Thursday, March 17, 2022

సదాచారములు, సత్ సాంప్రదాయములు

 సదాచారములు, సత్ సాంప్రదాయములు



1) పూజ్యులు పెద్దలైన ఇద్దరి మధ్య నుంచి నడిచి వెళ్ళకూడదు . 


2) ఒక నదిలో స్నానం చేస్తూ ఇంకో నదిని స్మరించకూడదు . 


3) షష్టి , అష్టమి , చతుర్దశి తిధులయందు తైలాభ్యంగ స్నానం చేయరాదు . 


4) బహిష్టు అయిన  5 వ రోజు నుంచి స్త్రీలు, దేవత శుభకార్యాలలో పాల్గొనవచ్చు . 


5) దీర్ఘకాలిక వ్రతాలు చేసే స్త్రీలకు మధ్యలో వచ్చే అంటు ,ముట్టు  వలన వారు వ్రతభంగము అయింది  అని బాధపడుతుంటారు . అది వ్రతభంగము ఏమి కాదు . వారు 5 లేక 7 వ రోజు నుంచి యధావిధిగా ఆ వ్రతాన్ని కొనసాగించవచ్చు . 


6)ఇల్లు కట్టుకునే ముందు ఆ స్థలాన్ని నాగలితో దున్నించి ఒక ఆవు దూడను మూడు రోజులు కట్టివేయుట వలన స్ధలసంబంధిత దోషాలు ఏమైనా ఉంటె అవి తొలగిపోతాయి . 


7) మొక్క / చెట్టు మీద నుంచి  రాలిన, నలిగిన  పూవులు  శ్రీ మహావిష్ణువు పూజకు ఉపయోగించరాదు . పూజకు పూవులు లేని సమయంలో 

వాటి స్థానంలో అక్షింతలు వాడుకోవచ్చు . 


8) దేవతలను తృప్తి పరుచుటకన్నా పితృదేవతలను( కాలం చేసిన పెద్దలును ) తృప్తి పరచుట ముఖ్యం . అందువలన వంశాభివృద్ధి జరుగును . 


9)ప్రతి రోజు మొదటి అన్నం ముద్ద తినేముందు ఓం హ్రీం గౌరీయై నమః  అని కానీ ఓం అన్నపూర్ణా దేవియై నమః అని ఒక 5 సార్లు స్మరించుకొని భోజనం ప్రారంభిస్తే ఆ భోజనం ఔషధము లాగ పని చేస్తుంది, ఆహారానికి ఎటువంటి లోటు లేకుండా దొరుకుతుంది , మరియు పండించిన రైతుకి కూడా ఎంతో  మేలు జరుగుతుంది  


10)  శత్రునాశనం కొరకు ఎన్నో క్షుద్రపూజలు చేయటానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు . అంటువంటి వారికి ఒక చిన్న చిట్కా . ఒక చిన్న శివలింగానికిప్రతి రోజు ఆవాలు నూనెతో అభిషేకం చేస్తే (  ఎంత చిన్న శివలింగమైతే అంత మంచిది .) శత్రుబాధలనుంచి విముక్తి పొందవచ్చు.  


11) తల్లిపాదాలకు ఒక్క సారి నమస్కారం , తండ్రి పాదాలకు 2 సార్లు , గురువు పాదాలకు 3 సార్లు , భగవంతునికి 4 సార్లు , అమ్మవారికి 

( శక్తి దేవతలకు) 5 సార్లు నమస్కారం చేయాలి . 


12)భగవంతునికి , మగవారు అయితే  సాష్టాంగ నమస్కారం , ఆడవారు అయితే పంచమ నమస్కారం చేయుట  శ్రేష్టం . 


13) స్త్రీలు మంగళసూత్రానికి తోడుగా పిన్నీసులు వంటివి పెడుతుంటారు . అది శాస్త్ర, విరుద్ధం . ఆలా చేయటం వలన భార్య, భర్తల మధ్య సరైన సఖ్యత ఉండదు . 


14) భగవంతుని నైవేద్యానికి బెల్లము ముక్క ఇక పటిక బెల్లం ఉపయోగించాలి . పంచదార నివేదన చేయరాదు . ఒకవేళ పండ్లు నివేదన చేస్తే తొక్క తీసి పెట్టాలి . 


15) సూర్యునికి, చంద్రునికి ఎదురుగా ఎప్పుడు కూడా మల మూత్ర విసర్జన చేయరాదు, అలాగే ఉదయాన్నే బయట సూర్యునికి ఎదురుగా 

 నుంచుని  పండ్లు తోముకుంటూ ఉంటారు . ఆలా ఎప్పుడు చేయరాదు . 


16) ఓం శ్రీ శా  నమో నమః -  ఈ మంత్రాన్ని  సర్వకార్యసిద్ధి మంత్రం అంటారు . సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని శక్తీ కొలది స్మరించుకోండి . మీరు చేయబోయే కార్యము నిర్విఘ్నం గా జరుగుతుంది 

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS