Thursday, July 12, 2018

ఆలుమగల మధ్య మళ్ళీ ప్రేమానురాగాలు చిగురించాలంటే.. నల దమయంతుల కథ పారాయణం చేయండి

భార్యా భర్తల మధ్య అనురాగం తగ్గిందా...
తరుచూ ప్రతీ చిన్న విషయానికి గొడవ పడుతున్నారా ....
ఆలుమగల మధ్య మళ్ళీ ప్రేమానురాగాలు చిగురించాలంటే..
నల దమయంతుల కథ పారాయణం చేయండి..
నల దమయంతిల అపూర్వ ప్రేమ కథ
అయోధ్య రాజు నిషిధకి నల మరియు కువర అనే ఇద్దరు కుమారులు కలరు. వారిలో నల దమయంతిని వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. దమయంతి జాడ అతనికి తెలియలేదు. కాబట్టి నల ఆమె కోసం హంసను పంపెను.
హంస దమయంతి యొక్క రాజభవనంనకు వెళ్లి, తోటలో ఒంటరిగా ఉన్న ఆమె దగ్గరకు వెళ్లి నల యొక్క కీర్తిని ఆలాపించెను. ఇంతలో, రాజు భీమ ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేసెను. చాలా మంది రాజకుమారులు వచ్చిన దమయంతి వారిలో ఎవరిని భర్తగా ఎంచుకోలేదు.
దమయంతి నలను ఎంచుకొని వివాహం చేసుకొనెను. తర్వాత వారికీ ఇంద్రసేనన్, ఇంద్రసేన అనే పిల్లలు జన్మించారు. నల మహారాజు తన రాజ్యంను బాగా పాలించెను.
రాజు నిషిధ మరణించిన తర్వాత నల రాజు అయ్యెను. అతను అనేక ఇతర రాజ్యాలను ఆక్రమించుకొని ప్రసిద్ది గాంచెను. ఇది చూసి అతని సోదరుడు కువర అసూయ చెందెను.
జూదం నల మహారాజు యొక్క బలహీనత. దాంతో కురవ పాచికల ఆట ఆడమని సవాలు విసిరెను. ఆ ఆటలో నల మహారాజు సర్వం కోల్పోయెను. కురవ రాజు అయ్యి, నల మహారాజును రాజ్యం నుంచి బహిష్కరించేను.
దమయంతి తమ పిల్లలను పుట్టింటికి పంపించి, నల మహారాజుతో అడవులకు వెళ్ళెను. నల మరియు దమయంతి అడవికి చేరుకొనెను. వారికి మూడు రోజుల పాటు ఆహారం దొరకలేదు. నల విసిగిపోయి దమయంతితో తనను వదిలి పుట్టిల్లు అయిన విదర్భకు వెళ్ళమని దారి చూపుతాడు.
అప్పుడు దమయంతి మాట్లాడుతూ' మిమ్మల్ని ఒంటరిగా వదలి వెళ్లనని, మిమ్మల్ని అనుసరిస్తానని, అలాగే భార్య అన్ని మానసిక ఒత్తిడి లకు ఔషధం' వంటిదని చెప్పెను. నల మాట్లాడుతూ నీవు సరిగానే చెప్పావు. భార్య ఉత్తమ స్నేహితురాలు, నిన్ను ఎప్పటికి వదిలిపెట్టను. నేను ఎప్పుడు నీతోనే ఉంటానని చెప్పెను.
అప్పుడు దమయంతి మాట్లాడుతూ,'అప్పుడు మీరు విదర్బ కు మార్గం ఎందుకు చూపారు? నేను నా ఇంటికి వెళ్ళాలని అనుకుంటే, ఇద్దరం కలిసి వెళ్లదాం. మీ మాటలు నాకు బాధ కలిగించాయి. మీరు నన్ను వదిలి వేస్తారేమో అని భయపడ్డాను.' అని అనెను. 
దమయంతి నిద్ర పోతున్నసమయంలో, నల ఆమెను వదిలి వెళ్ళిపోయెను. ఆమె నిద్ర నుండి మేల్కొన్నాక ఆమె భర్త కనపడలేదు. ఆ తర్వాత కలత చెందిన దమయంతి ఒంటరిగా జీవితం సాగించెను.నల అడవిలో నడిచి వెళ్ళుతుండగా, అతని సహాయం కోసం పిలుపు వినిపించెను.
'నల ఇక్కడకు రండి'. నల అరుపు వినపడిన దిశకు వెళ్ళెను. అక్కడ అతను అడవిలో ఒక భాగం దహనం కావటం కనుగొనెను. అతనిని సహాయం కోసం ఒక పాము పిలిచింది. పాము నలతో మాట్లాడుతూ' నేను పాములకు రాజు అయిన కర్కోటకుడుని, దయచేసి ఈ అగ్ని నుండి నన్ను బయటకు తీసుకురమ్మని వేడుకొనెను'.
నల అగ్ని నుండి కర్కోటకుడుని కాపాడెను. హఠాత్తుగా కర్కోటకుడు నలని కాటు వేసెను. విషం కారణంగా, నల రూపురేఖలు మారిపోయి మరియు అతను ఒక జుగుప్సాకరమైన వ్యక్తి వలె కనిపించెను. 'కర్కోటకుడు నలతో ఈ విధంగా చెప్పెను.
నేను ప్రజలు నుండి మీ గుర్తింపును కప్పిపుచ్చడానికి మాత్రమే చేశాను. ఈ విషం మీ మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగి ఉండదు.  మీరు మీ శత్రువులకు వ్యతిరేకంగా యుద్ధంలో గెలిచినట్టు ఉంటుంది. అయోధ్య వెళ్లి రితుపర్ణ అనే రాజును కలిసి, మీరు బాహుక అనే రథ చోదకుడు అని అతనికి చెప్పండి.
అతనికి అశ్వ హ్రిదయ పద్ధతులు నేర్పండి. అలాగే అతని నుండి అక్ష హ్రిదయ యొక్క పద్ధతులను నేర్చుకొండి. రాజు మీ స్నేహితుడు అవుతాడు. నిరాశ చెందవద్దు. మీరు మీ భార్య మరియు పిల్లలు మరియు మీ రాజ్యంను కూడా గెలుచుకుంటారు.
మీరు ఈ బట్టలను ధరించినప్పుడు, మీరు మీ మునుపటి రూపాన్ని తిరిగి పొందుతారని హామీ ఇస్తున్నాను'' అని చెప్పుతూ అదృశ్యమయ్యెను.
నల మరొక రాజ్యంనకు బయలుదేరేను. ఇంతలో, దమయంతి నిద్రలేచి  ఆమె తల్లితండ్రుల గురించి అడగగా సమాధానం దొరకలేదు.
ఆమె ముందుకు వెళ్లి ఒక భూతం తింటానని బెదిరించెను. ఆమె తెగింపు నచ్చి అతను తన నిజ రూపంలోకి వచ్చెను. నిజానికి అతను ఒక దేవుడు,
అతను పన్నెండు సంవత్సరాల తర్వాత ఆమె భర్త తో కలుస్తుందని చెప్పెను. దమయంతి ఆచల్పుర రాజ్యం బయలుదేరి వెళ్లి , రాణి యొక్క పని మనిషిగా మారెను. నల సంసుమర రాజ్యంనకు వెళ్లి,అక్కడి రాజుకు ఒక సేవకుడుగా మారెను. ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిచాయి.
ఒక రోజు, రాజు భీమ యొక్క అనుచరుడు ఆచల్పుర లో దమయంతి దొరికిందని, ఆమెను తండ్రి వద్దకు తీసుకువచ్చెను. రాజు భీమ నలను కనుగొనటానికి ప్రయత్నించెను. కానీ ప్రయత్నం విఫలమైంది. అందువలన అతను ఒక ప్రణాళిక తయారుచేసెను.
దమయంతికి స్వయంవరం ఏర్పాటు చేస్తే, తన భార్యకు రెండోవ వివాహం జరుగుతుందని తెలిసి నల వస్తాడని భావించి స్వయంవరం ఏర్పాటు చేసెను. రాజు భీమ ఆలోచన నిజం అయింది. నల తన యజమాని సంసుమర రాజుతో వచ్చెను.
దమయంతి స్వయంవరంనకు ముందు రోజు నల్లగా ఉన్న సేవకున్ని చూసి, ఆమె అతన్ని వెంటనే గుర్తించెను. నల అసలు రూపం రావటానికి తన తండ్రి ఇచ్చిన ఆభరణం చాలు. దమయంతికి అక్కడ అతను ఉన్నట్లు తెలిసిన స్వయంవరం ఏర్పాటు జరిగింది. స్వయంవరం రోజున ఆమె నల యొక్క మెడలో హారం వేసి, ఇద్దరు కలిసారు.
పన్నెండు సంవత్సరాల కాలం కూడా పూర్తి అయింది. రాజు భీమ యొక్క సైన్యం సహాయంతో, నల తిరిగి తన రాజ్యంను గెలిచి మళ్ళీ అయోధ్యకు రాజు అయ్యెను.
ఒక రోజు నల మరియు దమయంతి దగ్గరకు ఒక సన్యాసి వచ్చి అతను పన్నెండు సంవత్సరాల పాటు ప్రవాసం చేయటానికి కారణంను వివరించెను.
మునుపటి జన్మలో నల మరియు దమయంతి రాజు, రాణిగా ఉన్నప్పుడు ఒక అమాయక సన్యాసిని జైలులో బందించెను. వారి కిందటి జన్మ పాప పరిహారంగా ఇప్పుడు శిక్షను అనుభవించారు.
చివరికి, నల మరియు దమయంతిలకు ఒక కుమారుడు పుష్కర జన్మించెను. అతన్ని రాజు చేసాక, వారు ఆధ్యాత్మిక శోధన కోసం ప్రపంచాన్ని పరిత్యజించారు.
స్వస్తి..!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
                           శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS