Thursday, July 12, 2018

దీపారాధన..పాటించాల్సిన నియ‌మాలు దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి..

దీపారాధన..పాటించాల్సిన నియ‌మాలు
నిత్యం దీపారాధన చేసినా.. కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరికొందరకి నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి..
దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి..
అనే విషయంపై సరైన అవగాహన ఉండదు.
అయితే.. నిత్యపూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి ? ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటి సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసుకుందాం..
పంచలోహాలు, వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయష్కరం. అయితే నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు.
తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి, మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే.. గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి.. సంతోషంగా ఉంటారు.
పడమటి వైపు దీపం వెలిగిస్తే.. రుణ బాధలు, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది.
అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే.. సిరిసంపదలు, విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయి.
దక్షిణంవైపు దీపారాధన చేయరాదు. దక్షణముఖంగా దీపం వెలిగిస్తే.. అపశకునాలు, కష్టాలు, దుఖం, బాధ కలుగుతాయి.
దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే.. పూర్వజన్మ పాపాలు తొలగిపోయి.. సంతోషంగా జీవిస్తారు. తెల్లటి కొత్త వస్ర్తం మీద పన్నీరు చల్లి, ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్ర్తాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా.. శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలికిస్తే.. శ్రేయస్కరం.
దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలి అనే దానిపై చాలా మంది అయోమయం చెందుతూ ఉంటారు.
దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. లేదంటే.. నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే. దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే.. దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది.
విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అదే ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమంతో 48 రోజులు దీపం వెలిగిస్తే.. సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అని శాస్త్ర నిర్ణయం. వేరుశనగ నూనెతో దీపారాధన చేయరాదు...
స్వస్తి..!!
సర్వే జనా సుఖినోభవంతు..!!
                        శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS