణతో అధికారిత్వం లభిస్తుంది. మూడో ప్రదక్షిణతో ఇంద్రునితో సమానమైన సంపదను పొందుతారు.

ఏకంగణాధిపేదద్యా ద్వ్యేసూర్యే త్రీణిశంకరే | చత్వారికేశవేదద్యా తృప్తాశ్వథ్థా ప్రదక్షిణాః ॥

గణపతికి ఒక ప్రదక్షిణ, సూర్యుడికి రెండు, శంకరుడికి మూడు, శ్రీ విష్ణువుకు నాలుగు ప్రదక్షిణలు చేయాలి. రావిచెట్టుకు ఏడు ప్రదక్షిణలు.

 ఏకాచండ్యాం రవౌసప్త తిస్రోదద్యాద్వినాయకే | చతస్రః కేశవేదద్ద్యా చ్ఛివేత్వర్థం ప్రదక్షిణమ్ ॥

చండీదేవికి ఒకటి, సూర్యుడికి ఏడు, వినాయకుడికి మూడు, కేశవుడికి నాలుగు, మరియు శివుడికి అర్ధ ప్రదక్షిణ చేయాలి.

 ఏకహస్తప్రణామంచ ఏకాచైవ ప్రదక్షిణా । అకాలేదర్శనంచైవ హంతి పుణ్యం పురాకృతమ్ ॥

ఒక చేతితో నమస్కరించడం, ఒకే ఒక ప్రదక్షిణ చేయడం, మరియు సమయం కాని వేళ దేవతా దర్శనం చేసుకోవడం వలన గతంలో చేసిన పుణ్యం నశిస్తుంది ,ప్రధాన మూర్తులకు నిత్యార్చన అభిషేకం ,కళ్యాణం సేవలు జరుగుతున్నప్పుడు దేవాలయo మహా నైవేద్య కాలం , హారతి కాలం  మరియు  దేవతా విశ్రాంతి కాలమైనా, ఇంకా దేవాలయం మూసి ఉన్నప్పుడు ప్రదక్షిణలు చేయకూడదు.

పదాంతరే పదంన్యస్య కరౌ చలనవర్ణితే । స్తుతిర్వాచి హృదిధ్యానం చతురఙ్గం ప్రదక్షిణమ్ ॥

ఒక అడుగు వెనుక మరొక అడుగు వేస్తూ, చేతులు కదలకుండా, నోటితో స్తుతిస్తూ, హృదయంలో ధ్యానం చేస్తూ చేసే ప్రదక్షిణ ఉత్తమ ఫలితాన్ని కలిగి ఉంటుంది.

 స్థానే చండస్య సంకల్ప్య వృషభాదౌ ప్రదక్షిణమ్ | సవ్యే సవ్యం విజానీయా దపసవ్యేపసవ్యకమ్ ॥

నంది దగ్గర మొదలుపెట్టి శివలింగం చుట్టూ సవ్యంగా కుడివైపు  తిరుగుతూ సోమసూత్రం వరకు వెళ్ళాలి. ఆ సోమసూత్రం దగ్గర లేక అక్కడే ఉన్న చండీశ్వరుని దగ్గర ఆగి , దానిని దాటకుండా, అక్కడి నుంచి వెనుకకు తిరిగి వెనక్కు అపసవ్యంగా  ఎడమవైపు శివలింగం చుట్టూ నడిచి తిరిగి నంది దగ్గరకు చేరుకోవాలి. ఈ విధంగా ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది. ఈ ప్రదక్షిణను ఎన్ని సార్లు చేయాలనుకుంటే అన్ని సార్లు పునరావృతం చేయాలి.

నవప్రదక్షిణోపేతం యః కుర్యాత్తు ప్రదక్షిణమ్ | త్రింశత్సహస్ర సంఖ్యాక ప్రదక్షిణ ఫలం లభేత్

ఎవరైతే తొమ్మిది ప్రదక్షిణాలను ఒకేసారి చేస్తారో, వారికి ముప్పై వేల ప్రదక్షిణాల పుణ్యఫలం లభిస్తుంది

శంభోః ప్రదక్షిణం కుర్వన్ సోమసూత్రం న లంఘయేత్ | 
లoఘిత్వాత్వేకమేవస్యా దనులoఘ్యేయుత త్రయమ్ ||
ప్రసాదవిస్తార సమానసూత్రం సోమస్యసూత్రం దిశిసోమసూత్రమ్ । 
సూత్రాద్బహిర్లజ్ఝనతో నదోష స్స్యాద్దోష ఆభ్యంతర లంఘనేన

*శివునికి ప్రదక్షిణం*  చేసేవారు, సోమసూత్రాన్ని దాటకూడదు సోమసూత్రాన్ని దాటితే ఒక ప్రదక్షిణ ఫలితం మాత్రమే వస్తుంది. అదే దాటకుండా చేస్తే పదివేల రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది. దేవాలయం యొక్క పొడవు ఎంత ఉంటుందో అదే సోమసూత్రం యొక్క పొడవు. సోమసూత్రం ఉత్తర దిశగా ఉంటుంది.సోమసూత్రం వెలుపల దాటితే దోషం లేదు, కానీ దాని లోపల దాటితేనే దోషం.

॥  అపసవ్యంయతిః కుర్యా త్సవ్యం తు బ్రహ్మచారిణః ।  సవ్యాసవ్య విధిస్తు వానప్రస్థ గృహస్థయోః ॥

సన్యాసులు (యతులు) అపసవ్యంగా ప్రదక్షిణలు చేయాలి. కొన్ని సందర్భాలలో ఇది సాధారణ ప్రదక్షిణానికి వ్యతిరేక దిశలో ఉంటుంది.

బ్రహ్మచారులు సవ్యంగా ప్రదక్షిణలు చేయాలి. సవ్యం అంటే కుడివైపునకు ప్రదక్షిణ చేయడం. ఇది సాధారణంగా మనం చేసే ప్రదక్షిణ విధానం.

 వానప్రస్థులు, గృహస్థులు అయితే సవ్యం మరియు అసవ్యం రెండూ చేయవచ్చు. అంటే, వారి ఇష్టం ప్రకారం వారు ప్రదక్షిణలు చేయవచ్చు.

 సోమసూత్రద్వయం యత్ర యత్ర వావిష్ణుమందిరమ్ |  అపసవ్యం నకుర్వీత కుర్యాదేవ ప్రదక్షిణమ్ ॥

సోమసూత్రద్వయం అంటే శివలింగం నుండి నీరు బయటకు వెళ్ళే మార్గం. శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు సోమసూత్రాన్ని దాటకూడదు.

*విష్ణుమందిరం* అయిన వ్యతిరేక దిశ లో చేయకూడదు.ఆ స్థానం లో  ఎప్పుడూ సవ్య ప్రదక్షిణమే చేయాలి.

ప్రదక్షిణత్రయం కృత్వా నమస్కారైశ్చ పంచభిః ।
 పునః ప్రదక్షిణం కృత్వా శివలోకే మహియతే |

ఒక భక్తుడు శివుని ఆలయంలో  మొదట మూడు ప్రదక్షిణాలు చేయాలి. ఆ తర్వాత ఐదుసార్లు సాష్టాంగ నమస్కారం లేదా శిరస్సు వంచి నమస్కారం చేయాలి.నమస్కారాలు పూర్తయిన తర్వాత, మరొక ఒక ప్రదక్షిణ చేయాలి.
ఇది ఇంకోక విధానం. 

గర్భాలయే తథా ప్రాక్ ప్రదక్షిణ నిషేధః
పూజాభిషేకసమయే మహాదేవస్య శూలిన:| పూజాకర్తా వృష్ఠభాగం దర్శయేన్న కదాచన ॥

శివపూజాభిషేక సమయమందు మరియూ ఎల్లప్పుడునూ భక్తులు వారి శరీరముయొక్క వెనుకభాగము మహాదేవునకు చూపకూడదు.
అందువల్ల గర్భాలయములో మరియు విగ్రహం ముందు వైపు కూడా ప్రదక్షిణలు చేయరాదు.

తిరుమల లో అంగప్రదక్షిణ అనే పద్దతి కూడా ఉన్నది కోరికలు స్వామి వారికి చెప్పుకొని అవి తీరడానికి లేక కామ్యసిద్ధి తరువాత అక్కడ ప్రత్యేక సమయం లో (పొర్లు దండాలు) అంగప్రదక్షిణలు చేస్తారు 
కేదార్ మానససరోవర్ లో కూడా కొందరు విదేశీయులు సైతం కఠినమైన ఈ పద్ధతి దైవానుగ్రహం కోసం చేస్తుంటారు.

ఇతి ప్రదక్షిణ నమస్కారవిధిః ॥

*పంచాంగ మరియు సాష్టాంగ  నమస్కారము*

*బృహన్నారదీయే*
ప్రణమ్య దండవద్భూమౌ నమస్కారేణ యోర్చయేత్ | 
సయాం గతిమవాప్నోతి నతాం క్రతుశతైరపి ||

దండం లేక కర్ర వలె నేలమీద పడుకుని, శరీరాన్ని పూర్తిగా నేలకు ఆనించి నమస్కరించడం. ఇది అత్యంత వినయంతో, భగవంతునికి సంపూర్ణంగా లొంగిపోయి చేసే నమస్కారo  ఈ విధంగా నమస్కరించి, దైవాన్ని పూజించేవాడు.వ్యక్తి పొందే ఉన్నతమైన ఫలం జీవన్ముక్తి. వందలాది యజ్ఞాలు చేసినా కూడా పొందలేని ఫలాన్ని, కేవలం దండవత్ ప్రణామం ద్వారా భగవంతుని పూజించిన వ్యక్తి పొందుతాడు.

దోర్భ్యాం పద్భ్యాం చ జానుభ్యా మురసా శిరసా తథా | 
మనసావచసా దృష్ట్యా ప్రణామోష్టాఙ్గ ఈరితః || పద్భ్యాం కరాభ్యాం శిరసా పంచాంగప్రణతి స్మృతా | అష్టాఙ్గ ఉత్తమః ప్రోక్తః పంచాంగో మధ్యమః స్మృతః 

శిరోహస్తౌచ జానూచ చిబుకం బాహుకద్వయమ్ । పంచాంగంతు నమస్కారో నమస్కారత్రయం స్మృతమ్ 
ఉత్థాయోత్థాయ కర్తవ్యః ప్రణామో దండవద్భువి ॥ ప్రదక్షిణం నకర్తవ్యం పురతః పృష్ఠ దర్శనాత్ |

రెండు చేతులు, రెండు పాదాలు, రెండు మోకాళ్ళు, వక్షస్థలం, తల, మనస్సు, వాక్కు, మరియు దృష్టి - ఈ ఎనిమిది (శారీరక , మానసిక ) అవయవాలతో చేసే ప్రణామాన్ని *అష్టాంగ ప్రణామం* అంటారు.

రెండు పాదాలు, రెండు చేతులు, మరియు తల - ఈ ఐదు భాగాలతో చేసే ప్రణామాన్ని *పంచాంగ ప్రణతి* అంటారు. ఈ రెండింటిలో, అష్టాంగ నమస్కారం ఉత్తమం అని, పంచాంగ నమస్కారం మధ్యమం అని చెప్పబడింది. పదే పదే లేచి, భూమి మీద దండవత్ ప్రణామం చేయాలి. దేవుని ముందు ప్రదక్షిణం చేయకూడదు.

*మహాదేవ మహాదేవ శ్రీ మాత్రే నమః* 
*రాళ్ళబండి శర్మ* 🙏🙏🙏🙏

Thursday, August 28, 2025

సర్పవరం.!

సర్పవరం.!
సర్పవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా లోని కాకినాడ నగరంలో ప్రాంతం. .

పంచభావనారాయణ క్షేత్రాలలో ఒకటైన

పాతాళభైరవాలయం ఇక్కడ ఉంది. ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. నారదుడు ముందుగా స్నానం చేసి స్త్రీ రూపాన్ని పొందిన కొలను . ఆ తరువాత స్నానం చేసి స్త్రీ రూపాన్ని వదిలించుకున్న కొలను నేటికీ ఇక్కడ పక్కపక్కనే దర్శనమిస్తాయి. విశాలమైన ప్రాంగణం. శిల్ప కళా శోభితమైన గాలి గోపురం ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
 ఈ క్షేత్ర మహిమ గురించి శ్రీ నాథుడు తన కావ్యాల్లో ప్రస్తావించాడు. '
వైశాఖ శుద్ధ ఏకాదశి' రోజున స్వామివారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరుపబడుతుంది. శేష, గజ, అశ్వ వాహనాలపై ఊరేగే లక్ష్మీ నారాయణులను చూడటానికి భక్తులు ఈ ఉత్సవంలో విశేష సంఖ్యలో పాల్గొంటారు.
స్థల పురాణం · సర్పాలు ఎక్కువగా ఉండటం వలన ఈ ప్రాంతానికి 'సర్పవరం' అనే పేరు వచ్చిందని అంటారు. · సర్పవరం స్థల పురాణం బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది. అగస్త్య మహర్షి సర్పవరం గాథని సనకసనందనాదులకు చెబుతాడు.

#ఆలయం_వెనుక_చరిత్ర
*ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణ సంబంధమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడితో సమావేశమైనప్పుడు విష్ణు మాయ గురించిన ప్రస్తావన వచ్చింది. అందరూ కూడా విష్ణుమాయను కనుగొనడం ఎవరివల్లాకాదనే నిర్ధారణకి వచ్చారు. అయితే అక్కడే ఉన్న నారదుడు వారితో ఏకీభవించకుండా, అనుక్షణం విష్ణు నామాన్ని జపించే తనకి ఆయన మాయను తెలుసుకోవడం సులభమే అని అన్నాడు. ఈ సంగతి కాస్తా విష్ణుమూర్తికి తెలిసింది. ఆ తరువాత కొంతకాలానికి నారదుడు భూలోక విహారానికి వెళ్లాడు. సంధ్యావందన సమయం కావడంతో ఓ కొలనులోకి దిగాడు. 
ఆ నీటిలో మునిగి లేచిన నారదుడు తాను స్త్రీగా మారిపోయినట్టు తెలుసుకుని ఆశ్చర్య పోయాడు. గట్టున పెట్టిన మహాతి (వీణ) కానీ, కమండలం కానీ కనిపించకపోవడంతో అయోమయానికి లోనయ్యాడు. నారదుడిగా సర్వ శక్తులను కోల్పోయి గతం మరిచిపోయి ఇష్టానుసారంగా తిరగసాగాడు. 
స్త్రీ రూపంలో ఉన్న నారదుని చూసి మోహించిన పీఠికాపురం (పిఠాపురం) పాలకుడైన నికుంఠ మహారాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆ రాజు శత్రు రాజుల చేతిలో హతుడయ్యాడు. 
స్త్రీ రూపంలో ఉన్న నారదుడు పారిపోయి అడవుల్లో తిరుగుతూ ఆకలితో ఓ చెట్టు నుంచి పండును కోయడానికి ప్రయత్నిస్తూ, అది అందక ఇబ్బంది పడసాగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మారువేషంలో అక్కడికి వచ్చి అక్కడికి దగ్గరలోని కొలనులో స్నానం చేసి వస్తేనే గాని ఆ పండు అందదని చెప్పాడు. 
దానితో నారద స్త్రీ కొలనులోకి వంగిన ఓ చెట్టుకొమ్మ పట్టుకుని నీళ్ళలోకి దిగి ఓ మునకవేయగానే స్త్రీ రూపం పోయి నారద రూపం వచ్చినప్పటికీ, కొమ్మని పట్టుకోవడం వలన తడవని చేతి గాజులు మాత్రం అలాగే ఉన్నాయి. 
వాటిని చూసి ఆశ్చర్య పోతూ ఒడ్డుకువచ్చిన నారదుడికి అదంతా విష్ణుమాయ అని అర్థమైంది. 
దానితో శ్రీ మహా విష్ణువు అనుగ్రహం కోసం ఈ ప్రదేశంలో పాతాళ భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించి, వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు, ఆయన మాయకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ ప్రదేశంలో కొలువుదీర వలసిందిగా నారదుడు కోరడం వలన భావనారాయణ స్వామిగా ఆయన అక్కడ వెలిశాడు. ఆ తరువాత రాజ్య లక్ష్మీ అమ్మవారిని స్వామివారికి ఎదురుగా ప్రతిష్ఠించారు.
గ్రహ దోష నివారణకు మరియు కష్టాల నుండి విముక్తికి మంత్రం.*
జన్మజాతకంలో శని, రాహు, కుజ వంటి పాప గ్రహాల వల్ల ఏర్పడిన దోషాలను తొలగించుకోవడానికి, అలాగే అసలు జన్మజాతకమే లేని వారు (వారి జాతక వివరాలు తెలియని వారు) ఎలాంటి కష్టాలనైనా అధిగమించడానికి ఈ క్రింది మంత్రాన్ని జపించడం అత్యంత ప్రయోజనకరం.


మంత్ర జప విధానం:
 
* మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరా ప్రసన్న
 
 * జప సంఖ్య: ప్రతిరోజూ 1008 సార్లు.
 * సమయం: ఉదయం పూట.
 * కాల వ్యవధి: 48 రోజులు.

మంత్ర మహిమ:
ఈ మంత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఎవరైతే దేవిని  ఆశ్రయించి, ఆమె నామాలను భక్తి శ్రద్ధలతో జపిస్తారో, వారు కలియుగంలో ఏర్పడే సకల కష్టాల నుండి రక్షించబడతారు. ఈ మంత్రం సకల శుభాలను ప్రసాదించి, ఆటంకాలను తొలగించి, జీవితంలో శాంతిని, సుఖాన్ని అందిస్తుందని ప్రగాఢ విశ్వాసం.

ఈ మంత్రాన్ని నిష్టగా, భక్తి శ్రద్ధలతో జపించడం ద్వారా దైవిక అనుగ్రహం లభించి, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు, కష్టాల నుండి విముక్తి పొందగలరు.

గమనిక:గురూపదేశం తీసుకొని మంత్రసాధన చేస్తే శీగ్ర ఫలితం ఉంటుంది.
@everyoneమంత్ర యంత్ర తంత్ర సాధనలు

Friday, August 22, 2025

వారం రోజులు - ఏ రోజు ఏం చేయాలి.......!!


వారం రోజులు - ఏ రోజు ఏం చేయాలి.......!!
మానవుడు ఏ రోజు ఏం చేయాలి? 
ఏం చేస్తే పుణ్యఫలితం దక్కుతుంది. ఏ రోజు ఏం కార్యాలు చేయాలి..? 
ఏ దేవున్ని పూజించాలి..? 

ఈ విషయాలు నిత్యం అందరికి అవసరమే. 
ఏ రోజే ఏం చేయాల్లో శాస్త్రాలు వివరించాయి. 
ఇక ఏ రోజు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో శివ మహా పురాణం విద్యేశ్వర సంహిత 14వ అధ్యాయం వివరించింది. దేవతల ప్రీతి కోసం 5 విధాలైన పూజ ఏర్పడింది. 

మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే 5 విధాలు. సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ 4 రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది. పూజలు మనకున్న 7 వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చేయాల్సి ఉంటుంది.

ఆదివారం చేయాల్సిన కార్యాలు........
ఉత్తర దిశగా ప్రయాణం, ఉద్యోగంలో చేరడం, మంగళ కృత్యాలు, ఉత్సవాలు, నృపాభిషేకం, లోహం, చెక్క, చర్మ, ఊక పనులు, యుద్ధం, అస్తక్రర్మలు, వ్యవసాయపు పనులు, ధ్యానక్రియలు, ఔషధ సేవనం, వైద్యం, ఉల్లి, పొగాకు, మిర్చి.. వంటి తోటలు వేయడం, కెంపు ధరించడం చేయవచ్చు.

ఆదివారం చేయాల్సిన పూజలు.....
ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్ర వ్యాధులు, శిరోరోగం, కుష్ఠువ్యాధి తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక 3 సంవత్సరాల పాటు రోగ తీవ్రతనను బట్టి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.

సోమవారం చేయాల్సిన కార్యాలు......
దక్షిణ దిక్కు ప్రయాణించడం, కృషి క్రియలు, సమస్త వాస్తు కర్మలు చేయవచ్చు. ఇంకా.. ముత్యం, స్ఫటికం, నూతులు, కాలువలు, చెరువులు, జలం, ఉపనయనం, భూమి, పైకప్పులు, సంగీతం, నృత్య, నాటకాలు, స్తంభ ప్రతిష్ట, భూ సంబంధ కార్యాలు, తెల్లని వస్త్రాలు ధరించడం, వెండి వస్తువులు ఉపయోగించడం, ముత్యాలు ధరించడం, నృత్యాది కళలు ప్రారంభించవచ్చు.

సోమవారం చేయాల్సిన పూజలు.....
సంపద కోరుకోనేవారు సోమవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.

మంగళవారం చేయాల్సిన కార్యాలు....
తూర్పు దిక్కుకు ప్రయాణించడం, పగడపు ఉంగరం ధరించడం చేయవచ్చు. కోర్టు వ్యవహారాలు, ధైర్య సాహస విషయాల్లో అడుగుముందుకేయడం, అగ్ని, ఆయుధ, ఉగ్ర, అసత్యక్రియలు, వెండి, బంగారం, రాగి, ఇత్తడి, ఇనుము, ధాతువులు కరిగించడం, కందులు, వేరుశనగ వంటి ధాన్యాలు సాగు చేయడం.. వంటివి చేయవచ్చు.

మంగళవారం చేయాల్సిన పూజలు....
ఆరోగ్య సమస్యలు తగ్గేందుకు మంగళవారం కాళీ దేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.

బుధవారం చేయాల్సిన కార్యాలు.....
ఈ రోజు పడమట దిక్కుకు ప్రయాణం మంచిది. నూతన వ్యాపారాలు, యుక్తిగా కార్యాలు నిర్వర్తించవచ్చు. బంగారం మొదలైన నగలు చేయడం, వాహనం, శిల్పం, విద్య, రాజీలు, వివాహం, వ్యాపారం, క్రయవిక్రయాలు, దస్తావేజులు, చిత్ర గణితం, శిల్ప గణిత శాస్త్రాది విద్యలను అభ్యసించడం, అరటి, కొబ్బరి, మామిడి తోటలు పెంచడం, పెసలు మొదలైన పైర్లు వేయడం చేయవచ్చు. 

బుధవారం చేయాల్సిన పూజలు....
బుధవారం రోజు పెరుగు అన్నాన్ని విష్ణు దేవునికి నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

గురువారం చేయాల్సిన కార్యాలు.....
గురువారం రోజు పడమర దిక్కు దిశగా ప్రయాణం చేయడం మంచిది. యజ్ఞయాగాది క్రియలు, వివాహాది శుభకార్యాలు, వైదిక కార్యాలు, నూతన విద్యారంభం, వృక్షదోహదక్రియలు, అలంకార ధారణ క్రియలు, గురువులను, దేవతలను పూజించడం, యుద్ధారంభం, తీర్థయాత్రలు, అక్షరాభ్యాసం, శనగలు, చెరుకు, ప్రత్తి వంటి వ్యాపారాలు ప్రారంభించడం, పుష్యరాగం ధరించడం మొదలైనవి. దస్తావేజులు, ఒప్పంద పత్రాలు రాయడం మంచిది కాదని సంప్రదాయం.

గురువారం చేయాల్సిన పూజలు...
ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవానికి గురువారం రోజున పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం కూడా శుభకరం.

శుక్రవారం చేయాల్సిన కార్యాలు....
శుక్రవారం రోజున ఉత్తరం దిక్కు దిశగా ప్రయాణం మంచిది. నూతన వస్త్రాలు ధరించడం, కొనడం, రాజకీయ రంగ ప్రవేశం చేయడం శుభకరం. స్ర్తీ సంబంధ క్రియలు, ముత్యం వజ్రం, వైఢూర్యం, ఆభరణ ధారణ, సుగంధ శయ్యా భరణాలు, ఉద్యోగ కృషి, వ్యవసాయం, కాలు వలు, వివాహం, పుష్ప సంబంధమైన మంగళ కార్యాలు, ధాన్య సంబంధ పనులు ప్రారంభించడం, సాహిత్య విషయాలు, కళలు నేర్చుకోవడం మంచిది. 

శుక్రవారం చేయాల్సిన పూజలు...
శుక్రవారం రోజు కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించాలి. ఈ రోజు పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించడం మంచిది.

మంత్ర దీక్ష అంటే గురువు ఇచ్చిన ఒక నిర్దిష్ట మంత్రాన్ని గురువు ఆదేశాల ప్రకారం పఠించాలి.

మంత్ర దీక్ష అంటే గురువు ఇచ్చిన ఒక నిర్దిష్ట మంత్రాన్ని గురువు ఆదేశాల ప్రకారం పఠించాలి.


ప్రతి మంత్రానికి ఒక నిర్దిష్ట ఫలితం ఉంటుంది, దానికి గురువు దానిని అందిస్తాడు. లక్ష్యాన్ని సాధించడానికి, లక్ష్యాన్ని సాధించడానికి గురువు ఇచ్చిన ఆదేశాలను పాటించాలి. అత్యంత విశ్వాసంతో, దృఢ సంకల్పంతో మంత దీక్ష చేస్తే, ఆ మంత్రం చేసే వ్యక్తికి ఫలితాలు లభిస్తాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు.

నేను పాటించిన సాధన నియమాలు?

1.మంత్ర దీక్షలో ఉన్నపుడు అమ్మవారు పరీక్ష పెడుతుంది.ఎవరైన మనల్ని ఏమైన అంటే రియాక్ట్ అవ్వకూడదు మన శక్తి వేస్ట్ అవుతుంది కర్మ create అవుతుంది

2.నేను రోజు హోమాలు చేస్తూ ఉంటాను పీఠంలో రోజూ జపం చేస్తాను కొన్ని వేల హోమాలు చేసాను ఇప్పటికి. మనం దీక్షలో ఉన్నపుడు మనల్ని ఎవరైన తిడితే మన పాప కర్మలు తిట్టిన వారికే వెళతాయి మనం పవిత్రం అవుతాం కాబట్టి peaceful దీక్ష చేయాలి

3.రోజు జపాలు హోమాలు నిర్వహిస్తే తీవ్రమైన fire ఉంటుంది మనలో జాగ్రత్తగా శక్తి ని కాపాడుకోవాలి.మనం దీక్షలో ఉన్నపుడు ఎవరైన తిడితే అమ్మవారి కే వదిలేయాలి ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటుంది మనం రియాక్ట్ అయితే కర్మ  create అయి శక్తి వేస్ట్ అవుతుంది

4.మనం దీక్షలో ఉన్నపుడు ఎక్కువ  problems వస్తాయ్ తట్టుకోవాలి తట్టుకొని ముందుకు వెళితే మంత్రం సిద్ది తొందరగా అవుతుంది  ఊరికే  రియాక్ట్ అయితే ఇంకో జన్మ తీసుకోవాలి తర్వత సాదన కోసం

పంచాయతన* దేవత ఆరాధన విశేషములు

సనాతన ధర్మంలో  *పంచాయతన* దేవత ఆరాధన విశేషములు*
#పంచాయతనం 

#శివార్చన
#विष्णुपूजा
#దేవతార్చన 
#అభిషేకార్చన 
#shivapanchayatana 
#panchayatana 
#Shivarchana 
#शिवार्चना 
#विष्णुपूजा 
శుద్ధస్ఫటిక సంకాశం సచ్చిదానంద విగ్రహమ్ | దాతారం సర్వకామానాం కామేశ్వర ముపాస్మహే ॥

*పంచాయతన పూజావశ్యకతా*  :
గర్గోవాచ
శివం విష్ణుం గణపతిం దుర్గాం రవి మతఃపరమ్ | పంచైతాన్యజేన్నిత్యం నాత్రకార్యా విచారణా ॥ ఆదిత్యశ్చాంబికావిష్ణుః గణనాథో మహేశ్వరః | ఏతేషామంశ మాశ్రిత్య సర్వేనుయంతి చాపరే | తస్మాదేతాన్యజేన్నిత్యం అన్యథాపతితో భవేత్ ॥

శివుడు, విష్ణువు, గణపతి, దుర్గ, మరియు సూర్యుడు ఈ ఐదుగురు దేవతలను ప్రతిరోజు పూజించాలి. దీని గురించి ఎలాంటి సందేహాలు అవసరం లేదు

సూర్యుడు , అమ్మవారు ,విష్ణువు, గణపతి, మహేశ్వరుడు —ఈ ఐదుగురు పంచాయతన దేవతలు. మిగతా దేవతలంతా వీరి అంశల నుంచే వచ్చారు. కాబట్టి, ఈ ఐదుగురిని రోజూ పూజించాలి. అలా చేయకపోతే పతితులౌతారు.

శివం భాస్కరమగ్నిం చ కేశవం కౌశికీమపి మనసానర్చయన్ యాతి దేవలోకాదధోగతిమ్ ॥ పృథగప్యేక పాకానాం బ్రహ్మయజ్ఞో ద్విజాతినాం అగ్నిహోత్రం సురార్చాచ సంధ్యానిత్యం భవేత్తతః ||

శివుడిని, సూర్యుడిని ,అగ్నిని, విష్ణువును దుర్గాదేవిని మనస్సులో కూడా పూజించనివాడు దేవలోకం నుండి కూడా పతనం అవుతాడు.

బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మిగతావారు ఒకేసారి భోజనం చేసినప్పటికీ, వారు వేర్వేరుగా బ్రహ్మయజ్ఞం, అగ్నిహోత్రం, దేవతార్చన, మరియు సంధ్యావందనం వంటి నిత్యకర్మలను తప్పక ఆచరించాలి.

నవిష్ణ్వారాధనా త్పుణ్యం విద్యతేకర్మవైదికమ్ । తస్మాదనాదిమధ్యాంతం నిత్యమారాధయేద్ధరిమ్ ॥
​యోమోహాదథవాలస్యాదకృత్వా కేశవార్చనమ్ | భుక్త సయాతి నరకం శూకరేష్విహజాయతే ||

ఎవరైతే మోహంతో లేదా బద్ధకంతో  విష్ణువును పూజించకుండా భోజనం చేస్తారో, వారు నరకానికి వెళ్లి, ఆ తర్వాత పంది జన్మ ఎత్తుతారు.

విష్ణువును ఆరాధించడం కంటే గొప్పదైన పుణ్య కార్యమేదీ వైదిక కర్మలలో లేదు. కాబట్టి, ఆది, మధ్య, అంతం లేని ఆ హరిని  ప్రతిరోజు తప్పక ఆరాధించాలి.

పంచాయతనార్చనే ఫలవిశేషః 
యోగోజ్ఞానం యశస్సిద్ధిర్మహాదేవా దవాప్యతే। ఆరోగ్యం సాంప్రతం పుత్రం భాస్కరాత్రాప్నుయాధృవమ్ ||

మత్స్య పురాణే..
 ఆదిత్యస్య సదాపూజా తిలకస్వామినస్తథా | మహాగణపతేశ్చైవ కుర్వన్ సిద్ధిమవాప్నుయాత్ ॥
(తిలకస్యామీ - స్కందః) - యాజ్ఞవల్మ్యః ॥
ఆరోగ్యం భాస్కరాదిచ్చెద్ధనమిచ్ఛేదుతాశనాత్ | జ్ఞానంచ శంకరాదిచ్ఛే న్మోక్షమిచ్ఛే జ్జనార్దనాత్ ॥ - 
యోగోజ్ఞానం యశస్సిద్ధిర్మహాదేవా దవాప్యతే। ఆరోగ్యం సాంప్రతం పుత్రం భాస్కరాత్రాప్నుయాధృవమ్ ||

యోగం, జ్ఞానం, కీర్తి, సిద్ధి అనేవి మహాదేవుడి  అనుగ్రహం వల్ల లభిస్తాయి. ఆరోగ్యం, మంచి సంతానం సూర్యుడి అనుగ్రహం వల్ల తప్పక లభిస్తాయి.

యాజ్ఞవల్క్య వారు అంటారు
 సూర్యుడిని , స్కందుడిని, మరియు మహా గణపతిని ఎల్లప్పుడూ పూజించేవారు సిద్ధిని పొందుతారు.

ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని , ధనం కావాలంటే అగ్నిని, జ్ఞానం కావాలంటే శంకరుడిని, మరియు మోక్షం కావాలంటే జనార్దనుడిని  ఆరాధించాలి.

యజేదేకం సహస్రాంశుం మోక్షకామో న సంశయః ॥
మోక్షం కోరుకునేవాడు సహస్రాంశుడిని (సూర్యుడిని) ఒక్కడినే పూజించాలి, ఇందులో ఏమాత్రం సందేహం లేదు.

భవిష్య పురాణే 
గతిమిష్టాం తథాకామం ప్రదదాతి త్రివిక్రమః | ధర్మార్ధకామమోక్షాణాం భాజనం విష్ణుపూజకః | సర్వాన్కామానవాప్నోతి సంపూజ్య విష్ణువల్లభామ్ ॥ యస్సదాపూజయేద్దుర్గాం ప్రణమేద్వాపి భక్తితః | స్వర్గరాజ్య మోక్షాణాం క్షిప్రం భవతి భాజనమ్ ||

విష్ణుదేవత కోరుకున్న గతిని, కోరికలను ప్రసాదిస్తాడు. విష్ణువును పూజించేవాడు ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలను పొందుతాడు.

శ్రీ మహావిష్ణువుకు ఇష్టురాలైన లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సకల కోరికలను పొందవచ్చు.

ఎవరైతే దుర్గాదేవిని ఎల్లప్పుడూ పూజిస్తారో, లేదా భక్తితో నమస్కరిస్తారో, వారు త్వరగా స్వర్గాన్ని, రాజ్యాన్ని, మోక్షాన్ని పొందుతారు.

స్తుతా సంపూజితాపుష్పైర్గంధ ధూపాదిభిస్తథా | దదాతి విత్తంపుత్రాంశ్చ మతిం ధర్మే గతిం శుభామ్ || విఘ్నోనజాయతే తస్య యజేద్యస్తు వినాయకమ్ । మహాగణపతేః కర్మసిద్ధిం ప్రాప్నోతి మానవః ॥ సర్వంజగద్వశీకుర్యా న్మహాగణపతి స్సదా । స్వర్గాపవర్గ సంసిద్ధి ర్దుర్గాయాగా త్ప్రజాయతే ॥ మాతృగణాన్మహాసిద్ధిః సర్వేషామేవ జాయతే । లభతేధనధాన్యాని మర్త్యః పూజ్య హుతాశనమ్ ॥

పూలతో, గంధంతో, ధూపంతో పూజించబడిన మరియు స్తుతించబడిన దేవత ధనం, సంతానం, మంచి బుద్ధి, ధర్మంలో ఆసక్తి మరియు శుభమైన గతిని ప్రసాదిస్తుంది.

వినాయకుడిని పూజించేవాడికి విఘ్నాలు కలగవు. మహాగణపతిని ఆరాధించే మనిషి కార్యసిద్ధిని పొందుతాడు.

మహాగణపతిని నిత్యం ఆరాధించేవారు సమస్త లోకాన్ని తమ వశం చేసుకోగలరు. దుర్గాదేవిని పూజించడం ద్వారా స్వర్గం మరియు మోక్షం లభిస్తాయి.

మాతృగణాలను పూజించడం ద్వారా అందరికీ గొప్ప సిద్ధులు లభిస్తాయి. అగ్నిని పూజించే మనిషి ధనధాన్యాలను పొందుతాడు.

లింగే ఈశ్వరార్చనా :

అర్చయేత సదాదేవ మాపన్నోపి మహామునే । వరంప్రాణ పరిత్యాగః శిరసోవాపి కర్తనమ్ । నత్వసంపూజ్య భుంజీత భగవంతం త్రిలోచనమ్ | యో నపూజయతే భక్త్యా లింగే త్రిభువనేశ్వరమ్ ॥ లింగే దేవోమహాదేవః సర్వదేవ నమస్కృతః । అనుగ్రహాయలోకానాం తస్మాన్నిత్యం ప్రపూజయేత్॥ భవిష్యపురాణే ॥

ఓ మహామునీ, ఆపదలో ఉన్నప్పటికీ నిత్యం ఆ మహాదేవుడిని పూజించాలి. త్రిలోచనుడు మూడు కన్నులు గల శివుడిని పూజించకుండా భోజనం చేయడం కంటే ప్రాణాలను త్యాగం చేయడం లేదా శిరస్సును ఖండించుకోవడం మేలు.

భక్తితో లింగంలో ఉన్న త్రిభువనేశ్వరుడిని (మూడు లోకాలకు అధిపతి అయిన శివుడిని) ఎవరైతే పూజించరో, వారు పాపాత్ములు. లింగంలో ఉన్న ఆ మహాదేవుడు సమస్త దేవతలచే నమస్కరించబడేవాడు. లోకాలకు అనుగ్రహం కలిగించడం కోసం ఆయన లింగ రూపంలో ఉన్నాడు, కాబట్టి నిత్యం ఆయన్ని పూజించాలి.

లింగ పురాణే 
ఆకాశం లింగమిత్యాహుః పృథివీతస్యపీఠికా । ఆలయ స్సర్వభూతానాం లయనాల్లింగముచ్యతే |॥

 లింగేతుపూజితం సర్వమర్చితం స్యాచ్చరాచరమ్ | తస్మాత్సదా ర్చనం కార్యం లిఙ్గస్య సుమహాత్మనః ||
స్కంద పురాణే

 వరం ప్రాణపరిత్యాగ శ్శిరసోవాపి కృంతనమ్ | నచైవాపూజ్య భుంజీత శివలింగే మహేశ్వరమ్ ॥

ఆకాశమే లింగం అంటారు. భూమి దాని పీఠం. ఇది అన్ని భూతాలకు లేక జీవులకు నివాసం. సర్వమూ దానిలో లయమవుతుంది కాబట్టి దీనిని లింగం అని పిలుస్తారు. 

లింగంలో ఉన్న మహాదేవుడిని పూజిస్తే, చరాచరాలన్నింటినీ పూజించినట్లే అవుతుంది. కాబట్టి, ఆ గొప్ప లింగాన్ని ఎల్లప్పుడూ పూజించాలి. 

మహేశ్వరుడిని పూజించకుండా భోజనం చేయడం కంటే ప్రాణాలను త్యాగం చేయడం లేదా శిరస్సును కోసుకోవడం మేలు.

సనాతన ధర్మం లోని వారు ప్రతివారు ఆచరించవలసిన అత్యుత్తమ విధానం ఈ పంచాయతన అర్చన , విగ్రహ మూర్తులు లేక  పై లాంటివి లభించిన వారు శిలామూర్తులు గ్రహించవచ్చు .
ఎవరికి వారు వారి అర్హతను బట్టి పురాణోక్తంగా లేక వేదోక్తంగా దేవత ఆరాధనలు చేయవలసి ఉంటుంది 
కర్మ ప్రభావం వల్ల ఎన్నో కష్టాలు చూసిన వారు సైతం ఇది అనుసరించు వారికి దైవానుగ్రహం వల్ల శాంతి సంపదలు సమస్త అభీష్టాలు నెరవేరగలవు.
💐💐*మహాదేవ మహాదేవ మహాదేవ*💐💐
🙏🙏🙏🙏*రాళ్ళబండి శర్మ* 🙏🙏🙏🙏

Tuesday, August 19, 2025

కేరళ తంత్రం

కేరళ తంత్రం -- ఒక సంక్షిప్త పరిచయం........!!
​కేరళ తంత్రం అనేది భారతదేశంలోని ఇతర ప్రాంతాల తాంత్రిక పద్ధతుల కంటే భిన్నమైనది. ఇది వేదాలు, ఆగమాలు,

మరియు స్థానిక సంప్రదాయాల కలయిక. ఇక్కడ తంత్రం అంటే కేవలం కొన్ని రహస్య కర్మలు కాదు, అది ఆలయ నిర్మాణ శిల్పం నుండి నిత్య పూజల వరకు అన్నింటికీ సంబంధించిన ఒక శాస్త్రం. ఇక్కడ వివరించినట్టు, కేరళలో చేసే పరిహారాలు ఈ క్రింది ముఖ్య అంశాలపై ఆధారపడి ఉంటాయి:

​శక్తి ఉపాసన: 
చండీ, భద్రకాళి, భగవతి వంటి దేవతల ఆరాధన.

​సర్ప శాంతి: 
నాగదోషాలు, సంతాన సమస్యల నివారణకు ప్రత్యేకంగా చేసే కర్మలు.

​సంస్కార తంత్రాలు: 
వాస్తు, పితృదోష శాంతి కోసం చేసే కర్మలు.

​బీజాక్షరాల ప్రాముఖ్యత: 
ఓం, హ్రీం, శ్రీం, క్లీం వంటి బీజాక్షరాలను మంత్రాలకు హృదయంగా భావించి జపిస్తారు.

​హోమాలు: 
హోమాలు ద్వారా దైవ శక్తులను ఆవాహన చేసి, కోరిన ఫలితాలను వేగంగా పొందుతారు.

​కేరళలోని 5 ముఖ్య తాంత్రిక పరిహారాలు..........

​ఇక్కడ పంచుకున్న అత్యంత ప్రభావశీలమైన ఐదు పరిహారాలు, వాటి విధానాలు, మంత్రాలు, మరియు ఫలితాలను కింద వివరంగా విశ్లేషిస్తున్నాను.

​1. సంపద సిద్ధి – శ్రీ బీజ మంత్ర సాధన (లక్ష్మీ ఉపాసన)
​లక్ష్యం: ధనలాభం, వృత్తి అభివృద్ధి, ఐశ్వర్యం.

​మంత్రం: "ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః"

​విధానం:
 ఈ సాధనను శుక్రవారం లేదా అమావాస్య రాత్రి ప్రారంభించడం శ్రేష్ఠం. ఈ సాధనలో నెయ్యి దీపం, కుంకుమ, పసుపు పూలు, గోమయంతో చేసిన మేడ, మరియు తులసి లేదా స్ఫటిక జపమాల ఉపయోగించాలి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

​హోమం: 
ఇక్కడ వివరించిన విధంగా, ఆవుపాలు, నెయ్యి, తేనె, గోధుమ గింజలు వంటి వాటితో "ఓం శ్రీం మహాలక్ష్మ్యై స్వాహా" అనే మంత్రంతో హోమం చేయడం ద్వారా ఐశ్వర్యం త్వరగా సిద్ధిస్తుంది.

​నైవేద్యం: 
ఈ హోమం తర్వాత పాయసం లేదా లడ్డూ నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని స్వీకరించాలి.

​2. ఆరోగ్యం – ఆయుష్షు సాధన..,.
 (మహామృత్యుంజయ మంత్రం)

​లక్ష్యం: 
వ్యాధి నివారణ, దీర్ఘాయుష్షు, మానసిక శాంతి.

​మంత్రం: "ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం..."
​విధానం: 
ఈ సాధనను సోమవారం లేదా పౌర్ణమి రోజున ప్రారంభించాలి. శివలింగం ముందు బిల్వపత్రం, పాలు, బెల్లం, మరియు నెయ్యి దీపం సమర్పించాలి.

​హోమం: 
ఇక్కడ పేర్కొన్న విధంగా, నెయ్యి, బెల్లం, బిల్వపత్రం, తులసి వంటి వాటితో ఈ మంత్రాన్ని హోమం చేస్తే రోగాలు నివారించబడతాయి.

​నైవేద్యం: 
హోమం అనంతరం పంచామృతం లేదా బెల్లం పాయసం నైవేద్యంగా సమర్పించాలి.

​3. శత్రునాశనం (దుర్గాబీజ మంత్రం)
​లక్ష్యం: 
శత్రు బాధ నివారణ, ధైర్యం, విజయం.

​మంత్రం: 
ఓం దుం దుర్గాయై నమః"

​విధానం: మంగళవారం లేదా శనివారం రాత్రి ఈ సాధన ప్రారంభించాలి. ముఖ్యంగా, నిమ్మకాయతో చేసిన దీపం, ఎరుపు పూలు మరియు రక్త చందనాన్ని ఉపయోగించాలి.

​హోమం: 
ఈ హోమం కోసం నెయ్యి, ఎరుపు పూలు, మిరపకాయలు, మరియు అక్షతలు ఉపయోగిస్తారు. మీరు సూచించినట్టు, నిమ్మకాయతో పూర్ణాహుతి చేయడం తాంత్రిక విధానంలో చాలా ముఖ్యమైనది.

​నైవేద్యం: చక్కెర పొంగలి లేదా నిమ్మరసం అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి.

​4. సంతాన సిద్ధి (నాగ శాంతి – నాగ బీజ మంత్రం)..,.....

​లక్ష్యం: సర్పదోష నివారణ, సంతానప్రాప్తి.

​మంత్రం: "ఓం నమో భగవతే సర్పేశ్వరాయ నమః"
​విధానం: 
నాగపంచమి లేదా శ్రావణ శుక్రవారం రోజున ఈ సాధనను ప్రారంభించాలి. నాగదేవత చిత్రానికి పాలు, నెయ్యి మరియు పువ్వులు సమర్పించాలి.

​హోమం: 
మీరు వివరించిన విధంగా, పాలు, నెయ్యి, పసుపు గింజలు, తేనె మరియు చక్కెరతో హోమం చేస్తే నాగదోషాలు తొలగి, సంతానం కలుగుతుంది.

​నైవేద్యం: 
నైవేద్యంగా పాలు, పెరుగు, తేనె కలిపిన మిశ్రమం లేదా మిఠాయిని సమర్పించాలి.

​5. మోహన – ఆకర్షణ (కామ బీజ మంత్రం).......
​లక్ష్యం: 
ప్రేమలో విజయం, ఆకర్షణ, సంబంధాలలో సఖ్యత.
​మంత్రం:
 "ఓం క్లీం కృష్ణాయ గోపీజన వల్లభాయ స్వాహా"
​విధానం: ఈ సాధనను శుక్రవారం రాత్రి లేదా పౌర్ణమి రోజున ప్రారంభించాలి. శ్రీకృష్ణ చిత్రానికి ఎరుపు గులాబీలు మరియు నెయ్యి దీపం సమర్పించాలి.

​హోమం: 
నెయ్యి, తేనె, చక్కెర, గులాబీ రేకులు మరియు తులసి ఆకులతో హోమం చేయడం ద్వారా మోహన శక్తి పెరుగుతుంది.

​నైవేద్యం: 
వెన్న, పాలు, మరియు తేనె కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

​సాధారణ నియమాలు..........
​ఇక్కడ పంచుకున్న అన్ని పరిహారాలకు వర్తించే కొన్ని సాధారణ నియమాలు ఉన్నాయి.

​గురువు మార్గదర్శనం: ఈ తాంత్రిక పద్ధతులు శక్తివంతమైనవి, కాబట్టి గురువు మార్గదర్శనంలోనే చేయాలి.
​నియమ నిష్ఠ: శుభ్రత, శుద్ధమైన ఆహారం, మితాహారం మరియు సత్యవచనం పాటించడం తప్పనిసరి.

​సమయం: 
   మంత్ర జపాలను బ్రహ్మముహూర్తం (ఉదయం 4-6) లేదా అర్ధరాత్రి చేస్తే ఫలితాలు వేగంగా వస్తాయి.

​ఫలితం: 
ఏకాగ్రత, భక్తి మరియు విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే ఈ క్రియలు ఫలవంతం అవుతాయి.

​హోమాంతర కర్మలు: 
ఇక్కడ వివరించినట్టుగా, హోమం తర్వాత పూర్ణాహుతి, నైవేద్యం, ఆరతి మరియు అన్నదానం చేయడం ఆ కర్మకు సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది.

​ఈ సమాచారం కేరళ తంత్రం యొక్క లోతును, ప్రామాణికతను స్పష్టంగా చూపిస్తుంది.

శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా?


శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా?


సాదారణంగా మనకు దశావతారాలు లేదా విష్ణువు యొక్క 10 అవతారాల గురించి తెలుసు. కానీ శివునికి అవతారాలు ఉన్నాయని మీకు తెలుసా? నిజానికి శివునికి 19 అవతారాలు ఉన్నాయి. దేవుని యొక్క సంతతికి చెందిన ఈ అవతారాలు ఉద్దేశపూర్వకంగా భూమిపై మానవ రూపంలో ఉంటాయి. సాధారణంగా అవతారం ప్రధాన ఉద్దేశ్యం చెడును నాశనం చేయటం మరియు మానవుల యొక్క జీవితాన్ని సులభతరం చేయటానికి ఉంటుంది.

శివుని గురించి మాట్లాడితే, మాకు 19 అవతారాలలో చాలా కొన్ని మాత్రమే తెలుసు. శివుని యొక్క ప్రతి అవతారం ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది. శివుని యొక్క19 అవతారాలలో ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం మరియు మానవాళి శ్రేయస్సే అంతిమ ఉద్దేశ్యంగా కలిగి ఉన్నాయి. కాబట్టి, మీరు శివుని యొక్క19 అవతారాలు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింద ఉన్న వ్యాసంను చదవండి.
 
పిప్లాద్ అవతారం
శివుడు మహర్షి దధీచి ఇంటిలో పిప్లాద్ గా జన్మించెను. అయితే పిప్లాద్ జన్మించటానికి ముందే మహర్షి దధీచి ఇంటిని వదిలి వెళ్ళిపోయెను. పిప్లాద్ పెరిగిన తర్వాత తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళటానికి కారణం శని యొక్క చెడు ప్రభావం అని తెలుసుకొనెను. అందువలన పిప్లాద్ అతని ఖగోళ నివాసం నుండి శనిని క్షీణించమని శపించెను. తర్వాత అతని పరిస్థితిపై శివుడు జాలిపడి క్షమించేను. అయితే 16 సంవత్సరాల లోపు వారి మీద ఎప్పటికీ ప్రభావం చూపకుడదని చెప్పెను. అందువల్ల శివడుని పిప్లాద్ రూపంలో పూజిస్తూ శని దోషాన్ని వదిలించుకుంటారు.
 
నంది అవతారం
నంది లేదా ఎద్దు శివుని యొక్క వాహనంగా ఉంది. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శివుడిని నంది రూపంలో పూజిస్తారు. శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడుగా ఉంటారని పరిగణిస్తారు. ఎద్దు లేదా నంది నాలుగు చేతులతో ఉంటుంది. రెండు చేతులు కలిపి ఉంటాయి మరో రెండు చేతుల్లో గొడ్డలి మరియు జింక పట్టుకొని ఉంటారు.
 
వీరభద్ర అవతారం
సతీ దేవి దక్ష యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తరువాత,శివుడికి చాలా కోపం వచ్చింది. శివుడు అతని తల నుండి ఒక వెంట్రుకను త్రెంపి మైదానంలోకి విసిరెను. ఆ వెంట్రుక నుండి వీరభద్ర మరియు రుద్రకాళి జన్మించెను. ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైన అవతారం. అతను పుర్రెల దండ ధరించి, భయానకమైన ఆయుధాలు పట్టుకొని మరియు మూడు మండుతున్న కళ్ళతో ఒక డార్క్ దేవుడుగా కనపడతారు. శివుడు యొక్క ఈ అవతారంలోనే యజ్ఞం వద్ద దక్షుని యొక్క తలను త్రెంచబడింది.
 
భైరవ అవతారం
శివుడు,బ్రహ్మ మరియు విష్ణువు ఆధిపత్యం పోరాట సమయంలో ఈ అవతారం పట్టింది. బ్రహ్మ అతని ఆధిపత్యం గురించి అబద్దం చెప్పిన సమయంలో,శివుడు భైరవ రూపంలో బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికేను. బ్రహ్మ తల నరకటం వలన బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంది. అప్పుడు శివుడు బ్రహ్మ పుర్రె పట్టుకొని పన్నెండు సంవత్సరాల పాటు బిక్షాటన చేసెను. ఈ రూపంలోనే శివుడు అన్ని శక్తిపీఠాలకు కాపలా ఉంటారని చెప్పుతారు.
 
అశ్వత్థామ అవతారం
క్షీరసాగర మథన సమయంలో శివుడు ప్రాణాంతకమైన విషంను తీసుకొనెను. అతని గొంతులో విషం మండటం ప్రారంభమైంది.లార్డ్ విష్ణువు శివుని నుండి విషం బయటకు రాకుండా వరం ఇచ్చెను. అప్పుడు శివుడు విష్ణువుకి భూలోకంలో ద్రోణ కుమారుడుగా పుట్టుతావని వరం ఇచ్చెను. మొత్తం క్షత్రియులను చంపుతావని చెప్పెను. అందువలన విష్ణువు అశ్వత్థామగా జన్మించెను.
 
శరభ అవతారం
శరభ అవతారంలో శివుడు ఒక భాగం పక్షి,మరొక భాగం సింహ రూపంలో ఉంటుంది. శివ పురాణం ప్రకారం, విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మచ్చిక చేసుకోవటానికి శివుడు శరభ అవతారం ఎత్తేను.
 
గ్రిహపతి అవతారం
శివుడు విశ్వనర్ అనే బ్రాహ్మణుడు ఇంట కొడుకుగా జన్మించెను. విశ్వనర్ అతని కొడుకుకు గ్రిహపతి అనే పేరు పెట్టెను. గ్రిహపతికి 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతాడని నారదుడు అతని తల్లితండ్రులకు చెప్పెను. అందువలన,గ్రిహపతి మరణంను జయించేందుకు కాశీకి వెళ్ళెను. గ్రిహపతి శివుని అనుగ్రహం చేత మృత్యువును జయించెను.
 
దుర్వాస అవతారం
శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించడానికి ఈ రూపాన్ని ధరించెను. దుర్వాస గొప్ప యోగి మరియు తక్కువ నిగ్రహం కలవారని ప్రసిద్ది గాంచారు.
 
హనుమాన్ అవతారం
హనుమంతుడు శివుడి అవతారాలలో ఒకటి. రాముడు రూపంలో ఉన్న విష్ణువుకు సేవ చేయటానికి శివుడు హనుమాన్ రూపంలో అవతరించారు.
 
వృషభ అవతారం
సముద్ర మంథనం తర్వాత, ఒకసారి విష్ణువు పాతాళలోకం వెళ్ళెను. అక్కడ అతను అందమైన మహిళలు పట్ల తీవ్రమైన మొహాన్ని కలిగి ఉండెను. విష్ణువు అక్కడ నివసించిన కాలంలో అనేక మంది కుమారులు జన్మించారు. కానీ అతని కుమారులు అందరూ చాలా క్రూరముగా మరియు వికృతముగా ఉండేవారు. వారు మొత్తం దేవతలను మరియు మానవులను వేదించటం ప్రారంభించారు. అప్పుడు లార్డ్ శివ ఎద్దు లేదా వృషభ రూపంలో విష్ణు మూర్తి యొక్క కుమారులను చంపివేసెను. అప్పుడు విష్ణువు ఎద్దుతో పోరాటానికి వచ్చెను. కానీ ఎద్దును పరమేశ్వరుని అవతారం అని గుర్తించిన తర్వాత,అతను అతని నివాసం తిరిగి వెళ్ళిపోయెను.
 
యతినాథ్ అవతారం
ఒకప్పుడు ఆహుక్ అనే గిరిజనుడు ఉండేవాడు. అతను,అతని బార్య శివుని యొక్క భక్తులు. ఒక రోజు శివుడు యతినాథ్ రూపంలో వారికీ దర్శనం ఇచ్చెను. అయితే వారి గుడిసె ఇద్దరు పడుకోవటానికి మాత్రమే సరిపోతుంది. అందువల్ల ఆహుక్ బయట పడుకొని యతినాథ్ ను లోపల పడుకోమని చెప్పెను. దురదృష్టవశాత్తు ఆహుక్ రాత్రి సమయంలో ఒక క్రూర మృగంచే చంపబడ్డాడు.ఉదయం, ఆహుక్ చనిపోయినట్లు కనుకొని, తను కూడా చనిపోవాలని నిర్ణయించుకొనెను. అప్పుడు శివుడు అతని నిజ రూపంలో కనిపించి పునర్జన్మ లో ఆమె మరియు ఆమె భర్త నల మహారాజు మరియు దమయంతిలుగా జన్మిస్తారని చెప్పెను. ఇప్పుడు వారు శివునిలో ఇక్యం అయిపొయెను.
 
కృష్ణ దర్శన్ అవతారం
శివుడు ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయటానికి ఈ అవతారం జరిగింది.
 
భిక్షువర్య అవతారం
శివుని యొక్క ఈ అవతారం మానవులను అన్ని రకాల ప్రమాదాల నుండి కాపాడటానికి జరిగెను.
 
.సురేశ్వర్ అవతారం
శివుడు ఒకసారి భక్తులను పరీక్షించడానికి ఇంద్ర రూపంలో వచ్చెను. అందువల్ల ఈ అవతారంను సురేశ్వర్ అవతారం అని చెప్పుతారు.
 
కిరీట్ లేదా వేటగాడు అవతారం
అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో శివుడు ఒక వేటగాడు లేదా కిరీట్ రూపంలో వచ్చెను. దుర్యోధనుడు అర్జునుడుని చంపటానికి మూక అనే రాక్షసుణ్ణి పంపెను. మూక ఒక పంది రూపంలో వచ్చెను. అర్జునుడు తన ధ్యానంలో లీనమై ఉండగా,తన ఏకాగ్రతను భంగపరస్తూ అకస్మాత్తుగా బిగ్గరగా ఒక శబ్దం వచ్చెను. అప్పుడు కళ్ళు తెరచి మూకను చూసేను.
అర్జునుడు మరియు వేటగాడు ఒకేసారి పంది మీద బాణాలను వేసెను. ఇద్దరు కలిపి పందిని ఓడించెను. అర్జునుడుతో ఒక ద్వంద్వ యుద్ధం కోసం వేటగాడు రూపంలో ఉన్న శివుడు సవాలు విసిరెను. అప్పుడు శివుడు అర్జునుడు యొక్క శౌర్యంను మెచ్చి పాశుపత అస్త్రంను బహుమతిగా ఇచ్చెను.
 
సుంతన్ తారక అవతారం
శివుడు పార్వతిని వివాహం చేసుకోవటానికి ఆమె తండ్రి హిమాలయా నుండి అనుమతి కోసం ఈ అవతారం ఎత్తేను.
 
బ్రహ్మచారి అవతారం
పార్వతి ఆమె భర్త పరమశివుని పొందడానికి ప్రార్థన చేసే సమయంలో,శివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి ఈ అవతారం జరిగెను.
 
యక్షేశ్వర్ అవతారం
శివుడు దేవతల యొక్క మనస్సులలోకి వచ్చిన తప్పుడు అహంను తొలగించటానికి ఈ అవతారం జరిగేను.
 
అవధూత్ అవతారం
ఇంద్రుని యొక్క అహంకారంను తగ్గించటానికి శివుడు ఈ అవతారంను తీసుకున్నారు.
                  ఓం నమఃశివాయ.
🌹🌹🌹🙏🙏🙏

RECENT POST

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.............!!  కుబేర మంత్రం : (ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యదీప్తాయै ధనధాన్య...

POPULAR POSTS