Tuesday, March 17, 2020

పూలమ్మ గారు (చుండూరు కామేశ్వరమ్మ గారు


పూలమ్మ గారు
(చుండూరు కామేశ్వరమ్మ గారు)సాయి నాధుని శబ్దం తెలుగు వారు విననప్పుడే వీరు సాయి భక్తురాలు,గుంటూరు జిల్లా  నండూరు లో సాయి మందిరం 1965 లో కట్టించారు.వీరికి సాయి నాధుడు పిలిస్తే పలికెవారు వీరికి.అంతటి అదృష్టం.
వీరి చేతిలో తరచూ  గుప్పెడు నిండా గులాబీ పూలు వచ్చేవి.అందుకే పూలమ్మ గారు గా ప్రసిద్ధి.శివరామయ్య గారు,రుక్మిణి అమ్మ దంపతులకు 22,జనవరి,1915 సంవత్సరం లో రధ సప్తమి రోజు గుంటూరు జిల్లా లో ముని పల్లి గ్రామంలో జన్మించారు. శుక్రవారం రోజు పుట్టారు కాబట్టి లక్ష్మీ కామేశ్వరి అని పెట్టారు.వీరి 8 ఏట ఎవరో(సాయి నాధుడు) కనపడి బాబా పటం ఇచ్చి,రోజు అగరబత్తి పెట్టి అరిపోయేoతవరకు బాబా ని తదేకంగా చూస్తూ కూర్చో అని చెప్పారు.రోజు నియమంగా చేసేవారు.సాయి నాధుని భౌతికంగా దర్శించాలని 12 సంవత్సరాలు ఉపవాసం చేశారు.చివరికి షిరిడీ వెళ్లి నప్పుడు సాయి నాధుడే స్వయంగా జొన్న రొట్ట పెట్టి ఉపవాస దీక్ష విరమింపజేశారు.తెలుగులో మొదటిసారి సాయి సత్ చరిత్ర,సాయిసత్య వ్రతం రాసిన శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారి పుస్తకాలను పూలమ్మ గారు ప్రింట్ చేయించారు.వీరిని తరచు రoగన్న బాబు గారు,జిల్లెలముడి అమ్మ, శ్రీ లక్ష్మీకాంత యోగేశ్వరులు దర్శించుకున్నారు. ఒకరోజు కాశీ నుంచి ప్రసాదం,గంగ నీరు రావటం తో తాను కాశీ దర్శించలేదని బాధ పడ్డారు.ఆరోజు సాయి పటం నుంచి 3 బిందెలో నీరు కారితే పట్టుకొని వారు స్నానం చేయటమే కాక,ఇది చూడడానికి వచ్చిన వారికి తీర్ధం గా ఇచ్చారు.29,జులై 1993 సంవత్సరం లో 5 రోజుల ముందుగా తెలిపి ఏకాదశి రోజు సాయి లో ఐక్యం అయ్యారు.ఓం శ్రీ సాయిరాం.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS