Saturday, July 14, 2018

ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు.ఆషాఢ శధ్ధ పాడ్యమి నుండీ వారాహీ నవరాత్రలు ప్రారంభం!

ఆషాఢంలో - అమ్మ వారాహీ..
ఈ నవరోజుల్లో..అమ్మ వారాహి స్తోత్రం..పఠించండి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు. అమ్మవారి వైభవం గురించి కొంత
లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వరాహీ దేవి. లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది, దానిపేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ, మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు.
కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||
భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |
అంటూ లలితా సహస్రనామాల్లో హయగ్రీవ, అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు. విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది.
ఈ అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో ధ్యానిస్తారు.
వారాహీ అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు, శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి, వాడిని సంహరించి, భూమాదేవిని రక్షిస్తాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని, అందువలన ఈమె #వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ #మహాలక్ష్మీ. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది, లేదా పరిష్కరిస్తుంది.
అమ్మవారిని చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు. నిజానికి రైతు గోఆధారితం వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత.
#వారాహీ అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు. కానీ వారాహీ చాలా శాంతస్వరూపిణి. వెంటనే అనుగ్రహిస్తుంది, కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రు నాశనం జరుగుతుంది, అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, అజ్ఞానం నశిస్తాయి. అంతఃశ్శత్రువులను జయించినవాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు, అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత.
ఆషాఢ శధ్ధ పాడ్యమి నుండీ వారాహీ నవరాత్రలు ప్రారంభం!

నవరాత్రులూ అనగానే మనకి ముందుగా ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు తలంపుకు వస్తాయి!
అలాగే చైత్ర మాసం లో వచ్చే వసంత నవరాత్రులు కూడ మనకి పరిచయమే!
ఈ రెండూ కాక మరో రెండు నవరాత్రులు వున్నాయి.వాటి గురించి చిన్న వివరణ.
1 చైత్రమాసమున వసంత నవరాత్రములు
2 ఆషాఢమున వారాహీ నవరాత్రులు
3 ఆశ్వీజమున శరన్నవరాత్రులు దుర్గాదేవి
4.మాఘమాసమున శ్యామలదేవి నవరాత్రులు.
అంటే నాలుగు ఋతువులలో --
వసంత, గ్రీష్మ ; శరత్; శిశిర ఋతువులలో నివి.వస్తాయి.
చైత్ర మాసమున అర్చింపబడుదేవి అనగా లలిత, శ్రీ రాజరాజేశ్వరీ దేవతలు.
ఆశ్వీజమాసమున అర్చింపబడు దుర్గా దేవి అర్చనలు మనకు సుపరిచితములు.
కానీ ఆషాఢ ,మాఘ మాసములందు అర్చింపబడు వారాహీ , శ్యామలా దేవతలు మనకు లలిత; దుర్గా దేవతలవలే అంతగా తెలిసిన వారు కాదు.పరిచయం తక్కువ!
జగన్మాతయైన పరాశక్తి హృదయమునుండి..మాతృకా రూపిణి అయిన బాలా త్రిపుర సుందరీ దేవి,
ఆదిపరాశక్తి బుధ్ధి నుండీ..చిలుకనూ, వీణను ధరించిన శ్యామలాదేవి
అమ్మ అహంకారమునుండీ..మహావారాహీ జన్మించిరి.
వీరును దేవీరూపాంతరములేకానీ వేరుగా మరొకరు కాదు.
శ్యామలా దేవి మహామంత్రిణి! శక్తి సామ్రాజ్యమునకు !!
దేవీ సేనకు ప్రధాన అధికారిణి వారాహీ!!
"విశుక్రప్రాణ హరణ వారాహీ వీర్యనందితా!"
(లలితా సహస్రలో చదుతాం )విశుక్రుడనే రాక్షసుడిని సంహరించినది.
అమ్మవారి సేనకు ప్రధాన సైన్యాధ్యుక్షురాలు ఈమె.వారాహీ దేవి.సప్తమాతృకలలో ఒకరు.అలాగే దశమహా విద్యలలో కూడ ఈమె కొలుస్తారు. ఈమె వరాహస్వామి అర్ధాంగి.లక్ష్మీ స్వరూపంగాకూడ కొలుస్తారు.
వారాహీ పూజనూ సూర్యోదయానికి ముందు..
సూర్యాస్తమయానికి తరువాత చేయాలి.
దేవి పూజ రాత్రి సమయం ప్రశస్తమైనది.
ఇదీ సాంప్రదాయికంగా శ్రీవిద్యాదీక్షాపరులు మాత్రమే చేయతగినది!
అమ్మవారు సాంప్రదాయిని! సంప్రదాయేశ్వరీ!సదాచారప్రవర్తిక!!అందువలన..
నిర్మల మైన మనస్సుతో.స్వచ్ఛంగా నమస్కరించి వేడుకున్నా ఆ తల్లి అనుగ్రహిస్తుంది!.స్వస్తి..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
                        శ్రీ మాత్రే నమఃఆషాఢ మాసం శుభారంభం శుభాకాంక్షలతో శుభోదయం.
నేటి నుంచి వారాహిదేవి నవరాత్రోత్సవాలు ప్రారంభం.
మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి.
వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి...అందుకే ఆవిడను దండనాథ అన్నారు...
అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి),ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది...ఇది మహావారాహి(బృహద్వారాహి) యొక్క స్వరూపం...ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.
వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి...ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది...వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే...రోకలి ధాన్యం నించి పొట్టు వేరు చేయడానికి వాడుతారు...అలగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది...నాగలిి భూమిని విత్తనం వేసేముందు తయారు చేయడానికి వాడతాం...అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామకర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది....
పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి...శ్రీ విద్యా గద్యంలో "అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే" అని లలితను కీర్తిస్తారు...దేవీ కవచంలో "ఆయూ రక్షతు వారాహి" అన్నట్టు...ఈ తల్లి ప్రాణ సంరక్షిణి....ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం
ప్రకృతి పరంగా చూసినట్లైతే...ఈ సమయంలో వర్షం కురుస్తుంది...రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు...దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది...
అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి...బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి...ముఖ్య ప్రాణ రక్షిణి...హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామాలు...
-పంచమి
-దండనాథా
-సంకేతా
-సమయేశ్వరి
-సమయ
సంకేతా
-వారాహి
-పోత్రిణి
-వార్తాళి
-శివా
-ఆజ్ఞా చక్రేశ్వరి
-అరిఘ్ని
దేశం సుభిక్షంగా ఉండాలని...మనమంతా చల్లగా ఉండాలని...ధర్మం వైపు మనం నడవాలని...అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం
ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా
ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ.....
నమామిత్యామహందేవి మహాభయ వినాశినీమ్‌
మహాదుర్గ ప్రశమనీం మహాకారుణ్య రూపిణీమ్‌
ఈ శక్తియే ఇంద్రాక్షి, ఈశ్వరి, కౌమారి, పార్వతి, వారాహి, కాళరాత్రి, నారసింహి, బ్రాహ్మి, వైష్ణవి, చాముండి, మహిషాసుర హంత్రి, గాయత్రి, సరస్వతి, భవాని, దుర్గ, భువనేశ్వరి, లలిత, అంబిక, దుర్గ, భైరవి, మహాలక్ష్మి.. సర్వ శక్తి స్వరూపిణి. వేల సంవత్సరాల చరిత్ర కలిగి, కాలచక్ర ఫలితమైన సృష్టి స్థితి హేతు కార్యాల కారణంగా రూపు కలిగిన ఈ ఆషాఢ ఉత్సవాలు జగత్కల్యాణ కారణాలు.                         వారాహి  నవరాత్రులు       
         వారాహి దేవి    ..  ఈమె  సప్త మాతృకలలో  ఒకామె 
అమ్మవారి  శక్తి  స్వరూపాలలో  ఒకటిగా   కొలుచుకుంటాము   ..  వరాహస్వామి  అర్ధాంగి   ..  శ్రీమహాలక్ష్మి  స్వరూపం   ..  నేపాలీయులు   ఈమెనే  బారాహి  అనే  నామధేయం తో   కొలుచుకుంటారు   ..  బౌద్ధ మతం వారు   వజ్ర వారాహి ..   మరీచిగా     ఈమెనే  పూజిస్తారు   ..
         బ్రాహ్మీ     ..  మహేశ్వరీ   ..   కౌమారీ   ..  వైష్ణవి   ..  వారాహి  ..  ఇంద్రాణి  ..   చాముండీ    ..  సప్త మాతృకలు 
        మార్కండేయ పురాణంలో  దేవీమహత్యం  లో   ..  శుంభ  నిశుంభ   వధ  కధ  ప్రకారం  ..  దేవుళ్ళ  శరీరాల  నుంచి   వారి  స్త్రీ  రూప   శక్తులు   బయటకు  వస్తాయి  ..
       శివుని  నుంచి     శివానీ   ..   విష్ణువు నుంచి   వైష్ణవి
బ్రహ్మ నుంచి   బ్రాహ్మణీ  ..  వరాహస్వామి  నుంచి  వారాహీ   ఉధ్భవించారు    ..   ఈమె   ఉత్తర దిక్కుకు  అధిదేవత   ..  ఈమె   చేతిలో   నాగలి   రోకలి  ఉంటుంది   ..  నాగలి  భూమిని  దున్ని  సేధ్యానికి   సంకేతం   ..   రోకలి   పండిన  ధాన్యాన్ని  దంచి  మనకు  ఆహారంగా   మారడానికి   సంకేతం   ..  ఇది   బాహ్యార్ధం  .. అంతరార్థం   ఏమిటంటే    ..
         *   అహంకార  స్వరూప  దండనాధ  సంసేవితే   *
            *   బుద్ధి   స్వరూప  మంత్రిణ్యు   పసేవితే    *
       ప్రతీ  మనిషిలోనూ    వారాహీ శక్తి    నాభి ప్రాంతంలో  ఉంటుంది   .. మణిపూర   ..   స్వాధిష్టాన   ..  మూలాధార
చక్రాలను   ప్రభావితం  చేస్తుంది   ..  కుండలినీ శక్తిని  జాగృతం   చేస్తుంది  ..  మనలో  అస్తవ్యస్తంగా  ఉన్న    పృధ్వీ  అనే   బుధ్ధినీ    ..  రక్తబీజుడులాంటి   పిచ్చి  మొక్కలతో    అక్కరలేని   మనలో  వరసగా   ఉధ్భవించే  ఆలోచనలను  ..    లలితామాత   సైన్యాధ్యక్షురాలైన   దండనాయకి    శక్తి  అనే    నాగలితో     దున్నుతూ ఉంటే      ..  తన  సైన్యం  అయినటువంటి  ..  రధ   గజ  తురగ   పదాతి    దళాల  సహాయంతో    మనలో  ఉన్న   మానసిక  వికారాలను   అన్నింటినీ    నాశనం  చేసి  ..  జ్ఞానమనే   సేద్యానికి   అంకురార్పణ   చేసి    ..   ధాన్యం  అనే   కుండలినీ  శక్తిని   పెంపొందించి   ..    రోకలితో   ధాన్యం  నుండి    బియ్యాన్ని  వేరు చేసి   మన  ఆకలికి  అన్నమైనట్లుగా    ..   అలాగే   మన  జన్మాంతరాలలో    చేసిన  కర్మ ఫలాలను   (  ధాన్యపు పొట్టు నుంచి బియ్యాన్ని  వేరు చేసి నట్టు )  ..   వేరు చేసి   మోక్ష జ్ఞానాన్ని   క్షుధ్భాధ  తీర్చే   బియ్యంలా  మనకు   అంద చేస్తుంది   .. 
           వారాహి    ..  అనగా  భూదేవి   శ్రీమహాలక్ష్మి  ..
        వారాహీదేవి   కైవల్యరూపిణి   ..  వైవస్వతి   అని  కూడా అంటారు  ..   అసలు  ఇప్పుడు  మనకు  జరిగే  కల్పం   పేరే   ..  శ్వేత వరాహ కల్పం    ఆయన  దేవేరే  ఈఈ   వారాహీ    ..
                               ఇఛ్ఛా శక్తి  లలిత
                               జ్ఞానశక్తి  శ్యామల 
                               క్రియా శక్తి  వారాహి
          కేవలం   రాత్రి  వేళల్లో  మాత్రమే  పూజలందుకునే  ఏకైక    వారాహీ  స్వరూపం లో  ఉన్న    లక్ష్మిదేవి   .. 
       *  ఆయు   రక్షతు  వారాహి    *    ప్రాణ సంరక్షిణి
           వసంత నవరాత్రులు    గణపతి నవరాత్రులు    శరన్నవరాత్రులే   కాక     వారాహీ నవరాత్రులు   కూడా   మన   సనాతన ధర్మంలో   శాక్తేయులూ   శైవులూ  వైష్ణవులూ     కూడా   ఆషాఢ   పాడ్యమి నుంచి   ఈ  వారాహీ నవరాత్రులలో   వారాహీ దేవిని   కొలుస్తుంటారు   ..
            భక్తుల   కష్ట  నష్టాలతో   పోరాడే  యోధురాలు   .. 
         ఈమెను   ఆరాధిస్తే   శతృ భయం  ఉండదు  ..  జ్ఞానప్రదాయని   ..   ధాన్యలక్ష్మీ   స్వరూపమైన   వారాహీని   ఆరాధన   చేసి    దేశం  సుభిక్షంగా  ఉండాలనీ    మనం  అంతా   చల్లగా  ఉండాలనీ   అమ్మ   వారాహీని   పాదాలు  పట్టి   ప్రార్ధన  చేద్దాం   ..   
        వారణాసీ  క్షేత్ర పాలిక   ..   ఈ  వారాహీ   ..  రాత్రి  11   గంటల నుంచి  దర్శనం  ప్రారంభం    అవుతుంది   ..   మాకు     తెల్లవారుజామున   3  గంటలకు    అమ్మ  వారాహీ   దర్శన భాగ్యం   లభించింది   ..   తెల్లవారుజామున   4  గంటలకు   వారాహీ  దేవాలయం  మూసి వేస్తారు   ..
         కేవలం   రాత్రి  వేళల్లో  మాత్రమే   వారాహీ  దర్శనం  రాత్రి  11  గంటల నుంచి  తెల్లవారుజామున 4  వరకు 
                                                           భార్గవి  ..  *ఓం నమః శివాయ*:
*ఆషాఢమాసం - శ్రీ వారాహి నవరాత్రి*

ఓం శ్రీమాత్రే నమః 
అద్వైత చైతన్య జాగృతి

మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి...అందుకే ఆవిడను దండనాథ అన్నారు...
అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి),ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది...ఇది మహావారాహి(బృహద్వారాహి) యొక్క స్వరూపం...ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.
వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి...ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది...వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే...రోకలి ధాన్యం నించి పొట్టు వేరు చేయడానికి వాడుతారు...అలగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది...నాగలిి భూమిని విత్తనం వేసేముందు తయారు చేయడానికి వాడతాం( Land preparation before sowing )...అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామకర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది....
పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి...శ్రీ విద్యా గద్యంలో "అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే" అని లలితను కీర్తిస్తారు...దేవీ కవచంలో "ఆయూ రక్షతు వారాహి" అన్నట్టు...ఈ తల్లి ప్రాణ సంరక్షిణి....ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం
ప్రకృతి పరంగా చూసినట్లైతే...ఈ సమయంలో వర్షం కురుస్తుంది...రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు...దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది...
అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి...బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి...ముఖ్య ప్రాణ రక్షిణి...హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామాలు...
-పంచమి
-దండనాథా
-సంకేతా
-సమయేశ్వరి
-సమయ సంకేతా
-వారాహి
-పోత్రిణి
-వార్తాళి
-శివా
-ఆజ్ఞా చక్రేశ్వరి
-అరిఘ్ని
దేశం సుభిక్షంగా ఉండాలని...మనమంతా చల్లగా ఉండాలని...ధర్మం వైపు మనం నడవాలని...అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం
ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా
ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ...

వారాహి దేవి
ఈ అమ్మవారు శాక్తేయం లో కనిపిస్తారు. శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము. వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సైన్యాధిపతి,దండనాధ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం,చక్రం,నాగలి,గునపం,అభయ వరదాలతో దర్శనమిస్తుంది. బ్రాహ్మి,మాహేశ్వరి, కౌమారి,వైష్ణవి, వారాహి.,ఇంద్రాణీ,చాముండి, వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు.
శాక్తేయులు వారాహీ దేవి పార్వతీ దేవి మాతృక అని నమ్ముతారు . ఈ మాతృకలు దానవులపై యుధ్దానికి వెళ్లే టప్పుడు అవసరానుగుణంగా దేవతలయొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమతమ ఆయుధాలను యిచ్చినవి . శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడ్డ అన్ని మాతృకలను తనలో ఐక్యం చేసుకొని శంభుని సంహరించెనని శక్తి పురాణం లో ఉంది.
దేవీ భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించేటపుడు వారాహీ మాతృకను సృష్టించెనట . దేవీ పురాణం లో వారాహి దేవిని వరహాజనని , క్రితంత తనుసంభవ ( మృత్యుసమయములో వచ్చేశక్తి అంటే యమశక్తి) గా కూడా వర్ణించేరు . వారాహి దేవి వాహనం యెనుము , పాశం ధరించి వుండడం కూడా పై వాదనను బలపరుస్తుంది . ఈమెను కైవల్యరూపిణి , వైవస్వతి అని కూడా అంటారు . ఈమెను వాగ్ధేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు .
వారాహి దేవి వరాహ ముఖం అనగా పంది ముఖం కలిగి , చక్రం , కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది .లలితాసహశ్రనామాలలో ఈ వారాహి దేవి నామం వుండడం కనిపిస్తుంది .వారాహి దేవి మందిరాలలో ముఖ్యంగా , తాంత్రిక పూజ జరగపడం సర్వసాధారణం . ప్రతీ మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో వుండి మణిపూర , స్వాధిష్ఠాన , మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .
వారాహి దీవి కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తీ అవుతాయి.

శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం (వారాహి దేవి)..!!
(వింధ్యాచలము పైన సాక్షాత్తు ఆ కాశి విశ్వనాథ స్వామి శ్రీ వారాహి అమ్మవారిని ప్రతిష్టించారు ఆ అమ్మవారిని ఇక్కడి వారు విన్ధ్యేశ్వరిగా కొలుస్తారు ఈ అమ్మవారికి వింధ్యాచల్ లో వామాచారం లో కొలుస్తారు ఈ మందిరం లో కాళీ అమ్మవారు కూడా ప్రతిష్టింపబడింది)
నిశుంభ-శుంభ మర్దిని ప్రచండ ముండ ఖండినీం
వనే రణే ప్రకాశినీం భజామి వింధ్య వాసినీం  1 ..
త్రిశూల ముండ ధారిణీం ధరా విఘాత హారిణీం
గృహే గృహే నివాసినీం భజామి వింధ్య వాసినీం  2 ..
దరిద్ర దుఃఖ హరిణీం సదా విభూతి కారిణీమ్
వియోగ శోక హరిణీం భజామి వింధ్య వాసినీం 3..
లసత్సులోల లోచనం లతాసదే వరప్రదం
కపాల శూల ధారిణీం భజామి వింధ్య వాసినీం  4..
కరేముదా గదాధరీం శివమ్ శివ ప్రదాయినీమ్
వరం వరాననం శుభం భజామి వింధ్
య వాసినీం  5..
ఋషీంద్రయామినీ ప్రదం త్రిదా స్వరూపధారిణీం
జలే స్థలే నివాసినీం భజామి వింధ్య వాసినీం  6..
విశిష్ట సృష్టి కారిణీమ్ విశాల రూప ధారిణీం
మహోదరే విలాసినీమ్ భజామి వింధ్య వాసినీం  7..
పురంధరాది సేవితం మురాది వంశ ఖండినీమ్
విశుద్ధ బుద్ది కారిణీమ్ భజామి వింధ్య వాసినీం  8..


No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS