Monday, April 20, 2020

శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రం

శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రం

కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు. దత్తాత్రేయ మహర్షి కి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మహిష్మతీపురము.

ఒకసారి అగ్ని తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను. గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ అరణ్యములో మైత్రావరుణుని ఆశ్రమము కలదు, దానిని అగ్ని కాల్చివేసెను. మైత్రావరుణుని సుతులకు కోపము వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని శపించెను.

ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలుపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.

శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రం
కార్తవీర్య ఖలద్వేషి కృతవీర్య సుతోబలి
సహస్రబాహు శత్రుఘ్నో రక్త్రవాసా ధనుర్ధః

రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తు అభీష్టదః

రాజసైతాని నామాని కార్తవీర్యస్య యః పఠేత్

సంపదః తస్య జాయంతి జనాస్తస్య వషంఘదః

అనాయతాషు క్షేమలాభయుతం ప్రియమ్.

కార్తవీర్యార్జునోనామ రాజా బాహు సహస్రభృత్

తస్య స్మరణ మాత్రేన హృతం నష్టం చ లాభయతి

కార్తవీర్యః మహాబాహో సర్వ దుష్ట విభర్హణః

సహస్రబాహుం సాహస్రం స

రక్తాంబరం రక్తకిరీట కుణ్డలమ్,

చోరాని దుష్టభయ నాశనం ఇష్టదం తం

ధ్యాయేత్ మహాబల విజ్హృంభిత

కార్తవీర్యం యస్య సంస్మరణాదేవ

సర్వ దుఃఖ క్షయోభవేత్ తం నమామి మహావీర్యార్జునమ్

కార్తవీర్యజం హైహయాధిపతేస్తోత్రం

సహస్ర వర్తనం క్రియం వాంచితార్థప్రదం నరాణామ్

శూద్ర దయైర్యాతి నామ శ్రుతమ్

ఇతి దమర తంత్రే ఉమామహేశ్వర సంవాదే

కార్తవీర్యస్తోత్రమ్ సంపూర్ణమ్.

తప్పిపోయిన మనుష్యులు వచ్చుటకు, రాని బాకీలు వసూలగుటకు.

#కార్తవీర్యార్జున  #Karthaveeryarjuna

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS