Friday, December 25, 2020

శ్రీ అచలేశ్వర్ మహాదేవ్-ధోల్పూర్-రాజస్థాన్

*శ్రీ అచలేశ్వర్ మహాదేవ్-ధోల్పూర్-రాజస్థాన్*


మానవమేధస్సుకు 
అందని మరో శివలీల....

ప్రతీ రోజు మూడు రంగుల్లో శివలింగ దర్శనం. ఉదయ, మధ్యాహ్న, సాయంత్ర సమయాలలో శివయ్య సహజంగా తన లింగాకృతి వర్ణం మార్చుకుని దర్శనమిస్తాడు.

ఈ ఆలయం రాజస్థాన్ రాష్ట్రం ధోల్పూర్ లోని
మౌంట్ అబూ పర్వతాలకు11 కిలోమీటర్ల ఉత్తరాన
అచల్ ఘర్ కొండలపై ఉన్న కోట సమీపంలో ఉన్నది.

2500 సంవత్సరాలకు పూర్వపు ఆలయం ఇది.
ఈ ఆలయంలో శివుని బొటన వేలును లింగంగా ఆరాధిస్తారు.
 
మన దేశం లోని శైవశేత్రాలలో పరమేశ్వరుడు అత్యధికంగా లింగాకృతిలో, కొద్దిచోట్ల సాకార విగ్రహ స్వరూపంలో దర్శనమిస్తారు. కానీ ఇక్కడ బొటనవేలు ఆకారంలోని లింగ స్వరూపం గా దర్శనమివ్వడం విశేషం.
 
ఇక్కడ వలయాకారపు సొరంగ బిలం అందులో నీరు చేతికి అందే ఎత్తులో ఉంటుంది. అదే బిలంలో బొటనవేలు ఆకారంలో శివలింగాన్ని దర్శిస్తారు భక్తులు.

అది పరమేశ్వరుని కాలి బొటనవేలు. పూజలు కూడా ఆ బొటనవేలుకే జరుగుతాయి.
 
చలన లక్షణమున్న పర్వతాలను చలించకుండా చేసేందుకు ఇక్కడ స్వామిని అచలేశ్వర్ గా పిలుస్తారు.

శివుని బొటనవేలు ఆకారం ఉన్న సొరంగం పాతాళం వరకూ ఉందని నమ్ముతారు. నీటితో ఈ సొరంగం నిండడానికి ఆరు నెలలు కాలం పట్టిందని అంటారు.

అచలేశ్వర్ ఆలయాన్ని 9వ శతాబ్దం లో పారమార రాజ వంశీయులు నిర్మిచారని చెబుతారు.

ఈ ఆలయంలో ఐదు టన్నుల బరువుండే పంచలోహ నందీశ్వర విగ్రహం ఉంటుంది. ఆ నంది ప్రక్కనే పిల్లవాని విగ్రహం కూడా కనిపిస్తుంది. ఆలయం విచ్చిన్నం చేసే ప్రయత్నం చేసిన దుష్టశక్తులపై నందీశ్వర విగ్రహం నుండి తేనెటీగలు లేచి దాడిచేసి ఆలయాన్ని రక్షించాయి అన్నది స్థలపురాణం.

వశిష్టముని తపస్సు చేసిన ప్రదేశం. ఒక గోమాత ఈ బిలం లో చిక్కుకుంటే ముని ప్రార్ధన మేరకు గోమాతను రక్షించేందుకు సరస్వతీ నది పాయను శివుడు బిలం లోనికి పంపారని స్థల మహత్మ్యం చెబుతోంది.

ఈ అలయం సమీపం లో ఉండే తటాకం ఒడ్డున మూడు రాతి గేదెలు ఉంటాయి.
ఈ క్షేత్రాన్ని అర్థ కాశీ అని పిలుస్తారు.

శివయ్య బొటనవేలు క్రింద ఒక సహజ కొలను ఉంది.ఇది ఎప్పటికీ నిండదు. ఈ నీరు ఎక్కడికి వెళుతోంది కూడా అంతుపట్టని రహస్యం
 
ఈ లింగాకృతి ప్రతీ రోజు మూడు రంగుల్లో భక్తులకు దర్శనమిస్తుంది. ఉదయం ఎరుపు వర్ణంలో, మధ్యాహ్నం కాషాయ వర్ణంలో,
సాయంత్రం నలుపు వర్ణం లో
కనిపించడం ఎవ్వరూ తెలుకోలేని శివలీలగా నిలిచి ఉన్న సత్యం.

ఆలయ ప్రాంగణంలో పురాతన చంపా వృక్షం ఉంది.

 
పురాతన స్మారక చిహ్నాలు మరియు దేవాలయాలకు రాజస్థాన్ ప్రసిద్ధి చెందింది. 
ఈ పురాతన రాచరిక రాజ్యం సంవత్సరాలుగా భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన స్మారక చిహ్నాలు, కోటలు మరియు దేవాలయాలకు నిలయంగా మారింది. 

ఈ ఆలయం ఇప్పుడు దేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి మరియు దర్శించే వారిపై గొప్ప శివ దర్శనానుభవం చూపుతుంది...

ఓం నమః శివాయ.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS