Sunday, May 28, 2023

అమ్మవారు మనల్ని ఎలా ఏరూపంలో అనుగ్రహిస్తుంది? అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలూ ఏమిటి......!

అమ్మవారు మనల్ని ఎలా ఏరూపంలో అనుగ్రహిస్తుంది?
అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలూ ఏమిటి......!


🌷ప్రతి రోజు సాయంత్రం ప్రదోష కాలంలో అమ్మవారు, శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు.ఈ సమయమంలో చేసే పూజలు అంటే అమ్మవారికి చాల ఇస్టం.

🌷అవి ఆర్ద్రనతకరి అని, అనంత తృతీయ, రసకల్యని అని వ్రతములు చాలా ఇష్టం అని పురాణ వచనం.
ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయటం అత్యంత ప్రీతి కరం. ప్రతి మంగళవారం అమ్మవారిని సేవించడం, పూజ చేయటం, అర్చన చేయటం, వ్రతం చేయటం కూడా విశేషం అని అమ్మవారు చెపుతుంది.

🌷ఎవరు మంగళవారం అమ్మవారిని పూజ చేస్తారో వారికీ శత్రు పీడలు ఉండవు, రోగ నివారణ, అప్పులు, రుణాలు తీరిపొతాయి అని, కుజ గ్రహ దోషాలు జాతకం లో ఎక్కడ ఉన్న కూడా దోష పరిహారం అవుతుంది అని, అమ్మవారికి అత్యంత ప్రీతికరమయిన రోజు ఈ బౌమవారం (మంగళవారం) అని చెపుతారు.

🌷ఎవర్ని అయితే అమ్మవారు కరుణిస్తుందో వారి ఇంటికి అమ్మవారు కదిలి వస్తుందంట. పిలవని పేరంటం ఎవరు వస్తారో వారే అమ్మవారి స్వరూపంగా చెపుతారు.

🌷కృష్ణ చతుర్దశి (బహుళ చతుర్దశి ), ప్రతి మాసం లో అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశి రోజున అమ్మవారిని స్తుతించటం వలన అమ్మవారి కృపకి పాత్రులు కావచ్చు.

🌷నవరాత్రి ద్వయం అంటే శరన్నవరాత్రులు (దుస్సేర నవరాత్రి), వసంత నవరాత్రులు (ఉగాది నుంచి శ్రీ రామ నవమి వరకు చేసేది). అమ్మవారికి అత్యంత ప్రీతికరమయిన నవరాత్రులు.

🌷వసంత నవరాత్రులు ఎందుకు అమ్మవారికి ఇస్టం అంటే దేవిభాగవతం లో..
" శ్రీ రామో లలితంబికా, శ్రీ కృష్ణో శ్యామలంబ " అంటారు, అంటే శ్రీ రాముడు ఎవరో కాదు లలితా పరమేశ్వరే... స్వరూపం రాముడు, అవతారం లలితాంబ అని చెపుతారు.
అందుకనే శ్రీ రామ నవరాత్రులలో కూడా అమ్మవారికి పూజ చేస్తారు.

*అమ్మవారు మనల్ని ఎలా ఏరూపంలో అనుగ్రహిస్తుంది ?*
🌷కాలి, చండి, బాల, లలిత, దుర్గ అనేక రూపాలలో ఉండి మనల్ని నడిపిస్తుంది, కరుణిస్తుంది అని అనుమానం..
ఒకటి అని కాదు అమ్మవారు సకల వ్యాప్తం అయి ఉంది.

🌷మాత్రు రూపం, శాంతి రూపం, ఆకలి రూపం లో, జాతి రూపం లో, చైతన్య స్వరూపం, నిద్ర రూపం లో, దయా రూపం లో, బుద్ది రూపం లో కూడా అమ్మవారు ఉండి మనల్ని నడిపిస్తుంది.

*అమ్మవారిని ఏమి కోరుకోవాలి...*
🌷కొందరు పిల్లలు కావాలి అని , ఇల్లు కట్టుకోవాలి అని, పెళ్లి కావాలని రక రకాల కోరికలు కోరతారు. కానీ ఏది కోరిన మళ్ళీ దాని వలన కలిగే సుఖం అల్పం, క్షణికం. అది తీరగానె మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది.

*మరి ఏమి కోరాలి ?*
🌷 గురు శంకరాచార్య అంటారు " నన్ను కరుణించు, నాతో ఉండు" మోక్షం వద్దు, విద్య వద్దు, సంపదలు వద్దు, కానీ నీ నామ స్మరణ చాలు, నాతో ఉండాలి. ఎప్పుడు నీ పాదాల చెంత భక్తీ కలిగి ఉండాలి, ఎప్పుడు కరుణిస్తూ ఉండాలి, నన్ను ధర్మమయిన మార్గం లో నడిపించాలి అని కోరుకోవాలి.అని అన్నారు.

 *🕉️సమస్త లోకా సుఖినోభవంతు 🙏🕉️

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS