Wednesday, August 26, 2020

లక్ష్మీ కటాక్షం కలగాలంటే నిత్యం ఈక్రింది శ్లోకాన్ని 56 సార్లు జపించాలి.

లక్ష్మీ కటాక్షం కలగాలంటే నిత్యం ఈక్రింది శ్లోకాన్ని 56 సార్లు జపించాలి.

"సర్వమంగళ మాంగళ్యేశివే సర్వార్థసాధికే
శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే"

🕉 బంగారపు / వెండి లక్ష్మీదేవి ఉంగరాన్ని కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించాలి.

🕉 లక్ష్మీదేవి ఏదేని విగ్రహాన్ని ఆవునేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్యప్రాప్తి.

🕉 ఆఫీసులో/ వ్యాపారసంస్థలో తూర్పుముఖంగ కూర్చుంటే ధనప్రాప్తి.

🕉 పన్నీరుతో కొత్త తెల్లనివస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆవస్త్రంతో వత్తులుచేసి శుక్రవారం ఆవునేతితో ఆ  మూడువత్తులతో దీపారాధన చేస్తే సకలసంపదలు కలుగుతాయి

🕉 గురువారం ఐదు పత్తివత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తే అఖండఐశ్వర్యం లభిస్తుంది.

🕉 శ్రీ మహాలక్ష్మీ స్తవాన్ని త్రిసంధ్యలలో పఠించువారు మహాధనవంతులవుతారు — శ్రీదేవీభాగవతము

🕉 ప్రతిరోజూ సంపుటిత సహిత శ్రీసూక్తం చదివితే అఖండలక్ష్మి కరుణిస్తుంది.

🕉 కమలసప్తమీ వ్రతమును చైత్ర,వైశాఖమాసాలలో శుక్లసప్తమి నాడు శ్రీమత్స్యపురాణంలో చెప్పిన ప్రకారం చేయటం వలన మహాసంపదలు కలుగుతాయి.

🕉 కనకధారాస్తవము ప్రతిరోజూ త్రిసంధ్యలలోపఠిస్తే అపారసంపద చేకూరుతుంది.

🕉 శుక్రవారం లక్ష్మీదేవిని అష్టగంధాలతో(కర్పూరం,కస్తూరి,  పుణుగు,జవ్వాది,అగరు,పన్నీరు,  అత్తరు,శ్రీగంధం) పూజిస్తే కీర్తి,అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

🕉 కొత్త సంవత్సరంతర్వాత అనగా ఉగాది తరువాత వచ్చే  శుక్రవారం ఇష్టమైన దైవానికి అభిషేకం చేయడంద్వారా ఆ సంవత్సరమంతా ధనానికి కొదవ ఉండదు.జాతకరీత్యా ఉన్నదోషాలు తొలగిపోతాయి.

🕉 సౌందర్యలహరి లోని 33.వ శ్లోకం ను  45రోజులు రోజుకు 1000మార్లు పఠించాలి .పెసరపప్పుఅన్నం,తేనె ను నైవేద్యంగా సమర్పించిన అధిక ధనలాభము కలుగుతుంది.
(సేకరణ )

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS