Friday, April 20, 2018

శంకరాచార్యుల వైభవం ఆది శంకరాచార్యులు 32వ ఏట శరీరాన్ని విడిచిపెట్టేలోపు చేసిన స్తోత్రాలు-రచనలు,-భాష్యాల వివరాలు.



*సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం
జగధ్గురు శ్రీ ఆది శంకరాచార్యలు జయంతి పర్వదిన సందర్భంగా
జగత్గురు ఆదిశంకరాచార్యలు  సంపూర్ణ జీవిత చరిత్ర
**********************
⚜⚜⚜⚜
**********************
సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు . ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడే ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రధముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 — 820 మధ్య కాలంలో శంకరుడు జీవించాడని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. శంకరుడు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (- శివరహస్యము నుండి).
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా
శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి,వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించాడు. (కూర్మపురాణం నుండి).
హిందూ మతంపై శంకరుని ప్రభావం అసమానమైనది. శంకరుడు సాధించిన ప్రధాన విజయాలు:
బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరుడు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు.
ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశాడు. తరువాత శంకరుని అనుసరించినవారికీ, శంకరునితో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి.
శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించాడు. అవి శంకరుని సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకథారా స్తోత్రం,శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్ధనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.
జీవిత గాధ
***********
శంకరుని జీవితానికి సంబంధించిన వివిధ గాధలు, నమ్మకాలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని - శంకరుని జీవిత గాధలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.
వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగారు.
జననము
*********
శంకరుల జన్మస్థలం కాలడి
సదాశివుడే ఆదిశంకరుని రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ,శివగురువు లకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడి లో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్ కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ,శివగురువు లు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్ధించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామి కి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరునికి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితి లో ఉండగా జన్మించారు. ఆదిశంకరుని జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో జన్మించారు.
బాల్యము
**********
శంకరుని బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకథారా స్తోత్రాన్ని చెప్పారు. కనకథారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేస్తుంది.
ఒకరోజు శంకరుని తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.
సన్యాస స్వీకారము
*****************
సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరుడు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరుడు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరాడు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.
గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.
గోవింద భగవత్పాదుల దర్శనం
**********************
తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యుడు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరునికి అడవులనుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చెయ్యగా గోవింద భగవత్పాదుడు ఎవరునువ్వు అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.
న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం
నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.
ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరుని, గోవిందభగవత్పాపాదుడు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నాడు. - "స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్" (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరుడు.)
శంకరులు వెంటనే గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరునికి బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన ఓంకార శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రా లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు.
వారాణసిలో శంకరులు
********************
గురువునాజ్ఞతో శంకరులు వారాణసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానమాచరించి, విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుపరజనును ఆకర్షించినట్లు, వేదసూక్ష్మాలు శంకరునికి వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరునికి ప్రధమ శిష్యుడయ్యాడు.
మనీషా పంచకం
***************
ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక ఛండాలుడు అడ్డువస్తాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ ఛండాలుడు ఈ విధంగా అడిగాడు.
అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి
సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు
ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరునికి పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.
ప్రస్థానత్రయం
*************
అలా శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి, కాశీ నుండి బదరి కి బయలు దేరారు. బదరి లో ఉన్న పండితుల సాంగత్యంతో, పండితగోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నపుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలుకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము మరియు "లలితా త్రిశతి"లకు కూడా భాష్యాలు వ్రాశారు.
వ్యాసమహర్షి
*************
ఒకరోజు శంకరుడు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరునికి చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరుడు మాత్రమేనని ప్రశింసించాడు.
వేదవ్యాసుడు నిష్క్రమించ బోవడం చూసి, శంకరుడు నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించమని వ్యాసుని కోరుతాడు. అప్పుడు వ్యాసుడు "లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు అయుష్షు లభించుగాక" అని దీవిస్తాడు.
శంకరాచార్యుని శిష్యులు
*********************
శంకరునికి అనేకులు శిష్యులుగా ఉండిరి. ఆయన ప్రజ్నాపాఠవాలకు కొందరు. చర్చలద్వారా ఓడింపబడిన వారు మరికొందరు ఇలా అనేకులు ఆయన శిష్యులుగా ఉండేవారు వారిలో అతి ముఖ్యులు కొందరు కలరు
పద్మపాదుడు
************
పూర్తి వ్యాసం పద్మపాదాచార్యులు
శంకరుని కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రహ్మణుడను, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి జ్నానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్ధించాడు. అలా శంకరునుకు అత్యంత ఆత్మీయునిగా మారాడు.సదానందుడు శంకరునికి అత్యంత సన్నిహితంగా ఉండడంవల్ల తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరుడు గ్రహించి వారిలోని ఆ అసూయను పోగట్టదలచారు. ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుడ్ని పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకొంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసినచోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు, సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడు అయ్యాడు. పద్మపాదునికి సంబంధంచిన మరొక కథ. శ్రీ శంకరులు శ్రీ శైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసారు. శంకరులు తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో హిందూ ధర్మ ప్రచారము చేయుచున్నకాలమందు శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందిచు యత్నముతో ఆపరిసరాలయందు భీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుచున్న శంకరుని వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను.ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లిఖార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈదృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోదృగ్గుడై శ్రీలక్షీనృసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరును వధించుటకు ఉరికిన ఆదొంగలనాయకునిపై ఎటునుండొ హటాత్తుగా ఒక సింహము దాడి చేసినది అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది. తదనంతరము మిగిలిన శిష్యులకు ఈ విషయము తెలిసి పద్మపాదుని శక్తికి అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని అభినందించారు.
కుమారిల భట్టు ను కలవడం
**********************
తన 15 వ ఏట, శంకరులు ప్రయాగలో ఉన్న కుమారిల భట్టును కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. భట్టు వేదాలను తంతు లేదా ఆచార సంబంధమైన కార్యాలకు వినియోగించే వైదిక వృత్తికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు తాను నేర్చుకున్న బౌద్ధమతసిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నాల్లో భట్టు ఉన్నాడు. శంకరులు ప్రయాగ చేరే సమయానికి భట్టు ఊకతో చేసిన అగ్ని గుండంలో నిలబడి ఉన్నాడు. భట్టు శంకరుని గుర్తించి, బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసిన పనిని శంకరునికి వివరిస్తాడు. శంకరుడు రాసిన భాష్యాల గురించి తనకు తెలుసుననీ, వాటికి వార్తికలు (వివరణాత్మక వ్యాసాలు) వ్రాయాలన్న కోరిక తనకు ఉన్నదని కూడా వెల్లడిస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు వ్రాయలేనని, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుడు వ్రాస్తాడని చెప్పాడు. శంకరుని దర్శనంతో తన సర్వపాపాలు హరించాయని అన్నాడు. అప్పుడు శంకరుడు "శివుని పుత్రుడైన కుమారస్వామి గా నిన్ను నేనెరుగుదును. నీ చెంతకు పాపాలు చేరవు. అగ్ని నుండి నిన్ను రక్షిస్తాను, నా భాష్యాలకు వార్తికలు రచించు" అని కోరాడు. భట్టు అందుకు నిరాకరించి, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుని తర్కంలో ఓడించి, శిష్యునిగా చేసుకుని, ఆతనిచేత వార్తికలు వ్రాయించమని శంకరునితో చెప్పాడు.
భట్టిపాదుడు
************
భట్టిపాదుడు వేదవేదాంగాలు చదివిన జ్నాని. అతడు పుట్టేనాటికి భౌద్దమతం వ్యాప్తి జరిగి ఉన్నది. వైదిక ధర్మాలను హిందూ మత సిద్ధాంతాలను వ్యాప్తిచేయాలని అనుకొన్న భట్టిపాదుడు ముందు భౌద్దం గురించి తెలుకుంటే తప్ప దానిలో తర్కం చేయలేనని భౌద్ద బిక్షువుగా వేషం ధరించి ఒక భౌద్ద మతగురువు వద్ద భౌద్ద శాస్త్రాలను గురించి తెలుసుకోసాగాడు. ఒక నాడు ఒక భౌద్ద బిక్షువు హిందూ మతమును విమర్శించుచుండగా సహింపక వాదించుటతో వారతడిని మేడపైనుండి పడదోయగా ఒక కన్ను పోతుంది. దీనిపై ఆ రాజ్య రాజు విచారణ చేయగా భౌద్ద సన్యాసులతో ప్రసంగానికి పూనుకొని వారిని ఓడించి సభలో వేద ప్రభావం భోదించగా రాజు వేదప్రభావం గురించి చెప్పిన మిమ్ము పైనుంచి తోసివేసిన ఎలా పడినారు అని అడుగగా అది హఠాత్తుగా నేను ఏమరుపున ఉండగా జరిగినది. మీరు ఇపుడు పరిక్షీంచవచ్చు అని చెప్పగా రాజు మేడమీదనుండి త్రోయమని చెపుతాడు. భట్టిపాదుడు వేదపురుషుని ధ్యానిస్తూ వేదమే ప్రమాణమైతే నాకెటువంటి హానీ జరుగదు అనుకొంటూ దూకగా ఏ విధమైన దెబ్బలు తగలక వచ్చిన భట్టిపాడుని మరొక పరీక్షకు అహ్వానించి ఒక కాళీ కుండ తెప్పించి అందులో ఏమున్నది అని అడుగగా శ్రీమహావిష్ణువు ఉన్నడని చెపుతాడు. అందులో రాజుకు భోగశయనుడైన శ్రీమహావిష్ణువు దర్శనం ఇవ్వడంతో వేదాలను శాస్త్రాలను మాత్రమే ప్రమానంగా నమ్మి వైదిక కర్మలను ఆచరించని భౌద్ద బిక్షులను అందరినీ చంపమని ఆదేశిస్తాడు.దానితో అతని గురివుతో సహా అందరినీ చంపగా గురువును చంపినను, భౌద్దంలో ఉండగా ఈశ్వరుడే లేడని అన్నాను. ఇలా అనేక తప్పులు చేసిన నాకు చావే శరణ్యం అని తలచి చితి పేర్పించి కాల్చుకోడానికి తయారుకాగా శంకరుడు అక్కడకు వచ్చి వారిస్తాడు. తన సూత్ర భాష్యానికి వార్తికము రచించమి అడుగుతాడు. తనకు సాటికల మండన మిశ్రుడి ద్వారా ఆ కార్యము నెరవేర్చమని, శంకరుని చేతిమీదగా మోక్షము ప్రసాదించమని వేడుకొనగా శంకరుడు అంగీకరించి అతనికి బ్రహ్మ రహస్యాన్ని ఉపదేశించి ముక్క్తి ప్రసాదిస్తాడు
మండన మిశ్రునితో తర్క గోష్ఠి
**********************
మాహిష్మతిలో మండన మిశ్రుని ఇంటి వెళ్ళిన సమయానికి మండన మిశ్రుడు తన తపోశక్తితో వ్యాసభగవానుడిని, జైమినిమహా మునిని ఆహ్వానించి, వారికి అర్ఘ్యపాద్యాలు ఇస్తున్నాడు. శంకరుడు ఇంటికి రావడం గమనించి, తన ఇంటిలో సన్యాసులకు ప్రవేశం లేదని, అందువలన స్వాగతం పలకనని చెప్పాడు. అయితే, మహర్షుల ఆదేశంతో శంకరుని లోపలికి ఆహ్వానించాడు. తరువాతి రోజున చర్చ జరపాలని నిర్ణయించుకున్నారు. న్యాయనిర్ణేతలుగా వ్యాసుడు, జైమిని లను ఉండమని అభ్యర్థించగా,మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి సాక్షాత్తూ సరస్వతీ స్వరూపమనీ, ఆమెను న్యాయనిర్ణేతగా ఉంచి గోష్ఠి జరపమనీ వారు చెప్పారు. ఉభయభారతి మధ్యవర్తి గా ఉండటానికి అంగీకరించి, వాళ్ల ఇద్దరి మెడలలోనూ రెండు పూలమాలలు ఉంచి, వాదనసమయంలో ఎవరి మెడలో పూలమాల ఒడిలి పోతే వాళ్లు ఓడిపోయినట్లు అని చెప్పింది. వాళ్లిద్దరూ వాదన ప్రారంభించిన తర్వాత కొంతసేపటి కి మండనమిశ్రుని మెడలోని మాల ఒడిలిపోయింది. కాని, భర్త శరీరం లో భార్య సగం కనుక తనను కూడా ఓడిస్తే కాని తన భర్త ఓడినట్లు కాదని ఉభయభారతి చెప్పింది. శంకరులు దానికి అంగీకరించారు. ఉభయభారతి ఎన్నో చిక్కు ప్రశ్నలను శరపంపరగా సంధించగా, శంకరులు అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పగలిగినా ఆమె చివరిగా డిగిన మన్మధ కళలెన్ని వాటి స్వరూపార్ధాలేమిటి,శుక్ల పక్షలందు స్త్రీ పురుషులలో జరిగే మార్పులేమిటి అని అడిగింది. బ్రహ్మచారియైన శంకరుడు వాటిని గురించి తెలుసుకొనే ఉద్దేశ్యంతో జవాబులు చెప్పేందుకు కొంత కాలం గడువు ఇమ్మని అడిగిగడు.
కామరూపవిద్య
**************
శంకరుడు వందమంది భార్యలు కల అమరకుడు అనే రాజు చనిపోవుట గమనించి శిష్యులతో తన శరీరమును కాపాడమని చెప్పి రాజు శరీరంలో ప్రవేశించి అమరకునిగా నూర్గురు భార్యలతోనూ అనంగతంత్ర పాండిత్యంలో కల శ్రద్ద, ప్రీతి, రతి, దృతి, కీర్తి, మనోభవ, విమల, మోదిని, ఘోర, మధనోత్పాదిక, మద, దీసిని, వశకరి, రంజని,మోహిని అనే పదిహేను కళలూ నేర్చి తన శరీరంలో ప్రవేశించి ఆమెను పరాభూతురాలిని చేశాడు. చివరికి మండనమిశ్రుడు తన ఒటమిని అంగీకరించాడు. అప్పుడు అతనికి శంకరులు సన్యాసాన్ని ఇచ్చి, తన శిష్యునిగా స్వీకరించి, సురేశ్వరాచార్యుడుగా ప్రసిద్ధుడవుకమ్మని ఆశీర్వదించారు.
దిగ్విజయ యాత్రలు
*******************
తరువాత శిష్యులతో కలిసి శంకరులు మహారాష్ట్ర దేశంలోని పుణ్యక్షేత్రాలను, శ్రీశైలం వంటి ఇతర క్షేత్రాలను సందర్శించారు. శ్రీశైలంలో "శివానందలహరి" స్తోత్రాన్ని రచించారు. మాధవీయ శఁకర విజయం ప్రకారం ఒక కాపాలికుడు శంకరుని సంహరింపబోయినపుడు శంకరుని శిష్యుడు పద్మపాదుడు దేవుని ప్రార్ధించాడు. అపుడు శ్రీనృసింహుడు శంకరుని రక్షించాడు. ఆ సందర్భంలోనే శంకరుడు శ్రీలక్ష్మీనృసింహ స్తోత్రంతో దేవుని స్తుతించారు. ఈ స్తోత్రాన్నే కరావలంబస్తోత్రం అని కూడా అంటారు.
తరువాత శంకరులు గోకర్ణంలో హరిశంకర మందిరాన్ని, కొల్లూరులోని మూకాంబిక మందిరాన్ని దర్శించారు. కొల్లూరులో మూగవాడనిపించిన ఒక యువకుడు హస్తామలకాచార్యుడనే పేరుతో శంకరుని శిష్యుడైనాడు. తరువాత శంకరులు శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించారు. తోటకాచార్యుడు శంకరుని శిష్యుడయ్యాడు. పిదప శంకరులు దక్షిణ, ఉత్తర దేశాలలో తన "దిగ్విజయం" సాగించారు. హిందూ, బౌద్ధ పండితులను వాదాలలో ఓడించి అద్వైతాన్ని ఒప్పించారు. కేరళ, కర్ణాటక, సౌరాష్ట్ర దేశాలలో శంకర దిగ్విజయం సాగింది. గోకర్ణం, సోమనాధ, ద్వారక, ఉజ్జయినిలను దర్శించారు. బాహ్లిక దేశంలో జైనులను వాదంలో ఓడించారు. కాష్మీర, కాంభోజ దేశాలలో తాంత్రికులను కలుసుకొన్నారు.
సర్వజ్ఞపీఠం అధిరోహణ
*********************
కేదారనాధ్‌లో శంకరుని సమాధి మందిరం వద్ద ప్రతిమ
శంకరుడు కాష్మీర దేశంలో శారదాపీఠాన్ని సందర్శించారు. (ఇది ఇప్పుడు పాకిస్తాన్ అధీన ప్రాంతలో ఉంది , ఆ పీఠానికి నలుదిక్కుల ద్వారాలలో నలుగురు ఉద్ధండ పండితులు ఉన్నారు. కాని దక్షిణ ద్వారం అంతవరకు తెరువబడలేదు (అనగా దక్షిణ దేశంనుండి గొప్ప పండితులెవరూ రాలేదు). పండితులను మీమాంస వేదాంతాది తర్కాలలో ఓడించి శంకరులు దక్షిణ ద్వారాన్ని తెరిపించి అక్కడి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు.
తన జీవితం చివరి దశలో శంకరులు కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించి విదేహ ముక్తుడయ్యారు. కేదారనాధ మందిరం వెనుక శంకరుని స్మృతి చిహ్నంగా ఒక సమాధి ఉంది. అయితే శంకరులు కేరళలోని త్రిస్సూర్‌లో దేహంవిడిచారని "కేరళీయ శంకర విజయం" చెబుతున్నది. కాదు కంచి లో అని కూడా అంటారు.
శంకరుని జీవిత కాలము
**********************
శంకరుని జీవిత కాలం గురించి ప్రబలమైన అభిప్రాయాలున్నాయి.
క్రీ.పూ. 509 — 477 :ద్వారక, పూరి, కంచి మఠాల ఆచార్యుల గురించిన రికార్డుల ద్వారా ఈ కాలం నిర్ణయింపబడుతున్నది.
అయితే శంకరుడు ధర్మకీర్తి అనే బౌద్ధ పండితునితో వాదం సాగించిన ఆధారం ప్రకారం ఈ కాలం గురించి సంశయాలున్నాయి. ఎందుకంటే ధర్మకీర్తి గురించి 7వ శతాబ్దంలో హ్యూన్‌త్సాంగ్ తన రచనలలో ప్రస్తావించాడు. అంతే కాకుండా ఇంచుమించు శంకరుని సమకాలీనుడైన కుమారిలభట్టు 8వ శతాబ్దంవాడని భావిస్తున్నారు. దండయాత్రల కారణంగాను, మధ్యలో వచ్చిన అంతరాయాల కారణంగాను, ద్వారక మరియు పూరి రికార్డు కంటే శృంగేరి రికార్డులు మరింత పక్కాగా ఉండే అవకాశం
శృంగేరిలో విద్యాశంకర మందిరం
*******************************
మఠము-పీఠము. సన్యాసులు, బ్రహ్మవారి గురించి 
ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని  పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా ,శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.
శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి,వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి).
బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు.
ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశారు. తరువాత శంకరుల అనుసరించినవారికీ, శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి.
శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకథారా స్తోత్రం,శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.ఈయన 108 గ్రంథాలు రచించారు.
శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని,శంకరుల జీవిత గాథలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.
వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగినారు.
జననము:
శంకరుల జన్మస్థలం కాలడి
సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ,శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ,శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందినారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా జన్మించారు.
బాల్యము:
శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరులు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకథారా స్తోత్రాన్ని చెప్పారు. కనకథారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది.
ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.
సన్యాస స్వీకారము:
సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరినారు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.
గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు
.
గోవింద భగవత్పాదుల దర్శనం:
తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరులకు అడవులనుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చెయ్యగా గోవింద భగవత్పాదులు 'ఎవరు నువ్వు?' అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.
న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం
నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.
ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను, గోవిందభగవత్పాపాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు. - "స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్" (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరులు.)
శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రా లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు.
వారాణాసిలో శంకరులు:
గుర్వాజ్ఞతో శంకరులు వారాణాసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానమాచరించి, విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుపరజనును ఆకర్షించినట్లు, వేదసూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరులకు ప్రథమ శిష్యుడయ్యాడు.
మనీషా పంచకం
ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు.
అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి
సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు
ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.
ప్రస్థాన త్రయం
అలా శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి, కాశీ నుండి బదరికి బయలు దేరారు. బదరిలో ఉన్న పండితుల సాంగత్యంతో, పండితగోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నపుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలుకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము మరియు "లలితా త్రిశతి"లకు కూడా భాష్యాలు వ్రాశారు.
వ్యాసమహర్షి
ఒకరోజు శంకరులు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరులకు చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశింసించాడు.
వేదవ్యాసుడు నిష్క్రమించ బోవడం చూసి, శంకరులు 'నేను చెయ్యవలసిన పని అయి
పోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ'మని వ్యాసుని కోరగా, వ్యాసుడు "లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు అయుష్షు లభించుగాక" అని దీవించాడు.
శంకరాచార్యుల శిష్యులు
శంకరులకు అనేకులు శిష్యులుగా ఉండిరి. ఆయన ప్రఙ్ఞా పాటవాలకు కొందరు, చర్చలద్వారా ఓడింపబడిన వారు మరికొందరు ఇలా అనేకులు ఆయన శిష్యులుగా ఉండేవారు.
దిగ్విజయ యాత్రలు
తరువాత శిష్యులతో కలిసి శంకరులు మహారాష్ట్ర దేశంలోని పుణ్యక్షేత్రాలను, శ్రీశైలం వంటి ఇతర క్షేత్రాలను సందర్శించారు. శ్రీశైలంలో "శివానందలహరి" స్తోత్రాన్ని రచించారు. మాధవీయ శంకర విజయం ప్రకారం ఒక కాపాలికుడు శంకరులను సంహరింపబోయినపుడు శంకరుల శిష్యుడు పద్మపాదుడు దేవుని ప్రార్థించాడు. అపుడు శ్రీనృసింహుడు శంకరులను రక్షించాడు. ఆ సందర్భంలోనే శంకరులు శ్రీలక్ష్మీనృసింహ స్తోత్రంతో దేవుని స్తుతించారు. ఈ స్తోత్రాన్నే కరావలంబస్తోత్రం అని కూడా అంటారు.
తరువాత శంకరులు గోకర్ణంలో హరిశంకర మందిరాన్ని, కొల్లూరులోని మూకాంబిక మందిరాన్ని దర్శించారు. కొల్లూరులో మూగవాడనిపించిన ఒక యువకుడు హస్తామలకాచార్యుడనే పేరుతో శంకరుల శిష్యుడైనాడు. తరువాత శంకరులు శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించారు. తోటకాచార్యుడు శంకరుల శిష్యుడయ్యాడు. పిదప శంకరులు దక్షిణ, ఉత్తర దేశాలలో తన "దిగ్విజయం" సాగించారు. హిందూ, బౌద్ధ పండితులను వాదాలలో ఓడించి అద్వైతాన్ని ఒప్పించారు. కేరళ, కర్ణాటక, సౌరాష్ట్ర దేశాలలో శంకర దిగ్విజయం సాగింది. గోకర్ణం, సోమనాధ, ద్వారక, ఉజ్జయినిలను దర్శించారు. బాహ్లిక దేశంలో జైనులను వాదంలో ఓడించారు. కాష్మీర, కాంభోజ దేశాలలో తాంత్రికులను కలుసుకొన్నారు.
సర్వజ్ఞపీఠం అధిరోహణ
కేదారనాధ్‌లో శంకరుల సమాధి మందిరం వద్ద ప్రతిమ
శంకరులు కాష్మీర దేశంలో శారదాపీఠాన్ని సందర్శించారు. (ఇది ఇప్పుడు పాకిస్తాన్ అధీన ప్రాంత౦లో ఉంది ఆ పీఠానికి నలుదిక్కుల ద్వారాలలో నలుగురు ఉద్ధండ పండితులు ఉన్నారు. కాని దక్షిణ ద్వారం అంతవరకు తెరువబడలేదు (అనగా దక్షిణ దేశంనుండి గొప్ప పండితులెవరూ రాలేదు). పండితులను మీమాంస వేదాంతాది తర్కాలలో ఓడించి శంకరులు దక్షిణ ద్వారాన్ని తెరిపించి అక్కడి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు.
తన జీవితం చివరి దశలో శంకరులు కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించి దేహ విముక్తుడయ్యారు. కేదారనాధ మందిరం వెనుక శంకరుల స్మృతి చిహ్నంగా ఒక సమాధి ఉంది. అయితే శంకరులు కేరళలోని త్రిస్సూర్‌లో దేహంవిడిచారని "కేరళీయ శంకర విజయం" చెబుతున్నది.  కాదు కంచిలో అని కూడా అంటారు.
జయ జయ శంకర ......
⚜⚜⚜ శంకరాచార్యుల వైభవం* :-
ఆది శంకరాచార్యులు 32వ ఏట శరీరాన్ని విడిచిపెట్టేలోపు చేసిన స్తోత్రాలు-రచనలు,-భాష్యాల వివరాలు.
*గణపతి స్తోత్రాలు*:
గణేశ భుజంగ స్తోత్రం
గణేశ పంచరత్న స్తోత్రం
వరద గణేశ స్తోత్రం
గణేశాష్టకం
*సుబ్రహమణ్య స్తోత్రాలు*:
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం
*శివ స్తోత్రాలు*:
అర్థనాదీశ్వర స్తోత్రం
దశస్లోకి స్తుతి
దక్షిణామూర్తి  స్తోత్రం
దక్షిణామూర్తి  అష్టకం
దక్షిణామూర్తి  వర్ణమాల స్తోత్రం
ద్వాదశ లింగ స్తోత్రం
కాల భైరవ  అష్టకం
శ్రీ  మృత్యుంజయ  మానసిక  పూజ  స్తోత్రం
శివ  అపరాధ  క్షమాపణ  స్తోత్రం
శివానందలహరి
శివ భుజంగ స్తోత్రం
శివ కేశాది పదాంత వర్ణన స్తోత్రం
శివ మానస పూజ
శివ నామావళి అష్టకం
శివ పాదాది కేశాంత వర్ణన స్తోత్రం
శివ పంచాక్షర స్తోత్రం
శివ పంచాక్షర నక్షత్రమాల
సువర్ణ మాల స్తుతి
ఉమా మహేశ్వర స్తోత్రం
వేదసార శివస్తోత్రం
శివాష్టకం
*అమ్మవారి స్తోత్రాలు* :
అన్నపూర్ణ అష్టకం
ఆనంద లహరి
అన్నపూర్ణ స్తోత్రం
అన్నపురణ స్తుతి
అంబాష్టకం
అంబాపంచరత్నం
భగవతి మానస పూజ
భవాని అష్టకం
భవాని భుజంగం
బ్రమరంబ అష్టకం
దేవి భుజంగ స్తోత్రం
దేవి చతుశ్శస్త్య ఉపచార పూజ
దేవి పంచరత్నం
దేవి అపరాధ క్షేమాపణా స్తోత్రం
దేవి అపరాధ భజన స్తోత్రం
గౌరీ దశకం
హరగౌరీ అష్టకం
కాళి అపరాధ భజన స్తోత్రం
కామ భుజంగ  ప్రయత
కామబింబ అష్టకం
కనకధారా స్తోత్రం
శ్రీలలితా పంచరత్నం
మంత్రముత్రిక పుష్పమాలస్థావం
మాతృకా పుష్ప మాల స్తుతి
మీనాక్షి స్తోత్రం
మీనాక్షి పంచరత్నం
నవరత్నమాలిక
రాజరాజేశ్వరి అష్టకం
శారద భుజంగ ప్రయతా అష్టకం
సౌందర్యలహరి
శ్యామల నవరత్న మాలిక స్తోత్రం
త్రిపురాసుందరి అష్టకం
త్రిపురాసుందరి మనసపూజ స్తోత్రం
త్రిపురసుందరి వేదపద స్తోత్రం
*విష్ణు స్తోత్రాలు* :
అచుతాష్టకం
భగవాన్ మానసపూజ
భజగోవిందం
హరిమీడే స్తోత్రం
హరి నామావళి స్తోత్రం
హరి శరణాష్టకం
శ్రీ విష్ణు భుజంగ ప్రయతా స్తోత్రం
జగన్నాథాష్టకం
కృష్ణాష్టకం
లక్ష్మినృసింహ పంచరత్నం
నారాయణ స్తోత్రం
పాండురంగాష్టకం
రామ భుజంగ ప్రయతా స్తోత్రం
రంగనాథాష్టకం
లక్ష్మినృసింహ కరుణారస స్తోత్రం
లక్ష్మినృసింహ కరవలమబ స్తోత్రం
షట్పది స్తోత్రం
విష్ణు పాదాదికేశాంత స్తోత్రం
*హనుమాన్ స్తోత్రాలు*
హనుమత్ పంచరత్నం
*ఇతర స్తోత్రాలు*:
మాతృ పంచకం
కౌపీన పంచకం
కళ్యాణ వృష్టి
నవరత్నమాలిక
పుష్కరాష్టకం
మొహాముద్గ్రహ స్తోత్రం
*క్షేత్ర స్తోత్రాలు*:
కాశి పంచకం
కాశి స్తోత్రం
మణికర్ణికాష్టకం
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
*నదీ స్తోత్రాలు*:
గంగాష్టకం
గంగా స్తోత్రం
నర్మదాష్టకం
యమునాష్టకం
*ప్రకరణ గ్రంధాలు*:
అద్వైత అనుభూతి
అజ్ఞాన భోదిని
అమరు శతకం
అనాత్మశ్రీ వికర్హన
అపరోక్షానుభుతి
ఆత్మ-అనాత్మ వివేకం
ఆత్మ బోధం
ఆత్మజ్ఞాన ఉపదేసనవిధి
దృక్ దర్శన వివేకం
ఆత్మ పంచకం
అత్మశతకమ్
అద్వైత పంచకం
అత్మపూజ-పరపూజ
బాలబోధ సంగ్రహం
భోధసారం
అత్మచింతన
బ్రహ్మచింతన
బ్రాహ్మణా వలిమాల
ధ్యానాష్టకం
జ్ఞానగంగాష్టకం
గురు అష్టకం
జీవన ముక్త్యనందలహరి
యతి పంచకం
మణిరత్నమాల
మానిషా పంచకం
మాయా పంచకం
మతామ్నాయ
నిర్గుణ మనసపూజ
నిర్వాణ దశకం/సిధాంత బిందు
నిర్వాణ మంజరి
నిర్వాణ శతకం/ఆత్మ శతకం
పంచీకరణం
ప్రభోద సుధాకరం
ప్రశ్నోతర రత్నమాలిక
ప్రపంచసార తంత్రం
ప్రాతః స్మరణ స్తోత్రం
ప్రౌడానుభుతి
సదాచార సంతానం
సాధనా పంచకం/ఉపదేశ పంచకం
శంకర స్మృతి
సన్యాస పథ్థతి
సారతత్వ ఉపదేశం
సర్పత పంచారిక
సర్వసిధాంత సంగ్రహం
సర్వ వేదాంత సిద్దాంత సార సంగ్రహం
స్వాత్మ నిరూపణం
స్వాత్మ ప్రకాశికం
స్వరూపానుసంతానాష్టకం
తత్వ బోధం
తత్వ ఉపదేశం
ఉపదేశసహస్రి
వాక్యసిత
వాక్యవృతి
వేదాంత కేసరి
వేదాంత శతశ్లోకి
వివేకచూడామణి
ఏకస్లోకి
యోగ తారావళి
*భాష్య గ్రంధాలు* :
విష్ణు సహస్రనామ భాష్యం
లలిత త్రిశతి భాష్యం
యోగసూత్ర భాష్యం
భగవద్గీత భాష్యం
ఉపనిషద భాష్యం
బ్రహ్మసూత్ర భాష్యంఅవతారమూర్తి – ఆదిశంకరులు
అనుదినమూ శివపూజా సమయమున మన మీ క్రింది శ్లోకమును పఠింతుము.
ఆపాతాళ సభస్థలాంతభువన బ్రహ్మాండ మావిస్ఫుర
జ్ఞ్యోతిస్స్ఫాటికలింగమౌళి విలనత్ పూర్ణేందువాంతామృతైః,
అస్తోకాప్లుత మేక మీశ మనిశం రుద్రాను వాకాన్ జపన్
ధ్యాయే దీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రో భిషించే చ్ఛివమ్ః
ఈ శ్లోకము పరమేశ్వరుని స్వరూపమును వర్ణించి పూజాసమయమున చేయవలసిన జపమును, దేవుని ధ్యానించవలసిన రీతిని, ఆ ధ్యానఫలమును తెలుపును. సర్వేశ్వరుడు ఆపాతాళ సభస్థలాంతు-హతాళమునుండి ఆకసమువరకు వ్యాపకుడై యున్నాడు. అతడు కాలాతీతుడు, నిరవధికుడు, ఆదిమధ్యాంతరహితుడు, అంతర్బాహ్యముల అవిచ్ఛిన్నముగా వెలిగెడు పరిపూర్ణమూర్తి , జ్యోతిస్వరూపి, పూర్ణేందు శేఖరుడు, మన అభీప్సితములు నెరవేరుటకై ఆయనను స్ఫటికలింగమున అభిషేకసమయమున పై రీతిని ధ్యానించవలెను.
స్ఫటికలింగము దొక విశేషము గమనించదగినది. గ్రాహ్యమగు వస్తువును స్థూలముగ నర్థము చేసికొనుటకు మనమొక చిహ్నము నుపయోగింతుము. ఆత్యంతములు లేని అనాదిని-పరమేశ్వరుని, ఏ ప్రతీకమందు చూచుట? అది చదరముగనో దీర్ఘ చతురస్రముగనో ఉండగూడదు. అట్టి ప్రతీకమునకు ఆత్యంతములుండును. కానీ వర్తులమునకు స్ఫుటమగు ఆద్యంతములు లేవు. అదుచేతనే ఈశ్వరచిహ్నము శివలింగము-గుండ్రముగా నుండుట.
లింగము స్ఫాటికముగ నుండుటలో కూడా ఒక అర్థమున్నది. మనమే లింగమును పూజచేసినను, మనస్సున అవి స్ఫటికములనియే భావించదగును. స్ఫటికము బ్రహ్మమువలె శుద్ధమైనది, అది నిష్కళంకము, నిరంజనము, శుభ్రము. శివలింగమును ఏ వర్ణపు పుష్పముతో, పత్రముతో అలంకరింతుమో ఆ వర్ణమునే ప్రసరించును. ఆ రంగును ప్రతిబింబించును. స్వతహా దానికి రంగులేదు. భక్తు డేరంగుల వస్తు సంచయముతో పూజ చేయునో లింగమును అవేరంగులను ధరించును. అదేరీతిని ఈశ్వరస్వరూపము త్రిగుణాతీతము. కాని సాధకుని మనోభావమును అనుసరించి సత్త్వరజస్తమో గుణాకృతులను దాల్చినట్లు కాననగును.
పరమేశ్వరుడు, ఆహ్లాదకరుడగు అమృతకిరణుని శిరమున దాల్చియున్నాడు. ఈ శిరోభూషణమునకు అనుగుణ్యముగా స్ఫటికలింగమును సంతతక్షీరధారచే పూజా సమయనస్నానము చేయింపదగును. అభిషేకసమయమున యజుర్వేదాంతర్గతమగు రుద్రమును పఠింపతగును. చమకప్రశ్నమున 'శంచమే మయశ్చమే' యనియు, శ్రీరుద్రమున 'శంభవే మయోభువే, శంకరాయ, మయన్కరాయ' యనియు నున్నది. శం, శంభు శంకర, మయః, మయోభూః, మయస్కర-అనిన అర్థమేమి? ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగ వ్యాఖ్యానింతురు. వేద మంత్రములకు వివిధార్థము లుండుట సరికాదు. వానికంతయు ఒక్కటే అర్థము. వేదముల పరమ తాత్పర్యమును గూర్చి శ్రుతి యీ క్రింది విధముగా చెప్పును.

సర్వే వేదా యత్పద మామనంతి
తపాంసి సర్వాణి చ య ద్వదంతి|
య దిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి||
సర్వవేదములకు ఏది అంతిమమో, తపస్సు దేనికి దారితీయునో, సాధకులు దేనినికోరి బ్రహ్మచర్యము చేయుదురో అట్టి పరమోన్నతస్థితిని నేను నీకు సంగ్రహముగా చెప్పుదును అని నచికేతునితో యముడనును. ఆయన సంగ్రహముగా చెప్పినది: ' ఓ మిత్యేతత్' అను వాక్యము. ఆ పరమపదమును ఓంకారము సూచించును. ఓంకారమునకు వివరణము:
మాండూక్యోపనిషత్తున - ''సర్వం హ్యే తద్ర్బహ్మ-అయమాత్మా బ్రహ్మ-సోయ మాత్మా చతుష్పాత్'' అనియు ప్రథమావస్థ- జాగృతియు, ద్వితీయావస్థ- స్వప్నమును, తృతీయావస్థ-సుషుప్తియు, చతురము-పూర్ణమును. అంతిమమును అగు తురీయమని చెప్పబడినది. తురీయమును గూర్చి ఉపనిషత్తు, అదృష్టము, అవ్యవహార్యము, ఆగ్రాహ్యము. అలక్షణము, అచింత్యము, అవ్యపదేశ్యము, ఏకాత్మప్రత్యయసారము, ప్రపంచోపశమము, శాంతము, శివము, అద్వైతము అని పలికి 'స ఆత్మా విజ్ఞేయః' అనియు వక్కాణించును. కనుక వేదముల అంతిమలక్ష్యము- ఓంకారము. అదియే వాజ్మనసాతీత మగు పరబ్రహ్మము. 'ఏకమీవా ద్వితీయం బ్రహ్మ' అని శ్రుతి. శంకరులును దశశ్లోకియందు దీనినే యీ క్రింది విధముగా చెప్పిరి.
న చోర్ద్వం న చాధో న చాంత ర్న బాహ్యమ్
న మధ్యం న తిర్య జ్న పూర్వా పరా దిక్,
వియద్వ్యాపకత్వా దఖండై కరూప
న్త దేకో వశిష్టః శివః కేవలోఽహమ్||
న జాగ్రన్న మే స్వప్నకో వా సుషుప్తిః
న విశ్వో న వాతైజనః ప్రాజ్ఞకో వా,
అవిద్యాత్మకత్వాత్ త్రయాణాం తురీయః
త దేకో వశిష్టః శివః కేవలోఽహమ్||
ప్రథమ శ్లోకమున ఈశ్వరుని సర్వవ్యాపకత్వమును, అఖండత్వమును సూచింపబడినది. శాంతము, శివము, అద్వైతము అని చెప్పబడు పరబ్రహ్మము సాధకుల ధ్యానార్థము పూజార్థము, ఆపాతాళ సభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురజ్జ్యోతిగ - శివస్వరూపముగా చెప్పబడుచున్నది.
సాధారణముగా - ఏ వస్తువునకైనను ముఖ్యభాగము కేంద్రమున స్థాపితమైయుండును. ఉదాహరణముగా శ్రీరంగములోని ఆలయమును దీసికొందము. అందు సప్తప్రాకారములు ప్రతి ప్రాకారమందును ఎన్నియో విగ్రహములు. ఆలయమునకు మూలవిగ్రహమేది యనివెదకునపుడు ఇతరుల సాయములేకయే ఆలయమునకు కేంద్రమున ఏవిగ్రహము స్థాపితమైయున్నదో అదియే మూలవిగ్రహమని నిర్థారింతుము. గర్భగుడిమీదనే ముఖ్య విమానము నిర్మించియుందురు. కనుక ఏ వస్తువుకైనను నడుమ చెప్పినది, కేంద్రమున, పలికినది అతిముఖ్యము. వేదముల ముఖ్యోపదేశమేమి? వేదములను 'త్రయీ'యని యందురు. వేదత్రయములగు ఋక్, యజు, స్సామములలో యజుర్వేదము మధ్యనున్నది. ఇందు సప్త కాండములు, సప్త కాండములకు నడుమ నాలుగవ కాండము ఆ నాలుగవ కాండ మధ్యభాగము పంచాక్షరీ మంత్రము. 'శివ' ఇత్యక్షరద్వయమ్-అందుచే వేదశీం
ఓంకారమును, ఏకరూపమును అగు పరబ్రహ్మ స్వరూపమునకే 'శంభు' అని ధ్యానపూజాదుల నొసర్తురు. ఆయనయే ఆపాతాళ సభస్థలాంతవ వ్యాపించిన ప్రభువు పూజాదికముల గ్రహించు ఆపరమశివుడే శంభుడనియు శంకరుడనియు తెలియబడును. మనము 'శంభవే, మయోభువే, శంకరాయ, మయస్కరాయ' యని పరబ్రహ్మమును గూర్చి చెప్పుదుము. అదే పరబ్రహ్మను వేదములు 'శాంతము, శివము, అద్వైత' మని వర్ణించును, శంకరవిజయములను గ్రంథములలో భగవత్పాదుల జీవితచరిత్ర వర్ణితము. అందు ఆదిశంకరులు విరాట్స్వరూపుడగు పరమశివుని అవతారమేయని చెప్పబడినది.
''మూర్థని హిమకరచిహ్నం
నిటలే నయనాంక మంనయో శ్శూలమ్,
వవుషి స్ఫటిక సవర్ణం
ప్రాజ్ఞా స్తం మేనిరే శంభుమ్||''
శంకరులు శిశువుగ నున్నపుడు ఆయన శిరమున చంద్రుని చిహ్నముండెడిదట. నిటలమున నేత్రచిహ్నమట. భుజములయందు శూల చిహ్నమట. వారిదేహము స్ఫాటిక చ్ఛాయలతో వెలిగిపోయెడిదట.
అజ్ఞానాంతర్గహనపతితా నాత్మవిద్యోపదేశైః
త్రాతుం లోకాన్ భవదవశిఖాతాప సాపచ్యమానా9,
ముక్త్యా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి
శంభో ర్మూర్తి శ్చరతి భువనే శంకరాచార్యరూపా||
శంకరాచార్య రూపమున భువనమున తిరుగునది శంభుమూర్తియే. వటవృక్షమూలమువదలి మౌనమును త్యజించి అజ్ఞానారణ్యమున చిక్కిన వారును, భవతప్తులును అగు మానవానీకమును రక్షించుటకై ఆత్మవిద్యోపదేశమును చేయుచూ తిరుగులాడెడి శంకరాచార్యులు సాక్షాత్ దక్షిణామూర్తియే యని దీని తాత్పర్యము. ఇట్లు శంభువు శంకరుడాయెను. శ్రుతిలోని శంభువవు, శంకరుడు అను ఈ పదద్వయము ఒకే పరమాత్మను సూచించును. 'శంభుశబ్దమునకు సంభావయతి-ఉత్పాదయతి ఇతి శంభుః' అనియు శంకరశబ్దమునకు 'శంకరోతి ఇతి శంకరః' అనియు వివరణము, ఆనందమునకు మూలము శంభువు ఆనందమును లేక సుఖమును కల్గించెడివాడు శంకరుడు. ఆనందమూలమును మనము వెదకికొనుచు పోవలెను. కాని 'శంకరోతి' యనునపుడు ఈశ్వరుడు తన యునికిని వదలి ఆనందమును నాలుగుచోట్లకు కొని తెచ్చి ఆనంద పిపాసువులకందజేయును. మనమొక అరణ్యమున దప్పికొన్నప్పుడు జలాశయమునకై అన్వేషింతుము. కాని నది తన జన్మస్థానమునుండి జలవాహికమై పిపాసార్తులకు నీటిని తానుగ గొని తెచ్చును.
ఇచట మరికొన్ని గమనించదగిన విషయములున్నవి. శ్రుతి శంభువును వర్ణించునపుడు 'కపర్దినేవ్యుప్త కేశాయ' యని చెప్పును. కపర్ది యనగ జటలను దాల్చినవాడని అర్థము. శంభువును స్థాణువనియు, మౌనియనియు చెప్పుదురు. వట వృక్షచ్ఛాయలలో మౌనియై స్థాణువై అచలుడై ఆయనకూచుండును. ఆయన ఆనందమునకు మూలము, యోగమార్గమున గాని, తపోమార్గమునగాని ఆయనను మన మన్వేషించదగును. ఆయనకడకు మనము వెళ్ళవలెను. కానీ శంకరులట్లు కాదు నిత్యసుఖమును ఆయన మనమున్న కడకుదెచ్చి పడవైచి వెళ్ళును. మన వాకిలికి ఆయనయే అరుదెంచును. అజ్ఞాన గహనమున చిక్కిన మనలను చూచిన ఆయనకు అంతటిదయ.
శంభువు కపర్ది, జటాధారి శంకరులన్ననో వ్యుప్తకేశులు. కేశముండను గావించుకొన్నవారు. శంభువు స్థాణువు. అచలుడు. వటవృక్షచ్ఛాయలలో అసీనుడు. కానీ శంకరులు 'లోకాం స్త్రాతుం చరతి' ఒక్క చోటున నిలువక యత్యాశ్రమమున లోకములను కాపాడుటకై సన్యాసియై తిరుగులాడును. శంభువు మౌని, శంకరులు ఉపదేశకులు ఆత్మవిద్యోపదేశమును చేయుదురు.
శంకరులు నాలుగాశ్రమములలో యత్యాశ్రమము నేల గ్రహింపవలెను? నాలుగు ఆశ్రమములందు సన్యాసమే దేశభ్రమణకు అనుకూలము. బ్రహ్మచారి గురువుకడ అంతే చోటునుండి మరొక చోటునకు పోవుట అనునది యుండదు. గృహస్థు డన్ననో తన భార్యాబిడ్డల యోగక్షేమముల గమనించుచు అతిధులను అభ్యాగతులను ఆదరించుచు ఇంటికడనే యుండును. వానప్రస్థుడు అడవులకేగి తపోధ్యానములలో కాలము గడపును. కాని సన్యాసి నిలకడలేక ఏ ఒక్కచోటునను మూడురాత్రులమించి గడపక చరించుచునే యుండును. అందుచే వేదాంతోపదేశమునకు సన్యాసాశ్రమమే అత్యుత్తమ మైనదని శంకరులు గుర్తించి సన్యాసియై అజ్ఞానములో మునిగిన మానవానీకమునకు సరియగు మోక్షమార్గమును చూసెను.
ముందు చెప్పిన మంత్రమున 'మయశ్చ నమోమయోభువే, నమో మయస్కరాయ'- అను పదము లున్నవి. మయః అను పదమునకు మనము అర్థము తెలిసికొనవలెను. మయన్ యనగా మోక్షసుఖము. మయః ''సుఖం భావయతి ఇతి మయోభూః'', ''ఆచార్యశాస్త్రాదిరూపేణ మోక్షసుఖం కరోతి ఇతి మయస్కరః'' మయన్ అనగా నిత్యసుఖము, ఈ నిత్యసుఖము నుత్పానచేయువాడు మయోభూః. మయస్కరుడు ఈ నిత్యసుఖమును దెచ్చియిచ్చెడివాడు. 'యద్వైశివం త న్మయః' అని యజుర్వేదము. 'శాంతం శివం అద్వైతమ్' అని చెప్పబడు ఆ పరబ్రహ్మమే 'మయః.'
ఈ నిత్యసుఖమును అందుకొనవలెనని శాంతి అవసరము. అదియే మన నైతిక- ఆధ్యాత్మిక సాధనలకు అంతిమ ఫలము. వృక్షములకు షడ్రసములు కలవు. అవి ఆవ్లు లవణ కటు కషాయతిక్త మధురములు, వృక్షములో ఫలించెడు ఫలములకు సహిత మీరసములే. వృక్షము ఫలోన్ముఖమై ఫలించుటయే దాని పరిపూర్ణదశ, కాయలు ఫలించిన పిదప వృక్షమునకు వేరు పరిణామముగాని, అభివృద్ధిగాని యుండదు. షడ్రసములలో కడపటిది మధురరసము. ఏకాయయయినను సరే- ఫలించిన మధురమగును. చేదగు వేపకాయలు సైతము ఫలించినపుడు చేదుపోయి యించుక తీపికిదిగును. కాని కొన్ని ఫలములు వెఱ్ఱితీపి.
ఫలములలోని షడ్రసములవలెనే మనః పరిణామమును గూర్చి పలుకునపుడు నవరసములని వ్యవహరింతురు. అవి శృంగార వీర కరుణాద్భుత హాస్య భయానక భీభత్స రౌద్ర శాంతరసములు అన్నిటికీ కడపటిది శాంతము.
ఆవ్లులవణరసాదులెట్లు మధురమున లయించుచున్నవో అటులనే శృంగార వీర కరుణరసాలు శాంతమున లయించి పరిపూర్ణత నొందును. శాంతి పక్వమైన మనఃస్థితికి చిహ్నము మనస్సు వృత్తిరహితమైనచో శాంతినొందును. బాహ్యవిషయ సంపర్కముచే కలుగు మనో వ్యాపారములోని మార్పులు నవరసములు సూచించును. అడవిలోనొక పులిని చూచిన తోడనే మనిషి భయకంపితుడగును. సౌందర్యముచే నుద్దీపించునొక మగువను చూచి పురుషుడు కామ వివశుడగును. ఏ స్థితియందు మగువ సౌందర్యము కామమునుగాని, వ్యాఘ్రదర్శనము భీతినిగాని కల్గింపదో అదియే శాంతము. ఆ స్థితి యందు వస్తుదర్శనముగాని, వస్తుస్మృతిగాని ఎట్టి మనోవికారమును గల్గించదు. ఆస్థితి మనస్సుయొక్క అసంగత్వమును స్వచ్ఛతను తెలుపును. సత్త్వ రజస్తమోగుణముల ననుసరించి మనోవృత్తుల మార్పులను గ్రహించదగును. ఇందు సాత్విక చిత్తవృత్తి ఉత్తమము. సాత్త్విక చిత్తవృత్తి వృద్ధి అయినదనిన తక్కిన రెండుగుణములు జరస్తమముల వృత్తులు క్షీణించిన వని యర్థము. కాని యీ సాత్త్విక చిత్తవృత్తిని సైతము నిరోధించవలెను. అపుడే శాంతి, ఈశాంతి చేతనే మయన్ అనెడు నిత్య సుఖమును అందుకొనగలము. 'మయోభూః' అనియు, 'మయస్కరః' అనియు వర్ణింపబడిన శంకరులు యతియై దేశాటనము గావించి రక్షణకును విమోచనమునకును కారకులైరి.
మనమందరము ఈ శాంతిని సాధించవలెను. ఈ శాంతి నందుటయే మోక్షము. ముక్తుడు సంసారమునుండి విడివడును. అతనికి మరుజన్మయనునదిలేదు. 'తమేవం విద్వానమృత ఇహభవతి' యని శ్రుతి. ఈ లోకమునందే యీ జీవితమునందే ముక్తి నందునని దీని తాత్పర్యము. ఈ శ్రుతి జీవన్ముక్తిని గూర్చి ముచ్చటతించుచున్నదిగాని విదేహముక్తిని గూర్చి కాదు.
మరణసమయమున మన మనోవృత్తులు అనగా మనో వ్యాపారములు ఎట్లుండునో వాని ననుసరించి మనుష్యునకు మరుజన్మ కలుగుచున్నదని శాస్త్రములు చెప్పుచున్నవి. విదేహముక్తియే సత్యమైనచో మరణానంతరము శాంతినొంది తద్ ద్వారా ముక్తి నందవలెను. కాని చావునకు ముందులేని శాంతి చచ్చినతర్వాత ఎట్లువచ్చును? కావున ముక్తి కాములు జనననివృత్తి కొరకు ప్రయత్నించెడివారు. ఈ జీవితముననే బ్రహ్మజ్ఞానమునొంది తద్వారా శాంతినందవలెను. శ్రుతిలోని 'ఇహభవతి' యనుటకు అదియే అర్థము. 'ఇహ' అను పదమే భగవద్గీతలోని యీ క్రింది శ్లోకమున వాడబడినది.
''శక్నోతిహైవ యః సోఢుం ప్రాక్‌శరీర విమోక్షణాత్,
కామ క్రోధోద్భవం వేగం న యుక్త్ః స సుఖీ నరః||
ప్రాక్ శరీ విమోక్షణాత్స్‌శరీరమును వదలిపెట్టుటకు మునుపే కామ్రకోధోద్భవ వేగమును వహించి ఇహ జీవితముననే శాంతి ద్వారా మోక్షము నందవలెనని భగవానుడి బోధచేయును.
నిత్యసుఖము శాంతి స్వరూపము. దానికై మనము అనుదినమును యత్నించవలెను. విషయసుఖములపై మనస్సును మళ్ళనీయక అనవరతము కడు జాగరూకతతో ఇంద్రియముల నియమ మొనర్పవలెను. దానికి మార్గములు రెండు నిరతసాధన యొకటి. నిత్యధ్యానముచే లబ్దమగు పరమాచార్యుని దయ రెండు.
ఏ విద్యకైనను గురువు ననుగ్రహము, శిష్యుని అభ్యాసము రెండు ముఖ్యమైన అంగములు, శిష్యునికి దైవమందెంత భక్తియుండునో అంత భక్తియే గురువునందు సైతము ఉండవలెను. లేనిచో మనస్సున కొక అనాదర మేర్పడును. గురువునే భగవత్స్వరూపముగ భావింపవలెను. గురువులు సాధారణులైన అట్టి మనోభావమును (అనగా భగవత్ స్వరూపులను భావమును) కల్పించుకొనవలెను. కాని మన ఆచార్యులకడ అభావము స్వభావసిద్ధముగ అయత్నముగా కల్గుచున్నది. శంభువే శంకరుడుగ అవతరించెను. వారు సాక్షాత్ శంకరులే. అందుచే మనకు సులభముగా వారియందు భక్తి జనించును. మన మనస్సును, మనోవృత్తులను నిరోధించి మన ఆచార్యుల కడ భక్తి ప్రపత్తుల నెరపినచో మనకు ఈ జీవితమునందే ముక్తి సులభసాధ్యమగును.
చాలమంది తమ జీవితములను వృధా యొనర్చు కొందురు. మోక్షాన్వేషణ మే గొప్పధీమంతులకోగాని సాధానణులకు గాదని వారి అభిప్రాయము. ఇది మిథ్యాశంక. తప్పు అభిప్రాయము. స్వల్పమైనను- కొంచెము సాధనచేసి యయినను- చిత్తశుద్ధి నొందుటకు యత్నించిన- అంతవరకు మన మెంతయో ధన్యులము. ఆచేసిన కొంచెము మరుజన్మకు మూలధనమగును. మోక్షమునకు పెట్టుబడియగును. అందుచే పురుషయత్నముచేసి ఆచార్యుల దయ సంపాదించుట మన కందరకును విధి. అపుడే మనకు ఉత్తమపుణ్యగతి గల్గును.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
--- “జగద్గురు బోధలు” నుండి
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS