Wednesday, December 31, 2025

గురుచరిత్ర-త్రిపురా రహస్యం

గురుచరిత్ర-త్రిపురా రహస్యం.

అసలు ఈ రహస్యం ఏమిటి?
ధర్మ సూక్ష్మము ఏమిటీ?
అతి సులువుగా తెలుసుకోండి.
మనలోని 3 దోషాలు తరచూ  మోక్షం రాకుండా,మోక్షం వైపు సాధన చేయనియకుండా  అడ్డుపడతాయి.వాటి ని  తొలగించుకోవాలి.

🪷ఎలా తొలగించుకోవాలి.చాలా సులువుగా చెప్తాను.
 త్రిపుర ఆసురులు(మన మోక్షం అనే సంకల్పం నేర వేరకుండా చూసేవారు)లో
మొదటి వారు
 1.విద్యున్మాలి,
 అంటే అర్ధం (విద్యుత్ లాంటి చంచలత)
గుడార్ధము.-
“విద్యుత్” = మెరుపు, చంచలత-
మనస్సు ఒక క్షణంలో ఒకటిని, మరో క్షణంలో మరొకటిని ఆశించడం అనేది.అంటే ఒక నిమిషం మంచి మీద వాలి,మరు నిమిషం చెడు మీద వాలేది మనసు.ఇది    దోషం .
చంచలమైన మనస్సు,
ఏకాగ్రత లేకపోవడం,
ఒక విషయంపై నిలకడ లేకపోవడం ఇలా.
ముందు మనకు  స్థిరత్వం రావాలి.ఎలా వస్తుంది?
ఈ దోషం ధ్యానం ద్వారా తొలగించుకోవాలి.
ప్రతి రోజూ కళ్ళు మూసుకొని "దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా"అని నామం.చేయండి. వేరే ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు అపవద్దు.చేతి లో జపమాల వైపు చూడండి.మళ్ళీ మనకు నామ స్మరణ చేయాలని గుర్తు వస్తుంది. మళ్ళీ మనసు ని నామ స్మరణ వైపు పెట్టండి.ఇలా తరుచూ చేస్తుంటే మనసు నామ స్మరణ వైపు తిరుగుతుంది.చంచలం తగ్గుతుంది.
 
రెండవ దోషం.
2️⃣ తారకాక్షుడు (తర్క–అహంకార దృష్టి)-అహంకార బుద్ధి.
పురాణార్థం
“తారక” = తర్కం, లెక్కలు
ప్రతిదీ తర్కంతో కొలవడం,జ్ఞాన  గర్వం.
మనలో ఉన్న దోషం
అహంకారం
“నేనే తెలివైనవాడిని” అన్న భావం,నాకు అన్నీ తెలుసు.నాకు తెలిసింది అంతా నిజం.నా మార్గం మాత్రమే గొప్ప.ఇలా.భక్తి లో కూడా వాదనలు.
గురువు మాటను కూడా ప్రశ్నించడం.అన్నీ తెలుసు అనే భావన.
👉 భక్తి కన్నా వాదన ఎక్కువైతే — తారకాక్షుడు మనలో ప్రబలంగా ఉన్నాడు అని.
తారకాక్షుడు – అహంకార బుద్ధి,
🪷
దేనికి దత్త మార్గం ఈ.రోజు అంతా దత్త కృప.నా వల్ల అయితే అసలు కాదు అనుకోవడం.అంతా దత్తాత్రేయ అర్పణం అని తరచూ అనుకోవడం,నేను చేసే మంచి పనులు దత్తుని అనుగ్రహం కోసం అని భావన,చేయడం.తరచూ మహాత్ములను స్మరించడం ద్వారా వారు మనకన్నా ఎంత గొప్ప వారొ, మనం వారి ముందు  ఎంత అల్పం నో తెలుస్తుంది.
ఈ దోషమును దత్తునికి శరణాగతి ద్వారా తొలగించుకోవాలి.

3️⃣ కమలాక్షుడు.
ఆర్థం
“కమలం” = సౌందర్యం, భోగం
మాయా ప్రపంచంలో కన్నులకు నచ్చేదే సత్యమని భావించడం
మనలో ఉన్న దోషం.
ఇంద్రియాసక్తి.
చూసినవి 
అన్నీ కావాలి అనుకోవడం, భోగలాలస,దృష్టి ఎప్పుడూ బయట విషయాలపైనే ఉండడం.అసత్సంగం ని ఇష్ట పడటం,
మన  కళ్ళు–మనస్సు ఎప్పుడూ  మయా విషయాల వెంబడే పరుగెడితే — కమలాక్షుడు పని చేస్తున్నాడు అని.
కమలాక్షుడు → వైరాగ్యం ద్వారా తొలగించుకోవాలి.
కోరిక జనించగానే ఇది అవసరమా?మనకి అలవాటు నా?దాని పర్యవసానం ఏమిటి?అని ఆగి,వద్దు అని చెప్పెడం మనసుకి అలవాటు చేయాలి.దానితో మనకు ఉన్నదానితో తృప్తి అలవాటు అవుతుంది.
 
ఈ ముగ్గురు  బయట శత్రువులు కాదు.మన అంతర్ శత్రువులు.
ఇవి తీవ్రంగా మన ఇంద్రియాలను  లోబరుచుకొని తరచూ మన సాధనలలో అడ్డుపడుతుంటాయి. 'త్రిపుర+అంతకుడు' దత్తాత్రేయ స్వామి నే.
 
 మనలోని మూడు స్థాయిలు:
త్రిపురం
మనలో
*స్థూల శరీరం*
-శరీరాసక్తి.
*సూక్ష్మ శరీరం*-
మనస్సు–బుద్ధి
*కారణ శరీరం*
-అహంకారం–అజ్ఞానం.

ఈ మూడు కలిసినప్పుడే  మనలో అసుర స్వభావం ఎక్కువగా ఉంటుంది.

ఇదే దత్తాత్రేయ తత్త్వం.

🌼 దత్తాత్రేయ తత్త్వంలో (అవధూత దృష్టి)
దత్తాత్రేయుడు = గురు, జ్ఞానం, వైరాగ్యం, అనుభవం
త్రిపురాసురులు = ఈ మూడు శత్రువులు దత్త తత్త్వానికి విరుద్ధాలు.
1️⃣ విద్యున్మాలి → అస్థిర మనస్సు.నామధారకుని కథ.
దత్తుడు చెబుతాడు: “మనస్సే బంధం, ఈ మనస్సే ముక్తి”
మనస్సు చంచలంగా ఉంటే గురుకృప మనపై  నిలవదు.ముందు దత్తుని నమ్మాలి అని.సిద్ధుడు చెప్తాడు.

 జపం (నామస్మరణ)
 గురు స్మరణ
 ఏకాగ్రత
సద్గురువు వాక్యంపై నిలకడ వస్తే  మనలో విద్యున్మాలి నశిస్తాడు.
2️⃣ తారకాక్షుడు → అహంకార బుద్ధి
“నేనే తెలుసుకున్నాను” అనే భావం.శాస్త్రం చదివినా వినయం లేకపోవడం
గురువును కూడా తర్కంతో కొలవడం.అదే త్రివిక్రమభారతి తో కలిసి శ్రీ గురుని కలిసిన  వేద పoడితుల లీల.వేదం అంతా చదిమాము. మాకు అంతా తెలుసు.ఎదురు వారికి ఏమి తెలియదు అన్న భావన తో వేద పండితులు శ్రీ గురుని వద్దకు వస్తారు.
దత్త మార్గం:
 శరణాగతి,“నేను కాదు, అన్ని నా  గురువే” అనే భావం.

3️⃣ కమలాక్షుడు → ఇంద్రియ భోగాసక్తి.
రూపం, రసం, సుఖం వెంట పరిగెత్తడం.ఒక భక్తురాలికి అందరి ఇంటా భోజనం చేయాలని .సుఖంగా ఉండాలని తన భర్త తన మాట వినడం.లేదని దత్తుని ఆశ్రయించారు. దత్తుడు ఆమె కి లీల ద్వారా నిజం చూపించారు.

ఈ ముగ్గురు అసురులు
యోగ పరమం గా 
మనలో
విద్యున్మాలి
-విక్షేపం,మనస్సు అశాంతికి కారణం.
తారకాక్షుడు-
అస్మిత,అహంకారంకి కారణం.
కమలాక్షుడు
రాగ,కోరికలు
ఇవి ఉన్నంతవరకూ సమాధి స్థితి మనకు  అసలు  రాదు.

🕉️ ఇడా + పింగళ + సుషుమ్న సమతుల్యం.
 మూడు దోషాల సంహారం నే త్రిపుర సంహారం.
కాబట్టి 
🔹 చంచల మనస్సును నిలకడగా చేయడం
🔹 అహంకారాన్ని గురుభక్తిగా మార్చడం
🔹 భోగాన్ని ఋణను  బంధములు  కాకుండా చూడడం సాధన తో చేయాలి.
ఇదే  దత్త తత్త్వం.ఇదే అత్రి,అనసూయ తత్వం.వీరికి మాత్రమే దత్తుడు దత్తం అవుతారు.రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి. పద్మజ ప్రసాద్ బెతనభొట్ల.

Tuesday, December 30, 2025

జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం వేరే గ్రహాలతో కలిసినప్పుడు...........!!

జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం వేరే గ్రహాలతో కలిసినప్పుడు...........!!

జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం వేరే గ్రహాలతో కలిసినప్పుడు ఆ ప్రభావం చాలా విశేషంగా ఉంటుంది. బుధుడు మేధస్సు, కమ్యూనికేషన్‌, తర్కానికి కారకుడు. ఇది ఏ గ్రహంతో కలిస్తే, ఆ గ్రహం యొక్క లక్షణాలను తన కారకత్వంతో కలిపి ఫలితాలను ఇస్తుంది.

బుధుడు - రవి (సూర్యుడు).....
బుధుడు సూర్యుడితో చాలా దగ్గరగా ఉండే గ్రహం కాబట్టి, ఈ కలయిక చాలా సాధారణంగా కనిపిస్తుంది. దీనిని "బుధాదిత్య యోగం" అని అంటారు.
 * అనుకూల ప్రభావం: ఈ యోగం ఉన్నవారు చాలా తెలివైనవారు, తెలివైనవారు, మంచి విద్యావంతులు అవుతారు. వీరికి అపారమైన మేధస్సు, మంచి జ్ఞాపకశక్తి ఉంటాయి. ప్రభుత్వ రంగంలో లేదా అధికారం గల పదవుల్లో విజయం సాధిస్తారు.
 * ప్రతికూల ప్రభావం: ఒకవేళ బుధుడు సూర్యుడికి చాలా దగ్గరగా ఉండి "అస్తంగత్వం" (Combustion) పొందితే, మాటతీరులో సమస్యలు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తక్కువ ఆత్మవిశ్వాసం వంటివి కలగవచ్చు.

బుధుడు - శుక్రుడు.......
ఈ కలయికను "లక్ష్మీ నారాయణ యోగం" అని అంటారు. బుధుడు మేధస్సును సూచిస్తే, శుక్రుడు కళలు, సౌందర్యం, మరియు సంపదను సూచిస్తాడు.
 * అనుకూల ప్రభావం: ఈ యోగం ఉన్నవారు కళా రంగంలో, ముఖ్యంగా సంగీతం, నటన, రచన వంటి వాటిలో గొప్ప విజయం సాధిస్తారు. వీరికి అందమైన మాటతీరు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఆర్థికంగా కూడా చాలా బలవంతులు అవుతారు.
 * ప్రతికూల ప్రభావం: ఈ కలయిక సరిగ్గా లేనప్పుడు విపరీతమైన కోరికలు, సుఖాల కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం, అనాలోచిత సంబంధాల వల్ల సమస్యలు కలగవచ్చు.

బుధుడు - గురువు.....
బుధుడు మేధస్సు, గురువు జ్ఞానానికి కారకులు. ఈ కలయిక వల్ల అసాధారణమైన జ్ఞానం, వివేకం లభిస్తాయి.
 * అనుకూల ప్రభావం: వీరు చాలా పండితులు, మంచి ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక ప్రవక్తలుగా రాణిస్తారు. ఉన్నత విద్య, ఆధ్యాత్మికత, మరియు పరిశోధనా రంగాల్లో వీరు విశేషంగా రాణించగలుగుతారు. మంచి సలహాదారులుగా, న్యాయవాదులుగా కూడా రాణించగలరు.
 * ప్రతికూల ప్రభావం: ఈ కలయికలో బలహీనత ఉంటే, అతిగా ఆలోచించడం, కొన్నిసార్లు గందరగోళమైన ఆలోచనలు, మరియు ఆచరణకు దూరంగా ఉండే జ్ఞానం కలగవచ్చు.

బుధుడు - శని.......
శని క్రమశిక్షణ, కఠోర శ్రమకు ప్రతీక. బుధుడు శనితో కలిస్తే, ఈ లక్షణాలు మేధస్సుకు జోడించబడతాయి.
 * అనుకూల ప్రభావం: ఈ కలయిక ఉన్నవారు చాలా జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తారు. వీరికి లోతైన ఆలోచనా శక్తి, పట్టుదల ఉంటాయి. ఇంజనీరింగ్, పరిశోధన, మరియు నిర్మాణ రంగాల్లో బాగా రాణిస్తారు. వీరు చాలా నిజాయితీగా, బాధ్యతతో పనిచేస్తారు.
 * ప్రతికూల ప్రభావం: శని ప్రభావం వల్ల ఆందోళన, నిరాశ, అతిగా ఆలోచించడం, మాటతీరులో కఠినత్వం, మరియు మానసిక ఒత్తిడి కలగవచ్చు.

బుధుడు - కుజుడు (అంగారకుడు)....
కుజుడు ధైర్యం, దూకుడు మరియు తార్కిక శక్తికి కారకుడు. బుధుడు కుజుడితో కలిసినప్పుడు మేధస్సులో వేగం, నిర్ణయాల్లో చురుకుదనం పెరుగుతాయి.
 * అనుకూల ప్రభావం: ఈ కలయిక ఉన్నవారు పదునైన మేధస్సు, వాదించే సామర్థ్యం, మరియు వాక్చాతుర్యం కలిగి ఉంటారు. సైనిక రంగం, క్రీడలు, మీడియా, జర్నలిజం వంటి వాటిలో బాగా రాణిస్తారు.
 * ప్రతికూల ప్రభావం: ఈ కలయిక ప్రతికూలంగా ఉంటే, తొందరపాటు నిర్ణయాలు, దూకుడుగా మాట్లాడటం, మరియు ఇతరులతో అనవసరమైన గొడవలు కలగవచ్చు.

బుధుడు - రాహువు / కేతువు......
రాహువు భ్రమలు, కేతువు ఆధ్యాత్మికత మరియు వేరుచేయడం వంటి వాటికి కారకులు.

 * బుధుడు - రాహువు: ఈ కలయిక వల్ల అసాధారణమైన మేధస్సు, అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండవచ్చు, ముఖ్యంగా మార్కెటింగ్, రాజకీయాలు వంటి రంగాల్లో. కానీ ప్రతికూలంగా ఉన్నప్పుడు, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, మరియు అస్థిరమైన మానసిక స్థితి వంటి లక్షణాలు ఉంటాయి.

 * బుధుడు - కేతువు: ఈ కలయిక ఉన్నవారికి లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం, పరిశోధనపై ఆసక్తి ఉంటుంది. వీరు చాలా ఏకాగ్రతతో పనిచేయగలరు. కానీ ప్రతికూలంగా ఉంటే, మాటతీరులో స్పష్టత లేకపోవడం, మరియు మానసిక సమస్యలు కలుగుతాయి.
బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క స్వభావాన్ని తీసుకుంటాడు. ఈ కలయికలు ఉన్న స్థానం, రాశి, మరియు ఇతర గ్రహాల దృష్టిని బట్టి ఫలితాలు మరింతగా మారతాయి.

డబ్బులు నిలువ ఉండేదానికి సూక్ష్మ పరిహారం.......!!

డబ్బులు నిలువ  ఉండేదానికి సూక్ష్మ పరిహారం.......!!

గురు, శని కలయిక  మరియు  శని, శుక్ర కలయిక జాతక చక్రం లో మంచి కలయికగా అనుకో  బడుతుంది.

దీనిని నవగ్రహ వాస్తులో శుక్రుడు వంటగది గానూ గురువు పూజగది గాను మనం నిలువ  ఉంచే డబ్బులు ఎత్తి పెట్టే స్థానం శని గాను అనుకో పడుతుంది

దానివల్ల మనం కొంచెం ఎత్తి పెట్టే డబ్బుల్ని పూజ గదిలోనూ,   వంటగదిలో ను మనం  ఎత్తి   పెడితే  ఎప్పుడు డబ్బులు కొరత ఉండదు. 

అందువల్లనే మన పెద్దలు వంట గదిలో పోపుల పెట్టెలో పూజ గదిలో ఈ ఫోటోలు వెనక లేదా హుండీ లో వేసి మనకు రూపంగా చెప్పారు.

Sunday, December 28, 2025

మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి..

 

మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి..



🌸 1.  అర్ధ దోషం
🌿 2.  నిమిత్త దోషం         
🌸 3.  స్ధాన దోషం
🌿 4.  గుణ దోషం   
🌸 5.  సంస్కార దోషం.

🌿ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయి.

🌷అర్ధ దోషం

🌿ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒకవ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతోవున్న మూటని ఇవ్వడం చూశాడు.

🌸భోజనంచేసి, సాధువు ఒకగదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే  శిష్యుడు దాచినడబ్బు మూటవుంది. హఠాత్తుగా సాథువు మనసులో దుర్భుధ్ధి కలిగింది.

🌿ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తనసంచీలో దాచేశాడు. తర్వాత శిష్యుని వద్ద సెలవుతీసుకుని, తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.

🌸మరునాడు పూజా సమయంలో తను చేసినపనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.  

🌿తను శిష్యుని ఇంట్లో చేసిన దోష భూయిష్టమైన భోజనంవల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దున్నే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థంచేసుకున్నాడు.

🌸వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతాచెప్పి, ఆడబ్బును  తిరిగిచ్చేసాడు శిష్యుడిని "ఏవృత్తి ద్వారా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు?" అని అడిగాడు.

🌿శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బుకాదు". అని తలవంచుకొన్నాడు. ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం.

🌸మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం. 

🌷నిమిత్త దోషం

🌿మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమగల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాకకూడదు.

🌸ఆహారం మీద దుమ్ము, శిరోజాలవంటివి పడకూడదు. అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతివంట భుజిస్తే వారి దుష్టగుణాలు అవతలివారికి కలుగుతాయి. 

🌿భీష్మాచార్యులవారు కురుక్షేత్రయుధ్ధంలో బాణాలతో  కొట్టబడి యుధ్ధంముగిసేవరకు అంపశయ్యమీద ప్రాణాలతోనేవున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీకృష్ణుడు వున్నారు.

🌸వారికి భీష్ముడు మంచిమంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు. అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది.

🌿"ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించలేకపోయారు?"అని అనుకొన్నది.

🌸ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు,  "అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూవచ్చాను.

🌿నా స్వీయబుధ్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టింది. శరాఘాతాలతో, ఛిద్రమైన దేహంతో, ఇన్నిరోజులు ఆహారం తీసుకోనందున, ఒంట్లోఉన్న పాతరక్తం - బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను.

🌸నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను" అన్నాడు భీష్ముడు. చెడ్డ గుణాలున్నవారు ఇచ్చింది  తిన్నందువల్ల మనిషిలోని మంచి గుణములు నశించి 'నిమిత్త దోషం' ఏర్పడుతుంది.

🌷స్ధాన దోషం

🌿ఏ స్ధలంలో ఆహారం వండ బడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలుండాలి. వంటచేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాలవల్ల చేయబడినవంట కూడా పాడైపోతుంది.

🌸యుధ్ధ రంగం, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివికావు. 
దుర్యోధనుడు  ఒకసారి 56 రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు.

🌿కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి, విదురుని యింటికి భోజనానికెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.

🌸తినడానికి ఏమి పెట్టాలని ఆలోచించి, ఆనంద సంభ్రమాలతో తొందరపడి, అరటి పండు తొక్కవల్చి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు.

🌿ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో  కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను.

🌸నిజమైన శ్రద్ధాభక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏదిచ్చినా సంతోషంగా తీసుకుంటాను"అని అన్నాడు. కనుక మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి.

🌷గుణ దోషం 

🌿మనం వండే ఆహారం సాత్వికఆహారంగా వుండాలి. సాత్వికాహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకికమాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.

🌷సంస్కారదోషం

🌸ఆహారం వండేవారి సంస్కారాన్నిబట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతివంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతివంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది..స్వస్తి..🎻🌹🙏 మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి..

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸 1.  అర్ధ దోషం
🌿 2.  నిమిత్త దోషం         
🌸 3.  స్ధాన దోషం
🌿 4.  గుణ దోషం   
🌸 5.  సంస్కార దోషం.

🌿ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయి.

🌷అర్ధ దోషం

🌿ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒకవ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతోవున్న మూటని ఇవ్వడం చూశాడు.

🌸భోజనంచేసి, సాధువు ఒకగదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే  శిష్యుడు దాచినడబ్బు మూటవుంది. హఠాత్తుగా సాథువు మనసులో దుర్భుధ్ధి కలిగింది.

🌿ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తనసంచీలో దాచేశాడు. తర్వాత శిష్యుని వద్ద సెలవుతీసుకుని, తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.

🌸మరునాడు పూజా సమయంలో తను చేసినపనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.  

🌿తను శిష్యుని ఇంట్లో చేసిన దోష భూయిష్టమైన భోజనంవల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దున్నే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థంచేసుకున్నాడు.

🌸వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతాచెప్పి, ఆడబ్బును  తిరిగిచ్చేసాడు శిష్యుడిని "ఏవృత్తి ద్వారా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు?" అని అడిగాడు.

🌿శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బుకాదు". అని తలవంచుకొన్నాడు. ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం.

🌸మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం. 

🌷నిమిత్త దోషం

🌿మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమగల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాకకూడదు.

🌸ఆహారం మీద దుమ్ము, శిరోజాలవంటివి పడకూడదు. అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతివంట భుజిస్తే వారి దుష్టగుణాలు అవతలివారికి కలుగుతాయి. 

🌿భీష్మాచార్యులవారు కురుక్షేత్రయుధ్ధంలో బాణాలతో  కొట్టబడి యుధ్ధంముగిసేవరకు అంపశయ్యమీద ప్రాణాలతోనేవున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీకృష్ణుడు వున్నారు.

🌸వారికి భీష్ముడు మంచిమంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు. అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది.

🌿"ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించలేకపోయారు?"అని అనుకొన్నది.

🌸ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు,  "అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూవచ్చాను.

🌿నా స్వీయబుధ్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టింది. శరాఘాతాలతో, ఛిద్రమైన దేహంతో, ఇన్నిరోజులు ఆహారం తీసుకోనందున, ఒంట్లోఉన్న పాతరక్తం - బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను.

🌸నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను" అన్నాడు భీష్ముడు. చెడ్డ గుణాలున్నవారు ఇచ్చింది  తిన్నందువల్ల మనిషిలోని మంచి గుణములు నశించి 'నిమిత్త దోషం' ఏర్పడుతుంది.

🌷స్ధాన దోషం

🌿ఏ స్ధలంలో ఆహారం వండ బడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలుండాలి. వంటచేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాలవల్ల చేయబడినవంట కూడా పాడైపోతుంది.

🌸యుధ్ధ రంగం, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివికావు. 
దుర్యోధనుడు  ఒకసారి 56 రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు.

🌿కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి, విదురుని యింటికి భోజనానికెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.

🌸తినడానికి ఏమి పెట్టాలని ఆలోచించి, ఆనంద సంభ్రమాలతో తొందరపడి, అరటి పండు తొక్కవల్చి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు.

🌿ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో  కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను.

🌸నిజమైన శ్రద్ధాభక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏదిచ్చినా సంతోషంగా తీసుకుంటాను"అని అన్నాడు. కనుక మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి.

🌷గుణ దోషం 

🌿మనం వండే ఆహారం సాత్వికఆహారంగా వుండాలి. సాత్వికాహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకికమాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.

🌷సంస్కారదోషం

🌸ఆహారం వండేవారి సంస్కారాన్నిబట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతివంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతివంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది..

స్వస్తి 
🙏

Saturday, December 27, 2025

ఏ రోజు ఏ విశేషము..........!! వారములు 7. అవి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం


ఏ రోజు ఏ విశేషము..........!!
వారములు 7. అవి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం.
ఆకాశంలో చంద్రుని స్థానంలో సూర్యుడు, సూర్యుడున్న స్థానంలో చంద్రుని భావించగా, కక్ష్యాక్రమం వారాలుగా ఏర్పాడతాయి. శని, గురు, కుజ, రవి, శుక్ర, చంద్ర. ఆ క్రమంలో హోర (1గంట)లు ఏర్పడతాయి. శనివారం శని హోరతో ఆరంభం అవుతుంది. 

సూర్యోదయం నుంచి వరుసగా శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర హోరలు నడుస్తాయి. (మందామరేజ్య భూపుత్రః సూర్య శ్శుక్రేంద్రుజేందవః) అవే మరల పునరావృతం అవుతాయి. 3×7=21 గంటలు పూర్తి అయిన తర్వాత 22 వ గంట శనిహోర, 23వ గంట గురుహోర, 24వ గంట కుజహోర పూర్తికాగా ఆదివారం రవిహోరతో ప్రారంభం అవుతుంది. ఆ విధంగా ఏ వారం ఆ గ్రహానికి చెందిన హోరతో ఆరంభం అవుతుంది.

ఏ వారం ఎలాంటి ఫలితం ఉంటుందో ఆ వారం జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

ఆదివారం....
రాజకార్యములు. ఉద్యోగప్రయత్నములు, కోర్టుపనులు, విక్రయపనులు, విద్యారంభం. సీమంతములకు శుభం.

ఆదివారం జన్మించినవారి లక్షణాలు
ఆదివారం జన్మించినవారు ఛామనచాయ శరీరము కలిగి ఉంటారు. పైత్య తత్త్వమును చురుకుదనం స్వయంకృషి కలిగి జీవిస్తారు. ఇతరుల మనస్సులను ఇట్టే గ్రహిస్తారు. సువర్ణాభరములు ధరించుట వీరికి ప్రీతి. ఏ పనినైనా వీరు త్వరగా పూర్తిచేయుటలో నేర్పరులు. 

సోమవారం...
అన్నప్రాశన, కేశఖండన. అక్షరాభ్యాసం, యాత్రలు, బావులు తవ్వుటకు, ప్రతిష్టాదులు, విత్తనములు చల్లుట, ఉద్యోగ, ఉపనయన, గృహారంభములకు శుభం.

సోమవారం జన్మించినవారి లక్షణాలు
సోమవారం జన్మించిన వారు అందమైన రూపముతో అలరారుచుందురు. సత్వగుణము ప్రధానమైనవారు. విశేష శాస్త్ర కృషి గావింతురు. నిర్మలమైన మనస్సు గలిగి పరోప కారబుద్ధిగలిగి జీవింతురు. ఆరోగ్య పరిరక్షణ వీరికి ఇష్టమైనపని. నీటివద్ద వీరు భయపడతారు. 

మంగళవారం.....
శుభకార్యాలకు మంచిది కాదు. అగ్నిసంబంధ పనులు, పొలం దున్నుట, అప్పు తీర్చుట, సాహసకార్యములు, ఆయుధ విద్యలకు మంచిది.

మంగళవారం జన్మించినవారి లక్షణాలు
మంగళవారం జన్మించినవారు నీరువుతో కూడిన శరీరఛాయగల వారును, ఆలస్యముగా విద్యను అభ్యసించెదరు. తామస ప్రవృత్తితో సంచరించువారును. అడపాదడపా అనారోగ్యములకు గురికావచ్చు.

బుధవారం....
సమస్త శుభకార్యాలకు, ప్రయాణాలకు, నూతన వస్త్రదారణకు, గృహారంభ, గృహప్రవేశ, దేవతా ప్రతిష్టాదులకు, హలకర్మ, విత్తనములు జల్లుటకు, క్రయ విక్రయాది వ్యాపారాది పనులకు, అప్పుచేయుటకు, ఉద్యోగములో చేరుటకు మంచిది.

బుధవారం జన్మించినవారి లక్షణాలు 
బుధవారం జన్మించినవారు చామనఛాయతో వెలయు శరీరముగల వారును, సౌమ్యమైన మాటలను పలుకువారును, సూక్ష్మగ్రాహులును, వ్యవహార జ్ఞానము గలవారును, వృత్తీ ఉద్యోగములలో రాణించువారును. సభలయందు అనర్గళంగా ఉపన్యసించుగలవారు. 

గురువారం....
సమస్త శుభకార్యములకు మంచిది. వివాహ యాత్రాధులకు, నూతన వస్త్ర ఆభరణ ధారణకు, గృహారంభం, గృహప్రవేశ దేవతాప్రతిష్టాదులకు, చెరువులు, తవ్వుటకు, పదవీస్వీకారం చేయుటకు మంచిది.

గురువారం జన్మించినవారి లక్షణాలు 
గురువారం జన్మించినవారు మధ్యమ దేహమును సుందర వదనము గలవారై ధైర్యవంతులై ప్రవర్తిస్తారు. ఇతరులకు తమ ప్రజ్ఞచూపి మెప్పుపొందుదురు. అనేక విషములందును, ఆరితేరినవారై ఉంటారు.

శుక్రవారం...
వివాహాది శుభకార్యాలకు పంచదశ సంస్కారాలకు, క్రయవిక్రయాది వ్యాపారాలకు, ఔషధసేవకు, స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాలకు, లలిత కళలు అధ్యయనం చేయుటకు మంచిది.

శుక్రవారము జన్మించినవారి లక్షణాలు 
శుక్రవారము జన్మించినవారు తేజోవంతులును రజోగుణ ప్రధానులు అయి విచ్చలవిడిగా సంచరింతురు. సర్వశాస్త్రకోవిదులుగా ప్రఖ్యాతులు కాగలరు. స్వల్ప విషయాలకే నొచ్చుకొందురు. కొందరు కార్యాలయ ప్రధానులుగా పనిచేయుదురు. వంశోద్ధారకులైపొగడ్తలొందుదురు.

శనివారం......
ఇనుము, ఉక్కు సంబంధిత పనులకు, నూనె వ్యాపారమునకు, స్థిరాస్తులను అమ్ముటకు, ఉద్యోగ స్వీకరణకు మంచిది. గృహారంభం, గృహప్రవేశ వివాహాదులకు మాధ్యమం.  

శనివారంము జన్మించినవారి లక్షణాలు 
శనివారంము జన్మించినవారు నల్లని దేహముకలిగి మందమతులై సంచరించెదరు. పొట్టికాళ్ళ వెడల్పు పాదములు కలిగి ఆలస్యముగా నడచుచుందురు. భాగ్యవంతులగుటకై ఎన్నో ప్రయత్నములు జరుపుచుందురు.

శ్రీ కృష్ణుడికి ఎంత మంది తల్లులు ఉన్నారో.. తెలుసా..................!!

శ్రీ కృష్ణుడికి ఎంత మంది తల్లులు ఉన్నారో.. 
తెలుసా..................!!

విష్ణువు ఎనిమిదవ అవతారంగా వచ్చిన శ్రీకృష్ణుడు ప్రపంచంలో అన్ని కష్టాలను ఓడించే భగవద్గీత అనే జ్ఞానాన్ని మనకు అందించాడు.

పెదవులపై వేణువు, తలలో నెమలి పించం ఉన్న శ్రీకృష్ణుని చూస్తుంటే సర్వ కలలు ఆయనలో ఉన్నాయని అనిపించక మానదు.
శ్రీకృష్ణుడు భూమిపై ఉన్నంతకాలం మానవ సంక్షేమం కోసమే బతికాడు.

అంతేకాకుండా కోరి వచ్చిన భక్తుల కోర్కెలను తీర్చేవాడు.
శ్రావణ మాసంలోని కృష్ణపక్షం అష్టమి తిథినాడు రోహిణీ నక్షత్రంనందు జన్మించిన శ్రీకృష్ణునికి ఇద్దరు తల్లులు ఉన్నారు అన్న సంగతి అందరికీ తెలిసినదే.

కానీ శ్రీకృష్ణుడికి ఐదుగురు తల్లులు ఉన్నారు అన్న సంగతి తెలుసా...
అయితే వారు ఎవరు, వారి గురించి తెలుసుకుందాం.

1. దేవకి..!
శ్రీకృష్ణుడికి నిజమైన తల్లిదండ్రులు వసుదేవుడు ఆయన సతీమణి అయిన దేవకి.
దేవకి తన సోదరుడు కంసుని చెరసాలలో బంధించి అయిన నేపథ్యంలో చెరసాలలో శ్రీకృష్ణుడు జన్మించాడు.
దేవకి అష్టమ సంతానం ద్వారా కంసుడికి మరణ గండం ఉందని తెలుసుకొని, దేవకిని ఆమె భర్తను చెరసాలలో బంధించాడు.
దేవకి దేవతలకు తల్లి అయినా అదితి అవతారమని చెబుతారు.
అందుకే శ్రీకృష్ణుడిని నందనుడు, వాసుదేవుడు అని కూడా పిలుస్తారు.

2. యశోద..!
దేవకి ఎనిమిదవ సంతానం అయిన శ్రీకృష్ణుడిని కంసుడు చంపుతాడు అనే ఉద్దేశంతో శ్రీకృష్ణుని చెరసాల నుండి యశోద వద్దకు చేరుతాడు. 
యశోద శ్రీకృష్ణుడిని పెంచిన తల్లి అయినా కన్నతల్లిలా శ్రీకృష్ణుని పెంచింది.
శ్రీకృష్ణుడు, యశోద, నందుడు దంపతుల దగ్గర గోకులంలో పెరిగాడు.
శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఎన్నో చిలిపి పనులు చేస్తూ ఉండేవాడు.
ఈ నేపథ్యంలో మట్టిని తింటున్నాడు అని మందలించినా యశోదకు తన నోట్లో సృష్టి మొత్తం చూపించి ఆశ్చర్య పరిచేలా చేశాడు.
అలా శ్రీకృష్ణుని మందలిస్తూ ఎంతో ప్రేమగా యశోద శ్రీకృష్ణుని పెంచింది.

3. రోహిణి..!
వసుదేవుడు దేవకి కంటే ముందుగా రోహిణిని వివాహం చేసుకొని ఉంటాడు.
ఈమెకి బలరాముడు, సుభద్ర జన్మిస్తారు.
దేవకీ వసుదేవుల ఏడవ సంతానమైన బలరాముని రోహిణి గర్భంలో ప్రవేశ పెట్టడం ద్వారా వీరికి బలరాముడు జన్మిస్తాడు.
ఈ విధంగా రోహిణి కూడా కృష్ణుడికి తల్లిలా భావించాడు.

4. సుముఖీ దేవి..!
సందీపని ముని భార్య అయినా సుముఖీదేవికి కూడా తల్లి హోదా కల్పించాడు శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణుడు సందీపని ముని దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు.
అయితే సుముఖీ దేవి శ్రీకృష్ణుని తన కుమారుడిగా ఉండేలా అడుగుతుంది.
కావున శ్రీకృష్ణుడు ఆమెకు కూడా తల్లి హోదా కల్పించాడు.

5. పూతన..!
పాలు తాగే వయసులో ఉన్న శ్రీకృష్ణుని హతమార్చేందుకు కంసుడు పూతన అనే రాక్షసిని పంపిస్తాడు.
తన రొమ్ములలో కాలకూట విషాన్ని నింపుకుని కృష్ణుని హతమార్చాలని చూస్తుంది.
అయితే ఈ విషయాన్ని ముందుగా గ్రహించిన కన్నయ్య, పాలతో పాటు ఆమె శరీరంలోని రక్తం మొత్తం తాగేస్తాడు.
దీనితో ఆమె చనిపోతుంది.
దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో, కాలిపోతున్న ఆమె దేహం సుగంధ పరిమళాలను వెదజల్లుతాయి.
ఈ ఘటన తర్వాత శ్రీకృష్ణుడు పూతనకు తల్లి హోదా కల్పించాడు.

Thursday, December 25, 2025

గ్రహాలు పరిహారాలు..........!!

గ్రహాలు పరిహారాలు..........!!


రవి గ్రహం:-
ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌’ అనే సంప్రదాయం ప్రసిద్ధమైనది. 
వాస్తు శాస్త్ర విద్య ఈశాన్యాన ఉన్న నుయ్యి, 
తూర్పున ఉన్న స్నానగృహం, 
ఇంట్లో ఈశాన్యాన ఉన్న పూజాగృహం, 
ఆగ్నేయాన ఉన్న వంటిల్లు బాలభానుని లేతకిరణాల వల్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి. 
సౌర స్నానాల పేరిట ఆరోగ్యం సాధిస్తున్నారు. ఉదయకాంతి శరీర ఆరోగ్యానికి చాలా మంచిదని 
కొత్త వైద్య ప్రక్రియ కూడా రూపొందుతున్నది.

ఉదయాన సంధ్యావందనం, 
సూర్య నమస్కారాలు, 
ఉదయకాలపు నడక 
ఆరోగ్యవంతుల మంచి అలవాట్లు. 
సూర్యుని కాంతిని ప్రత్యేక అద్దం ద్వారా 
అనారోగ్య ప్రదేశంలో ప్రసరింపజేసి 
ఆనారోగ్యాన్ని నివారించే పద్ధతిని 
రష్యన్‌ శాస్తవ్రేత్తలు నిరూపించారు.

వేర్వేరు రోగాలకు వేర్వేరు రంగుటద్దాల ద్వారా సూర్యకాంతిని ప్రసరింపజేసి అనారోగ్యాలను నివారింపచేసే కలర్‌ థెరపీ ప్రసిద్ధి చెందుతోంది. 

రవికి సంబంధించిన 
రాగి జావ,
క్యారెట్,
ధాన్యం, 
గోధుమలు, 
గోధుమ పాలు, 
గోధుమ గడ్డి రసం 
పలువిధాలైన అనారోగ్యాలను నివారిస్తున్నట్టుగా శాస్తవ్రేత్తలు వక్కాణించారు.

ఎముకలకు అధిపతి రవి. 
ఆ ఎముకలలోని లోపాలను పగడం ద్వారా పూరించడం ఫ్రాన్స్‌ శాస్తజ్ఞ్రుల కృషి ఫలితం. 
కంటి సమస్యలు ఉన్నవారు క్యారెట్ తినటం మంచిది. ఇలా రవి లక్షణాలు గల పదార్ధలు రవి ప్రభావం వలన జనించిన రోగాలన్నీ నయం చేస్తున్నాయి. 

చంద్రుడు:-
కాల్షియంకు.
ముత్యపు చిప్పలకు, 
ముత్యాలకు, 
మంచి గంధానికి, 
లవణానికి 
అధిపతి చంద్రుడు.

మనస్సు కు చంద్రుడధి దేవత. 
రక్తంలోని తెల్ల రక్తకణాలకు చంద్రుడే అధిపతి. 
శరీరంలోని కాల్షి యం లోపించినపుడు ముత్యపు భస్మం ముందుగా తీసుకోవాలంటుంది ఆయుర్వేదం. 
పూర్వపు రాజులు ముత్యపు సున్నం తాంబూలంలో వాడుకున్నారు. 
శరీరంలోని రక్తవేగం పెంచడానికి లవణం ఉపయోగపడుతుంది.

ప్రేమ, కోపం, ఉద్వేగం బొమ్మా బొరుసులు. 
ఆ ఉద్వేగాన్ని పెంచే లక్షణం లవణంలో ఉంది. 
ఆ ప్రేమకు కూడా చంద్రుడే అధిపతి. 
అదే లవణాన్ని సూక్ష్మీకరించి (నేట్రంమూర్‌) ముందుగా వాడితే ఉద్వేగాన్ని రక్తపోటును తగ్గిస్తోంది. 
మంచి గంథం రాసుకుంటే చల్లదనం ఇస్తుంది. 
వెన్నెల ఆ లక్షణం కలదే. 
ముత్యం ధరిస్తే మనసు ప్రశాంతిని పొందుతుందని జ్యోతిశ్వాస్త్ర సాంప్రదాయం. 

కుజుడు:-
ఎర్ర రక్త కణాలకు, 
రక్త చందనానికి, 
ఎముకలలోని మజ్జ కు, 
తుప్పుగల ఇనుముకు, 
వ్రణాలకు, 
దెబ్బ సెప్టిక్‌ అవ్వడానికి, 
బెల్లంలోని ఐరన్‌కు 
అధిపతి కుజుడే.
కుజగోళం ఆకాశంలో ఎర్రగా కనుపిస్తుంది. 
ఆ ఎరుపుకు కారణం ఆ గోళం మీద  సూర్యకాంతి పడటమే. 
శరీరంలో ఐరన్‌ అధికంగా ఉంటే దెబ్బలు తొందరగా తగ్గుతాయి.

అవి లోపించిన దెబ్బపై తుప్పు ఇనుము తగిలినా సెప్టిక్‌ అవుతుంది. 
బెల్లాన్ని శరీరంలో ఇముడ్చుకునే శక్తి లోపించినపపుడు 
ఆ బెల్లమే వ్రణాలను తగ్గకుండా చేస్తుంది. 
ఎములలోని మజ్జలో పగడం కలిసిపోతుందని ఫ్రాన్స్‌ వైజ్ఞానికుల అభిప్రాయం. 
పగడం కుజగ్రహానికి చెందిన రత్నం. 
కుజుడు శరీర పుష్టికి ప్రాధాన్యం ఇచ్చే గ్రహం. 
అతనికి ధాన్యమైన కందిపప్పు శరీర పుష్టినిస్తోంది. కందుల రంగు ఎరుపే. 

బుదుడు:-
బుధుడు నరాలకు సంబంధించిన గ్రహం. 
అతని రాశులు మిథున, కన్యలు. 
ధాన్యం పెసలు. కన్యారాశి ఉత్పత్తికి, అమ్మకానికి సంకేతం. 
బుధుడు వ్యాపారస్థుడు. 
అతని రంగు ఆకుపచ్చ. 
ఆ రంగు ఉత్పత్తికి సంకేతమని ఆధునిక వైజ్ఞానికుల అభిప్రాయం. 
పెసల రంగూ ఆకుపచ్చేనని, 
అవి నరాల నిస్సత్తువను తొలగిస్తాయని ఆహార వైద్యుల అభిభాషణం.

బుధుడు సమయస్ఫూర్తికి అధిపతి. 
అది లోపించడం బుద్ధి మాంద్యం. 
పెసలలోనూ బుధునికి చెందిన వసలోను ఆ బుద్ధి మాంద్యాన్ని తగ్గించే లక్షణం ఉంది.

గురుడు:-
గురుడు పసుపుకు, 
పంచదారకు, 
షుగర్‌ వ్యాధికి, 
శనగలకు సంబంధించిన గ్రహం.

పంచదారను జీర్ణించుకుంటే షుగర్‌ వ్యాధి రాదు. 
అది జీర్ణించుకోలేనప్పుడు ఏర్పడే పుళ్ళకు వేప, పసుపు మందులైతే పంచదార, శనగలు పుళ్ళు తగ్గకుండా చేస్తాయి.

గురుడు మేధావి. 
మేధావులు ఆలోచనలు చేస్తారు. 
వ్యాయామం చేయరు. 
ఆ రెండు లక్షణాలే షుగర్‌ వ్యాధిని పుట్టిస్తాయి. 
పసుపు షుగర్‌ వ్యాధి తగ్గిస్తుందని, 
వ్యాయామం షుగర్‌ రాకుండా చేస్తుందని వైద్యుల అభిప్రాయం. 
విశేషించి గురునికి చంద్ర, కుజ, శనులను దోషరహితులుగా చేసే ప్రత్యేక లక్షణం ఉంది.

చంద్రుడిచ్చే జబ్బులకు 
శనిచ్చే వాతానికి 
పసుపు మంచి మందు. 
టి.బి.కి కూడా చంద్రుడే అధిపతి. 
దాన్ని నివారించే శక్తి వెన్న కలిపిన పసుపుకున్నది. 

శుక్రుడు:-
శుక్రుడు సౌందర్యానికీ, 
నిమ్మపండుకు, 
తేనెకు, 
చింతపండుకు, 
చర్మానికి అధిపతి. 
సౌందర్యాన్ని చింతపండు, నిమ్మపండు పెంపొందించడం లోకప్రసిద్ధమే. 
తేనె కూడా ఈ విషయంలో సహకరిస్తుంది. 
అది పుష్పాల నుండే వస్తుంది. 
పుష్ప జాతులు సౌందర్యానికి, సౌకుమార్యానికీ ప్రతీకలు. 

శని..
వాత లక్షణం కలవాడు. 
చర్మం లోని మాలిన్యాలను వెలువరించే శక్తికి ఇతడు అధిపతి. 
నువ్వులకు, ఊపిరితిత్తులకు కూడా అధిపతే. ఊపిరితిత్తులు చేసే పని వాయువును క్రమబద్ధం చేయడమే. 
వాతం అంటే వాయు దోషమే కదా!

మాలిన్యాలను వెలువరించే లక్షణం, 
ఊపిరితిత్తుల పనిని క్రమబద్ధం చేసే లక్షణం 
నువ్వులకు ఉందని ఆయుర్వేద విజ్ఞానం చెపుతోంది. 

నువ్వుల నూనె శరీరానికి పట్టించి 
అభ్యంగనం చేస్తే రోమకూపాలు శక్తివంతమై 
చర్మంలోని మాలిన్యాలను తొలగిస్తాయి. 

ఇలా గ్రహాలకు చెందిన లేదా పొంత ఉన్న వస్తువులు గ్రహాల వల్ల కలిగే అనారోగ్యాలను తొలగిస్తున్నాయి. 

విశేషించి ఆయా గ్రహాలు ఉచ్ఛ స్వక్షేత్రాదులలో బలంగా ఉన్నప్పుడు ఆయా పంటలు ఎక్కువగా పండి 
దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాయి.

వంశపారంపర్యంగా రోగాలుండేవి ఏడు తరాలు. శరీరంలోని కణాలన్నీ మారడానికి పట్టే కాలం ఏడు సంవత్సరాలే.
ఓం నమః శివాయ..!!

సర్వే జనా సుఖినోభవంతు..!

విజయాలకి భక్తి మార్గాలు.*

విజయాలకి భక్తి మార్గాలు.*


సాధారణంగా రోజూ చేసే పూజాదికాలతోపాటు, 
గ్రహస్థితి బాగా లేదని తెలిసినపుడు, 
ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు. 

దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు. 
అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరున్నప్పుడు 
ఆ పని సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు. 

ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠించాలి, 
ఏ దేవతా పూజ చేయాలనే వివరాలు..

1. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నపుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా రోజూ సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవాలి. సూర్యధ్యానం చేయాలి.

2. ఇక వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నపుడు 
"కనకధారా స్తోత్రం" రోజు చదివితే ఆ వ్యాపారం 
అభివృద్ధి చెందుతుందట.

3. ఇక మంచి విద్య రావాలన్నా, 
చదువులో ఏకాగ్రత కుదరాలన్నా రోజూ..  
హయగ్రీవ స్తోత్రం" పిల్లలతో చదివించాలి. 
అలాగే "సరస్వతి ద్వాదశ నామాలు" చదువుకోమనాలి.

4. కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలకు  విష్ణు సహస్రనామం, లలిలా సహస్ర నామం పారాయణ చేయాలిట.

5. పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు 
"గోపాల స్తోత్రం " చదివితే మంచిదట. 
అలాగే గర్భవతిగా వున్న స్త్రీ ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తే సుఖప్రసవం అవుతుంది అంటారు పెద్దలు.

6. ఇక వివాహానికి "లక్ష్మీ అష్టోత్తర పారాయణం" చెయ్యాలి
మంచి సంబంధం దొరికి, పనులన్నీ చక్కగా జరగాలని, పెళ్లితంతు సక్రమంగా జరగాలని సంకల్పించి ఈ పారాయణాన్నీ రోజు చేస్తే ఆ కోరికలు తీరుతాయట.

7. ఋణబాధలు ఇబ్బంది పెడుతుంటే రోజూ నవగ్రహ స్తోత్రం చదువుకోవాలిట.ఆదిత్యయోగీ.
అలా చదివితే ఆ ఇబ్బందులలోంచి బయట పడతారుట.

8. ఇవే కాక ఇక ఇతర ఏ కోరికలు సిద్ధించాలన్నా విష్ణు సహస్ర నామ పారాయణ చేస్తే చాలు ఆ కోరికలన్నీ తీరుతాయట..ఓం నమః శివాయ..*
.

#కేశవనామాల విశిష్టత.*

మనము ఏ శుభకార్యం చేయాలన్నా, 
ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, 
ఏ యజ్ఞము చేయాలన్నా 
సంకల్పానికి ముంచుగా ఆచమనము చేస్తూ

కేశవాయనమః,,
నారాయణాయనమః,,
మాధవాయనమః
 
అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని 3సార్లు తీర్థము తీసుకుని,తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము.
ఈ 24 కేశవ నామాలు  చెప్పడంలో విశిష్టత ఏమి? 
దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది.
ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే  
ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో చానిపైన పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది.
ప్రీతితో కార్యము చేస్తాము.

1. ఓం కేశవాయనమః.
(శంఖం _చక్రం_గద_పద్మం)
బ్రహ్మ రుద్రులకు ప్రవర్తకుడూ,
నియామకుడూ అయినందువల్ల 
శ్రీహరి ‘కేశవుడు’అనబడుతున్నాడు.
ఈ కేశవుడు గాయత్రిలోని ‘తత్’ అన్న 
మొదటి అక్షరానికీ,
ఓం నమో భగవతే వాసుదేవాయ’ అన్న 
మహామంత్రం లోని ‘ఓం ’అన్న అక్షరానికీ,
ఇరవై నాలుగు తత్వాలలో మొదటిదైన 
అవ్యక్త తత్వానికీ,మార్గశీర్షమాసానికీ,
శుక్లపక్షంలో లలాటంమీద ధరించే ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలలో ఒకటైన నామానికీ,
మేషరాశికీ,ఆహారపదార్థాలలో ఒకటైన అన్నానికీ నియామకుడు.

2. ఓం నారాయణాయనమః.
(పద్మం_గద_చక్రం_శంఖం)
నాశరహితుడైనందువల్ల విష్ణువు ‘నరుడు’ 
ఆయన చేత,సృష్టించబడిన జలం ‘నార’అనబడుతోంది.
ప్రళయోదకం మీద శయనించిన విష్ణువు ‘నారాయణుడు’ అయ్యాడు.ఆదిత్యయోగీ.
ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘న’అక్షరానికీ,
గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ, మహత్తత్వానికీ,పౌష్యమాసానికీ,
శుక్లపక్షంలో ఉదరం మీద ధరించే నామానికీ,
వృషభరాశికీ, పరమాన్నానికీ,     
ప్రాతఃకాలానికీ నియామకుడు.

3. ఓం మాధవాయ నమః.
(చక్రం_శంఖం_పద్మం_గద)
మధు’నామక యదువంశ శాఖలో జన్మించడంవల్లా,
రమాదేవికీ పతి అయినందువల్లా,
సర్వోత్తముడు అయినందువల్లా,
శ్రీహరి ‘మాధవుడు’ అయ్యాడు.
ఈ మాధవుడు వాసుదేవ మహామంత్రంలోని
‘మో’అన్న అక్షరానికీ,
గాయత్రిలోని‘వి’అన్న అక్షరానికీ,
అహంకారతత్వానికీ,మాఘమాసానికీ,
శుక్లపక్షంలో హృదయంమీద ధరించే నామానికీ,
మిథునరాశికీ,భక్ష్యాలకూ నియామకుడు.

4. ఓం గోవిందాయ నమః.
(గద_పద్మం_శంఖం_చక్రం)
వేదాల మూలంగా పొందబడేవాడూ,
భూమినీ,గోవులనూ రక్షించేవాడూ,
మోక్షప్రదుడూ అయినందువల్ల శ్రీహరి ‘గోవిందుడు’ అనబడుతాడు.
ఈ గోవిందుడు వాసుదేవ మంత్రంలోని‘భ’అన్న అక్షరానికీ’
గాయత్రిలోని“తుః”అన్న అక్షరానికీ,
మనస్తత్త్వానికీ,పాల్గుణ మాసానికీ,
శుక్లపక్షంలో కంఠ మధ్యలో ధరించే నామానికీ,
కర్కాటక రాశికీ, నేయికీ నియామకుడు.

5. ఓం విష్ణవే నమః.
(పద్మం_శంఖం_చక్రం_గద)
జ్ఞానానందాది సమస్త గుణాలతో,
దేశతఃకాలతః వ్యాప్తుడైనందువల్లా సర్వోత్తముడై ఉన్నందువల్లా శ్రీహరి “విష్ణువు” అనబడుతున్నాడు.
ఈ విష్ణువు వాసుదేవ మహా మంత్రంలోని‘గ’అన్న అక్షరానికీ,
గాయత్రిలోని‘వ’అన్న అక్షరానికీ కర్ణతత్త్వానికీ,చైత్రమాసానికీ,
శుక్లపక్షంలో ఉదరం యొక్క దక్షిణ పార్శ్వంలో ధరించే నామానికీ,
సింహరాశికీ,పాలకూ నియామకుడు.

6.ఓం మధుసూదనాయ నమః. (శంఖం_పద్మం_గద_చక్రం)
మధు”నామక దైత్యుడిని సంహరించినందువల్లా,సాత్త్విక లోకానికి సుఖాన్ని ప్రసాదించేవాడైనందువల్లా శ్రీహరి‘మధుసూదనుడు’  అనబడుతున్నాడు. 
ఈ మధుసూదనుడు వాసుదేవ మహామంత్రంలోని  వ’అన్న అక్షరానికీ, 
గాయత్రిలోని ‘రే’అన్న అక్షరానికీ,
త్వక్ తత్త్వానికీ,వైశాఖమాసానికీ,
శుక్లపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ,
కన్యారాశికీ,మధుర భక్ష్య విశేషానికీ నియామకుడు.
ఈ మధుసూదనుడు‘హస్తిని’నాడిలో ఉంటాడు

7. ఓం త్రివిక్రమాయ నమః.
(గద_చక్రం_శంఖం_పద్మం)
మూడు వేదాలనూ,మూడు కాలాలనూ,
సత్త్వాది మూడు గుణాలనూ,
భూరాది మూడు లోకాలనూ, 
త్రివిధ జీవులనూ,
చేతన అచేతన మిశ్రములన్న త్రివిధ ద్రవ్యాలనూ 
తన స్వరూపంతో వ్యాపించి నెలకొన్న కారణంగా 
శ్రీహరి ‘త్రివిక్రముడు’ అనబడుతాడు.
వాసుదేవ మహామంత్రంలోని “తే”అన్న అక్షరానికీ,
గాయత్రిలోని‘ణి’అన్న అక్షరానికీ,
నేత్ర తత్త్వానికీ,జ్యేష్ఠమాసానికీ,
శుక్లపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ,
తులా రాశికీ,వెన్నకూ నియామకుడు.

8. ఓం వామనాయ నమః.
(చక్రం_గద_పద్మం_శంఖం)
అపేక్షిత సుఖాలనూ,అభీష్టాలనూ కరుణించేవాడూ,
మోక్ష విరోధులైన దైత్యులను అంధకారంలో నెట్టివేసేవాడూ అయినందువల్ల శ్రీహరి‘వామనుడు’ అనబడుతున్నాడు.  
ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘వా’అన్న అక్షరానికీ,
గాయత్రిలోని‘యం’అన్న అక్షరానికీ  జిహ్వాతత్త్వానికీ,ఆషాడమాసానికీ,
శుక్ల పక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ,
వృశ్చికరాశికీ,పెరుగుకూ నియామకుడు.

9. ఓం శ్రీధరాయ నమః.
(చక్రం_గద_శంఖం_పద్మం)
శ్రీ శబ్దవాచ్య అయిన మహాలక్ష్మికి కూడా ధారణకర్తా, పోషణకర్తా అయినందువల్లా లక్ష్మిని సర్వదా తన వక్షస్థలంలో ధరించి ఉండడం చేతా శ్రీహరి‘శ్రీధరుడు’ అనబడుతున్నాడు.
ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘సు’అన్న అక్షరానికీ,
గాయత్రిలోని‘భ’అన్న అక్షరానికీ,
ఘ్రాణతత్త్వానికీ,శ్రావణమాసానికీ,
శుక్లపక్షంలో ఉదరం ఎడమ భాగంలో  ధరించే నామానికీ,
ధనూరాశికీ,ముద్దపప్పుకూ నియామకుడు.

10. ఓం హృషీకేశాయ నమః.
(చక్రం_పద్మం_శంఖం_గద)
ఇంద్రియ నియామకుడూ,
రమ,బ్రహ్మ,రుద్రాదులకు ఆనందాన్ని ఇచ్చేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘హృషీకేశుడు’  అనబడుతున్నాడు.
ఈయన వాసుదేవ మహామంత్రంలోని ‘దే’అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘ర్గో’అన్న అక్షరానికీ, 
వాక్‍తత్త్వానికీ,భాద్రపద మాసానికీ,
శుక్లపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,
మకర రాశికీ,ఆకుకూరలతో తయారుచేసిన పదార్థాలకూ నియామకుడు.

11. ఓం పద్మనాభాయ నమః.
(పద్మం_చక్రం_గద_శంఖం)
నాభిలో పద్మాన్ని కలిగినవాడూ,
భక్తుల మనస్సులో ప్రకాశించేవాడూ,
సూర్యకాంతి వంటి కాంతి కలిగినవాడూ అయినందువల్ల శ్రీహరి‘పద్మనాభుడు’ అనబడుతున్నాడు.
ఈయన వాసుదేవ మహామంత్రం లోని‘వా’అన్న అక్షరానికీ,
గాయత్రిలోని‘దే’అన్న అక్షరానికీ,
పాణితత్త్వానికీ, ఆశ్వయుజమాసానికీ,
శుక్ల పక్షంలో కంఠం ఎడమభాగంలో ధరించే నామానికీ,
కుంభరాశికీ,కూరగాయలతో తయారుచేసే పదార్థాలకు నియామకుడు.

12. ఓం దామోదరాయ నమః.
(శంఖం_గద_చక్రం_పద్మం) 
యశోదచేత పొట్టకు బిగించబడిన తాడు గలవాడూ,
ఇంద్రియనిగ్రహం కలిగిన ఋషులతో క్రీడించేవాడూ, దానశీలురకు ఆనందాన్ని ఇచ్చేవాడూ, 
దైత్యులకు దుఃఖం కలిగించేవాడూ,
దయాయుక్తులైన జీవులతో క్రీడించేవాడూ అయినందు వల్ల శ్రీహరి‘దామోదరుడు’ అనబడుతున్నాడు.
ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘య’అన్న అక్షరానికీ,
గాయత్రిలోని‘వ’అన్న అక్షరానికీ,
పాదతత్త్వానికీ,కార్తీకమాసానికీ,
శుక్లపక్షంలో మెడపైన ధరించే నామానికీ,
మీనరాశికీ,అన్ని రకాల పుల్లని పదార్థాలకీ నియామకుడు.

13. ఓం సంకర్షణాయ నమః.
(శంఖం_పద్మం_చక్రం_గద)
భక్తుల చిత్తాన్ని ప్రాపంచిక విషయాలనుండి మరలించి వైరాగ్య భావాన్ని కరుణించేవాడైనందు వల్ల శ్రీహరి ‘సంకర్షణుడు’ అనబడుతున్నాడు.
ఈయన గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ,
పాయు తత్త్వానికీ,కృష్ణపక్షంలో నుదిటిపై ధరించే నామానికీ,
ఆమ్ల మిశ్రమాలు కాని పదార్థాలకీ,
మనోమయకోశానికీ,క్షత్రియవర్ణానికీ,స్త్రీశరీరానికీ,
ఋతుసామాన్యానికీ,రుద్రునికీ,మధ్యాహ్నసవనానికీ,
ఆవేశరూపాలకూ,రాజసద్రవ్యాలకూ,
త్రేతాయుగానికీ,శరదృతువుకూ నియామకుడు.

14. ఓం వాసుదేవాయ నమః.
(శంఖం_చక్రం_పద్మం_గద)
త్రిలోకాలకూ ఆవాసస్థానమైనవాడూ, సర్వాంతర్యామీ, సర్వశక్తుడూ,సర్వచేష్టకుడూ,సర్వాభీష్టప్రదుడూ,
యోగ్యజీవులకు ముక్తిని అనుగ్రహించేవాడూ,
వసుదేవసుతుడూ అయినందువల్ల శ్రీహరి ‘వాసుదేవుడు’అనబడుతున్నాడు.
ఈయన గాయత్రిలోని‘ధీ’అన్న అక్షరానికీ,
ఉపస్థతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరమధ్యంలో ధరించే నామానికీ,పంచదారకూ,బెల్లానికీ,బ్రాహ్మణవర్గానికీ,
పురుషశరీరానికీ,సాయంసవనానికీ,అవతారరూపాలకూ,శుభద్రవ్యాలకూ,కృతయుగానికీ,హేమంత ఋతువుకూ నియామకుడు.

15. ఓం ప్రద్యుమ్నాయ నమః.
(శంఖం_గద_పద్మం_చక్రం)
అసదృశమైన కాంతీ,యశస్సు కలిగి ఉన్నందువల్ల శ్రీహరి ‘ప్రద్యుమ్నుడు’అనబడుతున్నాడు.
ఈయన గాయత్రిలోని‘మ’అన్న అక్షరానికీ,
శబ్దతత్త్వానికీ,కృష్ణపక్షంలో హృదయభాగంలో ధరించే నామానికీ,
వడపప్పు మొదలైన పదార్థాలకూ,వైశ్యవర్ణానికీ,
స్త్రీ శరీరానికీ,అయనానికీ,ప్రాతఃసవనానికీ, లీలారూపాలకూ,పీతవర్ణ ద్రవ్యాలకూ,
ద్వాపరయుగానికీ,వర్ష ఋతువుకూ నియామకుడు.

16. ఓం అనిరుద్ధాయ నమః.
(గద_శంఖం_పద్మం_చక్రం)
ఎవ్వరిచేతా నిరోధించబడనివాడూ,సర్వశక్తుడూ, గుణపూర్ణుడూ,మనస్సుతో సంపూర్ణంగా తెలియబడనివాడూ,
జ్ఞానుల మనసులలో ధ్యానంతో బంధించబడేవాడూ,
వేదవిరుద్ధ ఆచార నిరతులను సంహరించేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అనిరుద్ధుడు’అనబడుతున్నాడు.
ఈయన గాయత్రిలోని‘హి’అన్న అక్షరానికీ,స్పర్శతత్త్వానికీ,
కృష్ణపక్షంలో కంఠ మధ్యభాగంలో ధరించే నామానికీ,
చేదుపదార్థాలకూ,శూద్ర వర్ణానికీ,అన్నమయకోశానికీ,
భోగ్యవస్తువులన్నింటికీ,  అబ్దానికీ, నల్లని  ద్రవ్యాలకూ, కలియుగానికీ,  గ్రీష్మఋతువుకూ   నియామకుడు.

17. ఓంపురుషోత్తమాయనమః.
(పద్మం_శంఖం_గద_చక్రం)
దేహనాశంగల సర్వజీవులూ క్షరపురుషులు.
ఏ విధమైన నాశనమూ లేని అప్రాకృత శరీరం గల శ్రీమహాలక్ష్మిదేవి అక్షరపురుష.
ఈ ఉభయ చేతనులకంటే సర్వోత్తముడైనందువల్ల శ్రీహరి‘పురుషోత్తముడు’అనబడుతున్నాడు
ఈయన గాయత్రిలోని ‘థి’అన్న అక్షరానికీ,రూపతత్త్వానికీ,
కృష్ణపక్షంలో ఉదరం కుడిభాగంమీద ధరించే నామానికీ,
ఇంగువ,యాలకులు,ఆవాలు,కర్పూరాలకూ నియామకుడు.

18. ఓం అధోక్షజాయ నమః.
(గద_శంఖం_చక్రం_పద్మం)
ఇంద్రియ నిగ్రహం కలిగిన వసుదేవాదుల వల్ల ప్రాదుర్భవించినవాడూ, నిత్యజ్ఞానస్వరూపుడూ,
అక్షయకుమారుడిని సంహరించిన హనుమంతుడి చేత తెలియబడేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అధోక్షజుడు’ అనబడుతాడు.
ఈయన గాయత్రిలోని‘యో’అన్న అక్షరానికీ,
రసతత్త్వానికీ, కృష్ణపక్షంలో కుడిస్తనం మీద ధరించే నామానికీ, పాలకూ,పానకమూ,మజ్జిగకూ, పచ్చిపులుసుకూ, నేతితో,నూనెతో వేయించిన పదార్థాలకూ నియామకుడు.

19. ఓం నారసింహాయ నమః.
(పద్మం_గద_శంఖం_చక్రం)
నరుడిలాగా,సింహంలాగా ఉభయాత్మకమైన శరీరం కలిగివున్నందువల్ల శ్రీహరి‘నారసింహుడు’అనబడుతాడు.
ఈయన గాయత్రిలోని ‘యో’అన్న అక్షరానికీ,
గంధతత్త్వానికీ, కృష్ణపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ, 
బూడిద గుమ్మడికాయ, నువ్వులు,మినుములతో తయారుచేసిన వడియాలు మొదలైన పదార్థాలకూ,
ఈశాన్య దిక్కుకూ నియామకుడు.

20. ఓం అచ్యుతాయ నమః.
(పద్మం_చక్రం_శంఖం_గద)
శుద్ధజ్ఞానానందాలే దేహంగా కలవాడూ,
సకలగుణ పరిపూర్ణుడూ,సత్య సంకల్పుడూ అయినందువల్ల సర్వదా పూర్ణకాముడూ,దోషరహితుడూ అయినందువల్లా శ్రీహరి‘అచ్యుతుడు’అనబడుతున్నాడు.
ఈయన గాయత్రిలోని‘నః’అన్న అక్షరానికీ, ఆకాశతత్త్వానికీ, కృష్ణపక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ,
ఉద్దిపప్పుతో తయారుచేసే వడ మొదలైన వాటికి నియామకుడు. 

21.ఓంజనార్థనాయనమః.
(చక్రం_శంఖం_గద_పద్మం)
సముద్రంలో ఉండి తరచుగా దేవతల్ని పీడించే మధు,కైటభ,హయగ్రీవాది దైత్యులను మర్దనం చేసినవాడూ,ఆదిత్యయోగీ.
మోక్షప్రదుడూ, జన్మలేనివాడూ,    
సంసారదుఃఖాన్ని పరిహరించేవాడూ,
సుజీవులచేత పొందబడేవాడూ అయినందువల్ల శ్రీహరి‘జనార్ధనుడ’య్యాడు.
ఈ జనార్ధనుడు గాయత్రిలోని ‘ప్ర’అన్న అక్షరానికీ,
వాయుతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికీ, ఉప్పుకూ,నైరుతి దిక్కుకూ నియామకుడు.

22.ఓంఉపేంద్రాయనమః.
(గద_చక్రం_పద్మం_శంఖం)
ఇంద్రుడిని అనుజుడిగా పొంది ఉన్నందువల్ల శ్రీహరి   ‘ఉపేంద్రుడు’ అనబడుతున్నాడు.
ఈ ఉపేంద్రుడు గాయత్రిలోని‘చో’అన్న అక్షరానికీ,
తేజోతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఎడమ స్తనం మీద ధరించే నామానికీ,అరటిపండు,కొబ్బరికాయ మొదలైన ఫలాలకీ,
వాటి రసాలకీ,తూర్పు దిక్కుకూ నియామకుడు.

23. ఓంహరయేనమః.
  (చక్రం_పద్మం_గద_శంఖం)
భక్తుల పాపాలను పరిహరించేవాడు కావడంచేత నారాయణుడు‘హరి’అనబడుతున్నాడు.
ఈ హరి గాయత్రిలోని ‘ద’ అన్న అక్షరానికీ,
అపోతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,తాంబూలానికీ నియామకుడు.

24. ఓంకృష్ణాయనమః.
(గద_పద్మం_చక్రం_శంఖం)
సృష్టి,స్థితి,సంహార నియమనాదుల వల్ల సకల జగత్తునూ తనలోనికి లాగికొనువాడూ,పూర్ణానంద స్వరూపుడూ,  నీలవర్ణ దేహకాంతికలవాడూ అయినందువల్ల శ్రీహరి.. కృష్ణుడు”అనబడుతున్నాడు.
ఈ కృష్ణుడు గాయత్రిలోని‘యాత్’ అన్న అక్షరానికీ,
పృథ్వీతత్త్వానికీ,కృష్ణపక్షంలో మెడమీద ధరించే నామానికీ, త్రాగేనీటికీ,  
దైహిక  కర్మకూ నియామకుడు.
ఓం..నమో...శ్రీవేంకటేశాయా..*
.

#తెలియకుండా చేసిన పాపాలకి శిక్ష.*

మనం చేసిన పాపాలకి శిక్ష ఉంటుందని తెలుసు. 
కానీ తెలియకుండా కొన్ని, 
తెలిసి కొన్ని చేసేస్తూ ఉంటాం. 

ఈ విషయంలో మన సనాతన ధర్మంలో స్పష్టమైన విశ్లేషణ ఉంది. 
మనం చేసే అన్ని తప్పులు (పాపాలు) 
మూడిటితోనే చేస్తాం. 
(1) కాయిక (శరీర గత); 
(2) వాచిక (మాటతో); మరియు 
(3) మానసిక (మనసుతో). 

ఆ తప్పులు ఏమిటో తెల్సుకుని వాటిని ఎలా అరికట్టవచ్చో చూద్దాం. 
ఒకవేళ ఆ తప్పులు చేసినట్లైతే ప్రాయశ్చిత్తానికి కూడా ఉపయోగపడుతుంది. 
ఈ మూడు విధములైన తప్పులకు మూడు విధములైన తపస్సులు చెప్పేరు. 
ఇవి ఎవరికి వారే వ్యక్తిగతంగాపరీక్షించుకుని మార్పు చెందే సుళువైన మార్గం.

(1) కాయిక (శరీరగత) పాపములు:
మనుధర్మ శాస్త్ర ఆధారంగా…

శ్లోకం:
అదత్తాముపాదానం హింసాచైవా విధానతః, పరదారోపసేవా చ శరీరం త్రివిధం స్మృతం.
అర్థం:
అన్యాయముగా డబ్బు సంపాదించడం, 
హింస చేయడం, 
శాస్త్ర విరుద్ధమైన పనులు చేయడం, 
పరస్త్రీ సంగమం.. 
ఇవి శరీరముతో చేసే పాపములు (తప్పులు).

ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…
శ్లోకము:
దేవ ద్విజ గురు ప్రాఙ్ఞ్య పూజనం శౌచమార్జవం, బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే.
అర్థము:
దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, ఙ్ఞానులను పూజించడం, 
శరీరమును శుచిగా ఉంచడం, 
పవిత్రమైన ఆచారములు, 
డబ్బును, ఇతర ద్రవ్యములను న్యాయముగా సంపాదించడం,ఆదిత్యయోగీ.
బ్రహ్మచర్యము (తన భార్యతో తప్ప ఇతర స్త్రీలయందు కామ దృష్టి లేకపోవడం), 
ఇతరులను హింసించకుండా ఉండడం.. 
ఇవి శారీరిక తపస్సులు.

(2) వాచిక (మాటతో) పాపములు:
శ్లోకము:
పారుష్యమనృతం చైవ పైశున్యం చాపి సర్వశః, అసంబద్ధ ప్రలాపశ్చ
వాఙ్ఞ్మయంస్యాచ్చతుర్విధం.
అర్థం:
కఠినముగా మాట్లాడడం, 
అబద్ధాలు చెప్పడం, 
ఇతరులను నిందిస్తూ మాట్లాడడం, 
వ్యర్థమైన/పనికిమాలిన మాటలాడడం.. 
ఇవి వాక్కుతో చేసే తప్పులు.

ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…
శ్లోకము:
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్, స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్ఞ్మయం తప ఉచ్యతే.
అర్థము:
ఉద్వేగం కలిగించకుండా మాట్లాడడం, 
ఇష్టముగా మరియు మేలుకలిగించే విధంగా మాట్లాడడం, యదార్థము మాట్లాడడం, 
వేద శాస్త్రములను పఠించడం, 
పరమేశ్వరుని నామ జపం చేయడం.. 
ఇవి వాక్కుకి సంబంధించిన దోషాలను పోగొట్టే తపస్సనబడుతుంది.

(3) మానసిక పాపములు:
శ్లోకము:
పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్ట చింతనం, వితథాభినివేశశ్చ త్రివిధం కర్మ మానసం.
అర్థము:
ఇతరుల డబ్బును, ద్రవ్యాలను దోచుకోవాలనే ఆలోచన, పరులకి కీడుతలపెట్టే ఆలోచన, 
శరీర అభిమానము.. 
ఇవి మనసుకి సంబంధించిన పాపములు.

ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…
శ్లోకము:
మనః ప్రసాదః సౌమ్యత్త్వం మౌనమాత్మ వినిగ్రహ:, భావ సంశుద్ధిరిత్యేతత్తపోమానసముచ్యతే.
అర్థము:
మనసుని ప్రసన్నంగా ఉంచుకోవడం, 
శాంత భావం, 
సదా భగవచ్చింతన చేసే స్వభావం, 
మనోనిగ్రహం, 
అంతఃకరణాన్ని పవిత్రంగా ఉంచుకోవడము.. 
ఇవి మానసిక దోషములను పోగొట్టే తపస్సులనబడతాయి. 

అన్నిటిలోకి మానసిక తపస్సు చాలా గొప్పది. 
ఎందుకంటే అనేక తప్పులకు కారణం మానసిక దోషాలే. మనందరం ఈ నిముషం నుండే అభ్యాసం మొదలెడదాం.

సర్వే జనా సుఖినోభవంతు.....*
.

RECENT POST

దానాలు - శుభ ఫలితాలు*

దానాలు - శుభ ఫలితాలు*  ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడుతుంది.. అనే మాటలు మనం వింటూ ఉంటాము. పురాణాలు కూడా దానం చ...

POPULAR POSTS