Wednesday, April 15, 2020

ఆహార నియమాలు

ఆహార నియమాలు
దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు.
స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు.
ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది.
భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది.
మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది.
కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది.
ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు.
అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు.
అష్టమి నాడు
కొబ్బరి తినకూడదని, పాడ్యమినాడు గుమ్మడికాయతినకూడదని, *పురాణాలు చెబుతున్నాయి*
దొండకాయ తింటే వెంటనే బుద్ధి నశిస్తుంది.
 రాత్రి
అన్నం తినేటపుడు దీపం ఆరిపోతే విస్తరాకునుగాని, పాత్రనుగాని చేతులతో పట్టుకొని సూర్యుణ్ణి స్మరించాలని దీపాన్ని చూసి మిగిలినది తినాలని అప్పుడు మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలంటారు.
రాత్రి తింటూ ఉన్నప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్ళు చల్లడం,
దేవతను స్మరింపచేయడం ఆచారంగా ఉంది.
రాత్రి పెరుగు వాడకూడదు.
ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపివాడవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది.
రాత్రిళ్లు కాచిన పెరుగును మజ్జిగపులుసు మొదలైనవి వాడకూడదు.
ఆవునేయి కంటికి మంచిది. ఆవు మజ్జిగ చాలా తేలికైనది.
అందులో సైంధవలవణం కలిపితే వాతాన్ని పోగొడుతుందని,
పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, శొంఠికలిపితే కఫాన్ని పోగొడుతుందని
ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
నలుగురు కూర్చొని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు.
తేగలు, బుర్రగుంజు,
జున్ను, తాటిపండు    మొదలైనవి
వేదవేత్తలు తినరు.
మునగ, పుంస్త్వానికి *(మగతనానికి)* మంచిదంటారు.
ఆకలితో బాధపడేవారు
కోడి, కుక్క మొదలైనవి చూస్తూ ఉండగా తినకూడదన్నారు.
దృష్టిదోషం పోవడానికి
ఇది చదవాలి :--
ఎప్పుడూ నిర్ణీత
సమయం లోనే భోజనం చెయ్యాలి .
*(అందువలన బయోలాజికల్ క్లాక్ సక్రమంగా ఉంటుంది)*
ఆహారం నెమ్మదిగా పూర్తిగా నమిలి తినాలి
ఘన పదార్ధాలను
త్రాగండి అంటారు .

"అంటే నోటిలోనే
సగం నమలబడాలి"
అందువలన లాలాజలం పూర్తిగా కలిసి,
ముద్దా మింగడం సులువు అవుతుంది .
పిండి పదార్ధాలు పూర్తిగా జీర్ణం అవుతాయి .
కడుపులో ఊరే ఆమ్లాలకు లాలాజలం *(క్షారం)* విరుగుడుగా పనిచేస్తుంది.
ఆహార నియమాలను పాటించే వ్యక్తికి ఔషధాల అవుసరం ఏమి ఉంటుంది?
ఆహార నియమాలను పాటించని వ్యక్తికి ఔషధాలు ఏమి ఫలితాలను ఇవ్వగలవు ?
పధ్యేసతి గదార్తస్యకి మౌషద నిషేవనై :
వినాపి భేశాజేవ్యర్ది : పత్యాదేవ్ నివర్తత
నతు పథ్య విహీనస్య భేశాజానాం శథైర్యపి
అంటే రోగికి ఔషధాల అవుసరం లేకుండానే కేవలం నియమిత ఆహారం పాటించడం వలన వ్యాధులు దూరమవుతాయి .
రోగికి ఆహారంపై నియంత్రణ లేకపోతే మాత్రం అత్యుత్తమమైన
మందులు కూడా ఫలితాన్ని ఇవ్వలేవు
అని అర్ధం .
*అన్నం బ్రహ్మ రసోవిష్ణు: బోక్తా దేవో మహేశ్వర:*
ఇతి సంచింత్య భుంజానం దృష్టిదోషో నబాధతే అంజనీ గర్భం సంభూతం కుమారం బ్రహ్మచారిణం దృష్టి దోష వివానాశాయ హనుమంతం స్మరామ్నహం.
అనగా అన్నం బ్రహ్మం, అన్నరసం విష్ణురూపమై ఉన్నది.
తినువాడు మహేశ్వరుడు,
ఇట్లా చింతిస్తే దృష్టిదోషం ఉండదని పండితులు అంటున్నారు

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS