Monday, March 23, 2020

శ్రీ పైడితల్లి అమ్మ వారి ఆలయం విజయనగరం

విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మ వారి ఆలయం 




     విజయనగరం సంస్ధానాధీశుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మ వారి ఆలయం యం.జి.రోడ్, మూడు లాంతర్ల సెంటర్ కు సమీపంలో ఉంది.  గుడి నిత్యం భక్తులుతో సందడిగా ఉంటుంది.  మంగళవారం నాడు మరికొంత విశేషముగా ఉండును.  విజయదశమి వెళ్ళిన మొదటి మంగళవారం నాడు  " సిరిమాను " ఉత్సవం చాల ఘనంగా జరుగుతుంది.  సిరిమాను ఉత్సవాలు వీక్షించుటకు ఉత్తరాంధ్ర ప్రాంతము నుంచి సందర్శకులు తరలి వస్తారు.  అమ్మ  వారి ఆదేశం ప్రకారం ఒక వృక్షం ను సిరిమానుగా వడ్రంగి చేత తయారు చేయుంచుదురు.  ఆలయ పూజారి (అమ్మ వారు) సిరిమాను పై భాగంలో ఆశీనుడుగా ఊరేగుతాడు.  అమ్మ వారి గుడి నుంచి రాజకోట వరకు మూడు పర్యాయములు తిరుగుతుంది. 
     సిరిమాన ఉత్సవం ముగిసిన పిమ్మట (15 రోజులు తరువాత) ఊయల - కంభాల ఉత్సవాలు జరుగుతాయి.  అమ్మవారిని మేళతాళాలుతో ఊరేగిస్తు " వనం గుడి" తీసుకొని వెళ్ళి అనుపు ఉత్సవం జరుపుతారు.  అమ్మ వారి మూల విరాట్టు ను వనం గుడిలో దర్శించగలము.  రైల్వే స్టేషన్ ప్రాంతములో వనం గుడి ఉంటుంది. 
     హౌరా - చెన్నై రైలు మార్గంలో విజయనగరం జంక్షన్ కలదు.  జంక్షన్ నుంచి రాయపూర్ కు రైలు మార్గం ఉంది.  రాయపూర్ జాతీయ రహదారి (NH-26) కలదు. రైల్వే స్టేషన్ కు సమీపంలో RTC బస్ స్టాండ్ ఉంది.  జిల్లా కేంద్ర మైన విజయనగరం నందు యాత్రికులుకు మంచి వసతుల, రవాణా సౌకర్యములున్నాయి.
                                          కె. కె. మంగపతి
                                          Yatra - Telugu

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS