Friday, October 3, 2025

శివపూజ లో లింగార్చన ఏ స్థానం లో పూజిస్తే ఏ ఫలం* ???? రుద్రాభిషేకం లో రుద్రముల సంఖ్యలు ఫలాలు*???

శివపూజ లో లింగార్చన ఏ స్థానం లో పూజిస్తే ఏ ఫలం* ????
రుద్రాభిషేకం లో రుద్రముల సంఖ్యలు ఫలాలు*???


 గృహేత్వేక గుణంప్రోక్తం, నదీతీరే సహస్రకం|         దేవతాయతనేలక్షం శతలక్షం   హరేర్గృహే ||

శివాలయే కోటిగుణం స్వాయంభవే పునః । అనంతం పూజనంశంభోః ఋతం వచ్మిద్విజోత్తమ||

*స్థలాన్ని బట్టి శివార్చన లో లభించే ఫలాలు*

ఇంట్లో లింగార్చన చేస్తే, ఒక భాగం  ఫలితం వస్తుంది.

నదీ తీరంలో పూజిస్తే, వేయి రెట్లు ఫలితం.

దేవాలయాలలో పూజిస్తే, లక్ష రెట్లు ఫలితం.

విష్ణు ఆలయంలో పూజిస్తే, కోటి గుణాలు ఫలితం.

శివాలయంలో అర్చిస్తే, కోటి రెట్లు ఫలితం.

పర్వత గుహలలో పూజిస్తే, పది కోట్ల రెట్లు ఫలితం.

ఆ గుహ ఋషుల ఆశ్రమమైతే, కోటానుకోట్ల రెట్లు లింగార్చన ఫలం లభిస్తుంది.

బ్రహ్మక్షేత్రంలో శివార్చన చేస్తే, అనంత ఫలితం కలుగుతుంది.( రాజస్థాన్ లో పుష్కర్ బ్రహ్మ క్షేత్రం లేక స్వయంభూ శైవ క్షేత్రాలు )

*పైన చెప్పినవి అన్ని శాస్త్రీయంగా అర్చన చేస్తూ 
మానవ ప్రయత్నం వల్ల నిష్ఠ నియమాలు ఉన్న దైవానుగ్రహం తో కార్య సిద్ధి ఉంటుంది*

********
*రుద్రాభిషేక సంఖ్యా ప్రమాణములు*

*రుద్రకల్పే విష్ణవీశ్వర సంవాదే* *విష్ణు:*

విష్ణు భగవానుల అడుగుతున్నారు 
రుద్ర అభిషేకం ఏ సంఖ్యలు చేస్తే యెంఫలము అని

శ్లో॥ మహారుద్రార్చనవిధిం పరమేశదయానిథే మహ్యం కధయ సర్వజ్ఞ భక్తాయ పరిపృచ్చ్యతే

తేన పృష్టస్స గౌరీశోభగవాన్భక్త వతత్సలః *
ఇత్యాహ భగవాంచ్ఛంభుః శృణువక్ష్యామి కేశవ ॥

*శివోవాచ*
మహాదేవుడు ఇలా అంటారు ....
అభిషేకాశ్చష్ట విధాశ్చా దౌవారమితీరితం అవృత్తినామకంచైవ తతోరుద్రం ప్రకీర్తితం 
ఆధైకాదశరుద్రంచ శతరుద్రంతతఃపరం లఘురుద్రం మహారుద్రం చాతిరుద్రం ప్రకీర్తితం చమకై కానువాకశ్చ రుద్రాధ్యాయేన సంయుకం పునః పునః క్రమేణై వ కృతం చేద్ద్వారమీరితం తాన్యేకాదశవారాణిచావృత్తిరితి కీర్తిత

 ఏకమేకాదశావృత్తే రుద్రమిత్యభిధీయతే తాన్యేకాదశరుద్రాణి శతరుద్రం ప్రకీర్తితః శతరుద్రాణితాన్యేవ లఘు దముదాహృతం లఘువ్యైకాదశరుద్రాణి మహారుద్రం ప్రకీర్తితo ఏకాదశమహారుద్రై రతిరుద్రః ప్రకీర్తితః
 విష్ణవీశ్వర సంవాదే రుద్రాభిషేకవిధిః 
         ఇత్యాహబోధాయనః

*రుద్రాభిషేకము 8 విధములు*

నమస్తే రుద్రమన్యవ ఇత్యేకాదశానువాకానాం ఆగ్నా విష్ణూసజోషస ఇత్యేకైక మనువాకం జపేదితి సర్వ నమకాన్ పఠిత్వా ఏకైకం చమకానువాకం పఠేదిత్యర్ధ: ॥
అన్యత్ర 
*నమకం ఏక పాఠస్తు చమకం అనువాకం చరేత్* 

నమకము 11 అధ్యాయాలు చెప్పి చమకములో ఒక్కొ అనువాకం చెప్పాలి ఈ విధముగా నమకము 11 సార్లు చెప్పిన చమకము 11 అధ్యాయములు పూర్తి చేసిన పూర్తి అవుతుంది .

 ఒకరుద్రం ఒక చమక అనువాకo వరుసగా మళ్ళీ రుద్రం చమక అనువాకాలు చెప్పడం సూత్రం.

1. ఈ విధoగాచేసిన అభిషేకమునకు వారమని పేరు. *వారాభిషేకం*

2. ఆవృత్తి అభిషేకం  :- నమకము 121 సార్లు ,చమకము 11 సార్లు సంఖ్యలు.

3. రుద్రాభిషేకం :- నమకము 1,331 సార్లు,చమకము 121 సార్లు సంఖ్యలు.

4. ఏకాదశరుద్రం :- నమకము 14641 సార్లు,చమకము 1,331 సంఖ్యలు.

5. శతరుద్రం :- నమకము 1,61,051 సార్లు, చమకము 14,641 సంఖ్యలు.

6. లఘురుద్రం :- నమకము 17,71,561 సార్లు, చమకము 1,61,051 సంఖ్యలు.

7. మహారుద్రం :- నమకము 194,87, 171 సార్లు , చమకము 17,77,561 సంఖ్యలు.

8. అతిరుద్రo - నమకము 21,13,58,881 సార్లు , చమకము 194,87,171 సంఖ్యలు.

పై విధానాలలో వారి వారి మనోభీష్టము అనుసరించి శక్తిని అనుసరించి ఏదో ఒక పద్ధతిగా చేయవచ్చు.

*అష్టవిధాభిషేక ఫలాని*

 సర్వపాపాని నశ్యంతి శంభోర్వారాభిషేకతః | ఆవృత్త్యాచ భవేత్సౌఖ్యం రుద్రేణాఖిలసంపదః ॥ 

స్యాదేకాదశరుద్రేణ  సశ్రియం లభతే ధ్రువం | శతరుద్రాభిషేకేన   పుత్రపౌత్రాదిసంపదః ||

అప్లైశ్వర్యాది సిద్ధిశ్చ లభతేనాత్ర సంశయః | లఘురుద్రాభిషేకేన పునర్జన్మ నవిద్యతే ॥ 

మహారుద్రాతి రుద్రాదిఫలం వక్తుంనశక్యతే ॥ తద్విధానం ప్రవక్ష్యామి సావధానమనాశ్శృణు |

 శ్రావణ్యాం కార్తికేవాధ మాఘమాసే విషేషతః
 సుక్షేత్రేవా నదీతీరే పర్వతాగ్రే మనోహరే ॥ పశ్చిమాభిముఖద్వారయుక్తే శంకరమందిరే | యజమాన స్సమాగమ్య రుద్ర సంఖ్యాద్భిసృహ అభిషేకం ప్రకుర్వీత సముక్తోనాత్ర సంశయం : 

(ఇతి రుద్రకల్పే విష్ణ్వశ్వర సంపాదే)

1. వారాభిషేకము :- సృధివీరూపధారియగు రుద్ర ప్రీతి సర్వ పాపహరము.

2. ఆవృత్త్యభిషేకము :- జలరూపధారియగు శివప్రీతి, సర్వ సుఖప్రదము.

3. రుద్రాభిషేకము :- తేజోరూపధారియగు శంకర ప్రీతి సర్వసంపద్వృద్ధి.

4. ఏకదశరుద్రాభిషేకము : వాయురూపధారియగు పరమేశ్వర ప్రీతి, లక్ష్మీప్రాప్తి .

5 శతరుద్రాభిషేకము :- ఆకాశరూపధారియగు మహేశ్వర ప్రీతి, పుత్రపౌత్రాద్యష్టైశ్వర్యసిద్ధి.

6. లఘు రుద్రాభిషేకము :- సూర్యరూపధారియగు ఈశ్వర ప్రీతి, పునర్జన్మ నివృత్తి.

7. మహా రుద్రాభిషేకము :- చంద్ర రూపధారియగు రుద్రునకు ప్రీతి, జ్ఞానవృద్ధి.

8. అతిరుద్రాభిషేకము : సర్వరూపియగు పరమేశ్వర ప్రీతి, చెప్పశక్యముగాని మహాఫలము కల్గును. సందేహము లేదు.

శ్రావణ కార్తీకమాసములలో , విశేషముగ మాఘ మాసo సుక్షేత్రము (పుణ్యక్షేత్రం),  నదీతీరo లేక పర్వతo పై భాగము , పశ్చిమ అభిముఖ ద్వారముగల శివాలయమునగాని యజమాని
 11 గురు బ్రాహ్మణులతో అభిషేకము చేసిన 
తప్పక ముక్తి పోoదగలరు.
**********
మహన్యాస అనే ప్రత్యేక న్యాసాలు చేసి పై రుద్రముల సంఖ్య బ్రాహ్మణుల సంఖ్యలు గణన చేసి పూర్తి చేస్తుంటారు.
రుద్రాల సంఖ్య పాఠ్యoతరములు కొన్ని ఉన్నవి.
*మహాదేవ మహాదేవ రాళ్ళబండి శర్మ*

No comments:

Post a Comment

RECENT POST

తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం

  తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం                  *1.  సూర్యుని ఏఏ సమయాల్లో చూడర...

POPULAR POSTS