Thursday, July 12, 2018

అమ్మవారికి ఏ తిథి రోజున..ఏ అబిషేకం..ఏ నైవేద్యం.. పెట్టాలి.

అమ్మవారికి ఏ తిథి రోజున..ఏ అబిషేకం..ఏ నైవేద్యం.. పెట్టాలి.
పాడ్యమి రోజు..
ఆవు నేయి తో అభిషేకం చేస్తే సకల రోగాలు నివారణ అవుతాయి.
విదియ రోజు..
చక్కర తో అభిషేకమ చేస్తే దీర్గాయువు కలుగుతుంది.
తదియ రోజు..
ఆవు పాలు తో అభిషేకం చేస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి.
చవితి రోజున..
పిండివంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లబిస్తాయి.
పంచమి రోజు..
అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన మేధస్సు, బుద్ది శక్తి పెరుగుతుంది.
షష్టి రోజున..
తేనే తో అమ్మవారిని అభిషేకించి, బ్రహ్మణునికి దానం ఇవటం వలన కాంతి పెరుగుతుంది, యషస్సు పెరుగుతుంది.
అష్టమి రోజున..
బెల్లం నీటి తో అభిషేకించి, మంచి బెల్లం ఎవరికయినా దానం ఇవటం వలన అష్ట కష్టాలు అంటారు కదా అలాంటివి అన్నీ తీరిపొతాయి అంటారు.
నవమి రోజున..
నైవేద్యం పెట్టడం వలన సకల సౌభాగ్యలు కలుగుతాయి.
దశమి రోజున..
నల్ల నువ్వులు తో చేసిన పదార్ధాలు నైవేద్యం పెట్టడం వలన సకల రోగలు పోతాయి అని , దీర్గాయుషు పెరుగుతుంది.
వారాలలో ఏ నైవేద్యం..!
ఆదివారం రోజు - పాలు
సోమవారం - పాయసం
మంగళవారం - అరటిపళ్ళు
బుధవారం - వెన్న
గురువారం - పటికబెల్లం
శుక్రవారం - తీపి పదార్ధాలు
శనివారం - ఆవు నేయి
అమ్మవారికి ఇష్టమయిన అన్నం.
పులగం - అన్నం + పెసరపప్పు
పాయసన్నం
పెరుగు అన్నం
బెల్లం అన్నం
నైవేద్యం పెట్టకుండా మనం తింటే అది దొంగతనం చేసి తిన్నట్టు, అందుకని దేవునికి నివేదన చేయకుండా తినకూడదు.
అమ్మవారిని పూజ ఎలా చేయాలి.!
ఆచమనం ముందు చేయాలి..
కాల స్మరణ చేయాలి (సంకల్పం )..
అబిషేకం చేయాలి..
మామిడి రసం(చూత పళ్ళు ) తో అబిషేకం చేయటం వలన సరస్వతి ఆఇంటి ని విడిచి వెళ్ళదు, అ ఇంట్లో వుండే వారికీ సరస్వతి కటాక్షం ఉంటుంది.
ఆవు నేయి తో అబిషేకం చేయటం వలన సకల రోగాలు పోతాయి,
పెరుగు తో అబిషేకం వలన సంపదలు కలుగుతాయి అమ్మవారికి చాలా ప్రీతిగా ఉంటారు, సకల రోగాలు పోతాయి,
తేనే తో అబిషేకం చేయటం వలన యశస్సు పెరుగుతుంది, మేదస్సు పెరుగుతుంది,
ఆవు పాల తో అబిషేకం చేయటం వలన సకల దోషాలు పోయి, సకల శుభాలు కలుగుతాయి.
గంధం తో అబిషేకం చేయటం వలన మనలో తామస గుణం పోతుంది,
పసుపు తో అబిషేకం చేయటం వలన సౌభగ్యమ్ పెరుగుతుంది.
అమ్మవారిని 108 పువ్వులు తో పూజ చేయడం విశేషం. కమలాలు, జాజిపువులు, లేత బిల్వాలు - సకల సంపదలు కలుగుతాయి,
దాడిమి పువ్వులు (దానిమ్మ చెట్టుకు పూసే పువ్వులు అంటే కాయకి ముందు వచ్చే పువ్వులు కాకుండా దానిమ్మ పువ్వు చెట్లు చిన్న చిన్న గులాబిలా వేరుగా ఉంటాయి) వాటితో,
మల్లెలు కూడా అమ్మవారికి ఇష్టం...స్వస్తి..!
సర్వే జనా సుఖినోభవంతు..!
                        శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS