Wednesday, April 15, 2020

దేవాలయాల రహస్యాలగుట్టు విప్పగలరా.!ఆలయాల నిర్మాణంలో దాగున్న కిటుకులను ఇప్పటికీ తెలుసుకోవడం అసాధ్యమవుతోంది.

దేవాలయాల రహస్యాలగుట్టు విప్పగలరా.!


భారత దేశం పుణ్యక్షేత్రాలకు నిలయమన్న 
విషయం తెలిసిందే. 
అయితే వీటిలో చాలా పుణ్యక్షేత్రాలు అద్భుతమైన ఇంజనీరింగ్ పరిజ్జానికి నిలయాలు. 
దీంతో సదరు ఆలయాల నిర్మాణంలో 
దాగున్న కిటుకులను ఇప్పటికీ తెలుసుకోవడం అసాధ్యమవుతోంది. 

కొన్ని క్షేత్రాల నిర్మాణానికి వినియోగించిన 
ముడి పదార్థాలు ఏమిటన్న విషయం 
నిగూడ రహస్యమైతే మరికొన్నింటిలో..
భవనాలు, గుళ్లు, గోపురాల నిర్మాణానికి 
వాడిన ఇంజనీరింగ్ విధానం ఎటువంటిదన్నది తెలుసుకోవడానికి మహామహులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. 

మరికొన్ని క్షేత్రాలు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. అటువంటి రహస్యాలతో కూడిన క్షేత్రాల్లో 
కొన్నింటి వివరాలు మీకోసం. 

మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్లినప్పుడు వాటి రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నించండి. 

1. గాలిలో తేలే స్తంభం.💐
ప్రతి పుణ్యక్షేత్రంలోని గుడిలో అనేక స్థంభాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. 
స్థంభం అంటే భూమి పై ఉంటూ పై కప్పును మోసేది అనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. 
అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో ఉన్న వీరభద్ర దేవస్థానంలో కూడా మొత్తం 70 స్థంభాలు ఉన్నాయి. 
ఇందులో ఒక స్థంభం మాత్రం గాలిలో తేలి ఉంటుంది.

అంతుపట్టని రహస్యాల్లో...💐
అనంతపురం జిల్లాలోని వీరభద్ర ఆలయం, లేపాక్షి.
సుమారు 70 స్థంబాలు ఉన్న 
ఈ ఆలయ ప్రాంగణంలో ఒకే ఒక్క స్తంభం 
అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 
అందరూ ఆ స్తంభం వైపే పరుగులు పెడుతుంటారు. 

ఇంతకి ఈ స్తంభం ప్రత్యేకత ఏమిటో చెప్పలేదు కదూ ..! 
నేలకు, స్తంభానికి ఖాళీ ఉంటుంది. 
ఈ మధ్యలోనుంచి పేపర్లు, దారం, బట్టలను 
ఒకవైపు నుంచి తోసినప్పుడు అవి రెండవవైపునుంచి బైటికి వస్తుంటాయి. 
అంత బరువైన ఈ స్తంభం ఎలా వేలాడదీసారో ఎవ్వరికీ అర్థం కాదు. 
అదీగాక ఇన్ని శతాబ్దాలుగా ఆ స్తంభం అలాగే వేలాడుతూ ఉండటం మరొక విచిత్రం.

2.ప్రయత్నించి విఫలం..💐
అది ఎందుకన్న విషయం ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేక పోయారు. 
ఓ బ్రిటీష్ ఇంజనీర్ ఈ స్థంభాన్ని భూమి పై నిలబెట్టడానికి ప్రయత్నిస్తే పై కప్పు మొత్తం కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. 
దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. 
దీంతో సదరు దేవాలయం నిర్మాణం మొత్తం 
ఈ వేలాడే స్థంభం పై ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. 
ఇటువంటి నిర్మాణం ప్రపంచంలో ఇది ఒక్కటే.

3. ఆ నీరు ఎక్కడి నుంచి..💐
ఇదే ఆలయంలో దాదాపు మూడు అడుగుల పొడవైన మానవుడి పాద ముద్ర ఉంది. 
ఇంతటి బ`హత్ పాద ముద్రను ఎవరు చెక్కారన్నది ఇప్పటికీ నిగూడ రహస్యం. 
స్థానిక కథనం ప్రకారం ఇది హనుమంతుని పాదముద్రగా భావించినా 
ఎటువంటి నీటి ఎద్దడి సమయంలోనైనా 
సదరు పాదం నుంచి ఊరే నీరు ఎక్కడి నుంచి వస్తోందన్నది తెలుసుకోలేకపోతున్నారు.

4. వేసవిలోనైనా, వర్షాకాలంలోనైనా ఒకటే నీటి మట్టం.💐
యాగంటిలోని నందీశ్వర ఉన్న అగస్త పుష్కరిణిలోకి ఓ నంది విగ్రహం నుంచి నీరు వస్తుంది. 
ఈ విగ్రహంలోని నీరు ఎక్కడి నుంచి వస్తోందన్నది మొదటి ప్రశ్న. 
అదే విధంగా అటు వేసవి, ఇటు వర్షకాలం 
ఏ సమయంలోనైనా పుష్కరిణిలో ఒకే మట్టంలో 
నీరు ఉంటుంది. 
ఇది ఎలా సాధ్యమన్న విషయాన్ని ఇప్పటికీ 
ఎవరూ చెప్పలేరు.

5. ఆ గోపురం నీడ ఎందుకు పడదు..💐
తమిళనాడులోని తంజావూరులో ఉన్న
బృహదీశ్వర ఆలయం గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ ఉన్న ప్రధాన ఆలయం గోపురం నీడ 
భూమి పై పడదు. 

ఈ దేవాలయానికి చెందిన మరికొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. 
ఈ దేవాలయం నిర్మించి వెయ్యి ఏళ్లు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 
దీనిలో ఉన్న మర్మం ఇప్పటికీ తెలియదు. 
80 టన్నుల ఏక శిలతో తయారు చేయబడిన వీమాన గోపురాన్ని 216 అడుగుల ఎత్తులో 
ఎలా ఉంచారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్న.

6.నదీ తీరం ఒడ్డున ఎడారి..💐
కర్ణాటకలో కావేరి నదీ తీరం ఒడ్డున తలకాడు 
అనే పట్టణం ఉంది. 
ఈ పట్టణం మొత్తం ఎడారిని తలపిస్తోంది. 
ఎక్కడ చూసిన ఇసుక దిబ్బలు ఉంటాయి. 
ఇక ప్రతి ఏడాది ఇసుక పరిమాణం పెరుగుతూ ఉటుంది. 
ఇది ఎలా సాధ్యమన్న విషయానికి సరైన ఆధారాలు ఇప్పటికీ లేదు. 

ఓ కథనం ప్రకారం ఓ రాణి శాపం వల్ల తలకాడు 
ఇలా అయి పోయిందని చెబుతున్నా..
పరిశోధకులు, శాస్త్రవేత్తలు దీన్ని నమ్మడం లేదు.

7. ఆ కిరణాలు సరిగ్గా అదే రోజు ఎలా తాకుతున్నాయి..💐
ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులోని 
గవి గంగాధరేశ్వరస్వామి దేవాలయం 
ఒక గుహాలయం. 
ఇక్కడ ప్రతి ఏడాది సంక్రాంతి రోజున దాదాపు 
ఒక గంటపాటు సూర్య కిరణాలు నంది విగ్రహానికి ఉన్న కొమ్ముల గుండా ప్రసారం అయ్యి లింగాన్ని తాకుతాయి. 
క్రమం తప్పకుండా ప్రతి ఏడు జరిగే ఈ అద్భుతాన్ని చూడటానికి చాలా మంది దేవాలయానికి వస్తారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది. 
ఈ గుహాలయం నిర్మాణంలో వాడిన రహస్యం ఇప్పటికీ నిగూడ రహస్యం.

8.అంతులేని సంపద. 💐
కేరళలోని అనంత పద్మనాభ స్మామి టెంపుల్. 
ఇక్కడ దాదాపు దాదాపు 22 బిలియన్ డాలర్లు విలువ చేసే సంపద ఉన్నట్లు ఐదు నేల మాగళిలను తెరవగా తెలిసింది. 
మరో మూడింటిని తెరవడానికి ఇప్పటికీ ఎవరూ సాహసం చేయడం లేదు. 

అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక నేల మాగళికకు నాగబంధంతో ద్వారాన్ని మూసి వేశారు. పక్కనే ఉన్న ఓ శ్లోకాన్ని చదివితే ఈ నాగబంధం తనంతకు తానే తెరుచుకుంటుందని కొంతమంది చెబుతున్నారు.

9. నాగబంధనం విడిపించే శ్లోకం చదవగలరా.💐
అయితే సదరు శ్లోకం చదవడం తెలిసిన వారు మాత్రం ఇప్పటికీ ఎవరూ లేరు. 
ఒక ద్వారాన్ని ధ్వని తరంగాల ద్వరా మూయడం, తెరవడం అప్పటికే మన వాళ్లు కనిపెట్టారని 
దీని వల్ల అర్థమవుతోంది కదా. 
ఇక ఈ నాగమాగళిలో ఏముందన్న విషయం 
ఇప్పటి వరకూ ఎవరూ చెప్పడం లేదు.

10. కైలాసనాథ టెంపుల్.💐
మహారాష్ర్టలోని ఎల్లోర గుహల్లో ఉన్న కైలసనాథ టెంపుల్ ఏక శిల నిర్మితమైనవి. 
దీనిని ఎవరు, ఎప్పుడు నిర్మించారన్న విషయంపై ఇప్పటికీ సరైన ఆధారాలు లేవు. 
ఇందులో కొన్ని శిల్పాలు రాకెట్, గ్రహాంతర వాసులను కూడా పోలి ఉన్నాయి. 
వాటిని ఆవిధంగా ఎందుకు చెక్కారు, 
ఒకవేళ అప్పటి వారికి గ్రహాంతర వాసుల గురించి ముందే తెలుసా 
తదితర విషయాలన్నీ జవాబులు లేని ప్రశ్నలే.
ఇవన్నీ తెలుసుకునే సాహసం చేయలేకపోతున్నారు.
స్వస్తి..!!💐

ఓం నమః శివాయ..!!🙏
సర్వే జనా సుఖినోభవంతు..!💐

                           💐శ్రీ మాత్రే నమః💐

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS