Tuesday, January 5, 2021

కలియుగములో దత్తావతారులుగా ఉన్నవారిలో మధ్యముడుగా భావింపబడే మాణిక్య ప్రభువు ,

 కలియుగములో దత్తావతారులుగా ఉన్నవారిలో 

మధ్యముడుగా భావింపబడే మాణిక్య ప్రభువు ,

మిగిలిన నలుగురికి ఒక వారధిలాగా ఉంటారు .

దత్త పంచకంలో ' సమాధి ' వీరితోనే ప్రారంభమైనది .తల్లితండ్రులు ,పుట్టిన ప్రదేశాలు 

వీరి తోనే అంతమవుతాయి .అక్కల్కోట మహరాజు ,షిర్డి సాయిబాబా లలో ఆ విషయాలు 

తెలియవు .శ్రీపాద శ్రీవల్లభునకు ,నృశింహ సరస్వతి స్వాముల వారికి ముస్లింలతో సంబంధాలు అతి తక్కువ .మాణిక్య ప్రభువు ల 

వారినుండి ముస్లిం సంబంధాలు పెరిగిపోతూ 

చివరకి సాయిబాబా ముస్లిమా ? హిందువా ?

అనే సమస్యకూడా మొదలైనది .షిర్డి సాయి నాథునికి ,మాణిక్యప్రభువులవారికి అనేక పోలికలు కనిపిస్తాయి .మాణిక్య ప్రభువు 


22 -12 -1817 సం .న జన్మించారు .వీరిద్దరూ 

రోగులకు విచిత్ర చికిత్సలు చేశారు .కోరిన భక్తులకు సంతానమును ప్రసాదించారు .మూగ 

జీవాలపై కరుణను చూపారు .తమ మహత్తును 

తాము తెలుపుకోలేదు .సాయిబాబా మాణిక్య 

ప్రభువును దర్శించారని ఒక గాధ ఉన్నది .

ఒకసారి మాణిక్యప్రభువులు దర్బారు చేస్తుండగా 

సాయిబాబా ఒక లోటాను ఆయన ముందు ఉంచి 

"ప్రభుజీ ! ఈ లోటా ను నింపండి ." అని బాబా అన్నారు .ఆ లోటాలో మణిక్యప్రభువు సోదరుడు 

ఎంత ధనము వేసినాకూడా లోటా నిండలేదు .

అది గమనించిన మాణిక్యప్రభువు దివ్య దృష్టితో 

సాయిబాబాను గుర్తించి " సాయీ ! తీసుకొండి "

అని రెండు ఎండు ఖర్జురములు ,కొన్ని పుష్పములు ఆ లోటాలో వుంచారు .ఆశ్చర్యము గా ఆ లోటా నిండినది .సాయిబాబా వాటిని 

తీసుకుని ,ప్రభువులకు వందనం చేసి నిష్క్రమించారు .అవతారములన్నియు ఒకటే .

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS