Tuesday, March 24, 2020

శ్రీ సుందర దత్తాత్రేయ స్వామి ఆలయం..కడగంచి కడగండ్లు తీర్చే కరుణపాదుకా దత్తక్షేత్రo.

శ్రీ సుందర దత్తాత్రేయ స్వామి ఆలయం..కడగంచి
కడగండ్లు తీర్చే కరుణపాదుకా దత్తక్షేత్రo.

కడగంచి గ్రామం లో గల దత్త క్షేత్రాన్ని ‘ శ్రీ సాయందేవ కరుణపాదుకా దత్త క్షేత్రం’ అంటారు. ఇక్కడ ఉండే దత్తాత్రేయుడు ‘సుందర దత్తాత్రేయుడు’ ఇక్కడ గల శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలను ‘కరుణ పాదుకలు’ అంటారు. కడగంచి గ్రామం కర్ణాటక రాష్ట్రం లో అలంద్ తాలుకా గుల్బర్గా జిల్లలో కలదు. జిల్లా కేంద్రమైన గుల్బార్గాకు 20 కిలోమీటర్ల దూరంలో, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో అలంద్ – షోలాపూర్ స్టేట్ హైవే పైన ఉన్న గొప్ప దత్త క్షేత్రమిది. అలాగే ప్రముఖ దత్త క్షేత్రమైన దేవల్ గాణ్గాపూర్ కు 35 కిలోమీటర్ల దూరం లో ఈ ‘కరుణపాదుకా’ దత్తక్షేత్రం కలదు.
కడగంచి గ్రామం లో గల శ్రీ సాయందేవ కరుణపాదుకా దత్తక్షేత్రాన్ని ను ఎప్పుడు దర్శించుకోవాలి?
కడగంచి గ్రామం లో గల శ్రీ సాయందేవ కరుణపాదుకా దత్తక్షేత్రాన్ని సంవత్సరంలో ఏరోజైనా దర్శించుకోవచ్చు. ఇక్కడ గల దత్తాత్రేయుని విగ్రహం (నల్లరాతి) మెరిసిపోతూ, అత్యంత సుందరంగా ఉండడం వల్ల ఈ దత్తాత్రేయుడిని ‘సుందర దత్తాత్రేయుడు’ అంటారు.
కడగంచి గ్రామం లో గల శ్రీ సాయందేవ కరుణపాదుకా దత్త క్షేత్రం ప్రత్యేకత ఏంటి?
1. శ్రీ గురు చరిత్ర 13వ అధ్యాయం లో చెప్పబడిన 'వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం (బాసర)' యొక్క గ్రామాధికారి అయిన శ్రీ సాయందేవ (సాకరే) స్వగ్రామమే కడగంచి. ఈ గ్రామాన్ని పూర్వం 'కన్నడ కాంచీపురం' అనే వారు.
2. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు వేంచేసిన శ్రీ సాయందేవుల వారి స్వగృహాన్ని (నూతనంగా మార్పుచేయబడిన) నేటికి ఇక్కడ మనం దర్శించవచ్చు.
3. శ్రీ సాయందేవుల వారి మునిమనవడైన శ్రీ గంగాధర సరస్వతి (నామధరకుడు) కడగంచి లోని శ్రీ సాయందేవుల వారి స్వగృహము లోనే శ్రీ గురుచరిత్ర ను వ్రాసారు. శ్రీ గురుచరిత్ర వ్రాయబడిన దివ్య క్షేత్రమిది.
4. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు శ్రీ సాయందేవునికి ఇచ్చిన 'కరుణ పాదుకలను' ఇక్కడ మనం దర్శించుకోవచ్చు.
ఏమేమి తీసుకెళ్ళాలి?
శ్రీ సాయందేవ కరుణపాదుకా దత్త క్షేత్రం చుట్టుపక్కల అందుబాటులో ఏమి దొరకవు. కాబట్టి పూజా సామగ్రి, పాదుకలకు లేపనంగా గంధమును తీసుకోని వెళ్ళాలి. ఈ క్షేత్రానికి గోశాల కుడా కలదు. కాబట్టి గోపూజ చేయించు కోవాలను కునే వారు గోపుజా సామగ్రిని కుడా తీసుకెళ్ళడం మంచిది.
కడగంచి శ్రీ సాయందేవ దత్త మందిరం లో లభించే సౌకర్యాలు
కడగంచి శ్రీ సాయందేవ దత్త మందిరం లో భక్తులకు, సాధకులకు లబించే సౌకర్యాలు
కడగంచి శ్రీ సాయందేవ దత్త మందిరం లో భక్తులకు, సాధకులకు లబించే సౌకర్యాలు
ఉండడానికి పూర్తి ఉచిత వసతి ( కరుణ పాదుకా క్షేత్రం ఎదురుగా భక్తనివాస్ లో రూములు ఉచితంగా ఇస్తారు)
ఉచిత భోజన సౌకర్యం (క్షేత్రానికి చేరుకోబోయే ఒక గంట ముందుగా బోజన పదార్ధాలు తయారు చేయమని మానేజమెంట్ వారికి ఫోన్ లో చెప్పాలి Ph: 09740625679 / 09901178593)

క్షేత్రం లో ఉండి పారాయణ చేసుకోవడానికి పూర్తి ఉచిత పారాయణ హాలు సౌకర్యం (ఒకప్పటి భూగృహం ఇప్పుడు పారాయణ హాలుగా మార్చబడినది. ఇక్కడ చక్కటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాలరాతి విగ్రహం ప్రతిష్టించారు)
ఉచిత గోపుజా సౌకర్యం
కొసమెరుపు: ఇక్కడగల కరుణపాదుకలను భక్తులందరూ చేతిలోకి తీసుకోవచ్చు. భక్తితో మనమే గంధలేపనం చేయవచ్చు, కావలసినన్ని ఫోటోలు తీసుకోవచ్చు. ఇక్కడ భక్తులదీ, సాధకులదే ఇష్టారాజ్యం. ప్రేమతత్వం అణువణువునా కనిపించే దివ్యక్షేత్రం.
ఆశ్చర్యపరిచే ప్రత్యక్ష నిదర్శనాలు…
శ్రీ వాసుదేవానంద సరస్వతి (టెంబే స్వామి) కడగంచి శ్రీ సాయందేవ కరుణపాదుకా దత్తక్షేత్రం ను దర్శించి, ఎంతో సంతోషించి, శ్రీ గురుచరిత్ర వ్రాయబడిన ఆ ఇంటి నుండే ‘ఘోరకస్తోద్ధరణ స్తోత్రము’ను వ్రాసారు. నేటికి వారు స్వహస్తాలతో వ్రాసిన ఆ స్తోత్రం యొక్క అసలు ప్రతిని (Original Copy) శ్రీ సాయందేవుని గృహం లో మనం చూడవచ్చు

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS