Thursday, July 12, 2018

శ్రీ లలితా సహస్ర నామ ఫలం


శ్రీ లలితా సహస్ర నామ ఫలం 
ప్రతి రోజు లలితా సహస్ర నామాన్ని చదవడం మహా ఫలం. అలా వీలుకాని వారు శుక్రువారం చదివితే మంచిదే.
" కదంబ వన వాసిన్యై నమః  "
అనగా లలితా దేవి కొంతకాలం కదంబ వనం లో నివసించింది. ఆవిడకు కదంబ వనం అంటే చాలా ఇష్టం. కావున కదంబ వృక్షం కింద కుర్చుని 11 రోజులు గాని 21 రోజులు కాని లలితా సహస్ర నామాన్ని పారాయణం చేస్తే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. మరియు అనుకున్న కార్యాలు తప్పక జరుగుతాయి.
కదంబ పుష్పం.
" ఓం ఐం హ్రీం శ్రీం పంచ వక్త్రాస్తి సంస్థితాయై నమః  "
ఆస్థి అనగా ఎముకలు. ఈ మంత్రాన్ని ఎముకలు విరిగిన వారు రోజు 108 సార్లు జపం చేసి నానపెట్టిన పెసలు అమ్మ కు నైవేద్యం పెడితే ఎముకలు చాలా త్వరగా సరవుతాయి. బందువులు అయిన ఈ మంత్ర జపం చేసి తీర్ధాన్ని ఇచ్చినా ఎముకలు సరి అవుతాయి.
పుణ్య ఘడియల్లో ,పుణ్య తిదులలో లలితా సహస్ర నామ పారాయణ ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువగా లభిస్తుంది. అలాగే కుటుంభ సభ్యుల జన్మ నక్షత్ర సమయాల్లో చదివితే కుటుంభ శాంతి.
పౌర్ణమి రోజు చంద్రుడిని చూస్తూ చదవడం వల్ల సాక్షాత్ లలితాదేవి ఎదురుగా చదివన పలితం కలుగుతుంది. పళ్ళెంలో..పాలు పోసి..చంద్రబింబం చూస్తూ..లలితా పారాయణం చేస్తే...చాలా మంచిది..అమ్మ అనుగ్రహం తొందరగా లభిస్తుంది.
పౌర్ణమి నాడు..లలితా పారాయణం వలన..అమ్మ దృష్టి మనపై..ప్రసరిస్తుంది.
లలితాదేవికి కలువలు, మారేడు దళాలు, తులసి దళాలు, మల్లెపూలు ఇష్టం . వాటితో పూజిస్తే అమ్మ త్వరగా ప్రసన్నమవుతుంది. అలాగే నైవేద్యముగా పాయసము, పులగము, చిత్రాన్నము (పులిహోర )దానిమ్మ, బూడిద గుమ్మడికాయ ప్రీతీ.
కావున పూజకు..లలితాదేవికి పైన చెప్పినవి నైవేద్యము పెట్టిన సకల శుభ ప్రదం. ఓం శ్రీ లలితాదేవ్యయై నమః.
                       ఓం శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS