Sunday, July 30, 2023

వత్తులు , ప్రాముఖ్యత దీపారాధన విధానం

 వత్తులు , ప్రాముఖ్యత   దీపారాధన విధానం 




1 ) ఒక వత్తి : సామాన్య శుభం

2 ) రెండు వత్తులు : కుటుంబ సౌఖ్యం

3 ) మూడు వత్తులు : పుత్ర సుఖం


4 ) ఐదు వత్తులు : ధనం , సౌఖ్యం , ఆరోగ్యం ,


ఆయుర్ధాయం , అభివృద్ధి దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్ఠము .




 1 ) నెయ్యి: 


నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగును .


2) నువ్వుల నూనె : 


నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు , పీడలు తొలగును .


3 ) ఆముదం : 


ఆముదముతో దీపారాధన చేసిన , దేదీప్యమానమగు జీవితం , బంధుమిత్రుల శుభం , దాంపత్య సుఖం వృద్ధియగును .


4 ) వేరుశెనగ నూనె :


వేరుశెనగనూనెతో దీపారాధన చేసి నిత్య ఋణములు , దుఖం , చోర భయం , పీడలు మొదలగునవి జరుగును .


 5 ) నెయ్యి , ఆముదం , వేప నూనె , కొబ్బరి నూనె , యిలప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన , వారికి దేవీ అనుగ్రహం కలుగును .


6 ) వేపనూనె , నెయ్యి , యిలపనూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం ఇలవేల్పులకు సంతృప్తి కలుగును .


 7 ) ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి జరుగంటలలోపు చేసిన సర్వరుభములు , శాంతి కలుగును .


దీపాల యొక్క దిక్కుల ఫలితములు:- 


1 ) తూర్పు : 


కష్టములు తొలగును , గ్రహదోషములు పోదురు ,


 2 ) పశ్చిమ : 


అప్పుల బాధలు , గ్రహదోషములు , శనిదోషములు తొలగును ,


 3 ) దక్షిణం : 


ఈ దిక్కున దీపము వెలిగించరాదు కుటుంబమునకు కష్టము కలును ,


 4 ) ఉత్తరం : 


ధనాభివృద్ధి , కుటుంబములో శుభకార్యములు జరుగును .



దీప వత్తుల యొక్క ఫలితములు : ....


1)పత్తి:-


పత్తితో దీపము వెలిగించినదో ఆయుషు పెరుగును .


 2 ) అరటినార :-


ఆరటి నారతో దీపము వెలిగించినదో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును .


 3 ) జిల్లేడినార:- 


జిల్లేడినారతో దీపము వెలిగించినచో భూత , ప్రేత , పిశాల బాధలు ఉండవు ,


4 ) తామర నార :-


పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును . ధనవంతు లగుదురు .


5 ) నూతన పసుపు వస్త్రము :-


అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుదురు


 6)నూతన ఎరుపు వస్త్రము :- పెళ్ళిళ్ళు అగును , గొడ్రాలికి సంతానము కల్గును


7 ) నూతన తెల్ల వస్త్రము :-

పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగును , సాయంత్ర సమయములందు శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం , సౌభాగ్యం కల్గును.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS