దేవీ శక్తులలో ముఖ్యమైన సప్తమాతృకలు
*రూప వర్ణన* *దేవత వాహనాలు పూజా ఫలం
సర్వదేవతలూ శక్తిస్వరూపాలేనని
స్పష్టంచేసే పురాణాల్లో వ్యక్తం చేయబడ్డాయి.
పరాశక్తి ‘సప్తమాతృకలు’గా అవతరించింది. బ్రహ్మ, విష్ణు, శివాది దేవతల శక్తులే సప్తమాతృకలు.
1 *బ్రాహ్మీ* ఈ మాతృమూర్తి బ్రహ్మశక్తిరూపిణి, బ్రహ్మవలె హంస వాహిని, అక్షరమాల, కమండలం ధరించిన శక్తి.
2.*మహేశ్వరి* శివుని శక్తి శివునివలె వృషభంపై కూర్చుని త్రిశూలాన్ని, వరదముద్రని ధరించి, నాగులను అలంకరించుకొని చంద్రరేఖని శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత.
3.*కౌమారి*కుమారస్వామి శక్తి
శక్తి (బల్లెం) హస్త, మయూర వాహనారూఢ.
4.*వైష్ణవి*విష్ణుశక్తి శ్రీమాహావిష్ణువువలె గరుడవాహనాన్ని అధిరోహించి, చేతులలో శంఖచక్ర గదా శార్జ్గ, ఖడ్గ, ఆయుధాలు ధరించిన మాత.
5.*వారాహి*హరి అవతారమైన యజ్ఞవరాహుని శక్తి. వరాహముఖంతో వెలిగే తల్లి.
6.*చాముండి*శక్తి దేవి, త్రిశూలం, ఖడ్గాన్ని ఆయుధంగా కలిగి, గుడ్లగూబ లేదా శవాన్ని అధిరోహించిన యోగిని, మాత.
7.*ఐంద్రీ*ఇంద్రశక్తి ఐరావతంపై కూర్చొని వజ్రయుధాన్ని ధరించిన సహస్రనయన ఈ జగదంబ.
*సప్తమాతృకల ఆవిర్భావo*
బ్రాహ్మీ ,మహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి.
ఈ దేవతలను *సప్త మాతృకలు* అంటారు.
దేవీ భాగవత, బ్రహ్మవైవర్త, విష్ణుధర్మోత్తర మరియు స్కంద పురాణాల లో సప్తమాతృకల ఆవిర్భావం గురించి వాటి విశిష్టతను తెలియచేస్తాయి.
పూర్వం జగన్మాత రాక్షసులతో పోరాడుతున్న సమయంలో రాక్షసుల మాయవల్ల తిరిగి అవిర్భవిస్తూ వస్తున్న రాక్షసుల సంహారం కోసం దేవతలు వారి లోని అమ్మవారి శక్తి రూపాలను అమ్మవారికి సహాయంగా యుద్ధానికి పంపుతారు.
*ఏ శక్తి రూపం ఏ దేవత నుండి అవిర్భవించింది*
*బ్రహ్మ పంపిన బ్రాహ్మీ హంస వాహనంపై,
*విష్ణుమూర్తి పంపిన వైష్ణవి గరుడ వాహనంపై,
*కుమార స్వామి పంపిన కౌమారీ నెమలి వాహనంపై,
*వరాహమూర్తి పంపిన వారాహి మహిష వాహనంపై,
*ఇంద్రుడు పంపిన ఇంద్రాణి ఐరావతంపై,
*యముడు పంపిన చాముండి శవ వాహనంపై యుద్ధభూమికి చేరుకున్నాయి.
*సప్తమాతృకల వాహనాలు*
శ్రీ బ్రాహ్మీ వాహనంగా *హంస*
శ్రీ మహేశ్వరి వాహనంగా *వృషభం*
శ్రీ కౌమారి వాహనంగా *నెమలి*
శ్రీ వైష్ణవి వాహనంగా *గరుడ పక్షి*
శ్రీ వారాహి వాహనంగా *మహిషం*
శ్రీ ఇంద్రాణి వాహనంగా ఏనుగు*
శ్రీ చాముండి వాహనంగా 'శవం' కనిపిస్తాయి.
ఇలా *సర్వంశక్తిమయం* అయిన మాతృక దేవతలు దుష్ట సంహారం చేసి లోకాలను కాపాడిన జగన్మాత స్వరూపాలే ఈ సప్త మాతృకలు!
*పూజ ఫలం* ఈ నామాలు జపించిన +పూజించిన వారికి మనలోని మనకు తెలియకుండా ఉన్న దుర్గుణాలు, లోభం, అసూయ వంటి గుణాల నుండి మనల్ని రక్షించమని ఆ తల్లిని ప్రార్ధించాలి, చెడు నుండి మనల్ని కాపాడమని కోరుకోవాలి, నాలోని బలం ఆ తల్లి! అనే భావన బలపడాలి ఆ భావనే భక్తి.
ఆ భక్తే ముక్తి అవుతుంది అదే మానవ జీవిత సార్థకత ఆ అమ్మ అనుగ్రహమే అసలైన వరం
ఆ వరాన్నే అందరం అర్ధించాలి. అందుకు చిత్తశుద్ధితో ఆ జగదంబను శరణు వేడాలి.
ఈ దేవతల అనుగ్రహం ఉంటే అరిష్టాలు అన్ని తొలగిపోతాయి.
సేకరణ *శ్రీ మాత్రే నమః రాళ్ళబండి శర్మ*
No comments:
Post a Comment