Tuesday, May 30, 2023

లక్ష్మీదేవి మన శరీరంలో ఏఏ స్థానంలోనివాసముంటే ఎలాంటి ఫలితాలు ప్రాప్తిస్తాయో చూడండి

లక్ష్మీదేవి మన శరీరంలో ఏఏ స్థానంలోనివాసముంటే ఎలాంటి ఫలితాలు ప్రాప్తిస్తాయో చూడండి


🌺మానవులందరికీ ఇష్టమైన దైవం లక్ష్మీదేవి .... 
ఆవిడ అనుగ్రహాన్ని వాంఛించని వారు ఉండరు .... అయితే ఆ తల్లి కరుణ పొందినా వినయంతో ఉండేది కొందరైతే అహంకారపూరితులై అష్టకష్టాలు పడేది మరికొందరు.🌺

🌺అమ్మవారు పాద స్థానములో ఉంటే ఆ మానవులకు పెద్ద పెద్ద భవంతులు , విలాస వంతమైన గృహాలు లభిస్తుంది !
తొడలలో అమ్మవారు శక్తి ఉంటే ధనసమృద్ధి విశేషంగా కలుగుతుంది !
గుహ్య భాగంలో ఉంటే భార్యసుఖసాంసారిక ఆనందం కలుగుతుంది !
రొమ్ము భాగంలో ఉంటే మనోరథాలు శీఘ్రంగా సిద్దిస్తూ ఉంటుంది !
కంఠ భాగంలో ఆ తల్లి తేజస్సు ఉన్నపుడు ఆభరణ ప్రాప్తి కలుగుతుంది !
ముఖంలో లక్ష్మీదేవి నివాసమై ఉన్నప్పుడు అన్నసమృద్ధి ! మధురమైన కవిత పాండిత్యం , జ్ఞానశక్తి లభిస్తాయి !
ఇక ఈ ఆరు స్థానాలూ దాటి తలపైకెక్కిందో ...
వారి దగ్గర లక్ష్మీదేవి నిలబడదు .... 
వివేకహీనుడై దుష్కార్యాలు చేసి తెలివిమాలిన తనంతో ఆమె అనుగ్రహాన్ని కోల్పోతాడు అని శ్రీ దత్తాత్రేయ స్వామి వారు దేవతలకు బోధించారట.🌺

🌺లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు 
దక్షిణావర్తన శంఖం 
ముత్యాల శంఖం
ఏకాక్షి నారికేళం

ఈ వస్తువులను పూజా మందిరంలో వుంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ....
దక్షిణావర్తన శంఖం :
ఈ శంఖం కడుపు ఊదే వారి కుడి వైపుకు తెరుచుకొని ఉంటుంది. ఇలాంటి శంఖాన్ని దక్షిణావర్తన శంఖం అంటారు. దీనికి వ్యతిరేక దిశలో తెరచుకొని ఉండేవి వామావర్తి శంఖమని అంటారు.🌺

🌺లక్ష్మీదేవికి ఈ శంఖమంటే ఎందుకు అంత ఇష్టం అంటే లక్ష్మీదేవి సముద్రము నుండి జన్మించింది.ఈ శంఖం కూడా మనకు సముద్రంలోనే దొరకుతాయి.మనకు సామాన్యంగా దొరికేవి వామావర్తి శంఖలే కావడం విశేషం.
అయితే దక్షిణావర్త శంఖం దొరకడం కష్టసాధ్యమే అయినా ఈ శంఖాన్ని లక్ష్మీదేవి సోదరిగా వర్ణిస్తారు మునిశ్రేష్టులు. దక్షిణావర్తి శంఖాలు మ్రోగవు.కానీ మ్రోగేవి దొరికితే పూజామందిరంలో పెట్టుకొని పూజించాలి.
పగిలినవి , విరిగినవి , పల్చని పొర కలిగినవి , గరుకైన ముక్కు , రంధ్రాలు ఉన్నవి పూజాకు పనికి రావు. 
ఈ శంఖాలు ఉన్న ఇంట్లో అష్టైశ్వర్యాలు సమకూరుతాయని ప్రసిద్ధి. 
ఈ శంఖాలు కన్యాకుమారి , రామేశ్వరంలో దొరుకుతాయని ప్రసిద్ధి .🌺

🌺ముత్యపు శంఖం
ముత్యపు శంఖం కనతిలో గుండ్రంగా ఉండే శంఖం ఇది. ఈ శంఖం కూడా అత్యంత అరుదుగా దొరికేవే.
ఈ శంఖాన్ని బుధవారం రోజు..

" ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై
ధనదాన్య సంరుద్ధిం దేహి దేహి నమః "

అని ఈ మంత్రాన్ని 108 సార్లు స్మరిస్తూ పూజిస్తే సకల దారిద్ర్యాలు దూరమవుతాయి .🌺
🌺ఏకాక్షి నారికేళం 
సాధారణంగా కొబ్బరికాయలకు రెండు కళ్ళు ఉంటాయి. కానీ అరుదుగా దొరికే ఒకే కన్ను ( ఒంటి కన్ను ) నారికేళం ఉంటుంది.ఈ ఏకాక్షి నారికేళాన్ని ఒక పళ్ళెంలో చందనం , కుంకుమ వేసి వాటిపై అష్టదళ ముగ్గు వేసి , దానిపై ఏకాక్షి నారికేళాన్ని ఎర్రనివస్త్రంలో ఉంచి అభిషేకిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ధనలాభం చేకూరుతుంది..స్వస్తి.
లోకా సమస్తా సుఖినో భవంతు.🌺

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS