Saturday, April 28, 2018

లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు.

లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు.
అందుకే
ఆ చెట్టుకు పండిన కాయను
‘శ్రీఫలము’
అని పిలుస్తారు.
సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. ●
అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.●
మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి●●● దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. ●
మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది. ●
ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది.●
అందుకే
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!
అని
తలుస్తాము.
దళములు దళములుగా ఉన్నవాటినే కోసి
పూజ చేస్తారు.
ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది.
అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది.
అది మూడు,
తొమ్మిది కూడా ఉంటాయి. ●
పుష్పములను
పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి.
కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా
ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. ◆
మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు.●
అందులో
మారేడు దళము ఒకటి.●
మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె
శివలింగమునకు తగిలితే
ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.◆
అందుకే
ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా,
పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా●●●
మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు. ●
శివుడిని మారేడు దళంతో పూజ చేయగనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట.◆
‘బాల్యం,
యౌవనం,
కౌమారం
ఈ మూడింటిని నీవు చూస్తావు’
అని ఆశీర్వదిస్తాడుట.◆
కాబట్టి
ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. ◆
శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు.●
మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే●●● జ్ఞానం సిద్ధిస్తుంది.
ఇంత శక్తి కలిగినది కాబట్టే
దానికి "శ్రీసూక్తం"లో
‘అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’
(అమ్మా అలక్ష్మిని= దరిద్రమును పోగొట్టెదవుగాక)
అని
చెప్తాము.
మనిషికి మూడు గుణములు,
మూడు అవస్థలు ఉంటాయి.●
నాల్గవదానిలోకి వెళ్ళడు.
నాల్గవది తురీయము.●
తురీయమే జ్ఞానావస్థ.◆
అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.◆
మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే
మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ●
ఇంట్లో మారేడు చెట్టు ఉంటె >>
ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా>> అపారమయిన సిద్ధి కలుగుతుంది.◆
యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు
ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి >>పీట వేసి >>ఆయనను అక్కడ కూర్చోపెట్టి >>
భోజనం పెడితే >>
అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.◆
శాస్త్రము మనకు లఘువులు నేర్పింది.●
మారేడు చెట్టు అంత గొప్పది.◆
మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.●
అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.◆
‘మా-రేడు’
తెలుగులో
రాజు ప్రకృతి,
రేడు వికృతి. ◆
మారేడు అంటే మా రాజు. ◆
ఆ చెట్టు పరిపాలకురాలు.●
అన్నిటినీ
ఇవ్వగలదు.◆
ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు.◆
అది పువ్వు పూయవలసిన అవసరం లేదు.◆
ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా >>>
మారేడు
పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. ●
అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.◆
అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా >>మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి.●
అందులో
1●మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం,
2● రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట,
3● మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట. ●
ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.◆◆◆

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS