Thursday, July 12, 2018

శ్రీ గురురాఘవేంద్రస్వామివారిచరిత్ర. మంత్రాలయ క్షేత్రం.


శ్రీ గురురాఘవేంద్రస్వామివారిచరిత్ర.
              మంత్రాలయ క్షేత్రం.

"పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయచ
  భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే "
               
ఒకప్పుడు ‘మంచాల’ గ్రామంగా ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ రాఘవేంద్రస్వామివారు బృందావన ప్రవేశం చేశారు. ఆ ప్రదేశమే మంత్రాలయం.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్న ఈ మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారి లీలా విశేషా
లతో పునీతమైంది.
శ్రీ రాఘవేంద్రస్వామి జన్మవృత్తాంతం.
ఓ పురాణగాథ ప్రకారం శంఖు కర్ణుడనే పరిచారకుడు తర్వాత జన్మలో ప్రహ్లాదుడిగా జన్మించాడు.తర్వాత జన్మలో వ్యాసరాయలుగా జన్మించి సన్యాశాస్రమాన్ని స్వీకరించి తన 93వ ఏట ‘హంపి’ క్షేత్రంలో సమాధి పొందాడు.
జననం చరిత్ర.
         శంఖుకర్ణుడు మూడవ జన్మగా కాంచీపురం సమీపంలో గల భువనగిరి గ్రామంలో నివసిస్తున్న బ్రాహ్మణ దంపతులైన తిమ్మనభట్టు, గోపమ్మ దంపతులకు
మూడవ సంతానంగా 1595లో మన్మధ నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమినాడు జన్మించాడు.
తల్లిదండ్రులు అతనికి వేంకటనాధుడని నామకరణం చేశారు. అతనే మన రాఘవేంద్రస్వామి. వెంకటనాధుడు చిన్నతనంలోనే శబ్దమంజరి వల్లించాడు. అష్టాదశ పురాణాలలోని విశేషార్చనలను అధ్యయనం చేశాడు.
అనంతరం ధర్మప్రబోధానికి నడుంకట్టి తంజావూరులో తన గురువు సుదీంద్ర తీర్థులవద్ద 1623లో వేంకటనాధుడు సన్యాసం స్వీకరించాడు. గురువు ఆయనకు ‘వ్రణమంత్రం’ బోధించాడు.
మూల రాములవారు స్వప్నంలో ఆదేశించిన విధంగా ‘శ్రీ రాఘవేంద్ర తీర్థ'అని గురువు ఆయనకు నామకరణం చేశారు.
బృందావన ప్రవేశము.
            సన్యాసం స్వీకరించిన శ్రీ రాఘవేంద్రస్వామి లోక కళ్యాణానికి కృషి చేసి1671విరోదినామసంవత్సర శ్రావణ బహుళ విదియ గురువారంనాడు ప్రహ్లాదుడు యజ్ఞం చేసిన తుంగభద్ర నదీ తీరంలో బృందావన ప్రవేశం చేశారు.
మంచాలమ్మ
                  ‘మంచాల’ గ్రామదేవతగా మంచాలమ్మ వుంటారు.
ఈ దేవత పేరునే మంత్రాలయం పేరు వచ్చింది. ఇక్కడ మంచాలమ్మ గుడిలో మంచాలమ్మను దర్శనము చేసుకొన్న తరువాతనే తనను దర్శించాలని గురురాఘవేంద్రులు చెప్పారు.
ఆలయదర్శనము.
              గురువుకు సిసలైన నిర్వచనంగా నిలిచిన శ్రీగురురాఘవేంద్రస్వామి ఆలయం సదా భక్తజన సందోహంతో దివ్యమైన లోకాన్ని తలపిస్తుంది. శ్రీరాఘవేంద్రస్వామి వారి బృందావనమే ఇక్కడ
భక్తులకు దర్శనమిస్తుంది. ప్రాపంచిక విషయాలను
సైతం పటాపంచలు చేసే ఈ బృందావన దర్శనం వల్ల సర్వదా శుభం జరుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
శ్రీ రాఘవేంద్రస్వామికి ఎదురుగా ఓ ఆలయంలో ఆంజనేయస్వామివారు కొలువయ్యారు. శ్రీరామభక్తు
డైన ఆ స్వామి ఇక్కడ కొలువై ఉండడంవల్ల శ్రీరాఘవేంద్రస్వామివారి బృందావన క్షేత్రం మరింత మహిమాన్వితమైంది.
శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంగా, విరాజిల్లుతున్న మఠానికి ముందు కుడివైపు భాగంలో మంచాలమ్మవారు ఆశీనులయ్యారు. లోపల ఆలయంలో పూర్వ మఠాధిపతుల సమాధులు (బృందావనాలు) కనిపిస్తాయి. మరోపక్క నాగేంద్రస్వామి, ముడుపుల చెట్టు దర్శనమిచ్చి పునీతుల్ని చేస్తుంది.
రాషువేంద్రుని మహిమలు.
            ఆయన తన జీవితమంతా అవిశ్రాంతంగా శ్రీ హరి మహాత్మ్యాన్ని ప్రవచించి, విస్తృతి చేశాడు. శ్రీ హరి కృప వల్ల ఆయన నయం కాని రోగాలను నయం చేయడం, మరణించిన వారిని బ్రతికించడం, నిరక్షరాస్యుడైన వెంకన్నను పండితునిగా చేయడం వంటి ఎన్నో మహిమలను ప్రదర్ళించారు. అలాంటి వాటిలో బాగా చెప్పుకోదగింది ఆదోని రాజు సిద్ది మసూద్ ఖాన్ గర్వాన్ని అణచడం.
              
శ్రీగురురాఘవేంద్రస్వామి 1671లో  తుంగబద్ర తీరంలో మంత్రాలయములో బృదావన ప్రవేశము చేసాక 800ల సంవత్సరాలు బృందావనం యందు వుండి  భక్తుల కోరికలు నెరవేరుస్తానని మాట ఇచ్చినారు. అందుకు నిదర్శనముగా స్వామి బృందావనము నుండి నేటికి ఓంకారం వినిపిస్తుంటుందని ఇచ్చటి ఆచార్యులు చెప్తారు.
  శ్రీ గురురాఘవేంద్ర సార్వభౌమనే నమః..స్వస్తి..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
                         శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS