Thursday, March 17, 2022

స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పే ముఖ్యమైన విషయాలు..

 ధర్మ సూక్తులు............!!



స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పే ముఖ్యమైన విషయాలు...!


సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా 

ఎప్పుడు వుండకూడదు.


రెండు చేతులతో తల గీరుకోరాదు.


అయినదానికీ కానిదానికి ఎప్పుడు కంట నీరు పెట్టుకోరాదు. 

ఇది దారిద్ర్యమును తెచ్చిపెట్టును.


ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరియొక ఆకులో వడ్డించ కూడదు.


ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించవలెను.


గర్భిణి స్త్రీలు టెంకాయ పగులకొట్ట రాదు. 

టెంకాయ కొట్టే స్థలంలో కూడా వుండకూడదు.


గర్భిణి నిమ్మకాయను కోసి దీపము వెలిగించకూడదు.


గర్భిణి స్త్రీలు గుమ్మడి కాయ కొట్టకూడదు.


సూర్యోదయం పూర్వమే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం వలన లక్ష్మి కటాక్షము కలుగును. ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్నా 

ఇంటి యజమానురాలు చేయడం వల్ల లక్ష్మి లోగిలిలోకి రావడానికి దోహదం చేస్తుంది.


చేతితో ఎప్పుడు అన్నం, ఉప్పు, కూరలు వడ్డించకూడదు


ఎవరినీ కూడా పెరుగు తోడుకు ఇమ్మని అడగకూడదు. 


ఏ వస్తువు అయిన ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు. 

నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్వినిదేవతలు మరియు తథాస్తు దేవతలు కూడా పలుకుదురు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS