Sunday, May 28, 2023

*తిథిని అనుసరించి ఆహార విహారాదులు*

*తిథిని అనుసరించి ఆహార విహారాదులు* 


• పాడ్యమి నాడు కూష్మాండము ( గుమ్మడి, బూడిద గుమ్మడి ) తినరాదు. ఎందుకంటే ఇది నష్టాన్ని కలిగిస్తుంది. 

• విదియనాడు వంకాయ తినడం విషం.

• తదియనాడు అడవి దొండకాయ తినడం వలన శత్రువులు పెరుగుతారు . 

• చవితినాడు ముల్లంగి తింటే ధన నష్టం కలుగుతుంది .

• పంచమినాడు మారేడును ( బిల్వ ) తింటే అపనింద కలుగుతుంది. 

• షష్టినాడు వేప ఆకు, వేప పండ్లు, వేప పుల్ల నోటిలో వేసుకోవడం వలన నీచ జన్మ కలుగుతుంది. 

• సప్తమినాడు తాటి పండ్లను తింటే వ్యాధి ఎక్కువవుతుంది. అంతేగాక శరీరం నాశనం అవుతుంది. 

• అష్టమి నాడు కొబ్బరి తిన్నవారి బుద్ధి నశిస్తుంది. 

• నవమినాడు సొరకాయ ( ఆనపకాయ ) తినడాన్ని గోమాంస భక్షణవలె త్యజించాలి. 

• ఏకాదశినాడు చిక్కుడు కాయ, ద్వాదశినాడు బచ్చలి, త్రయోదశి నాడు వంకాయ తిన్నచో పుత్రుని నాశనము జరుగుతుంది. 

• అమావాస్య, పౌర్ణమి, సంక్రాంతి, చతుర్దశి, అష్టమి తిథులు, ఆదివారము, శ్రాద్ధ దినములలో, వ్రతమాచరించే రోజులలో స్త్రీతో సహవాసము, నువ్వులను తినడం మరియు శరీరానికి నూనెను పట్టించడం నిషిద్ధము. 
( బ్రహ్మవైవర్త పురాణం , బ్రహ్మఖండం : 27.37-38 ) 

• ఆదివారం నాడు అలచంద పప్పు, అల్లం, వేరుశనగ, ఎరుపు రంగులో ఉండే ఆకుకూరలు తినకూడదు. 
( బ్రహ్మవైవర్త పురాణం , శ్రీకృష్ణ ఖండము : 75-90 ) 

• సూర్యాస్తమయం తర్వాత నువ్వులు వాడబడిన ఏ ఆహార పదార్థాన్ని కూడా తినరాదు. 
( మనుస్మృతి : 4.75 ) 

• లక్ష్మీప్రాప్తి కోరిక ఉన్నవారు రాత్రికి పెరుగు మరియు పేలపిండి తినకూడదు. ఇది నరకాన్ని కలిగిస్తుంది ( ప్రాప్తింపజేస్తుంది ) . 
( మహాభారతం, అనుశాసన పర్వం : 104.93 ) 

• పాలతో పాటు ఉప్పు , పెరుగు , వెల్లుల్లి , ముల్లంగి , బెల్లం , నువ్వులు , నిమ్మకాయ , అరటి , బొప్పాయి మొదలైన అన్ని రకాల పండ్లు , తులసి , అల్లం ఎన్నడూ సేవించరాదు. ఇవి విరుద్ధ ఆహారానికి సంబంధించినవి . 

• పాలు త్రాగడానికి 2 గంటల ముందు గానీ లేదా 2 గంటల తరువాత గానీ భోజనం చెయ్యాలి. జ్వరం వచ్చినప్పుడు పాలు త్రాగడం అనేది పాము విషంతో సమానం . 

• ముక్కలుగా కోసి చాలాసేపు ఉంచబడిన పండ్లు , పచ్చివి ( మామిడి , జామ , బొప్పాయి మొదలైనవి ) తినకూడదు. పండ్లు భోజనానికంటే ముందే తినండి. రాత్రికి పండ్లు తినకూడదు. 

• ఒకసారి వండినటువంటి ఆహారాన్ని మరలా వేడిచేసి తినడం వలన శరీరంలో గడ్డలు తయారవుతాయి. ఈ గడ్డలు ట్యూమర్ వ్యాధికి దారితీయవచ్చు. 

• తినకూడని పదార్థాలను తినడం ( అభక్ష్య - భక్షణము ) వలన కలిగే పాపం నశించడానికి ఐదురోజుల పాటు గోమూత్రం, గోమయం ( ఆవుపేడ ), పాలు , పెరుగు మాత్రమే ఆహారంగా తీసుకొనవలెను . 
( వసిష్ఠ స్మృతి : 370 )

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS