Monday, July 31, 2023

శ్రీ కాళహస్తి

 శ్రీ కాళహస్తి 


దక్షిణ భారతదేశంలోనే ప్రశస్తమైనది ఈ దేవాలయం అదే శ్రీ కాళహస్తి.*63 నయనారులలో ఒకడైన కన్నప్ప ఇక్కడే శివలింగం కళ్ళలోనుండి వస్తున్న రక్తాన్ని ఆపడానికి తన కళ్ళను పెరిగి శివలింగానికి అమర్చిన హృదయాన్ని ద్రవింపజేసే మహత్తర ఘట్టం చోటు చేసుకున్న పుణ్యస్థలం ఈ శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది.వాయుదేవునికై నిర్మించిన ఏకైక దేవాలయం శ్రీకాళహస్తిలో ఉంది. వాయుదేవుడు ఇక్కడ శివుని రూపంలో శ్రీకాళహస్తీశ్వరునిగా పూజలందుకుంటాడు. చోళరాజు శ్రీ రాజేంద్ర చోళుని చే 12వ శతాబ్దంలో ఈ దేవాలయం నిర్మించబడింది.

భారతీయ ఖగోళశాస్త్రంలో ప్రముఖులైన రాహువు, కేతువు లకు కూడా ఇక్కడ గుడులు నిర్మించారు. సువర్ణముఖి నది ఒడ్డున ఉంది. శ్రీ కాళహస్తిని 'దక్షిణ కైలాసం' గా భావిస్తారు. మొదటి శతాబ్దానికి చెందిన శైవ సన్యాసులు ఈ దేవాలయం గూర్చి గానం చేశారు.

వాస్తుశిల్పకళ ప్రకారంగా కూడా శ్రీకాళహస్తి ఒక అధ్బుతమైన శివాలయం.

పురాతన సాంప్రదాయ రీతిలో నిర్మించబడిన 120 అడుగుల (36.5m) ఎత్తున్న పెద్ద గోపురం దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణ. పెద్ద రాతిగుట్ట ను తొలిచి ఈ దేవాలయాన్ని నిర్మించారు. మెదట పల్లవ రాజులు ఈ దేవాలయ నిర్మాణం గావించారు. తమిళులైన చోళ రాజులతో పాటూ విజయనగర రాజులూ ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేశారు. ఐతే ఇతర దేవాలయాల్లాగే శ్రీకాళహస్తి నిర్మాణం కూడా శతాబ్దాలపాటూ జరిగింది. పదో శతాబ్దంలో చోళరాజులు దేవాలయాన్ని పునరుద్దరించి ఒక రూపునిచ్చారు. ప్రాకారపు గోడలు, నాలుగు గోపురాలు పన్నెండో శతాబ్దంలో వీరనరసింహరాయార్ చే నిర్మించబడ్డాయి. 120 అడుగుల ఎత్తున్న ప్రధాన గోపురాన్ని, వందకాళ్ళ మంటపాన్ని విజయనగర రాజు శ్రీ క్రిష్ణ దేవరాయలు క్రీ.శ. 1516లో నిర్మించారు.

దేవాలయాన్ని పునరుద్దరించి ఒక రూపునిచ్చారు. ప్రాకారపు గోడలు, నాలుగు గోపురాలు పన్నెండో శతాబ్దంలో వీరనరసింహరాయార్ చే నిర్మించబడ్డాయి. 120 అడుగుల ఎత్తున్న ప్రధాన గోపురాన్ని, వందకాళ్ళ మంటపాన్ని విజయనగర రాజు శ్రీ క్రిష్ణ దేవరాయలు క్రీ.శ. 1516లో నిర్మించారు.

దేవక్కొట్టకు చెందిన నట్టుక్కొట్ట చెట్టియార్ 1912లో ఒక మిలియన్ డాలర్లు వెచ్చించి ప్రస్తుతమున్న రూపు తెచ్చారు. అప్పార్, సుందరార్, సంబందార్ మొదలైన నయనారులు శ్రీకాళహస్తీశ్వరున్న తమ 'తేవారం' భక్తిగీతాల్లో కొనియాడారు.

పంచబూతాల రూపంలో శివుని ప్రార్దించడం శైవ సాంప్రదాయం. శ్రీకాళహస్తిలో శివున్ని పంచబూతాల్లో ఒకటైన 'వాయు' రూపంలో పూజిస్తారు. (నీరు- తిరువనైకావల్, అగ్ని-అన్నామలైయార్, భూమి-ఏకాంబరేశ్వరార్ దేవాలయం, ఆకాశం (విశ్వం)- చిదంబరం దేవాలయం)గర్భగుడిలో గాలి చలనం లేకున్నా, గర్భగుడి ప్రదాన ద్వారం మూసివేసినా అక్కడి దీపాలపై మంట కదులుతూ ఉండటం అద్భుతం. శివుని ఉచ్వాసనిశ్చ్వాస లకు అనుగుణంగా ఆ దీపాలు కదులు తున్నాయని నమ్మకతప్పదు. శ్రీకాళహస్తిలో కలదు అద్భుతమైన స్వయంభూ లింగం.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS