Wednesday, April 15, 2020

ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు -

ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు  -
     కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఆరోగ్యపరమైన సలహాలు అంతర్లీనంగా ఉన్నాయి . వాటిన్నింటిని నేను నా పరిశోధనలో భాగంగా సేకరించాను . వీటిని మీకు ఇప్పుడు తెలియచేస్తాను.
రహస్య సూక్తులు  -
* రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేల్కొనవలెను.
* ఉదయం , సాయంసమయం నందు స్నానం ఆచరించవలెను.
* మలమూత్ర మార్గములను , పాదములను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకొనవలెను.
* నిత్యం శిరస్సు , ముక్కు, పాదముల యందు తైలము ను ఉపయోగించుకొనవలెను
* వెంట్రుకలు , గోళ్లు , గడ్డము నందు రోమములు 15 రోజులకు మూడుసార్లు హరించవలెను
* పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను .
* భయము లేకుండా దైర్యవంతునిగా ఉండవలెను . భయము కలుగుటచే రోగములు ఉద్భవించును.
* గొడుగు, తలపాగా, కర్ర సహాయంగా ఉంచుకొనుము . కొండలు ,సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు.
* శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము.
* ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భొజనం చేయవలెను .
* రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం .
* అజీర్ణం చేయుట , తినినవెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధికి కారణం అగును.
* కాలంకాని కాలము నందు ఆహారాం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును .
* అన్ని రకాల రుచులు అనగా తీపి , చేదు , కారం , వగరు , పులుపు , ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను . ఎల్లప్పుడూ ఒకేరూచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును.
* ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును.
* విరుద్ద ఆహారపదార్థాలు స్వీకరించరాదు.
* పాలు , నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు.
* మజ్జిగ భోజనం చేసినతరువాత ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయను , విరుద్ద ఆహారపదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను , గ్రహణి , మొలలు మొదలగు రోగములను నివారించును . పెరుగు నందు నాలుగోవ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తక్రమగును .ఇది అత్యంత గుణకారి .
* ప్రతి ఉదయం నోటి యందు నువ్వులనూనె పొసుకొని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను . దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను . ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివలన దంతములు కు బలం కలుగును.దంతవ్యాధులు రానివ్వదు . నములువానికి రుచి తెలియును .
* రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం .
* అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం .
* వృక్షసంభందమైన నూనెలలో అన్నింటికంటే నువ్వులనూనె శ్రేష్టమైనది .
* నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది.
* పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి .
* ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం .
* దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం .
* ఫలములలో ద్రాక్ష శ్రేష్టం .
* ఉప్పులలో సైన్ధవ లవణం శ్రేష్టం .
* చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం
* మినుములు అతిగా వాడరాదు.
* వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు.
* చవిటి ఉప్పు మంచిది కాదు.
* గొర్రెపాలు , గొర్రెనెయ్యి వాడకం మంచిది కాదు.
* పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు.
* దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు.
* మలమూత్ర వేగములను ఆపరాదు .
* ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును.
* హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది .
* స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది .
* విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును.
* గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి .
* ఉసిరికపచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకొవడం వలన వయస్సు నిలుపును .
* నెయ్యి వాతముని , పిత్తమును తగ్గించును
* నువ్వులనూనె వాతముని , శ్లేష్మముని తగ్గించును .
* తేనె శ్లేష్మమును , పిత్తమును తగ్గించును .
* కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు.
* ఇంగువ వాతమును , కఫమును తగ్గించును . ఆహారదోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును జఠరాగ్ని వృద్ధిపరచును. .
* ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును .
* మినుములు శ్లేష్మముని , పిత్తమును వృద్ధిచేయును .
* అరటిపండు పాలతో , మజ్జిగతో తినకూడదు హానికరం .
* నిమ్మకాయ పాలతో , పెరుగుతో , మినపప్పు తో కూడి తినకూడదు .
* పాలుత్రాగడానికి ముందు గాని , పాలుత్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు .
* స్మృతి మద్యం వలన హరించును . మద్యం తాగరాదు.
* ఆహారానికి ముందు వ్యాయమం చేయవలెను . వ్యాయామం వలన శరీరభాగములు స్థిరత్వం పొందును .
* బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధిపొందించును .
* నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తిన్చును . నపుంసకత్వం సంభవించును.
* గర్భవతి వ్యాయాయం , తీక్షణమైన ఔషదాలు విడువవలెను .
* మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు .

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS