Sunday, July 30, 2023

*వత్తులు , ప్రాముఖ్యత* ....!!



*వత్తులు , ప్రాముఖ్యత* ....!!


1 ) ఒక వత్తి : సామాన్య శుభం
2 ) రెండు వత్తులు : కుటుంబ సౌఖ్యం
3 ) మూడు వత్తులు : పుత్ర సుఖం

4 ) ఐదు వత్తులు : ధనం , సౌఖ్యం , ఆరోగ్యం ,

ఆయుర్ధాయం , అభివృద్ధి దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్ఠము .

 *దీపారాధన విధానం* 

 *1 ) నెయ్యి*: 

నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగును .

*2) నువ్వుల నూనె* : 

నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు , పీడలు తొలగును .

*3 ) ఆముదం* : 

ఆముదముతో దీపారాధన చేసిన , దేదీప్యమానమగు జీవితం , బంధుమిత్రుల శుభం , దాంపత్య సుఖం వృద్ధియగును .

*4 ) వేరుశెనగ నూనె* :

వేరుశెనగనూనెతో దీపారాధన చేసి నిత్య ఋణములు , దుఖం , చోర భయం , పీడలు

మొదలగునవి జరుగును .

 *5 ) నెయ్యి , ఆముదం , వేప నూనె , కొబ్బరి నూనె , యిలప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన , వారికి దేవీ అనుగ్రహం కలుగును* .

*6 ) వేపనూనె , నెయ్యి , యిలపనూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం ఇలవేల్పులకు సంతృప్తి కలుగును* .

 *7 ) ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి జరుగంటలలోపు చేసిన సర్వరుభములు , శాంతి కలుగును* .

🌹దీపాల యొక్క దిక్కుల ఫలితములు:- 🌹

🌸1 ) తూర్పు : 

కష్టములు తొలగును , గ్రహదోషములు పోదురు ,

🪷 2 ) పశ్చిమ : 

అప్పుల బాధలు , గ్రహదోషములు , శనిదోషములు తొలగును ,

🌸 3 ) దక్షిణం : 

ఈ దిక్కున దీపము వెలిగించరాదు కుటుంబమునకు కష్టము కలును ,

🪷 4 ) ఉత్తరం : 

ధనాభివృద్ధి , కుటుంబములో శుభకార్యములు జరుగును .


🌷దీప వత్తుల యొక్క ఫలితములు : ....🌷

🌸1)పత్తి:-

పత్తితో దీపము వెలిగించినదో ఆయుషు పెరుగును .

🪷 2 ) అరటినార :-

ఆరటి నారతో దీపము వెలిగించినదో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును .

🌸 3 ) జిల్లేడినార:- 

జిల్లేడినారతో దీపము వెలిగించినచో భూత , ప్రేత , పిశాల బాధలు ఉండవు ,

🪷4 ) తామర నార :-

పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును . ధనవంతు లగుదురు .

🌸5 ) నూతన పసుపు వస్త్రము :-

అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుదురు

🪷 6)నూతన ఎరుపు వస్త్రము :- పెళ్ళిళ్ళు అగును , గొడ్రాలికి సంతానము కల్గును

🌸7 ) నూతన తెల్ల వస్త్రము :-
పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగును , సాయంత్ర సమయములందు శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం , సౌభాగ్యం కల్గును.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS