Friday, August 28, 2020

పంచ సత్పురుషులలో ఒకరైన హజరత్ తాజుద్దీన్ బాబా వారి 95 వ పుణ్య తిథి.



*పంచ సత్పురుషులలో ఒకరైన హజరత్ తాజుద్దీన్ బాబా వారి 95 వ పుణ్య తిథి.*


*తాజుద్దిన్ బాబా ముస్లిం పంచాంగం ప్రకారం మొహరం నెల 26 వ రోజున (17 -8 -1925 ) నాగపూర్ నగరమునందు సమాధి చెందారు. తాజుద్దిన్ బాబా* *షిర్డీ సాయిబాబా వారి* 

*సమకాలికులు.*

*షిరిడీలో సాయబాబా వద్ద శ్యామకర్ణి అని పిలవబడే గుర్రము ఒకటిఉండేది.* *సాయిబాబా కు ఇచ్చే హరతులలోను, పల్లకి సేవలో నృత్యం చేసి తన భక్తిని చాటుకోనేది.*

*పంచ సత్పురుషులలో ఒకరు, నాగపూరు నివాసి అయిన తాజుద్దిన్ బాబా వద్ద " షేరు " అని పిలవబడే కుక్కఒకటుండేది.*

*ఆ కుక్క తాజుద్దిన్ బాబా గొప్పదనాన్ని గుర్తించింది.*

*తన సమయాన్ని అంతా బాబా సేవలో గడిపేది.* *ప్రతిరోజూ ఆ కుక్క* 

*నాగపూరు రైల్వే స్టేషనుకు* *వెళ్ళి, రైలు వచ్చే సమయము వరకు వేచిఉండి, బాబా దర్శనానికి వచ్చే భక్తులను బాబా దగ్గరకు తీసుకువెళ్లేది.*

*తాజుద్దిన్ బాబాను దర్శించేందుకు వచ్చే భక్తులందరికీ ఆ విషయము తెలిసిపోయింది.*

*రైలు దిగగనే భక్తులు బాబా వద్ధకు ఆ కుక్క వెంట* 

*వెళ్ళేవారు. ఎందుకనగా* 

*బాబా ఒకప్పుడు వాకి* 

*( బాబా ఉండే ప్రదేశం )* *మరొక్కప్పుడు సమీపములోగల అడవిలో ఉండెడివారు.*

*ఆ కుక్క క్రమము తప్పకుండా స్టేషను కు వెళ్ళి బాబా ఎక్కడుంటే అక్కడకి భక్తులను చేర్చేది.*

*ఒక రొజు" షేరు " రైల్వే స్టేషనుకు రాలేదు.స్టేషన్ లో దిగిన భక్తులకు బాబా వాకి లో ఉన్నారా లేదా అడవిలో ఉన్నారా అనేది తెలియలేదు.*

*వారు స్టేషను లో దిగి బయలుదేరి వస్తుండగా, వారికి మార్గమధ్యమములో " షేరు " చనిపోయిన* 

*కళేబరం కనిపించింది.*

 *వారు బాబావద్దకు వెళ్లి ఆ సంగతి చెప్పారు. వెంటనే బాబా చనిపోయిన కుక్కవద్దకు వచ్చి దాని పై తన ధరించిన చొక్కా కప్పి, అక్కడివారికి దానిని తన* *కుటీరానికి తీసుకురమ్మని* *వెళ్ళిపోయారు.* 

*బాబా కొంత దూరము నడచి వెళ్ళగానే కుక్కకు ప్రాణం వచ్చి బాబావెంట పరిగెత్తింది.*

*సత్పురుషుల మహిమ చెప్పుటకు అసాధ్యము.*

*తాజుద్దిన్ బాబా, షిర్డి సాయిబాబా సమకాలికులు.*

*ఒకరోజు షిరిడీలో సాయిబాబా తన భక్తులతో గొప్ప ముస్లిం మహాత్ముడైన* *తాజుద్దీన్ బాబా గూర్చిమాట్లాడుతున్నారు.*

*మధ్యలో తన satka ( దండం ) తీసుకుని అక్కడున్న నీటి కుండను గట్టిగా తట్టారు.* *భక్తులు దాని భావమేమి అని అడిగారు " నా సోదరుడు తాజుద్దిన్* *బాబా కుటీరానికి నిప్పంటుకొంటే*

*చల్లార్చుతున్నాను" అన్నారు బాబా.*

*ఒక భక్తుడు నాగపూరు లోని తన మిత్రునికి ఉత్తరం వ్రాయగా అదే రోజు, అదే* *సమయానికి తాజుద్దిన్ బాబా కుటీరానికి నిప్పు అంటుకొన్నదని, కానీ వెంటనే* *దాని అంతట అది చల్లారిపోయింది వారు తెలిపారు.* 

*సాయిబాబాకు తాజుద్దిన్ అంటే ఎనలేని ప్రేమ.* *అయనను* 

*"బంగారు మామిడి చెట్టు "అని వర్ణించారు.*

*అట్టి మహా సత్పురుషుడైన తాజుద్దిన్ బాబా* 

*17 -8 -1925న పరమాత్మలో ఐక్యమయ్యారు.*

*నాగపూరు లోని పాండురంగ స్వామి దేవాలయము లొని విఠలుడు, రుక్మిణీదేవి* 

*విగ్రహాలు ఆ రోజున ఏకధాటిగా 12 గంటలు కన్నీరు కార్చాయి.*

*ఈ రోజు ఆయన మహాసమాధి చెంది 94 ఏళ్లు ముగిస్తుంది.తాజుద్దిన్ బాబాను స్మరిద్దాం. తరిద్దాం*


Adipudi Venkata Sivasairam AVSSAIRAAM, [18.08.20 08:29]

మతాన్ని అయినా ,దైవాన్నైనా మార్చడం సాయిబాబా అంగీకరించరు .షిరిడీలో బాబా సన్నిధికి ఇతర గురువులకు చెందిన శిష్యులు కూడా రావడము జరిగేది .సాయిబాబాను గురువుగా నమ్మని వ్యక్తులు ఇతర గురువులవద్దకు పొవడం కూడా సహజముగా జరిగేది .ఒకసారి బాబా వద్దకు ఇతర గురువుకి 

చెందిన పంత్ అను శిష్యుడు వచ్చాడు .బాబా 

అతనితో "ఎలాంటి సందర్భంలోను అయినా 

మనము నమ్మిన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు .

ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ ,అనన్యంగా అందరిలోనూ ఏకత్వాన్ని చూడు " అని అన్నారు .

ఒకసారి ఒకరిని గురువుగా నిర్ణయించుకున్న తరువాత ,వేరొక గురువు మహత్తు ,ప్రజ్ఞలను 

చూసి మనసు చలించకూడదు .జీవితాంతము ఒకే గురువుని అంటిపెట్టుకొవాలి .అంతేకానీ మన గురువు తక్కువ ,వేరొక గురువు ఎక్కువ అను 

ఆలోచన మన మనసులోంచి తీసివేయాలి .

ఒకసారి శ్యామా అను పేరుగల బాబా భక్తుడు 

నాగపూరు పరిసరప్రాంతాలు కు పోయి బాబా వద్దకు వచ్చాడు .బాబా శ్యామాతో " శ్యామా ! 

ఇక్కడెక్కడకు పోయివచ్చావు ? అని అడిగాడు .

" నాగపూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు " అని జవాబిచ్చాడు శ్యామా ." నాగపూరులో గల 

బంగారు మామిడి చెట్టును చూశావా ?" అని బాబా అడిగాడు .అందుకు శ్యామా బంగారు 

మామిడి చెట్టు అంటే ,నాగపూరు నందుకల 

సత్పురుషుడైన " తాజుద్దిన్ బాబా "అని అర్థం చేసుకున్నాడు ." ఇంకా మరే ప్రదేశాలు దర్శించావు ? అని బాబా శ్యామాను అడిగాడు .

అందుకు శ్యామా " బాబా ! ఖేడ్ గాన్ బెట్ వెళ్లాను 

అక్కడగల నారాయణ మహరాజ్ ను దర్శించాను 

బాబా ! అక్కడకి ఎంతమంది భక్తులు వచ్చారో" 

 అని చెప్పాడు ." నారాయణ మహరాజ్ గారి గూర్చి నీ ఉద్దేశమేమిటి ?" అని ప్రశ్నించాడు 

బాబా శ్యామాని .నారాయణ మహరాజ్ గారు 

చాలా ఆడంబరంగా ఉండేవారు .ఖరీదైన వస్త్రాలు ధరించేవారు .దీనికి భిన్నంగా సాయి దర్బారు ఉంటుంది .అడంబరం ,నిరాడంబరం 

మధ్య ఊగిసలాడే శ్యామా మనసు బాబా గ్రహించారు .

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS