Wednesday, February 19, 2020

ఆంధ్ర- తెలంగాణ- భారతదేశంలోని ప్రముఖమైన గణపతి క్షేత్రాలు:


ఆంధ్ర- తెలంగాణ- భారతదేశంలోని ప్రముఖమైన గణపతి క్షేత్రాలు:ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A2uoghedfF4p5KOXYUffhvD

1). కాణిపాకం 2). అయినవిల్లి 3). బిక్కవోలు 4). శ్రీశైలం 5). చోడవరం 6). సికింద్రాబాద్ 7). విశాఖపట్టణం 8). కాజీపేట 9). రాయదుర్గం. 1). రేజింతల్ 2). రుద్రారం 3). కొలనుపాక 4). అవంచ 5). వినుకొండ 6). సిద్ధాంతం 7). శ్రీకాళహస్తి 8). నెల్లూరు 9). యానాం భారతదేశంలో గణపతి క్షేత్రాలు:1). మధుర (కేరళ) 2) కొంకళపూలే (మహారాష్ట్ర) 3). మోర్ గావ్ (మహారాష్ట్ర). 4). రణదంబూర్ కోట (రాజస్థాన్) 5). చండీకోల్ (ఒడిస్సా) 6). ఉజ్జయిని (మధ్యప్రదేశ్) 8). బొంబాయి (మహారాష్ట్ర) 9. తిరుచ్చి (తమిళనాడు)..1. ఆంధ్ర ప్రదేశ్ (చిత్తూరు జిల్లా- కాణిపాకం) (స్వయంభూ క్షేత్రం--సత్యప్రమాణం) 2. ఆంధ్ర ప్రదేశ్( తూర్పు గోదావరి జిల్లా ,అయినవల్లి) (విఘ్నేశ్వర స్వామి --108 కొబ్బరికాయలు మొక్కు తీర్చుకోవడం) 3. ఆంధ్ర ప్రదేశ్ (తూర్పు గోదావరి జిల్లా-- బిక్కవోలు) (గణపతి చెవిలో కోరిక చెప్తే ఆ కోరిక నెరవేరటం 4. శ్రీశైలం ( సాక్షి గణపతి-- వ్రాతపతి గణపతి) ( శ్రీశైలం వచ్చినట్లుగా సాక్ష్యం చెప్పేవారు) 5. ఆంధ్ర ప్రదేశ్ (విశాఖపట్టణానికి –44 కి:మీ దూరం-- చోడవరం)( స్వయంభూ క్షేత్రం-- మత్స్య గణపతి) 6. తెలంగాణ.( సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన)( శ్రీ గణపతి దేవాలయం-- వందల ఏళ్ళ చరిత్ర గలది) 7 . ఆంధ్ర ప్రదేశ్ (విశాఖపట్టణం-- సంపత్ వినాయకుడు) (కోరిక అనుకొని నమస్కారం చేస్తే కోరిక తీరడం) 8. తెలంగాణ . (వరంగల్ జిల్లా- కాజీపేట)( శ్వేతార్క మూల గణపతి-- తెల్ల జిల్లేడు మొదలులోంచి సహజంగా నిర్మాణం) 9. ఆంధ్ర ప్రదేశ్ (అనంతపురం జిల్లా-- రాయదుర్గం) (దశభుజ గణపతి) ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ గణపతి ఆలయాల గురించి తెలియజేశారు. దీని ద్వారా మేము ఏ ఆలయాలు దర్శించాలి, ఏ ఆలయాలు దర్శించుకున్నాము అనే విషయం అర్థమైంది..తెలుగు రాష్ట్రాల్లో 9 గణపతి దేవాలయాలు: 1) రేజింతల్:( సిద్ధి వినాయకుడు):- మెదక్ జిల్లా జహీరాబాద్ కు 12 కిలోమీటర్ల దూరంలో, రేజింతల్ గ్రామంలో ఉన్న సిద్ధి వినాయక ఆలయం, 213 సంవత్సరాల క్రితం కనుగొన్న ఆలయం. 5 అంతస్తులతో ఉన్న ఆలయం. రేజింతల్ కు మలకల్ గుట్ట అని పేరు ఉన్నది. స్వయంభు వినాయక విగ్రహం. కోరిన కోరికలు తీర్చటం వలన సిద్ధి వినాయకుడిగా పేరుపొందింది. మొదట్లో ఈ శిలా విగ్రహం ఒకటిన్నర అడుగుల ఉండేదని, అది క్రమేణా పెరుగుతూ ఇప్పుడు మరింత పెద్దది అవుతుంది. 2) రుద్రారం:( విద్యా గణపతి):- సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరువు దగ్గరలో, రుద్రారంలో సంకష్టహర సిద్ధి విద్యా గణపతి ఆలయం ఉంది. వందల ఏళ్ల నాటి ఆలయం శివరాం భట్ అనే ఆధ్యాత్మిక గురువు చేత నిర్మించబడినది. వీరు రుద్రారం నుండి రేజింతల్ వరకు 5 వినాయక ఆలయాలు నిర్మించారు. అవి చింతల గిరి, చీమకుర్తి, మలకల్ పాడు, మలకల్ గుట్ట, రేజింతల్, రుద్రారం. ఈ వినాయకుని ఆలయాలలో శ్రీచక్ర బీజాక్షరాలు ఉండుటచేత, సామాన్యులు తట్టుకోవడానికి సింధూర లేపనం ప్రతిరోజు అద్దం పడుతుంది. హైదరాబాద్ నుండి 54 కిలోమీటర్ల దూరంలో గణేష్ గడ్డ ఉన్నది. 3) కొలనుపాక:( గణపతి ):- వీరశైవ మతానికి సంబంధించిన చారిత్రక ప్రదేశం, గణపతి విగ్రహం, చాళుక్య శిల్ప కళా చాతుర్యంతో ఉంటుంది. గణపతి చతుర్భుజాలతో ఉంటాడు. 11వ శతాబ్దంలో చెక్కబడిన విగ్రహం, ఎడమ చేతిలో మోదకం, కుడి చేతి మోకాలుపై ఆధారముగా ఉన్నది. సర్ప ఉదర బంధం ఉన్నది. ఇక్కడ గణపతికి భక్తులు ముడుపులు కట్టి చెల్లించుకుంటారు. యాదగిరిగుట్ట కు 22 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాదుకు 78 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 4) అవంచ:( గణేశుడు ):-మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని అవంచ గ్రామంలో, అసంపూర్ణ భారీ గణేశ శిలా నిర్మాణం ఉంది. 30 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు గల కొండకు, వినాయక రూపం కల్పించాలని ఆశించారు. తైలపుడు అనే పశ్చిమ చాళుక్యుల రాజు, భారీ వినాయక విగ్రహం తుది మెరుగులు దిద్ద లేకపోయారు. కొన్ని కారణాల వలన తర్వాత రాజులు కూడా పట్టించుకోక పోవడం వలన, అసంపూర్ణ గణపతి విగ్రహం రూపం కనిపిస్తుంది. హైదరాబాదు నుండి 86 కిలోమీటర్లు, మహబూబ్ నగర్ నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 5) వినుకొండ:( వరసిద్ధి వినాయకుడు ):- గుంటూరు జిల్లాలో వినుకొండలో, శ్రీరామునిచే ప్రతిష్టించినట్లుగా చెప్పబడుతున్న, వరసిద్ధి వినాయకుని విగ్రహం ఏకశిలా విగ్రహం. దక్షిణముఖంగా ఉన్నది. ప్రతిరోజూ ఒక నాగుపాము ప్రదక్షిణ చేసి వెళ్ళుట విశేషం. వినాయక చవితి ఉత్సవాలకు లక్షల మంది భక్తులు వస్తారు. గుంటూరు నుండి వినుకొండ 88 కిలోమీటర్ల దూరంలో వుంది. 6) సిద్ధాంతం:( సిద్ధి వినాయకుడు ):- పశ్చిమగోదావరి జిల్లాలో, పెనుగొండ మండలంలో సిద్ధాంతంలో, సిద్ధి వినాయకుడి ఆలయంలో సిద్ధి వినాయకుడి విగ్రహం, ఐదు అడుగుల ఎత్తు ,నాలుగు అడుగుల వెడల్పు ఉన్నది. కొన్ని సంవత్సరాల క్రితం దుక్కి దున్నుతూ ఉండగా లభ్యమైన విగ్రహాన్ని, ప్రతిష్టించి ఆలయం నిర్మించారు. ఏలూరు నుండి సిద్ధాంతం 91 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 7) శ్రీకాళహస్తి:( పాతాళ వినాయకుడు ):- శ్రీకాళహస్తి ఆలయంలో, ఉత్తర గోపురం ముందుకు వెళితే, ఎడమవైపున పాతాళ వినాయకుడి ఆలయం ఉంది. భూ మట్టానికి 35 అడుగుల దిగువన ఉండే ఆలయంలో, స్వామిని దర్శించాలి అంటే ఒక్క మనిషి మాత్రమే పట్టే ఇరుకు దారిలో, కొన్ని అడుగులు పాకుతూ వెళ్లి ,25 మెట్లు క్రిందకి దిగాలి. తిరుపతి నుండి శ్రీకాళహస్తి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. 8) నెల్లూరు:( అతి పెద్ద గణపతి ):-ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు నందు, మూలపేట నందు మూలస్థానేశ్వర ఆలయమునకు దక్షిణంగా ఉన్న ఆలయంలో, ఒక పెద్ద గణపతి అతిపెద్ద విగ్రహంతో ఉంటుంది. ఒంగోలు నుండి నెల్లూరు 132 కిలోమీటర్ల దూరంలో ఉంది. 9) యానాం:( సిద్ది గణపతి ):-సిద్ధి గణపతి పిళ్ళైయార్ స్వామిగా కోరిన కోర్కెలు తీరుస్తూ అనుగ్రహిస్తాడు. 13- 7- 1954వ సంవత్సరంలో, తమిళుడైన రెడ్డియార్ పట్టి స్వామి అనే వైద్యుడు, రావిచెట్టు వద్ద వైద్యం చేసేవారు. ఒకరోజు స్వామివారు కలలో కనిపించి, రావిచెట్టు వద్ద పుట్టలో ఉన్నట్టుగా చెప్పారు. పుట్టలో ఉన్న గణపతిని తీసి రావిచెట్టు క్రింద గట్టుపై ఉంచి పూజాదికాలు నిర్వహించారు. పిళ్ళైయార్ గా నామకరణం చేశారు. 108 కొబ్బరికాయలు, 108 ప్రదక్షిణాలు చేయాలి. యానాం కాకినాడ నుండి, 32 కిలోమీటర్ల దూరంలో ఉంది.భారతదేశంలో 9 వినాయక ప్రముఖ క్షేత్రములు1. కేరళ (కాసర్ గౌడ్ 7కి:మీ దూరం మధుర) (మధుర మహాగణపతి ఆలయం-- బొడ్డ గణేశుడు- పెద్ద గణపతి) 2. మహారాష్ట్ర( రత్నగిరికి -25 కి:మీ-- కొంకళ పూలే-- పడమర ముఖ దర్శనం-- లంబోదరుడు) 3. మహారాష్ట్ర.( పూలే జిల్లా మోర్ గావ్)( మయూరే శ్వరుడు) 4. రాజస్థాన్ (రణ ధంబూర్ కోటలో )(ప్రథమ గణేష ఆలయం-- త్రినేత్ర గణపతి) 5. ఒడిస్సా (జాజి పూర్ జిల్లా చండీ కోల్-- మహా వినాయక ఆలయం ) 6. మధ్యప్రదేశ్( ఉజ్జయని--- చింతామణి గణపతి) 7. తమిళనాడు ( శివగంగై జిల్లా పిళ్యార్ పట్టి-- కర్పగ వినాయక ఆలయం) 8. మహారాష్ట్ర (బొంబాయి --సిద్ధి వినాయక ఆలయం ) 9. తమిళనాడు (తిరుచ్చి-- ఉచ్చి పిళియార్ గణపతి) భారతదేశంలో ప్రముఖంగా ఉన్న 9 గణపతి క్షేత్రాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ఈ గణపతి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి, వాటి ప్రత్యేకత గురించి చాలా మంచి విశేషాలు చెప్పారు..

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS